Ayyannapatrudu: ఏపీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు!

Ayyannapatrudu: ఏపీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు!


Ayyannapatrudu: మంత్రివర్గంలో చోటు దక్కని చింతకాయల అయ్యన్నపాత్రుడికి కీలక పదవి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన్ను ఏపీ స్పీకర్‌గా నియమించేందుకు చంద్రబాబు సిద్దమైనట్లు సమాచారం.

అలాగే ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన జనసేనకు డిప్యూటీ స్పీకర్‌ పదవి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మండలి బుద్ధప్రసాద్‌, బొలిశెట్టి శ్రీనివాస్‌, లోకం మాధవి పేర్ల చంద్రబాబు పరిశీలిస్తున్నారు. ఈ ముగ్గురిలో ఒకరిని డిప్యూటీ స్పీకర్‌ పదవి వరించే అవకాశం ఉంది. జనసేనకు 21 మంది ఎమ్మెల్యేలు ఉండడంతో చీప్‌విఫ్‌గా దూళిపాళ్ల నరేంద్ర పేరు పరిశీలనలో ఉంది. దీనిపై రెండ్రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.