వైకాపా అధిష్ఠానం తీరు దారుణం: మాజీ ఎమ్మెల్యే

www.mannamweb.com


వైకాపా అధిష్ఠానం తీరు దారుణం: మాజీ ఎమ్మెల్యే

వైకాపా కోసం పనిచేసినా.. అధిష్ఠానం తనను అన్నివిధాలా అవమానించిందని, కనీసం సంజాయిషీ అడగకుండా సస్పెండ్‌ చేసిందని శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ పి.వి.సిద్ధారెడ్డి పేర్కొన్నారు.

వైకాపా కోసం పనిచేసినా.. అధిష్ఠానం తనను అన్నివిధాలా అవమానించిందని, కనీసం సంజాయిషీ అడగకుండా సస్పెండ్‌ చేసిందని శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ పి.వి.సిద్ధారెడ్డి పేర్కొన్నారు. గురువారం కదిరిలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘‘పార్టీ కోసం, ఎన్నికల హామీలు నెరవేర్చడానికి 365 రోజులూ పనిచేశా. స్థానిక సంస్థలన్నింటిలో అభ్యర్థులను గెలిపించుకోగలిగాం. గడప గడపకు కార్యక్రమంలో లక్ష ఇళ్లకు పైగా తిరిగిన 20 మందిలో నేనొకడిని. జగన్‌ నన్ను పిలిచి మీ నియోజకవర్గంలో అభ్యర్థిని మార్చుతున్నామని చెప్పినా.. నేనేమీ మాట్లాడలేదు. సిటింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న నాకు ఎన్నికల సమయంలో ప్రాధాన్యం ఇవ్వలేదు. అధికారులకు ఫోన్‌చేసి నా మాట వినకూడదని చెప్పారు. కదిరి పర్యటనకు వచ్చిన జగన్‌ మా ఇంటికి 50 మీటర్ల దూరంలో వెళ్లినా.. పిలిచి మాట్లాడలేదు. పార్టీకి పదేళ్లు పనిచేసిన సిటింగ్‌ ఎమ్మెల్యేని నన్ను కాదని, ఎన్నికలకు పక్క పార్టీ వ్యక్తిని తెచ్చుకున్నారు. నాలుగేళ్ల పాటు నన్ను వ్యతిరేకించినవారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కదిరికి 30 కి.మీ. దూరంలో పులివెందుల ఉన్నా.. పార్టీ అధ్యక్షుడు జగన్‌కి పక్క నియోజకవర్గంలో జరిగే విషయాలు తెలియవు. ఐదేళ్లు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించిన జగన్‌కి, ఆదరించిన వైకాపా శ్రేణులు, ప్రజలకు ధన్యవాదాలు’’ అని చెప్పారు.