Saturday, May 17, 2025

మా స్టెప్ బై స్టెప్ గైడ్ ద్వారా మా స్నేహితుడు వాట్సాప్ ద్వారా కొత్త AP రేషన్ కార్డు కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకోండి.

ఏపీలో కొత్త రేషన్ కార్డులను డిజిటల్ గవర్నెన్స్ రూపంలో అందిస్తున్నారు. ఇందుకోసం వాట్సప్ మన మిత్ర పేజ్ ద్వారా ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ప్రస్తుతం వాట్సప్ మిత్ర ద్వారా రేషన్ కార్డు ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. తద్వారా మీరు సులభంగా కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది.

ఏపీలోని కూటమి ప్రభుత్వం ప్రస్తుతం డిజిటల్ గవర్నెన్స్ విషయంలో విప్లవాత్మకమైన మార్పులు తెస్తోంది. ఇందులో బాగంగా దాదాపు 160 ప్రభుత్వ సేవలను వాట్సప్ ద్వారా అందిస్తోంది. ఈ వాట్సప్ సేవల కోసం మన మిత్ర పేజ్ అందుబాటులోకి తెచ్చారు. ఈ మన మిత్ర పేజ్ ద్వారా తాజాగా కొత్త రేషన్ కార్డులను సైతం పొందే అవకాశం ఉంది. వాట్సప్ ద్వారా సులభంగా కొత్త రేషన్ కార్డులను ఎలా అప్లై చేసుకోవచ్చు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం జూన్ నెల నుంచి క్యూఆర్ కార్డ్ తో కూడా స్మార్ట్ రేషన్ కార్డులను అందుబాటులోకి తెస్తున్నారు. దీని వల్ల రేషన్ కార్డుల విషయంలో జరుగుతున్న అవినీతికి అడ్డుకట్ట వేయడంతో పాటు పారదర్శకతను ప్రోత్సహిస్తుంది.
మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా రేషన్ కార్డ్ అప్లై చేయాలంటే ఏం చేయాలో ఇఫ్పుడు తెలుసుకుందాం. స్టెప్ బై స్టెప్ గైడ్ ద్వారా ఎలా దరఖాస్తు చేయవచ్చో చూద్దాం.
>> మన మిత్ర వాట్సప్ గవర్నెన్స్ ద్వారా రేషన్ అప్లై చేయాలంటే ముందుగా వాట్సాప్ లో 95523 00009 నెంబర్ కు HI అని టైప్ చేయాల్సి ఉంటుంది.
>> ఆ తర్వాత మీకు రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచిన సేవలు వివరాలు ప్రత్యక్షం అవుతాయి. వాటిలో మీకు అవసరం అయిన సర్వీసును ఎంపిక చేసుకోవచ్చు.
>> మన మిత్ర యాప్ ద్వారా మొత్తం 160 కన్నా ఎక్కువ సేవలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో విద్య, ఆరోగ్యం,. రవాణా, రెవెన్యూ, మున్సిపల్ సేవలు, పోలీస్ శాఖలకు సంబంధించిన సేవలు అందుబాటులో ఉన్నాయి.
>> ముఖ్యంగా వాట్సప్ ద్వారా మీరు రేషన్ కార్డు సైతం అప్లై చేసుకోవచ్చు. మే 7వ తేదీ నుంచి ఈ సేవలను అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ సర్వీసు ద్వారా మీరు కొత్త రేషన్ కార్డుతో పాటు పాత రేషన్ కార్డులో మార్పులు, చేర్పులు చేయవచ్చు. .
>> అలాగే ఈ కొత్త వాట్సప్ సర్వీసు సర్వీసులో కొత్త రేషన్ కార్డు దరఖాస్తులతో పాటు,కొత్త సభ్యులను యాడ్ చేయడం, పాత సభ్యులు చనిపోయిన వారిని తొలగించడం, కార్డు సరెండర్ చేయడం, చిరునామా మార్పు, కుటుంబాలు విడిపోయినప్పుడు కార్డు స్ప్లిట్ వంటి సర్వీసులు అందబాటులో ఉన్నాయి.
>> ఇదిలా ఉంటే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1.46 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయి. తద్వారా మొత్తం 4.24 కోట్ల మంది లబ్ది దారులు ఇందులో ఉన్నారు.

తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. దర్శనం మరియు గది టిక్కెట్లను వెంటనే బుక్ చేసుకోండి..

తిరుమల శ్రీవారి దర్శనం కోసం నిత్యం వేంకటేశుని భక్తులు ఎదురు చూస్తుంటారు. ఈ నేపథ్యంలో టీటీడీ మూడు నెలల ముందుగానే శ్రీవారి ప్రత్యేక దర్శనం టిక్కెట్లు ఇతర సేవ టిక్కెట్లు, గదుల బుక్‌ చేసుకునే సౌకర్యం కూడా కల్పిస్తోంది.  అయితే, తాజాగా ఆగష్టు కోటా దర్శనం టిక్కెట్లను మే 19న విడుదల కానున్నాయి. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

తిరుమల శ్రీ వెంకటేశుని దర్శనార్థం నిత్యం ఎంతో మంది భక్తులు తపిస్తూ ఉంటారు. అయితే ఆన్‌లైన్ దర్శన కోటా విడుదల చేసింది ఆగస్టు నెలకి సంబంధించిన ఆర్జిత సేవలు ప్రత్యేక దర్శనంతో పాటు గదులు బుక్ చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నారు.

ఈ నేపథ్యంలో 19వ తేదీ ఉదయం 10:00 నుంచి లక్కీ డిప్‌ రిజిస్ట్రేషన్ ప్రారంభం అవుతుంది. ఇది 21వ తేదీ 10 గంటల వరకు కొనసాగుతుంది. 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల్లోపు ఎంపికైన వారు డబ్బులు చెల్లిస్తే టికెట్ కన్ఫర్మ్ అవుతుంది.

ఇక స్వామి వారి ఉంజాల్‌, ఆర్జిత, బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ ఆగస్టు నెలకోటా 22వ తేదీన విడుదల చేస్తారు. వర్చువల్ సేవ టికెట్లు సంబంధించింది కూడా అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు.

23వ తేదీ ఉదయం అంగ ప్రదక్షిణ టోకెట్లు విడుదల చేస్తారు. అదే రోజు శ్రీ వాణి ట్రస్ట్ టికెట్లు కూడా ఉదయం 11 గంటల నుంచి టీటీడీ అందుబాటులో ఉంచనుంది. వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శనం టికెట్లు కూడా 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.

ఇక మే 24వ తేదీ ఆగస్టు నెల కోటాకు సంబంధించిన ప్రత్యేక దర్శనం రూ.300 టికెట్లు కూడా ఆన్‌లైన్లో టీటీడీ విడుదల చేయనుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి గదులు బుకింగ్ చేసుకునే సౌకర్యం కూడా కల్పిస్తున్నారు.

 

జియో బ్లాక్ బస్టర్ రీఛార్జ్ ప్లాన్.. తక్కువ ధరకే అపరిమిత ప్రయోజనాలు..!

రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం కొత్త రూ.458 ప్రీపెయిడ్ ప్లాన్‌ను పరిచయం చేసింది, ఇది ప్రత్యేకంగా కాలింగ్ మరియు SMS సేవలను ఎక్కువగా ఉపయోగించే వినియోగదారుల కోసం రూపొందించబడింది. ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీని అందిస్తూ, అనేక ఆకర్షణీయమైన ప్రయోజనాలతో వస్తోంది.

