Virat Kohli Security Threat: మరికాసేపట్లో ఎలిమినేటర్.. విరాట్ కోహ్లీ భద్రతకు ముప్పు..

Virat Kohli Receives Security Threat Ahead Of RR vs RCB Eliminator: ఎలిమినేటర్ మ్యాచ్‌కు ముందు దురదృష్టకర సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగనున్న ఎలిమినేటర్ మ్యాచ్‌కు భద్రతా ముప్పు ఉన్నట్లు సమాచారం రావడంతో మంగళవారం ఆర్సీబీ తన ప్రాక్టీస్ సెషన్‌ను రద్దు చేసుకుంది.


ఉగ్రవాద అనుమానంతో నలుగురు ఐసిస్ టెర్రరిస్టులను అరెస్ట్ చేయడం ఇందుకు బలం చేకూరుస్తుంది. తీవ్రవాద ముప్పుతో మ్యాచ్‌కు ముందు జరిగే ప్రెస్ కాన్ఫరెన్స్‌ను కూడా రద్దు చేసినట్లు సమాచారం.

బెంగాలీ దినపత్రిక ఆనందబజార్ పత్రిక గుజరాత్ పోలీసు అధికారులను ఉటంకిస్తూ, RCB వారి ప్రాక్టీస్ సెషన్‌ను రద్దు చేయడం, ఇరుపక్షాలు విలేకరుల సమావేశం నిర్వహించకపోవడం వెనుక ప్రధాన కారణం విరాట్ కోహ్లీకి భద్రతా ముప్పు అని సూచించింది.

ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే అనుమానంతో గుజరాత్ పోలీసులు సోమవారం రాత్రి అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. నలుగురు నిందితుల రహస్య ప్రదేశాన్ని శోధించిన పోలీసులు ఆయుధాలు, అనుమానాస్పద వీడియోలు, టెక్స్ట్ సందేశాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

భద్రతా అధికారులు ఈ సమాచారాన్ని RR, RCB రెండింటికి తెలియజేసినట్లు సమాచారం. అయితే RR మాత్రం తన ప్రాక్టీస్‌ను యథావిధిగా కొనసాగించింది. కానీ RCB మాత్రం ప్రాక్టీస్ సెషన్ ఉండదని భద్రతా సిబ్బందికి తెలియజేసింది. ప్రాక్టీస్ సెషన్‌ను రద్దు చేయాలనే తమ ఆకస్మిక నిర్ణయానికి RCB ఎటువంటి అధికారిక కారణం చెప్పలేదని నివేదిక పేర్కొంది. RCB, RR రెండూ సోమవారం అహ్మదాబాద్‌లో దిగాయి. ఆదివారం, సోమవారం విశ్రాంతి తీసుకోవడానికి వారికి తగినంత సమయం ఉంది.

మరికాసేపట్లో ఎలిమినేటర్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఈ విషయం బయటకి రావడం అభిమానుల్లో ఆందోళనలనే రేకెత్తిస్తోంది. ఎలాగైనా ఈ మ్యాచ్ గెలిచి క్వాలిఫైయర్-2 కు చేరుకొని తద్వారా ఫైనల్ చేరాలని ఆర్సీబీ తహతహలాడుతుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.