కొబ్బరి నీళ్లను వీరు పొరపాటున కూడా తాగకూడదు. ఎవరు తాగకూడదో తెలుసా..?

కొబ్బరి నీళ్లలో చక్కెర ఉంటుంది. ఇది డయాబెటిస్ రోగులకు హానికరం. మధుమేహ వ్యాధిగ్రస్తులు కొబ్బరి నీళ్లు తాగితే, వారి రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది.


అంతేకాకుండా షుగర్ లెవల్స్ అదుపులో ఉండకపోవచ్చు. అందుకే షుగర్‌ బాధితులు కొబ్బరి నీళ్లు తాగే ముందు డాక్టర్‌ని సలహా తీసుకోవడం మంచిది.

కొబ్బరి నీళ్లలో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఇది మూత్రపిండాల సమస్యలు ఉన్నవారికి హానికరం. వీరి శరీరాల ద్వారా అదనపు పొటాషియంను సరిగ్గా ఫిల్టర్ చేయలేరు. ఇది వారి రక్తంలో అధిక స్థాయి పొటాషియం కు దారితీస్తుంది. దీనివల్ల కండరాల బలహీనత, క్రమరహిత హృదయ స్పందన, తీవ్రమైన సందర్భాల్లో గుండెపోటు కూడా వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

కడుపు సంబంధిత సమస్యలు ఉన్నవారు కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగితే, గ్యాస్, విరేచనాలు, ఉబ్బరం వంటి సమస్యలు మరింతగా వేధిస్తాయి. ఎందుకంటే, కొబ్బరి నీళ్లలో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. ఇది కొంతమందికి జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి, కొబ్బరి నీళ్లను జాగ్రత్తగా తీసుకోవాలి.

అధిక రక్తపోటుతో బాధపడేవారికి కొబ్బరి నీళ్లు ఉత్తమమైనవిగా భావిస్తారు. మీ రక్తపోటు తక్కువగా ఉంటే, పొరపాటున కూడా కొబ్బరి నీల్లు తాగరాదంటున్నారు నిపుణులు.. కొబ్బరి నీళ్లు తీసుకోవడం వల్ల రక్తపోటు మరింత తగ్గుతుంది. దీనివల్ల అలసట, మూర్ఛపోవడం, తలతిరగడం వంటి సమస్యలు వస్తాయి. అందుకే లోబీపీ సమస్యతో బాధపడేవారు కొబ్బరి నీళ్లకు దూరంగా ఉండాలని చెబుతున్నారు.

మీరు ఏదైనా సర్జరీ చేయించుకోబోతున్నట్లయితే కొన్ని రోజుల ముందే కొబ్బరి నీళ్లు తాగడం మానేయాలంటున్నారు. కొబ్బరి నీళ్లలో ఉండే ఎలక్ట్రోలైట్లు, ఖనిజాలు శరీర రక్తపోటు, ఎలక్ట్రోలైట్ సమతుల్యతను ప్రభావితం చేస్తాయి. ఇది శస్త్రచికిత్స సమయంలో లేదా తరువాత సమస్యలను కలిగిస్తుంది. అందువల్ల, శస్త్రచికిత్సకు ముందు కొబ్బరి నీళ్లు తాగకుండా ఉండటం మంచిది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.