ప్లాన్ వివరాలు:
వ్యాలిడిటీ: 84 రోజులు
కాల్స్: భారతదేశం అంతటా ఏ నెట్‌వర్క్‌లోనైనా అపరిమిత కాల్స్
SMS: 1000 ఉచిత SMSలు
రోమింగ్: ఉచిత నేషనల్ రోమింగ్ సౌకర్యం
అదనపు ప్రయోజనాలు: జియో సినిమా, జియో టీవీ వంటి జియో యాప్‌లకు ఉచిత యాక్సెస్

ఈ ప్లాన్ కాలింగ్ మరియు SMS సేవలపై దృష్టి సారించే వినియోగదారులకు అనువైన ఎంపికగా నిలుస్తుంది. జియో యాప్‌ల ద్వారా వినోదాన్ని ఆస్వాదించే వారికి కూడా ఈ ప్లాన్ అదనపు విలువను అందిస్తుంది. రూ.458 వద్ద, దీర్ఘకాలిక వ్యాలిడిటీ మరియు అపరిమిత కాల్స్ సౌకర్యంతో ఈ ప్లాన్ ఆర్థికంగా సమర్థవంతమైన ఎంపికగా ఉంది.

 

మీ బిడ్డ పుట్టినరోజు కోసం అనాథాశ్రమానికి వెళ్లి ఈ తప్పు చేయకండి.

పుట్టినరోజు అంటే ప్రతి పిల్లవాడికీ ఎంతో ప్రత్యేకమైన రోజు. ఈ రోజు కోసం వారు నెలల తరబడి ఎదురుచూస్తుంటారు. కొత్త బట్టలు, కేక్ కట్, గిఫ్టులు, పార్టీలు… ఇవన్నీ పిల్లల జీవితంలో నిత్య మధుర జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల బర్త్ డేను జ్ఞాపకంగా మార్చేందుకు ఎన్నో విధాల ప్లాన్ చేస్తారు. అయితే ఇటీవల ఒక కొత్త ట్రెండ్ వచ్చిందని చెప్పొచ్చు. అదే అనాథాశ్రమాల్లో పిల్లల పుట్టినరోజు వేడుకలు జరపడం.

ఇది ఒక మంచి ఆలోచనలాగే మొదలైంది. “పార్టీ చేసుకోవడమే కాదు, కొంతమంది నన్ను తలచుకోవాలి, వారి కోసం నేను ఏదైనా చేయాలి” అన్న దృక్కోణంలో తల్లిదండ్రులు ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. కానీ దీని వెనుక ఊహించని ప్రభావాలు ఉన్నాయని ఇప్పుడు పేరెంటింగ్ ఎక్స్‌పర్ట్లు చెబుతున్నారు.

పుట్టినరోజు ఆనందం… కానీ ఎవరికీ?

తల్లిదండ్రులు బర్త్ డే సందర్భంగా అనాథాశ్రమానికి వెళ్లి అక్కడి పిల్లలతో కేక్ కట్ చేయిస్తారు. అక్కడి పిల్లలకు తినే మంచి ఫుడ్, చాక్లెట్లు, గిఫ్టులు ఇస్తారు. ఈ వేడుకల్ని చాలా ప్రేమతో ప్లాన్ చేస్తారు. కొంతమంది ఫ్యామిలీ మొత్తం తీసుకెళ్లి అక్కడ ఒక మంచి మూడ్ క్రియేట్ చేస్తారు. అక్కడి పిల్లలు కూడా బయట నుంచి వచ్చిన వారితో కలిసి కొన్ని గంటలు సంతోషంగా గడుపుతారు. ఇది చూస్తే ఎవరైనా ఇది మంచి పని అంటారు. కానీ ఇదే విషయాన్ని ఇంకొక కోణంలో చూస్తే మాత్రం అసలైన సమస్య కనిపిస్తుంది.

పేరెంటింగ్ నిపుణులు, ముఖ్యంగా అంబికా అగర్వాల్ వంటి వారు చెబుతున్న విషయాలు ఎంతో ఆలోచించదగినవిగా ఉన్నాయి. ఆమె చెప్పినట్లే.. “ఈ వేడుకల్లో ఆనందం ఎంత ఉంది అనేది కాకుండా, ఎవరి హృదయం నొప్పించబడుతోంది అనేదే ముఖ్యం.”

తల్లిదండ్రుల ప్రేమను చూసి నెర్వస్ అవుతున్నారు

పుట్టినరోజు వేడుకల్లో పిల్లలు కేక్ కట్ చేస్తారు, తల్లిదండ్రులకు తినిపిస్తారు, హగ్ చేస్తారు, ముద్దులు పెడతారు. ఇది ప్రతి ఇంట్లో జరిగే ప్యారెంట్-చైల్డ్ బాండ్‌ను చూపించే ఒక అందమైన క్షణం. కానీ అదే సందర్భంలో అనాథాశ్రమంలోని పిల్లలు చూస్తే ఏమవుతుంది?

వాళ్లు కూడా తమకు తల్లిదండ్రులు ఉన్నారా అన్నదే మొదటి ఆలోచన. తాము కూడా ఒక రోజు ఇలా తమ తల్లిదండ్రులతో పుట్టినరోజు జరుపుకునే అదృష్టం పొందుతామా అన్న ఆశ కూడా కలుగుతుంది. కానీ అదే సమయంలో… ఆ ఆశ తీరదనే బాధ వారిని తలకిందులు చేస్తుంది. అదే విషాదం.

“మాకూ కుటుంబం ఉంటే ఎంత బాగుండేది” అన్న బాధ

ఇంటి పిల్లలు ఆనందంగా ఉంటే, ఫ్యామిలీతో వచ్చి పుట్టినరోజు జరుపుకుంటే, ఆ ఫ్యామిలీని చూసి అనాథాశ్రమంలో ఉన్న చిన్నారి మనసు హరించి పోతుంది. “అమ్మా నాన్న ఉంటే మన లైఫ్ కూడా ఇలా ఉండేది కదా?” అనే వేదన వారికి గుర్తుచేస్తుంది తాము ఒంటరిగా ఉన్న సత్యాన్ని. ఇది ఇంత సులభంగా మర్చిపోలేని లోటుగా మారుతుంది. వారి జీవితంలోని దౌర్భాగ్యాన్ని మరోసారి స్పష్టం చేస్తుంది.

వాళ్ల లోటునే వాళ్లకు గుర్తు చేస్తున్నాం

పుట్టినరోజు సెలబ్రేషన్లు అనాథాశ్రమాల్లో చేయడం వల్ల అక్కడి పిల్లలకు తమ జీవితంలో లేని అన్ని సౌకర్యాలు కనిపిస్తాయి. తినడానికి మంచి ఫుడ్, అందమైన బట్టలు, కేక్, కుటుంబం, హడావిడి అన్నీ ఊహలోకి వచ్చేస్తాయి. కానీ ఆ ఊహలే వెంటనే నిజమైన లోటుగా మారుతాయి. “ఇవి మన జీవితంలో లేవు” అన్న బాధ మళ్లీ మళ్లీ తలెత్తుతుంది.

తాము తినే ఆహారం, ఉండే వాతావరణం, స్పెషల్ ట్రీట్‌మెంట్ అన్నీ సాధారణమైపోతాయి. ఇది ఫైనాన్షియల్‌గా కాదు, ఎమోషనల్‌గా వారిని గాయపరుస్తుంది. కొందరికి ఇది ఎంత చిన్న విషయం అనిపించవచ్చు. కానీ ఒక్క పిల్లవాడి మనసులో ఒక్క నిమిషం వచ్చిన దిగులే… దీర్ఘకాలంగా మానసికంగా ప్రభావితం చేస్తుంది.

ఇర్ష్య, ద్వేష భావనలు పెరిగే ప్రమాదం

అనాథాశ్రమాల్లో ఉన్న పిల్లలు అందరూ ఒకేలా ఫీలవరు. కొందరు సంతోషంగా తీసుకుంటారు. కానీ కొందరు మాత్రం సెన్సిటివ్‌గా ఉంటారు. వారి మనసులో తల్లిదండ్రుల ప్రేమకు దక్కని తాపత్రయం ఉంటుంది. ఇలాంటి వేడుకల్లో మిగతా పిల్లలను చూసి వారిలో ఈర్ష్య కూడా కలుగుతుంది. ఇది వారిని ద్వేషపూరితంగా మార్చే ప్రమాదం ఉంటుంది. ఇది రెగ్యులర్‌గా జరగడం వల్ల, కొన్ని సందర్భాల్లో వారిలో నెగటివ్ ఫీలింగ్స్ పెరిగి ప్రవర్తనలో మార్పులు రావొచ్చు.

