ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్ వచ్చింది.
తెలంగాణలో రాబోయే నాలుగు సంవత్సరాలలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.
నియోజకవర్గానికి 3,500 ఇళ్లతో పాటు, ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలకు అదనపు ఇళ్లను కేటాయిస్తున్నామని, మొదటి దశలో యుద్ధ ప్రాతిపదికన 4.50 లక్షల ఇళ్లను నిర్మిస్తున్నామని ఆయన అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇళ్లకు కట్టుబడి ఉందని ఆయన అన్నారు.