పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై శనివారం క్లారిటీ రానుందా!

పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై శనివారం క్లారిటీ రానుందా!


పోస్లల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో వైసీపీ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్
ఏపీలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు విషయంలో వైసీపీ వేసిన పిటిషన్ మీద హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్‌కు సంబంధించి ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాల్లోని ఓ నిబంధనపై వైసీపీ అభ్యంతరం తెలుపుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల మీద రిటర్నింగ్ అధికారి సీల్ లేకున్నా కూడా అనుమతించాలని సూచించింది. అయితే దీనిపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. క్రమంలోనే ఈ నిబంధన మీద హైకోర్టును ఆశ్రయించగా.. వైసీపీ పిటిషన్ మీద విచారణ జరిపిన హైకోర్టు.. తీర్పును హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. రేపు సాయంత్రం 6 గంటలకు తీర్పు చెబుతామని పేర్కొంది.