PM Kisan: రైతులకు రూ.7,000 జమ.. భారీ శుభవార్త చెప్పిన ప్రభుత్వం

రైతులకు ఊరట. ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద జూలై 18న రైతుల ఖాతాల్లోకి నగదు జమ కానుంది. దీనితో పాటు PM Kisan పథకానికి సంబంధించిన డబ్బులు కూడా అదే రోజు విడుదల కానున్నాయి.


ఈ రెండింటినీ కలిపి అర్హులైన ప్రతి రైతు ఖాతాలో రూ.7,000 క్రెడిట్ అవుతుందని బైరెడ్డిపల్లి ఏఓ గీతా కుమారి వెల్లడించారు.

ఇందులో రూ.2,000 కేంద్ర ప్రభుత్వ PM Kisan Yojana నుండి, మరో రూ.5,000 రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అన్నదాత సుఖీభవ పథకం నుండి జమ అవుతుంది. ఇది DBT (Direct Benefit Transfer) ద్వారా రైతు ఖాతాలోకి నేరుగా జమ అవుతుంది.

ఇకపోతే, మీ పేరు అర్హుల జాబితాలో ఉందో లేదో తెలుసుకోవాలంటే **రైతు భరోసా కేంద్రం (Rythu Bharosa Kendra)**కు వెళ్లి వివరాలు చెక్ చేయాలి. మీ పేరు లేని రైతులు జూలై 13లోపు మార్పులు చేసుకోవచ్చు. ఆ మార్పులు సరైనవైతే, జూలై 18న డబ్బులు ఖాతాలోకి వస్తాయి.

మీ స్టేటస్ తెలుసుకోవాలంటే “మనం మిత్ర” గవర్నెన్స్ హెల్ప్‌లైన్ నంబర్ 9552300009 కు కాల్ చేయండి. అలాగే, కొంతమందికి eKYC పూర్తి కాలేదని అధికారులు చెప్పారు. వారు వెంటనే eKYC పూర్తి చేసుకోవాలి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.