ఇది హెల్ప్ కాదా?

కొందరు ఈ వ్యాసాన్ని చదివి “అయితే ఏమిటి? అనాథాశ్రమానికి వెళ్ళకూడదా?” అని ఆశ్చర్యపోవచ్చు. కాని విషయం అలా కాదు. అక్కడికి వెళ్లి సహాయం చేయొచ్చు. కానీ పిల్లల బర్త్ డేను సెలబ్రేట్ చేయడం పేరుతో తామే హిరోలమనే ఫీలింగ్‌తో చేయకూడదు. ఇది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం కాకుండా, నిజంగా వారికి ఉపయోగపడే విధంగా ఉండాలి. నొప్పి గుర్తుచేయకుండా, సహాయం చేయడం నిజమైన సేవ.

మాటలకంటే భావన ముఖ్యం

పుట్టినరోజు ఒక వేడుకే కానీ, ఒకరికే కాదు అందరికీ ఆనందం కలిగించేదిగా ఉండాలి. అదే సమయంలో ఇతరులకు బాధ కలిగించకుండా ఉండాలి. అనాథాశ్రమాల పిల్లల మనసులో గాయాలు మిగలకుండా, వారిని గుర్తించి మానసికంగా స్టెబుల్‌గా ఉండేలా చేయాలి. ఈ చిన్న మార్పు… ఎంతో పెద్ద ప్రభావాన్ని చూపుతుంది.

సంక్షిప్తంగా చెప్పాలంటే

మీ పిల్లల బర్త్ డేను మీరు కుటుంబంతో కలిసి ఎక్కడైనా జరుపుకోవచ్చు. కానీ ఇతరుల బాధను గుర్తుచేసే విధంగా కాకుండా జరుపుకోవడమే ముఖ్యమైనది. మానవత్వం అంటే సాయం చేయడమే కాదు, ఎవరికైనా బాధ కలిగించకుండా చేయడమూ కావాలి. ఆనందం పంచడం అంటే, ఎవరి హృదయాన్ని బాధపెట్టకుండా పంచడం.

అందుకే… ఈసారి మీ బర్త్ డేను పబ్లిసిటీ కోసం కాకుండా, హ్యూమానిటీ కోసం ప్లాన్ చేయండి. ఒక నిస్వార్థ ఉదాహరణగా నిలవండి. అప్పుడే మీరు నిజమైన సేవా భావంతో పుట్టినరోజు జరిపినట్టవుతుంది.

రోజుకు రూ.2 వేల ఆదాయం.. సీజన్‌లో మంచి వ్యాపారం.

పనస పండ్లలోని ఫైటోన్యూట్రియంట్స్, ఐసోప్లేవిన్స్ క్యాన్సర్ కారక కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి. పనసలో ఖనిజాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఏర్పడే ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. కణజాలాల నాశనాన్ని అడ్డుకుంటాయి. పనస తొనలు తినడం ద్వారా మగవారిలో వీర్యకణాల సంఖ్య పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే విటమిన్ ఎ కంటి చూపుని మెరుగుపరుస్తుంది. రేచీకటి సమస్యను తగ్గిస్తుంది. అంతేకాకుండా చర్మం, జుట్టు ఆరోగ్యంతో ఉండేలా సహాయపడుతుంది. రక్తహీనత సమస్యతో బాధపడేవారికి పనసపండు మంచి ఫలితాన్ని ఇస్తుంది. దీనిలో ఉండే పోషకాలు , విటమిన్స్ రక్తహీనత సమస్యను తగ్గిస్తాయి. అంతేకాకుండా రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమబద్దీకరిస్తుంది.
అయితే ఈ వేసవి కాలంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా పనస పండ్లు ఇక్కడ కనబడlr పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే పనస తోటలు తక్కువగా ఉండటం దీనికి బలమైన కారణం అని చెబుతున్నారు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు, జంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూడెం మార్కెట్ పనస పండ్లు వ్యాపారులు. ప్రస్తుతం మార్కెట్ లో పనస పండ్లు వ్యాపారం తక్కువగా చేస్తున్నాము అని పనస పండ్లు తోటలో అందుబాటులో లేకపోవడం తో ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేస్తున్నాము అని పనస తోటలలో ఒక్కొక్క చెట్టు 2000 రూపాయలు చొప్పున కొనుగోలు చేసి ఆ చెట్టుకు ఉన్నా కాయలని దింపి పండేసుకుని మార్కెట్ లో తొనలు లెక్క విక్రయిస్తున్నాము అని చెబుతున్నారు.

రైతులకు భారీ శుభవార్త.. 100 శాతం సబ్సిడీతో కొత్త పథకం

రైతు భరోసా విషయంలో ఇటీవల శుభవార్త తెలిపిన తెలంగాణ ప్రభుత్వం, తాజాగా పోడు రైతులకు తీపి కబురు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా పోడు పట్టాలు పొందిన 2.10 లక్షల మంది రైతులను ఈ పథకానికి ఎంపిక చేశారు. వారికి ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

6 లక్షల ఎకరాలకు ప్రయోజనం.. సీఎం రేవంత్ చేతుల మీదుగా ప్రారంభం: ఈ పథకం ద్వారా సుమారు 6 లక్షల ఎకరాల పోడు భూములు కలిగిన రైతులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ నెల 18న అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్ మండలం మాచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.

ఐదేళ్లలో రూ.12,600 కోట్ల బడ్జెట్:
ఈ పథకానికి సంబంధించిన వ్యయాన్ని ప్రభుత్వం ఇప్పటికే ఖరారు చేసింది. వచ్చే ఐదు సంవత్సరాల్లో (2025-26 నుంచి 2029-30 వరకు) రూ.12,600 కోట్లను ఖర్చు చేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.600 కోట్లు ఖర్చు చేయనుండగా, తర్వాతి నాలుగు సంవత్సరాలకు ప్రతి ఏడాదికి రూ.3,000 కోట్ల చొప్పున ఖర్చు చేయనున్నారు.

ఎస్టీ ఎస్డీఎఫ్ నిధులతో అమలు:
ఈ పథకం అమలుకు అవసరమైన నిధులను ఎస్టీ ఎస్డీఎఫ్ (Scheduled Tribes Special Development Fund) నుంచి ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పోడు పట్టాలు పొందిన గిరిజన రైతుల సంక్షేమమే లక్ష్యంగా ఈ పథకాన్ని తీసుకువచ్చినట్లు వెల్లడించింది.

ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల
మే 15న, గురువారం నాడు ఈ పథకానికి అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇందిర సౌర గిరి జల వికాసం పథకం కింద, పోడు భూముల్లో బోర్లు తవ్వించడం, వాటికి సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేయడం వంటి మౌలిక సదుపాయాలను ప్రభుత్వం అందించనుంది.

రైతులకు ఖర్చుల్లేని పథకం – పూర్తి భారం ప్రభుత్వమే భరిస్తుంది
ఈ పథకం కింద రైతులు ఎలాంటి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కావలసిన మొత్తం ఖర్చును ప్రభుత్వం పూర్తిగా భరిస్తుంది. గిరిజన రైతులపై ఎలాంటి ఆర్థిక భారం మోపకుండా 100 శాతం రాయితీతో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.

వ్యవస్థాపిత కార్యాచరణ – తేదీల వారీగా లక్ష్యాలు
మే 25వ తేదీ వరకు మండలాల వారీగా అర్హులైన ఎస్టీ రైతులను గుర్తించాలి.
జూన్ 10 లోపుగా భూగర్భ జలాల సర్వే, క్షేత్రస్థాయి పరిశీలన, ఇతర అంచనాలు పూర్తిచేయాలి.
మే 30 నాటికి జిల్లాల వారీగా టెండర్లు ఖరారు చేయాలి.
జూన్ 25 నాటికి ఎంపిక చేసిన ప్రాంతాల్లో పనులు అప్పగించాలి.

