జానీ భార్యపై బిగుస్తున్న ఉచ్చు..! జైలుకి వెళ్లడం తప్పదా?

www.mannamweb.com


ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో రోజుకోక ట్విస్ట్ వెలుగులోకి వస్తుంది. ఇప్పటికే జానీ మాస్టర్ కు కోర్టు 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో జానీని పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. అయితే ఈ ఇష్యూలో జానీ మాస్టర్ భార్యపై కూడా బాధితురాలు మొదట పోలిసులకు ఫిర్యాదు చేసింది. ఇక ఆ ఫిర్యాదులో.. బాధితురాలుకు ఆయేషా మతం మారి తన భర్తను పెళ్లిచేసుకోవాలని వేధించేదని, పలుమార్లు దాడి కూడా చేసి, బెదిరించేదని సదరు యువతి నార్సింగ్ స్టేషన్ లో కేసు పెట్టింది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి జానీ మాస్టర్ భార్యపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. ఒకవేళ అదే కనుక నిజమైతే భర్తలాగే ఆయేషా కూడా జైలుకి వెళ్లక తప్పదా..? ఆ వివరాలేంటో చూద్దాం.

జానీ మాస్టర్ భార్య ఆయేషా పై తాజాగా మరో కేసు నమోదైంది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. అయోషా తాజాగా బాధితురాలి ఇంటికి వెళ్లి తనపై దాడి చేసేందుకు ప్రయత్నించిందని సమాచారం. ఈ కారణంతోనే.. పోలీసులు ఆమెను అరెస్ట్ చేసేందుకు సిద్ధమైయ్యారని, ఆమెతో పాటు జానీ మాస్టర్ ఇద్దరు అసిస్టెంట్స్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ, ఇందులో ఏదీ నిజం, ఏదీ అబ్ధం అనే విషయాలపై క్లారిటీ రాలేదు. కానీ, నిన్నటి వరకు ఒక వెర్షన్ మాట్లాడిన ఆయేషా, నేడు తను కూడా బాధితురాలికి దాడి చేయడానికి ప్రయత్నించిదనే కథనాలు వినిపిస్తుడంతో.. ఆమె కూడా నిందితురాలిగా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఒకవేళ నిజంగా ఆయేషా బాధితురాలిని దాడి చేసేందుకు ప్రయత్నించినట్లయితే, ఆమె కూడా తన భర్త జానీలా కచ్చితంగా జైలుకు వెళ్లాల్సి ఉంటుదని సమాచారం వినిపిస్తోంది.

కానీ, ఈ విషయంలో జానీ మాస్టర్ భార్య ఇటీవలే ఓ మీడియా ఛానేళ్లతో మాట్లాడిన వివరాలు చూస్తే.. అయేషా ఆ అమ్మాయిని ఒక్కసారే కొట్టానని, నిజాలు ఒప్పుకోవాలని, అది కూడా నా భర్తను లాక్కోవాలని చూసే క్రమంలో నేను ఆమెను బెదిరించానని తెలిపింది. అంతేకాకుండా.. తన భర్త జానీ మాస్టర్ ను కావాలనే ఆ యువతి ట్రాప్ చేసిందని, ఇదొక హని ట్రాప్ అంటూ ఆమె ప్రేర్కొంది. అంతేకాకుండా.. జానీ అంటే ఆమెకు ముందు నుంచి ఇష్టమని, కావలనే ఆయనను ట్రాప్ చేసి, ఆయన దగ్గర లగ్జరీ లైఫ్ ను పొందాలనుకుంది. అందుకే ఆయనతో చాలా క్లోజ్ గా ఉండేదని, కానీ,ఇప్పుడు కావాలనే ఆ అమ్మాయి, వాళ్ల అమ్మతో కలసి నా భర్తతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, దీని వెనుక పెద్ద కుట్ర జరుగుతుందని ఆమె తెలిపింది.

మరోవైపు నేడు (శనివారం) ఉప్పరపల్లి కోర్టులో జానీ మాస్టర్‌ని కస్టడీకి కోరుతూ నార్సింగి పోలీసులు పిటిషన్ వేయనున్నారు. పది రోజులపాటు కస్టడీకి కోరే అవకాశం ఉంది. పూర్తిస్థాయిలో ఆయన్ను విచారించేందుకు పోలీసులు కోర్టుకు వెళ్లనున్నారు. రిమాండ్ రిపోర్టులోని కీలక అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. లేడీ కొరియోగ్రాఫర్ ఇచ్చిన 40పేజీల ఫిర్యాదుపైనా సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు కస్టడీ కోరనున్నారు. అలాగే మరోవైపు జానీ మాస్టర్‌పై ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు కావడంతో ఆయన తరఫు న్యాయవాది బెయిల్ కోసం రంగారెడ్డి జిల్లా కోర్టును ఆశ్రయించనున్నారు.