ఆధార్ సేవల పైన గుడ్ న్యూస్. ఇక నుంచి ఆధార్ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. నవంబర్ 1 నుంచి ఆధార్ కార్డు వివరాల అప్డేట్లో కీలక మార్పు తీసుకొచ్చారు.
ఇకపై పేరు, అడ్రస్, పుట్టిన తేదీ, జెండర్, మొబైల్ నంబర్ వంటి ముఖ్యమైన వివరాలను ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లకుండానే అప్డేట్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఫీజుల విషయంలోనూ మార్పులు చేసారు. ఇక నుంచి ఆధార్ సేవలను సులభతరం కానున్నాయి.
ఆధార్ సేవలు మరింత సులభతరం చేసేలా మార్పులు జరిగాయి. ఇప్పటికే ఆధార్ నిర్వహణలో పలు మార్పులు వచ్చాయి. యూఐడీఏఐ కసరత్తులో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా ఇక ఆన్ లైన్ లోనే ఇక ఆధార్ లో కావాల్సిన మార్పులు చేసుకునే విధంగా వెసులుబాటు కల్పించారు. ఇక నుంచి ఆధారం కేంద్రాలకు వెళ్లే అవసరం లేకుండా బయోమెట్రిక్ అథెంటికేషన్లో కూడా కీలక మార్పులు తీసుకువచ్చారు. ఆధార్ లో కావాల్సిన మార్పులు చేసుకునే విధానంలో కీలక మార్పులు వచ్చాయి. మొబైల్ నంబర్, ఈ మెయిల్ అడ్రస్, చిరునామాను సులభంగా ఆన్ లైన్ లోనే మార్పులు చేసుకునే విధంగా అప్డేట్ జరిగింది. బయోమెట్రిక్అథెంటికేషన్లో కూడా కీలక మార్పులు తీసుకువచ్చారు. ఇప్పటి వరకు ఉన్న ఫింగర్ప్రింట్, కంటి ఐరిస్ స్కాన్ ఇప్పుడు మరింత ప్రతిభావంతంగా పనిచేసేలా మార్పులు చేశారు.
దీని ద్వారా బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ తో పాటు కావాల్సిన విధంగా సేవలు ఉపయోగించే సమయంలో సులభంగా, వేగంగా పనులు పూర్తిచేసుకొనే వెసులుబాటు కలుగుతుంది. ఆధార్ కార్డు దారుల గోప్యత దృష్టిలో పెట్టుకుని కొన్ని నిర్ణయాలు తీసుకుంది. గోప్యతను కాపాడే క్రమంలో భాగంగా కార్డులోని 12 అంకెల పూర్తి ఆధార్నంబర్కాకుండా చివరి నాలుగు నంబర్లు మాత్రమే కనిపిస్తాయి. దీని వల్ల యూజర్ల ప్రైవసీ భద్రంగా ఉంటుంది. అదే విధంగా బ్యాకింక్ రంగంలో ముఖ్యమైన ఈ కేవైసీ ప్రక్రియను మరింత సులభంగా మార్చారు. ఫలితంగా కొత్త బ్యాంక్ ఖాతా, మొబైల్కనెక్షన్, లేదా ఏదైనా ఆన్ లైన్ సేవలను సులభంగా పొందే అవకాశం కలుగుతుంది. పాన్, బ్యాంక్ ఖాతాలకు ఆధార్ కార్డును లింక్చేసినప్పటి నుంచి ట్యాక్స్, ఆర్థిక సేవలకు సంబంధించిన మోసాలు నియంత్రణలోకి వచ్చాయి.
ఇక నుంచి బయోమెట్రిక్ వెరిఫికేషన్ లో లో భాగంగా ఫేస్అథెంటికేషన్ ఫీచర్ ను తీసుకు రానుంది. ఇకపై ఆధార్ వెరిఫికేషన్ ఆఫ్ లైన్ లోనూ చేసుకునేలా యూఐడీఏఐ కొత్త ఫీచర్ను అందు బాటులోకి తీసుకొస్తోంది. దీని వల్ల ఇంటర్నెట్సదుపాయం లేకుండానే ఆధార్ వెరిఫికేషన్ సులభంగా చేసుకోవచ్చు. ముఖ్యంగా డిజిటల్ ఆధార్ వెల్ వెట్ లాలా ఉపయోగపడేలా కొత్తగా ఒక యాప్ను తీసుకురానుంది యూఐడీఏఐ. ఫలితంగా ఆన్లైన్, ఆఫ్లైన్వెరిఫికేషన్సులభంగా కావడంతో పాటు యూజర్వివరాలు భద్రంగా ఉంటాయి. వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచేలా కొత్త ఎన్క్రిప్షన్, మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ యూఐడీఏఐ ప్రవేశపెట్టనుంది. వీటిని త్వరలోనే అందుబాటులోకి తీసుకొచ్చేలా కసరత్తు వేగవంతం చేసింది.
































