Andhra Pradesh: 8th వరకు కామన్ ఎగ్జామినేషన్ పరీక్షలు రద్దు చేసిన ఏపీ హై కోర్టు

Andhra Pradesh: 8th వరకు కామన్ ఎగ్జామినేషన్ పరీక్షలు రద్దు చేసిన ఏపీ హై కోర్టు


ఎనిమిదో తరగతి వరకు కామన్ ఎగ్జామ్ నిర్వహించడం కేంద్ర చట్టాన్ని ఉల్లంఘించడమే అంటున్నారు. దీనికోస ప్రవైటు స్కూల్స్ లక్షల రూపాలయను వసూలు చేస్తున్నారని చెప్పారు.

దీనికి సంబంధించి ఇవాళఏపీ హైకోర్టులో విచారణలు జరిగాయి. కేంద్ర చట్టాన్ని ఉల్లంఘిస్తూ కామన్ ఎగ్జామినేషన్ బోర్డు పడుతున్నారని…దాని కోసం డబ్బులు కూడా వసూలు చేస్తున్నారని న్యాయవాది ముతుకుమిల్లి శ్రీవిజయ్ వాదనలు వినిపించారు. సాల్ట్ ప్రోగ్రామ్ పేరుతో ఈ పరీక్షలు నిర్వహించడం నిబంధనలకు విరుద్దమని న్యాయవాది పేర్కొన్నారు.

ఈ వాదనలు విన్న తర్వాత కేంద్ర చట్టంలో ఉన్న సెక్షన్ 29కి ఈ కార్యక్రమం వ్యతిరేకమని పేర్కొంటూ హైకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. పాఠశాలల్లో ఉపాధ్యాయులు స్వయంగా ప్రశ్నాపత్రాలు తయారు చేసుకుని పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని న్యాయవాది శ్రీ విజయ్ పేర్కొన్నారు.