జూన్ 26 నుండి వచ్చే ఏడాది మార్చి 31 వరకు బోరుబావుల ఏర్పాటుతో పాటు సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేసి, ఉద్యాన పంటల సాగు కార్యక్రమాలు పూర్తి చేయాలి. చివరగా యూనిట్ వినియోగపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

ప్రభుత్వ ప్రకటనలో ముఖ్యాంశాలు
గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి డా. ఏ. శరత్ మే 15న ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో పథకం లక్ష్యాన్ని, వ్యయాన్ని, అమలులో ఉండబోయే మౌలిక పనులను స్పష్టంగా పేర్కొన్నారు. ముఖ్యంగా, 2.10 లక్షల మంది రైతుల 6 లక్షల ఎకరాలకు సౌర విద్యుత్ ఆధారిత సాగు నీరు అందించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యమని వివరించారు. ఈ విధంగా, తెలంగాణ ప్రభుత్వం పోడు భూముల అభివృద్ధికి విశేష ప్రాధాన్యం ఇస్తూ గిరిజన రైతులకు ఉచితంగా సాగు అవసరాలు తీర్చేలా ప్రణాళిక రూపొందించింది. ఇది గిరిజన వర్గాల ఆర్థిక భద్రతకు దోహదపడే మంచి కార్యక్రమంగా నిలవనుంది.

మిమ్మల్ని లక్షాధికారిని చేసే SBI కొత్త పథకం.. నెలకు ఎంత పెట్టుబడి పెట్టాలి?

ఎస్‌బీఐ ఇటీవల కస్టమర్ల కోసం కొత్త పథకాలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. రెండు పథకాలు తీసుకురాగా.. అందులో ‘హర్ ఘర్ లఖ్‌పతి ఆర్‌డీ’ పథకం ఒకటి. మరొకటి ఎస్బీఐ ప్యాట్రన్స్ స్కీమ్. ఇక హర్ ఘర్ లఖ్‌పతి పథకం ద్వారా మీరు చేసే డిపాజిట్ల ద్వారా లక్షాధికారులు కావొచ్చు. ఇందుకోసం ఎంత ఇన్వెస్ట్ చేయాలనేది తెలుసుకుందాం.

సామాన్యుల్లో పొదుపును ప్రోత్సహించేందుకు, డిపాజిట్లను పెంచేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సరికొత్త పథకాలను అందుబాటులోకి తెస్తోంది. ఇటీవల ఎస్బీఐ.. ‘హర్ ఘర్ లఖ్‌పతి రికరింగ్ డిపాజిట్’ (Har Ghar Lakhpati RD) సహా ఎస్బీఐ ప్యాట్రన్స్ అనే పథకాల్ని తెచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మనం హర్ ఘర్ లఖ్‌పతి స్కీమ్ గురించి తెలుసుకుందాం. ఈ పథకం ద్వారా మీరు ఒక నిర్దిష్ట కాలవ్యవధిలో లక్ష రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ నిధిని సమకూర్చుకోవచ్చు. ఇక్కడ సాధారణ ఆర్‌డీల్లా కాకుండా, మీకు ఎంత మొత్తం కావాలో దానిని బట్టి నెలనెలా ఎంత చెల్లించాలో ముందే తెలుసుకోవచ్చు. ఈ పథకంలో రికరింగ్ డిపాజిట్లకు కనీస కాలవ్యవధి 12 నెలలు కాగా, గరిష్టంగా 120 నెలల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. సాధారణంగా ఆర్‌డీల్లో మనం నెలకు కొంత నిర్ణీత మొత్తం జమ చేస్తూ వెళ్తాం. కానీ ఈ కొత్త స్కీమ్‌లో మీరు లక్ష రూపాయల లక్ష్యాన్ని చేరుకోవడానికి వడ్డీ రేట్లను బట్టి నెలకు ఎంత చెల్లించాలో ముందే లెక్కిస్తారు.

ప్రస్తుతం ఎస్బీఐ సాధారణ ప్రజలకు 3 నుంచి 4 సంవత్సరాల కాలవ్యవధి గల రికరింగ్ డిపాజిట్లపై గరిష్టంగా 6.75 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఇతర కాలవ్యవధులపై వడ్డీ రేటు 6.50 శాతంగా ఉంది. సీనియర్ సిటిజన్ల విషయానికి వస్తే, ఇదే కాలవ్యవధికి 7.25 శాతం, ఇతర డిపాజిట్లపై 7 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ఇప్పుడు సాధారణ ప్రజలు, సీనియర్ సిటిజన్లు లక్ష రూపాయలు పొందడానికి ఏ కాలవ్యవధిలో నెలకు ఎంత పెట్టుబడి పెట్టాలో చూద్దాం.

సాధారణ ప్రజలకు..

3 సంవత్సరాలు: నెలకు రూ. 2,500 పెట్టుబడితో 6.75 శాతం వడ్డీ రేటుతో మెచ్యూరిటీకి రూ. లక్ష పొందొచ్చు.
4 సంవత్సరాలు: నెలకు రూ. 1,810 పెట్టుబడితో 6.75 శాతం వడ్డీ రేటుతో మెచ్యూరిటీకి రూ. 1,00,000 పొందొచ్చు.
5 సంవత్సరాలు: నెలకు రూ. 1,407 పెట్టుబడితో 6.50 శాతం వడ్డీ రేటుతో మెచ్యూరిటీకి రూ. లక్ష వస్తుంది.

సీనియర్ సిటిజన్లు..

నెలకు రూ. 2,480 పెట్టుబడితో 7.25 శాతం వడ్డీ రేటుతో మెచ్యూరిటీకి అంటే మూడేళ్లకు రూ. లక్ష వస్తుంది.
ఇదే నాలుగేళ్లకు చూస్తే నెలకు రూ. 1791 పెట్టుబడి పెడితే చాలు.. ఇక్కడ 7.25 శాతం వడ్డీ రేటుతో రూ. లక్ష పొందొచ్చు.
ఐదు సంవత్సరాల వ్యవధికి నెలకు రూ .1389 పెట్టుబడితో 7 శాతం వడ్డీ రేటుతో మెచ్యూరిటీకి రూ. లక్ష పొందే అవకాశం ఉంటుంది.

గుర్తుంచుకోవాల్సిన విషయాలు..

ఈ లఖ్‌పతి ఆర్‌డీ పథకాన్ని భారతీయ నివాసితులు వ్యక్తిగతంగా లేదా జాయింట్‌గా తెరవవచ్చు.
పదేళ్లు పైబడిన మైనర్ల తరపున వారి సంరక్షకులు ఖాతా తెరవొచ్చు.
గడువుకు ముందే రూ.5 లక్షల లోపు విత్‌డ్రా చేస్తే 0.50 శాతం, అంతకు మించి విత్‌డ్రా చేస్తే 1 శాతం పెనాల్టీ ఉంటుంది.
వరుసగా 6 నెలలు ఇన్ స్టాల్‌మెంట్స్ చెల్లించకపోతే ఖాతా మూసివేయబడుతుంది.

 

ప్రతిరోజు ఉదయం ఒక టీస్పూన్ గుమ్మడికాయ గింజలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే.

గుమ్మడికాయ గింజల్లో అనేక పోషకాలు దాగి ఉంటాయి. ఇవి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు మన సొంతం అవుతాయి. రోజూ ఒక టీ స్పూన్ గుమ్మడి గింజలు తినడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

గుమ్మడి గింజల్లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇందులోని ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, మెగ్నీషియం, ఫైబర్‌ తదితర యాంటీఆక్సిడెంట్లు శరీరంలో వాపు, వృద్ధాప్యంతో పోరాడటానికి సహాయపడతాయి.

గుమ్మడి గింజల్లోని మెగ్నీషియం రక్తపోటును నియంత్రిస్తుంది. తద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

గుమ్మడి గింజలు తరచూ తీసుకోవడం వల్ల ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడంలో సాయపడతాయి. ఇందులోని విటమిన్-E, ఫైటోస్టెరాల్స్‌ తదితర యాంటీఆక్సిడెంట్లు రక్త నాళాలు దెబ్బతినకుండా సాయపడతాయి.

