Monsoon Illness: వర్షాకాలంలో వ్యాధుల నుంచి కాపాడుకోవాలంటే.. రోజూ ఇలా చేయండి!

www.mannamweb.com


మండే ఎండల తర్వాత కురిసే చల్లని జల్లులు.. వేసవి తాపం నుంచి కాస్త ఊరట కలిగిస్తాయి. కానీ వర్షాకాలం వచ్చిందంటే వేలల్లో రోగాలు కూడా వచ్చి చేరుతాయి. ఈ సమయంలో అధిక చలి, కడుపునొప్పి తరచూ వేధిస్తుంటాయి. అయితే కొన్ని ఆయుర్వేద చిట్కాలు పాటిస్తే వర్షాకాలంలో కూడా అనారోగ్యం దరిచేరకుండా కాపాడుకోవచ్చు.

వర్షాకాలంలో కాచిన నీరు మాత్రమే తాగాలి. గోరువెచ్చని నీరు శరీరాన్ని నిర్విషీకరణ చేయడంతో పాటు, కడుపుని కూడా శుభ్రపరుస్తుంది. వర్షాకాలంలో ఆయిల్ ఫుడ్ తినడం మానుకోండి. తేలికపాటి భోజనం తినడానికి ప్రయత్నించాలి.

వర్షాకాలంలో రోజూ త్రిఫల చూర్ణం తీసుకోవడం మంచిది. సిరి, కరక్కాయ, తానికాయలతో చేసిన త్రిఫలం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. వర్షాకాలంలో సహజమైన ఆహారాన్ని తినడానికి ప్రయత్నించాలి. పండ్ల రసానికి బదులుగా పండ్లను తింటే మంచిది. దాంతో శరీరం బాగుంటుంది, రోగాలు కూడా తగ్గుతాయి.

ఒక్కోసారి అనుకోని పరిస్థితుల్లో వర్షంలో తడిసి వస్తాం. అలాంటప్పుడు వేడి నీటిలో ఆవిరి స్నానం చేస్తే.. అంతగా చలిగా అనిపించదు.

వర్షాకాలంలో గొంతు నొప్పి ప్రారంభమైనప్పుడు గోరువెచ్చని నీటిలో కాస్తింత ఉప్పు కలిపి పుక్కిలించండి. ఇది గొంతు సమస్యలు పెరగ కుండా నివారిస్తాయి. అసౌకర్యం నుంచి కూడా ఉపశమనం ఇస్తుంది. వీటన్నింటితోపాటు తగినంత నిద్ర, విశ్రాంతి కూడా అవసరం. సరైన నిద్ర లేకపోతే శరీరం ఎప్పటికీ రిఫ్రెష్ గా ఉండలేదు.