పంబన్ రైల్వే వంతెన ప్రారంభం..ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం

భారతదేశంలో పురాతన నిర్మాణాలకు, కట్టడాలకు కొదవలేదని జగమేరిగిన సత్యం. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చారిత్రాత్మకమైన వారసత్వ సంపద మనకు తారసపడుతుంటాయి.


విభిన్నమైన ప్రత్యేకతలతో చారిత్రక ప్రదేశాలు చూపరులను ఇటే కట్టిబడేస్తాయి. ఇప్పుడు అలాంటి కోవకే చెందినేదే పంబన్ బ్రిడ్జి వంతెన. పురాతన వైభవాన్ని తలపిస్తునే..నూతన హంగులతో, ఆధునికతను జోడించి పంబన్ బ్రిడ్జిని పునర్ నిర్మించారు. నేడు కొత్తగా నిర్మించిన పంబన్ రైల్వే వంతెనను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించినున్నారు. ఎన్నో ప్రత్యేకతలతో నయా ట్రేడ్తో ప్రస్తుత బ్రిడ్జిని తీర్చిదిద్దారు. ఆ ప్రత్యేకతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

తమిళనాడులోని రామేశ్వరం మండపం జిల్లా పట్టణం నుంచి బంగాళాఖాతంలోని రామేశ్వరం దీవికి వెళ్లాలంటే.. కేవలం సముద్ర మీదుగానే ప్రయాణం చేయాల్సిందే. రామేశ్వరం ద్వీపాన్ని ప్రధాన భూభాగంతో కలిపే కొత్త పంబన్ వంతెనను రైల్వేశాఖ నిర్మించింది. పాత రైల్వే వంతెన శిథిలావస్థకు చేరడంతో దాన్ని మూసివేసింది. ఆ వంతెన స్థానంలో కొత్తగా వంతెనను నిర్మించింది. గతకొద్దిరోజుల కిందట నిర్మాణం పూర్తయ్యింది. ట్రయల్ రన్ సైతం విజయవంతం కావడంతో వంతెనను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసింది. సముద్రం గుండా ఎలాంటి ఆటంకం లేకుండా నౌకలు వెళ్లేలా ఏర్పాటు చేసిన వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జిని తొలిసారిగా సముద్రం మధ్యలో 17 మీటర్ల ఎత్తులో రూ.550 కోట్ల వ్యయంతో నిర్మించారు. అవసరానికి అనుగుణంగా లిఫ్ట్ చేసేలా ఏర్పాటు చేసిన ఫ్లెక్సిబుల్ బ్రిడ్జి. దేశంలోనే తొలి వర్టికల్ బ్రిడ్జి కావడం విశేషం.అయితే, దాదాపు 104 సంవత్సరాల కిందట నిర్మించిన పంబన్ వంతెన ఇనుము తుప్పు పట్టింది. దాని స్థానంలోనే కేంద్రం కొత్తగా వంతెనను నిర్మించింది. పాత వంతెనను బ్రిటిష్ కాలంలో నిర్మించారు. ఈ వంతెన 1914లో ప్రారంభించారు. అప్పటి వరకు దాదాపు వందేళ్లకుపైగా సేవలందించింది.

కొత్త వంతెనకు తుప్పు సమస్య రాకుండా మూడు పొరల పాలీసిలోక్సేన్ పెయింట్ వేశారు. దాంతో 58 సంవత్సరాల వరకు తుప్పు ముప్పు ఉండదు. చిన్న చిన్న మరమ్మతులు చేస్తే వందేళ్ల వరకు ఇబ్బంది లేకుండా రాకపోకలు సాగించొచ్చు. సముద్రంలో వేసిన దిమ్మెలకు ఇబ్బంది కలుగకుండా కేసింగ్ విధానంలో ఐరన్ చట్రాలతో కాంక్రీట్ వేశారు. వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జిలో ఒక బోల్డును వాకపోడం విశేషం. అన్నీ వెల్డింగ్తోనే జోడించారు. వంతెన మొత్తాన్ని స్కాడా సెన్సర్లతో లింక్ చేయగా.. గంటకు 58 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తే స్కాడా సెన్నార్లు ఆటోమేటిక్గా వంతెనను మూసివేస్తాయి. మత్స్యకారుల పడవలు, నేవీ, పోర్టుల నుంచి వచ్చే ఓడలు వంతెనను దాటాల్సి వచ్చిన సమయంలో సిబ్బంది దిమ్మెల వద్ద ఏర్పాటు చేసిన గదుల్లోకి వెళ్లి రిమోట్ ద్వారా వంతెనను లిఫ్ట్ చేస్తారు. చాలా రోజుల తర్వాత పంబన్ రైలు వంతెన మీదుగా ప్రయాణం సాగించనుండడంతో రామేశ్వరానికి వెళ్లే భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సముద్రం అలలు పంబన్ వంతెనపైకి వరకు వస్తుంటాయి. ఇనుము పట్టాలు కావడంతో తప్పుపడుతుంటాయి. శ్రీరామనవమి సందర్భంగా ఈ వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ జాతికి అంకితం చేయనున్నారు.