గుమ్మడి గింజల్లోని ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం.. శరీరంలో సెరోటోనిన్, మెలటోనిన్ అనే హార్మోన్ల ఉత్పత్తికి సాయపడుతుంది. అలాగే నాడీ వ్యవస్థను కాపాడడంలో కూడా సాయం చేస్తాయి.

ఈ విత్తనాలు తినడం వల్ల టైప్-2 డయాబెటిస్ లేదా ప్రీడయాబెటిస్ ఉన్నవారికి ఎంతో ప్రయోజనం ఉంటుంది. అలాగే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

బలూచిస్తాన్ భౌగోళిక నేపథ్యం, ​​సామాజిక మరియు ఆర్థిక పరిస్థితి

బలూచ్ నేతలు పాకిస్తాన్ నుండి విడిపోతున్నట్లు ప్రకటించారు. స్వతంత్ర దేశంగా గుర్తించాలని భారత ప్రభుత్వాన్ని, ఐక్యరాజ్యసమితిని కోరుతున్నారు. అలాగే, న్యూఢిల్లీలో బలూచిస్తాన్ రాయబార కార్యాలయాన్ని ఏర్పా టు చేయాలని వారు భారత ప్రభుత్వాన్ని కోరారు. పాకిస్తాన్‌లో విస్తీర్ణపరంగా అతి పెద్ద ప్రావిన్స్ బలూ చిస్తాన్. దీనిని ప్రత్యేక దేశంగా గుర్తించా లని ఈ మేరకు బలూచిస్తాన్ నాయకుడు ‘మీర్ యార్’ బలూచ్ ఎక్స్‌లో పలు పోస్టు లు చేశారు. రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ ఏర్పాటును తన పోస్టులో ప్రకటించారు.

తమను ఒక దేశంగా గుర్తించి కరెన్సీ, సపరేట్ పాస్‌పోర్ట్ జారీ, ప్రాథమిక అవసరాలకు నిధులను సమకూర్చాలని ఐక్యరాజ్యసమితిని వారు అభ్యర్థించారు. అలాగే తమను, పాకిస్తానీలను ఒకటిగా చూడవద్దని భారతీయ మీడియాను వారు కోరారు.

భౌగోళిక నేపథ్యం

బలూచిస్తాన్ దక్షిణ ఆసియాలో చారిత్రకంగా, భౌగోళికంగా, రాజకీయంగా ఎంతో కీలకమైన భూభాగం. ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఆధీనంలో ఉన్న ఈ ప్రాంతం, ఆ దేశంలో అత్యంత పెద్ద రాష్ట్రమైనా, రాజకీయ శక్తిలో మాత్రం అత్యంత వెనుకబడి ఉంది. ఈ ప్రాంత చరిత్రను, సామాజిక-ఆర్థిక పరిస్థితిని, భౌగోళిక విశిష్టతను, ప్రస్తుత ఉద్యమాల రాజకీయ పటాలను విశ్లేషించకపోతే ఈ ప్రాంత సమస్యలకు ముడిపడిన అసలైన సమస్యలు తెలిసే అవకాశం లేదు. బలూచిస్తాన్ పాకిస్తాన్ మొత్తం భూభాగంలో సుమారు 44 శాతం ప్రాంతాన్ని ఆక్రమించుకొని ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ దేశాల సరిహద్దులకు ఆనుకొని ఉండటంతో, ఇది భౌగోళిక రాజకీయాల పరంగా చాలా కీలకమైన ప్రాంతం. గ్వాదర్ పోర్ట్ వంటి ప్రాజెక్టులను చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్‌లో భాగంగా నిర్మిస్తున్నా, దాని వల్ల ఈ ప్రాంత ప్రజలకు అసలు ప్రయోజనం కలగడం లేదు.

సామాజిక, ఆర్థిక పరిస్థితి

బలూచిస్తాన్‌లో జనాభా తక్కువే అయినా, సహజ వనరులు అధికంగా ఉన్నాయి. ప్రధానంగా గ్యాస్, ఖనిజాలు విస్తృతంగా ఉన్నాయి. అయినా ఈ వనరులపై స్థానికులకు ఎలాంటి హక్కులూ లేవు. పాకిస్తాన్ పాలనలో ఈ ప్రాంత వనరులను అన్య ప్రాంతాలకు తరలిస్తున్నా, బలూచ్ ప్రజలకు మాత్రం విద్య, ఆరోగ్యం, ఉపాధి వంటి మౌలిక అవసరాలు తీరడం లేదు. ఇది విపరీతమైన అసమానతలకు దారి తీసింది. పేదరికం, నిరుద్యోగం, అక్రమ అరెస్టులు, గోప్యతా సమస్యలు, నిర్బంధాలు సామాన్య జీవితాన్ని భయంతో నింపుతున్నాయి. 1947లో భారత ఉపఖండ విభజన అనంతరం పాకిస్తాన్ బలవంతంగా బలూచిస్తాన్‌ను తనలో కలిపేసుకుంది. అప్పటి నుంచే పాకిస్తాన్‌పై స్థానికుల వ్యతిరేకత మొదలైంది. 1948, 1958, 1962, 1973, 2004 సంవత్సరాలలో ఎన్నోసార్లు ఈ ప్రాంతంలో తిరుగుబాట్లు జరిగాయి.. అక్కడి ప్రజలు తమ ఆత్మగౌరవం కోసం అనేక పోరాటాలతో నిలకడగా కొనసాగి ఇప్పుడు తమది స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు. దీనిని ఐక్యరాజ్యసమితి, ఇతర దేశాలు గుర్తించాల్సి ఉంటుంది.

సాంస్కృతిక నేపథ్యం

బలూచీ భాష, కళలు, నృత్యాలు, జీవన విధానం ప్రత్యేకమైనవే. కానీ పాకిస్తాన్‌ ఈ సాంస్కృతిక విశిష్టతలను గుర్తించని విధంగా జాతీయత పేరుతో బలవంతపు ఉర్దూ ఆధిపత్యాన్ని వారిపై మోపుతున్నారు. ఇది బలూచ్ సమాజాన్ని మరింత బహిష్కృతంగా మార్చింది. విద్యలో బలూచీ భాషకు ప్రాధాన్యత ఇవ్వకపోవడమే కాక, వారి చరిత్రను పాఠ్యపుస్తకాల్లో వికృ తంగా చూపించటం వల్ల సాంస్కృతిక అపకీర్తి ఏర్పడింది.

ప్రస్తుత రాజకీయ పరిస్థితి

ఇటీవల కాలంలో బలూచ్ రాజకీయ కార్యకర్తలు, మేధావులు, విద్యార్థులు భౌతికంగా కనిపించకుండా పోవడంపై అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు సైతం ఆందోళన వ్యక్తం చేశాయి. ఆకస్మికంగా జరుగుతున్న ‘బలవంతపు అదృశ్యాలు’ బలూచిస్తాన్‌ను భయాందోళన ప్రాంతంగా మార్చాయి. స్వాతంత్ర్యం కోసం బలూచ్ లిబరేషన్ ఆర్మీ వంటి సంస్థలు పోరాటం చేస్తున్నప్పటికీ, పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాదం పేరుతో వాటిని తీవ్రంగా అణిచివేస్తోంది.

బలూచ్ ప్రాంతీయ సమస్య కాదు..

బలూచిస్తాన్ సమస్య ఒక ప్రాంతీయ సమస్య మాత్రమే కాదు. అది మానవ హక్కులకు సంబంధించినది. ఆత్మగౌరవం, ప్రజాస్వామ్య విలువల సమస్యగా ఉంది. ఆర్థిక వనరుల దోపిడీ, సాంస్కృతిక అణచివేత, రాజకీయ నిరంకుశతలపై ప్రపంచం స్పందించాల్సిన అవసరం ఉందని చాలా కాలంగా అక్కడి ప్రజలు పోరాటం చేస్తున్నారు. బెలూచ్ ప్రజలకు తమ భవితవ్యాన్ని నిర్ణయించుకునే హక్కు, జీవించడానికి భద్రత కల్పించాల్సిన బాధ్యత అంతర్జాతీయ సమాజానిదీ కూడా.

