ప్రతీ నెల ఫస్ట్ తారీఖున గ్యాస్ ధరల్లో మార్పులు వస్తాయి. గత కొన్ని నెలల నుంచి సిలిండర్ ధరలు పెరుగుతున్నాయి. అయితే ఈ సెప్టెంబర్ నెలకు ఆయిల్ కంపెనీలు గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్ తెలిపాయి.
19 కిలోల కమర్షియల్ సిలిండర్పై రూ.51.50 తగ్గించింది. దీంతో కమర్షియల్ సిలిండర్ ధర ఇప్పుడు రూ.1,580గా ఉంది. ఈ ధరలు నేటి నుంచి అమల్లోకి వస్తాయి. అయితే కేవలం కమర్షియల్ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. గృహ వినియోగానికి ఉపయోగించే 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదని తెలిపింది. కమర్షియల్ ఎల్పీజీని ఎక్కువగా హోటల్స్, రెస్టారెంట్లు లేదా ఇతర వ్యాపారాలు చేసుకునే వారికి బాగా ఉపయోగపడుతుంది.
































