టయోటా కంపెనీ తమ అక్వా హైబ్రిడ్ కార్లను భారతదేశంలో టెస్ట్ చేస్తోంది. ఈ కారు 35.8 కి.మీ. మైలేజీని ఇస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ కారు భారత మార్కెట్లో ఒక పెద్ద విప్లవాన్నే సృష్టిస్తుందని భావిస్తున్నారు.
అసలు ఈ కారు భారతదేశంలో విడుదల కాబోతుందా, లేక వేరే కారణాల వల్ల టెస్ట్ చేస్తున్నారా? పూర్తి వివరాలు ఈ వార్తలో తెలుసుకుందాం.
భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో టాటా, మారుతి, టయోటా వంటి కంపెనీలు ఎక్కువ మైలేజీనిచ్చే కార్లను తయారు చేస్తున్నాయి. ఇందులో భాగంగా టయోటా కంపెనీ తమ అక్వా అనే కారును భారతదేశంలో టెస్ట్ చేస్తోంది. ఈ కారు ఒక స్ట్రాంగ్ హైబ్రిడ్ రకం కారు. ఈ కారు భారతదేశంలో విడుదల అవుతుందా అనే అంచనాలు పెరిగిపోతున్నాయి.
ఈ కారుపై ప్రజల్లో ఇంత అంచనాలు ఉండటానికి ప్రధాన కారణం దాని మైలేజే. ఈ కారు అంతర్జాతీయ మార్కెట్లో 35.8 కి.మీ. మైలేజీని ఇస్తుంది. భారత ప్రజలకు ఇది చాలా అవసరమైన కారు. అంతర్జాతీయ మార్కెట్లో ఈ కారు పెద్ద ఎత్తున ఆకర్షించడంతో ఇప్పుడు భారతదేశంలో దీన్ని టెస్ట్ చేస్తున్నారు.
ఈ కారును టయోటా కంపెనీ 2021లో మొదటిసారి పరిచయం చేసింది. ఈ కారు జపాన్లో ప్రియస్ సి అనే పేరుతో అమ్ముడైంది. ఈ కారు టిఎన్జిఏ ప్లాట్ఫారమ్లో తయారు చేయబడింది. ఇదే ప్లాట్ఫారమ్లో యారీస్, సియంటా వంటి కార్లు కూడా తయారు చేయబడ్డాయి.
ఈ కారులో 1.5 లీటర్ పెట్రోల్ హైబ్రిడ్ ఇంజిన్ అమర్చారు. ఈ కారు గరిష్టంగా 116 బిహెచ్పి పవర్ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి రెండు ఎలక్ట్రిక్ మోటార్లను దీనికి అమర్చారు. ఇందులో పెట్రోల్ ఇంజిన్ను మాత్రమే ఉపయోగిస్తే 90 బిహెచ్పి పవర్, 120 ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.
ఈ కారు ముందు భాగంలో ఉన్న మోటార్ 80 బిహెచ్పి పవర్ను, 141 ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేయగల కెపాసిటీని కలిగి ఉంది. 4 వీల్ డ్రైవ్లో ఇది 64 బిహెచ్పి పవర్ను, 52 ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు ఇ-సీవీటీ గేర్బాక్స్తో రూపొందించారు. ఈ కారు 35.8 కి.మీ. మైలేజీని ఇస్తుందని తెలుస్తోంది.
ఈ కారులో ప్రపంచంలోనే మొదటిసారిగా బైపోలార్ నికెల్ హైడ్రోజన్ బ్యాటరీ ఉపయోగించారు. ఇందులో ఎక్కువ పవర్ను స్టోర్ చేయవచ్చు. టయోటా కంపెనీ ఇంతకు ముందు ఆర్ఏవీ4, యారీస్, సి-హెచ్ఆర్ వంటి కార్లను కూడా టెస్ట్ చేసింది. కానీ, ఈ కార్లు ఏవీ అమ్మకాలకు రాలేదు. ఇది ఆ కార్ల టెక్నాలజీ కోసం జరుగుతున్న టెస్టింగ్ కూడా కావచ్చు.
డ్రైవ్స్పార్క్ అభిప్రాయం: ఈ కారును టయోటా భారతదేశంలో విడుదల చేస్తుందా లేదా అనేది ఇంకా తెలియదు. కానీ, ఖచ్చితంగా ఈ హైబ్రిడ్ టెక్నాలజీని భారతదేశంలోకి తీసుకువస్తుందని అంచనా వేస్తున్నారు. భారత మార్కెట్లో మైలేజీకి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా, టయోటా అక్వా వంటి ఒక సూపర్ మైలేజ్ కారు వస్తే, కచ్చితంగా మార్కెట్లో పెద్ద మార్పు వస్తుంది. పెట్రోల్ ధరలు పెరుగుతున్న ఈ రోజుల్లో, ఇలాంటి హైబ్రిడ్ కార్లు ప్రజలకు చాలా అవసరం.
































