పళ్లు ఎంత గారబట్టి నల్లగా మారినా ఈ టిప్స్‌తో ముత్యంలా మెరవాల్సిందే

www.mannamweb.com


శరీర అందంపై పెట్టిన శ్రద్ధ చాలా మంది ఆరోగ్యంపై కూడా పెట్టరు. పై మెరిసే చర్మం ఎంత ముఖ్యమో.. లోపలి ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. ఇలా చాలా మంది పళ్లను కూడా పట్టించుకోరు.

అవి పాడైపోయి.. గారబట్టి నల్లగా మారితే తప్ప.. వీటి కోసం జాగ్రత్తలు తీసుకోరు.

దంతాలు నల్లగా, పసుపు రంగులోకి మారడానికి చాలా కారణాలు ఉంటాయి. సరిగా బ్రష్ చేయకపోవడం, మాంసాహారాన్ని ఎక్కువగా తినడం, టీ, కాఫీలు ఎక్కువగా తాగడం, ధూమపానం, మధ్య పానం, కూల్ డ్రింక్స్ వంటివి ఎక్కువగా తాగడం వల్ల కూడా దంతాల ఆరోగ్యం దెబ్బతింటుంది.

దంతాలు పసుపు రంగులోకి మారడం, గారబట్టి నల్లగా ఉన్నప్పుడు.. నలుగురిలో తిరగాలన్నా.. మాట్లాడాలన్నా.. నవ్వాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఈ సమస్యను మన ఇంట్లో ఉండే వాటితోనే పరిష్కరించుకోవచ్చు.

అందరి ఇళ్లలో కూడా వెల్లుల్లి ఖచ్చితంగా ఉంటుంది. ఈ వెల్లుల్లికి ఉండే పొట్టు దీసేసి.. వీటిని మెత్తగా దంచుకోవాలి. ఆ తర్వాత ఇందులో అర చెక్క నిమ్మరసం కలుపుకోవాలి. ఇందులో చిటికెడు పసుపు కూడా కలపండి. ఇప్పుడు పేస్ట్ రెడీ అవుతుంది.

ఈ పేస్టుతో ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు బ్రెష్ చేయండి. ఇలా కొద్ది రోజుల్లోనే పళ్లపై ఉండే గార, పసుపు రంగు పోతుంది. పళ్లు తెల్లగా ముత్యాల్లా మెరుస్తాయి. నోటిలో ఉండే బ్యాక్టీరియా, దుర్వాసన కూడా పోతుంది. ఇతర నోటి సమస్యలు కూడా తగ్గుతాయి.