ఏపీ ఎడ్సెట్ కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ప్రస్తుతం సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఈ గడువు ఈనెల 3వ తేదీతో పూర్తవుతుంది. ఈనెల 10వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది. https://edcet-sche.aptonline.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి.
బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఎడ్ సెట్ సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ల జరుగుతుండగా… ఈ గడువు అక్టోబర్ 3వ తేదీతో పూర్తవుతుంది. ఈనెల 4వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు https://edcet-sche.aptonline.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్లను ఎంచుకోవాలి.
అక్టోబరు 5 నుంచి వెబ్ ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ గడువు అక్టోబర్ 7వ తేదీతో పూర్తవుతుంది. 8వ తేదీన వెబ్ ఆప్షన్లను మార్చుకునే అవకాశం ఉంటుంది. అక్టోబర్ 10వ తేదీ సీట్ల కేటాయింపు ఉంటుంది.
ఈ సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ లో సీట్లు దక్కించుకున్న విద్యార్థులు ఈనెల 13వ తేదీలో లోపు ఆయా కళాశాలల్లో రిపోర్టింగ్ చేయాలి. ఈ తేదీ నుంచి తరగతులు కూడా ప్రారంభమవుతాయని అధికారులు ప్రకటించారు.
ఈసారి నిర్వహించిన ఏపీ ఎడ్ సెట్ పరీక్షకు మొత్తం 17,795 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా… 14,527 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. 5 విభాగాల్లో కలిపి మొత్తం 99.42 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
ర్యాంక్ కార్డు ఇలా డౌన్లోడ్ చేసుకోండి
- అభ్యర్థులు ముందుగా https://cets.apsche.ap.gov.in/EDCET/Edcet/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- ఎడ్ సెట్ – 2025 ఫలితాల లింక్ పై క్లిక్ చేయాలి.
- రిజిస్ట్రేషన్ నంబర్, ఎడ్సెట్ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయాలి.
- సబ్మిట్ బటన్పై క్లిక్ చేస్తే ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా ర్యాంక్ కార్డు కాపీని పొందవచ్చు.
- అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు చాలా కీలకం. జాగ్రత్తగా ఉంచుకోవాలి.
































