ఢీల్లీకి ఏపీ డిప్యూటీ సీఎం.. అమిత్‌షాతో కీలక భేటీ.

గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీకి పయనమయ్యారు. నేడు సాయంత్రం గం.7 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆయన భేటి కానున్నారు.


ఈ సమావేశంలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి తరఫున ప్రచారం చేయమని కేంద్రమంత్రి పవన్‌ను కోరనున్నట్లు తెలుస్తుంది. ఏపీలో తాజా రాజకీయ పరిణామాలను పవన్ కేంద్రమంత్రికి వివరించనున్నట్లు సమాచారం. ఇటీవలే పవన్ ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి అనితపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అమిత్‌షాతో భేటి అనంతరం పవన్ విజయవాడకు తిరిగి రానున్నారు.

ఉపముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సందడి నెలకొంది. తన యాత్రకు ముందు కళ్యాణ్ మంగళవారం సరస్వతి పవర్ ప్రాజెక్ట్ కోసం కేటాయించిన భూములను పరిశీలించారు, భూసేకరణ ప్రక్రియకు సంబంధించి విచారణ నిర్వహిస్తామని ప్రకటించారు. అమిత్ షాతో చర్చలు జరిపిన తర్వాత, ఢిల్లీ విమానాశ్రయానికి తిరిగి వచ్చే ముందు అక్కడ కాసేపు గడిపేందుకు పవన్ కళ్యాణ్ ఏపీ భవన్‌కు వెళతారు. తిరిగి రాత్రి 10:40 గంటలకు గన్నవరం విమానాశ్రయంలో దిగి ఆయన అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మంగళగిరిలోని తన కార్యాలయానికి చేరుకుంటారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.