 

గత ప్రభుత్వం కంటే పాఠశాలలు బలహీనంగా ఉన్నాయి – ఉపాధ్యాయుల పోరాటం

ఏపీలో ఉపాధ్యాయ సంఘాలు పోరుబాటకు దిగాయి. నిరసనల కార్యాచరణ ఖరారు చేసాయి. జీవో 117కు ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చిన జీవో 21లోనూ అసంబద్ధ నిర్ణయాలు ఉన్నాయని ఉపా ధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. వాటిని తాము వ్యతిరేకించినా పాఠశాల విద్యాశాఖ ఏకపక్షంగా వాటిపై నిర్ణయం తీసుకుందని ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో, పోరుబాట మొదలు పెట్టినట్లు సంఘాల నేతలు వెల్లడించారు.

నిరసనలకు పిలుపు ఉపాధ్యాయ సంఘాలు నిరసనలకు దిగుతున్నాయి. ఇటీవల హేతుబద్ధీకరణ జీవోలు జారీచేసిన నేపథ్యంలో తాజాగా పాఠశాల విద్యాశాఖ అధికారులు నిర్వహించదలచిన సమావేశాన్ని గుర్తింపు పొందిన సంఘాలు మూకుమ్మడిగా బహిష్కరించాయి. యూటీఎఫ్‌, ఎస్టీయూ, ఏపీటీఎఫ్‌-257, ఏపీటీఎఫ్‌-1938, పీఆర్‌టీయూ, ఏపీయూఎస్‌, ఆప్టా, వైఎస్ ఆర్‌టీఏ, పీహెచ్‌ఎంఏ సంఘాలు ఐక్య వేదికగా ఏర్పడి ఉమ్మడి కార్యాచరణ ప్రకటించాయి. నూతన సంస్కరణలకు నిరసనగా ఈనెల 21న ఉమ్మడి జిల్లాల డీఈవోల కార్యాలయాల ముట్టడి, 23న పాఠశాల విద్య డైరెక్టర్‌ డైరెక్టర్‌ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ప్రకటించాయి. ఆ తర్వాత మిగిలిన ఉపాధ్యాయ సంఘాలను కలుపుకొని వెళ్తూ పోరాటాన్ని ఉధృతం చేస్తామని తేల్చి చెప్పాయి.

గతంలో లాగానే ఇకపై చర్చలంటూ నిర్వహిస్తే కేవలం మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి సమక్షంలోనే జరగాలని స్పష్టంచేశాయి. ఇక నుంచి జరిగే చర్చలకు హాజరుకాబోమని ఆ సంఘాల నాయకులు స్పష్టంచేశారు. గత 30 వారాలుగా సంఘాల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నా, తాము లేవనెత్తిన అంశాలను పరిగణలోకి తీసుకోకుండా జీవోలను విడుదల చేశారన్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 117 వల్ల మూడు లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు వెళ్లిపోయా రని, ఈ ప్రభుత్వం కూడా అవే విధానాలను కొనసాగిస్తోందని విమర్శించారు. గత ప్రభుత్వం ఆరు రకాల బడుల విధానం అమలుచేస్తే, ఈ ప్రభుత్వం తొమ్మిది రకాల బడుల విధానం ప్రవేశపెట్ట డం ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేయడమేనన్నారు. తెలుగు రాష్ట్రంలో తెలుగు మీడియం లేకుండా చేయడం దారుణమని వాపోయారు.

సంఘ నేతల డిమాండ్లు ఇదే సమయంలో ఉపాధ్యాయ సంఘాలు తమ డిమాండ్లను స్పష్టం చేసాయి. ఉన్నత పాఠశాలల్లో 45 మంది విద్యార్థులు దాటితే రెండో సెక్షన్‌ ఏర్పాటుచేయాలని కోరుతున్నారు. మోడల్‌ ప్రైమరీ పాఠశాలలకు ప్రధానోపాధ్యాయులుగా స్కూల్‌ అసిస్టెంట్లను నియమించకూడదని డిమాండ్ చేస్తు న్నారు. ఎస్జీటీలకు పదోన్నతి కల్పించి వారినే హెచ్‌ఎంలుగా నియమించాలని కోరారు. ఇంగ్లీష్‌, తెలుగు మీడియంలను, మైనర్‌ మీడియంలను కొనసాగించాలని డిమాండ్ చేసారు. ఆ మేరకు పోస్టులు కేటాయించాలని కోరుతున్నారు. ఫౌండేషన్‌, బేసిక్‌ ప్రైమరీ పాఠశాలల్లో 40 మంది విద్యార్థులు దాటితే మూడో టీచర్‌ పోస్టు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

 

మీరు ఆనందంగా, సంపదతో కూడిన జీవితాన్ని గడపాలనుకుంటే, రాత్రిపూట పొరపాటున కూడా ఈ పనులు చేయకండి.

హిందూ మతంలోని వాస్తు శాస్త్రం ప్రకారం ప్రజలు రాత్రి సమయంలో ఏ పని చేయకూడదు. మనం కొన్ని రకాల పనులు చేస్తే చెడు పరిణామాలను అనుభవించాల్సి వస్తుందని నమ్ముతారు.

కనుక రాత్రి సమయంలో మనం చేయకూడని పనులకు దూరంగా ఉండటం మంచిది. అయితే కొంతమంది వాస్తు నియమలాను చాదస్తం అంటూ కొట్టివేస్తారు. దీంతో జీవితంలో చాలా సమస్యలను సృష్టిస్తుంది. మన జీవితం చాలా వరకు వాస్తు శాస్త్రంపై ఆధారపడి ఉంటుంది. వాస్తు శాస్త్రాన్ని అనుసరిస్తూ చేసే ఇంటి నిర్మాణం, దిశలు, వాతావరణం , మనం చేసే అన్ని పనులు శుభప్రదంగా ఉంటాయి. ఈ శాస్త్రం ద్వారా సమస్యలను నివారించుకోవచ్చు. అయితే రాత్రి సమయంలో చేయకూడని పనుల గురించి వాస్తు శాస్త్రం ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంది. ఈ సమయంలో చేసే పని చాలా అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. ఈ విషయాలు మనకు చెడు పరిణామాలను తెస్తాయి. అవి ఏమిటంటే..

సూర్యాస్తమయం తర్వాత ఇల్లుని శుభ్రం చేయవద్దు: వాస్తు శాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత ఇల్లు ఊడ్చడం అశుభంగా పరిగణించబడుతుంది. చీపురులో లక్ష్మీ దేవి నివసిస్తుందని నమ్ముతారు. సాయంత్రం ఇంటిని ఊడ్చడం ద్వారా లక్ష్మీదేవి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతుందని నమ్మకం. ఇలా చేయడం వలన ఇంట్లో ఆర్ధిక ఇబ్బందులు పడతారని.. డబ్బు నష్టం జరుగుతుందని నమ్మకం. కనుక ఇంటిని సాయంత్రం దీపం పెట్టే లోపు శుభ్రపరచాలి.

రాత్రి గోర్లు, జుట్టు కత్తిరించవద్దు: వాస్తు శాస్త్రం ప్రకారం రాత్రి గోర్లు, జుట్టు కత్తిరించడం మంచిది కాదు. దీనివల్ల పేదరికం పెరుగుతుంది. సమయంతో పని లేకుండా ఎప్పుడు బడితే అప్పుడు గోళ్లు కత్తిరించుకునే వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు. అంతేకాదు ఈ అలవాటు ఉన్నవారు మానసికంగా , ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. కనుక రాత్రి సమయంలో గోర్లు, జుట్టు కత్తిరించడం మంచిది కాదు.

