Theft Of Gold Toilet: 300 ఏళ్ల భవనం నుంచి రూ.50 కోట్ల బంగారు టాయిలెట్‌ చోరీ..!

www.mannamweb.com


ఎటువంటి ఖరీదైన వస్తువులైన సరే.. మనం ధనవంతుల ఇంట్లో చూస్తుంటాము. ధనవంతులు ఎక్కువగా బంగారం, వెండి, వజ్రాలతో కూడిన వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. ఇక రాజుల కుటుంబాలు అయితే మాత్రం.. ప్యాలెస్ అంటూ పెద్ద పెద్ద భవంతులలో అత్యంత విలువైన, అలాగే ఖరీదైన వస్తువులను ఉంచుకోవడం వారి పరిపాటి. పురాతన కాలం సంబంధించిన వస్తువులను అప్పుడప్పుడు ప్రపంచ మార్కెట్లో కొన్ని వేలానికి తీసుకువస్తుంటారు. ఇకపోతే ఓ ప్యాలెస్ లో ఉన్న బంగారు టాయిలెట్ కు కూడా ఇలా అమ్మకానికి తీసుకోవచ్చారు. కాకపోతే అది గత నాలుగు సంవత్సరాలు క్రితం చివరికి గురైంది. అయితే ఇందుకు సంబంధించి ఆ టాయిలెట్ ను తానే తీసుకువెళ్లను అంటూ ఓ దొంగ నిజాన్ని ఒప్పుకున్నాడు. విచారణలో భాగంగా సదరు దొంగ చెప్పే నిజాలు చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. తాను ఇదివరకు కూడా చాలా విలువైన వస్తువులను చోరీ చేసినట్లు పోలీసులు వద్ద సంచలన విషయాలు వెలుగులోకి తీసుకోవచ్చాడు.

ఈ సంఘటన ఇంగ్లాండ్ దేశంలో బయటికి వచ్చింది. అప్పట్లో ఇంగ్లాండ్ లో ఉన్న ఆక్స్‌ఫర్డ్‌షైర్‌లో ఉండే బంగారు టాయిలెట్ ను ఓ దొంగ ఎత్తుకెళ్లిన సంఘటన కలకలం లేపింది. దాదాపు 300 సంవత్సరాల క్రితం నాటి బ్లెన్‌ హీమ్ అని ప్యాలెస్ నుండి ఈ బంగారు టాయిలెట్ ని జేమ్స్ అనే దొంగ చోరీ చేశాడు. ఇక టాయిలెట్ విలువ భారతదేశ కరెన్సీలో సుమారు రూ. 50.36 కోట్లు.
ఇందుకు సంబంధించి 2019లో సెప్టెంబర్ నెలలో బ్లెన్‌హీమ్ ప్యాలెస్‌లో ఆర్ట్ ఎగ్జిబిషన్‌ నిర్వహించగా.. దానికి తాను వచ్చానని.. అయితే అక్కడ ఆ బంగారు టాయిలెట్ కనిపించడంతో దానిని దొంగలించినట్లు జేమ్స్ తెలిపారు. ఇక ఇప్పటి వరుకు గతంలో చేసిన దొంగతనాలకు ప్రస్తుతం 17 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు జేమ్స్. ఇతను ఎన్నో ఖరీదైన దొంగతనాలకు పాల్పడ్డాడు. ఇదివరకు కొన్ని సంవత్సరాల క్రితం నేషనల్ హార్స్ రేసింగ్ మ్యూజియం నుంచి ఏకంగా రూ. 4.3 కోట్ల విలువైన ట్రాక్టర్లు, ట్రోఫీలను ఎత్తుకెళ్లినట్లు అధికారులు విషయాన్ని తెలిపారు.