రాత్రి ఆలస్యంగా తినవద్దు: మారిన జీవన శైలిలో భాగంగా ఆహరం తినే సమయాల్లో కూడా మార్పులు వచ్చాయి. దీంతో చాలా మంది ఇప్పుడు రాత్రి తినే విషయంలో సమయం పాటించడం లేదు. అయితే ఇలా రాత్రి ఆలస్యంగా తినడం అసలు మంచిది కాదు. శాస్త్రాల ప్రకారం రాత్రి 8 గంటల తర్వాత భోజనం చేయడం ఆరోగ్యానికి హానికరం. ఈ అలవాటు శారీరక శక్తిని నిర్వీర్యం చేస్తుంది. అంతేకాదు రాత్రి ఆలస్యంగా ఆహారం తిని వెంటనే నిద్ర పోతారు. దీంతో రాత్రి తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తుంది. కనుక రాత్రి ఆహారం తినే తినడం సమయాన్ని పాటించాలి. వీలైనంత వరకూ సాయంత్రం 7. కే తినెయ్యడం అన్ని విధాల మంచిది.

ఏ దిశల్లో మీ తల పెట్టుకోవద్దు అంటే.. వాస్తు శాస్త్రం ప్రకారం రాత్రి నిద్రించే సమయంలో పొరపాటున కూడా మీ తలను ఉత్తర దిశలో ఉంచకూడదు. ఈ తప్పు తెలిసి చేసినా తెలియకుండా చేసినా.. అది ప్రతికూల పరిణామాలను కలిగిస్తుంది. ఈ ఉత్తర దిశలో దేవత నివాసం కాదు. కనుక ఈ దిశలో తల పెట్టి నిద్రపోతే మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందని నమ్మకం. అంతేకాదు ఈ దిశలో తల పెట్టి నిద్రపోయే వ్యక్తికి శక్తి తగ్గుతుంది.

కనుక వాస్తు శాస్త్రంలో చెప్పిన ఈ వాస్తు చిట్కాలను పాటించడం ద్వారా జీవితం సుఖ సంతోషాలతో సాగుతుంది. కుటుంబంలో శాంతి, ఆనందాన్ని తెస్తాయి. అంతేకాదు ఇంట్లో నివసించే వ్యక్తుల ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావాన్ని నివారిస్తాయి. కనుక ఈ వాస్తు చిట్కాలను అనుసరించి సంతోషంగా జీవించడానికి ప్రయత్నించండి.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.

గోదావరి జిల్లాలోని ఆ పట్టణం ఎందుకు అంత ప్రసిద్ధి చెందింది?

రావులపాలెం, ఏపీలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి నది ఒడ్డున ఉన్న ఓ చలాకీగా ఉండే చిన్న పట్టణం. దీన్ని కోనసీమకు గేటు అని పిలుస్తారు, ఎందుకంటే ఇక్కడ ఆర్థికంగా, సాంస్కృతికంగా, భౌగోళికంగా చాలా ప్రత్యేకత ఉంది. రావులపాలెం అంటే ముందుగా గుర్తొచ్చేది అరటిపళ్ళ మార్కెట్. ఆంధ్రప్రదేశ్‌లోనే ఇది టాప్ అరటిపళ్ళ మార్కెట్లలో ఒకటి. కోనసీమ ప్రాంతంలో అరటి తోటలకు అనువైన సారవంతమైన భూమి, గోదావరి నది నీళ్లు ఉన్నాయి. రోజూ వేల టన్నుల అరటిపళ్ళు ఇక్కడ కొనుగోలు, అమ్మకాల్లో తిరుగుతాయి. రైతులు, వ్యాపారస్తులు, మధ్యవర్తులు కలిసి ఈ పట్టణాన్ని ఆర్థికంగా బలంగా నిలబెట్టారు. గోదావరి నది ఒడ్డున ఉన్న రావులపాలెం, గౌతమి గోదావరి శాఖ పక్కనే ఉంది. నది ఒడ్డున పచ్చని పొలాలు, కొబ్బరి తోటలు కోనసీమ అందాన్ని చూపిస్తాయి.

గోదావరిపై ఉన్న బ్రిడ్జ్ రాజమహేంద్రవరం, కాకినాడ లాంటి పెద్ద సిటీలతో రావులపాలెంను కనెక్ట్ చేస్తుంది. ఈ బ్రిడ్జ్ వ్యాపారం, రాకపోకలకు చాలా కీలకం. రాజమహేంద్రవరం నుంచి 36 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఊరు, వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు హబ్‌లా ఉంది. రావులపాలెం సంస్కృతీ, జీవనశైలీ కూడా ఆకట్టుకుంటాయి. ఇక్కడ జరిగే సంతలు, పండగలు స్థానికులతో పాటు టూరిస్టులను కూడా ఆకర్షిస్తాయి. స్థానిక ఫుడ్, సాంప్రదాయ కళలు ఈ ఊరికి ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. సమీపంలోని ర్యాలి గ్రామంలో జగన్మోహిని కేశవస్వామి ఆలయం ఉంది, ఇది భక్తులనూ, చరిత్ర ఆసక్తి ఉన్నవాళ్లనూ ఆకర్షిస్తుంది. అంతేకాదు, రావులపాలెం చుట్టూ సినిమా షూటింగ్‌లకు కూడా బాగా ఫేమస్. గోదావరి జిల్లాలో సినిమాలు తీసేందుకు ఇది హాట్‌స్పాట్ అయిపోయింది.

వ్యవసాయం, వ్యాపారం, సంస్కృతి, టూరిజం కలిసి రావులపాలెంను గోదావరి జిల్లాలో స్పెషల్ ప్లేస్‌గా చేశాయి. ముఖ్యంగా అరటిపళ్ళ వ్యాపారం ఇక్కడి రైతులకు పెద్ద ఆసరాగా ఉంది. గోదావరి ఒడ్డున ఉన్న ఈ ఊరు అందమైన ప్రకృతి, ఆర్థిక స్థిరత్వం, సాంస్కృతిక వైవిధ్యంతో టూరిస్టులకూ, వ్యాపారస్తులకూ ఆకర్షణీయంగా ఉంది. ఈ ప్రత్యేకతల వల్ల రావులపాలెం కేవలం వ్యవసాయ కేంద్రం మాత్రమే కాదు, సాంస్కృతిక, చారిత్రక, ఆర్థిక కేంద్రంగా కూడా పేరు తెచ్చుకుంది. కోనసీమకు గేటులా నిలిచిన ఈ పట్టణం, ఆంధ్రప్రదేశ్ యొక్క గొప్ప వారసత్వాన్ని, సహజ సంపదను చూపిస్తుంది. రావులపాలెం వెళ్లేవాళ్లకు వ్యాపార అవకాశాలు, సాంస్కృతిక అనుభవాలు, ప్రకృతి అందం అన్నీ ఒకే చోట దొరుకుతాయి.

 

మీకు పంటి నొప్పి ఉన్నప్పుడు వీటిని అస్సలు తినకండి.

పంటి నొప్పి అనేది చాలా సాధారణం. కానీ, ఇది చాలా ఇబ్బంది పెడుతుంది. ఈ నొప్పి ఉంటే ఆహారం కూడా సరిగ్గా తినలేరు. దీనిని నిర్లక్ష్యం చేస్తే ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. తీవ్రమైన పంటి నొప్పి రోజువారీ కార్యకలాపాలను కూడా ప్రభావితం చేస్తుంది. నొప్పి కారణంగా ప్రజలు తమ పనిపై దృష్టి పెట్టలేరు. పంటి నొప్పికి అనేక కారణాలు ఉండవచ్చు. దీని కోసం మీరు వైద్యుడిని సంప్రదించాలి. అయితే, ఈ పంటి సమస్య ఉన్నవారు వీటిని తినడం మంచిది కాదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

తీపి పదార్థాలు

పంటి నొప్పి ఉంటే తీపి పదార్థాలు తినడం మంచిది కాదు. చాక్లెట్, కాఫీ లేదా ఇతర స్వీట్లు తినవద్దు. ఎందుకంటే తీపి పదార్థాలు మీ పంటి నొప్పిని మరింత పెంచుతాయి.

సాఫ్ట్ డ్రింక్స్

మీకు దంతాలు నొప్పిగా ఉంటే, మీరు శీతల పానీయాలు తాగకూడదు. ఎందుకంటే వాటిని తినడం వల్ల నొప్పి పెరుగుతుంది. వీటిలో సోడా ఉంటుంది, ఇందులో ఫాస్పరస్ ఆమ్లం, సిట్రిక్ ఆమ్లం ఉంటాయి. ఇది దంతాల ఎనామిల్ కు చికాకు కలిగించవచ్చు.

సిట్రస్ పండ్లi

సాధారణంగా పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ మీకు పంటి నొప్పి ఉంటే పుల్లని పండ్లు తినకూడదు. నారింజ, మామిడి, ద్రాక్ష, కాలానుగుణ పండ్లకు దూరంగా ఉండాలి.

పచ్చి కూరగాయలు, మాంసం

పంటి నొప్పితో బాధపడేవారు పచ్చి కూరగాయలు తినకూడదు. అలాగే, మాంసం తినడం కూడా మంచిది కాదు. వీటిని నమలడం వల్ల పంటి నొప్పి వస్తుంది.

మద్యం

మీకు పంటి నొప్పి ఉంటే మద్యం సేవించడం మంచిది కాదు. దీన్ని తాగడం వల్ల నోరు ఎండిపోతుంది. నోటిలో తక్కువ లాలాజలం ఉత్పత్తి అవుతుంది. నోటిలో లాలాజలం తక్కువగా ఉత్పత్తి అయినప్పుడు ఆహారం దంతాలకు అంటుకుంటుంది. కాబట్టి, పంటి సమస్య ఉన్నవారు మద్యం తాగకండి.

ఆ బ్రాండ్ బీరు ధరలు తగ్గుతున్నాయి.

నడి వేసవిలో మందుబాబులకు గుడ్ న్యూస్. బీర్ల ధరలు తగ్గనున్నాయి. అయితే అవి కొన్ని బ్రాండ్లకే పరిమితం కానున్నాయి. ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో మందుబాబులు చల్లటి బీర్లను తాగుతూ సేద తీరుతున్నారు. ఇటువంటి సమయంలోనే బీర్ల ధరను తగ్గించేందుకు కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో లిక్కర్ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ప్రభుత్వాలకు భారీగా ఆదాయం సమకూరుతోంది. మరోవైపు భారత్, బ్రిటన్ మధ్య జరిగిన వాణిజ్య ఒప్పందం వల్ల బీర్ ధరలు తగ్గనున్నాయి. నిజంగా ఇది మందుబాబులకు శుభవార్త. సాధారణంగా వేసవిలో రికార్డు స్థాయిలో బీర్ల అమ్మకాలు పెరుగుతాయి. వీటిని దృష్టిలో పెట్టుకునే కంపెనీలు ధరను తగ్గించేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.

* ఐదు రకాల బీర్లపై..
తెలుగు రాష్ట్రాల్లో ఐదు రకాల ప్రధాన బీర్ బ్రాండ్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. రూ.99 బ్రాండ్లు అందుబాటులోకి వచ్చిన తరువాత బీర్ల అమ్మకాలపై ఆ ప్రభావం పడింది. అయితే వేసవిలో ఎక్కువగా బీర్ల విక్రయాలు ఎక్కువగా జరుగుతాయి. తాజాగా భారత్, బ్రిటన్ మధ్య జరిగిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం వల్ల.. బ్రిటన్ బీరు పై ఉన్న 75% పన్నును తగ్గించింది. దీంతో ఆ దేశంలో తయారయ్యే బీర్ల ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పడ్డాయి. తాజా ఒప్పందంతో బ్రిటన్ బీర్ బ్రాండ్లు ఇండియాలో చాలా చౌకగా మారుతాయి. బ్రిటన్ బీర్ తో పాటు అక్కడి స్కాచ్, విస్కీ పై కూడా పన్ను తగ్గించారు. దీంతో తక్కువ ధరకే ఇండియాలో లభించనున్నాయి.

* ఒక్కో బీరు రూ.30 తగ్గుదల..
ప్రస్తుతం ఇండియాలో లభిస్తున్న బీర్లు 250 రూపాయల వరకు పలుకుతున్నాయి. బ్రిటన్ తో ఒప్పందం నేపథ్యంలో ఒక్కో బీరు పై 20 నుంచి 35 రూపాయల వరకు ధర తగ్గే అవకాశం కనిపిస్తోంది. 2024లో భారతీయ బీర్ మార్కెట్ విలువ దాదాపు 50 వేల కోట్ల రూపాయలు ఉండేది. ఇది ఏడాదికి సగటున ఎనిమిది నుంచి పది శాతం వృద్ధిరేటు పొందుతూ వస్తోంది. కేంద్రం ఒప్పందం చేసుకున్నా.. ప్రతి రాష్ట్రం తమ సొంత ఎక్సైజ్ డ్యూటీ.. వ్యాట్ పన్నును ఖరారు చేస్తుంది. అయితే ఇలా ఎలా చేసినా యూకే బ్రాండ్ బీర్ల ధరలు మాత్రం తగ్గించాల్సి ఉంటుంది.

భారతదేశంలో అత్యంత చౌకైన మరియు అత్యధిక మైలేజ్ ఇచ్చే కారు మీకు తెలుసా?

 కారు కొనడం అనే అంశం వచ్చినప్పుడల్లా ప్రజలు మైలేజ్ గురించి అడుగుతారు. కారు లక్షణాలు, ఇంజిన్ బాగుండి, కారు మంచి మైలేజీని ఇవ్వకపోతే ప్రజలు దానిని కొనాలనే నిర్ణయాన్ని మార్చుకుంటారు. మైలేజీని అందించే కార్లు ఎల్లప్పుడూ భారతీయ కార్ల కొనుగోలుదారులకు ఇష్టమైనవి..

భారతదేశంలో వినియోగదారులు ముఖ్యంగా మధ్యతరగతికి చెందిన వారు, ఈ కార్లను ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ఇది చూడటానికి బాగుండే కారు, తక్కువ బడ్జెట్‌లో మంచి మైలేజీని ఇస్తుంది. ఆల్టోతో ప్రారంభించి మంచి మైలేజీని అందించే అనేక కార్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

చాలా మారుతి కార్లు వాటి మైలేజ్ కారణంగా ప్రజాదరణ పొందాయి. మీరు అత్యధిక మైలేజీని అందించే కారు కోసం చూస్తున్నట్లయితే, మారుతి సెలెరియో మీకు మంచి ఎంపిక. ప్రస్తుతం, మారుతి సెలెరియో అధిక మైలేజీని అందించే పెట్రోల్ ఇంజిన్‌తో కూడిన ఇంధన-సమర్థవంతమైన కారు. కంపెనీ ప్రకారం, మారుతి సెలెరియో పెట్రోల్ వేరియంట్ లీటరుకు 26.68 కి.మీ. ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది.

మారుతి సెలెరియో డిజైన్ చాలా ఆకర్షణీయంగా, ఆధునికంగా ఉంది. ఇది కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. ఇంటీరియర్స్‌లో కూడా మార్పులు చేసింది కంపెనీ. కొత్త టాప్-ఎండ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్మార్ట్ రివర్స్ పార్కింగ్ సెన్సార్ల వంటి ఫీచర్లు, అయితే కారు భద్రత కోసం గ్లోబల్ NCAP రేటింగ్‌ను పొందింది.

మారుతి సెలెరియో ప్రత్యేకంగా ఇంజిన్ డ్రా, హైబ్రిడ్ టెక్నాలజీతో రూపొందించింది. ఇది తక్కువ ఇంధన వినియోగంతో ఎక్కువ దూరాలను కవర్ చేయడానికి వీలు కల్పిస్తుంది. సెలెరియో పెట్రోల్ వేరియంట్ లీటరుకు 26.68 కి.మీ మైలేజీని అందిస్తుంది. అయితే దాని CNG వేరియంట్ కిలోకు 35.60 కి.మీ మైలేజీని అందిస్తుంది. ఈ మైలేజ్ సెలెరియోను భారత మార్కెట్లో అత్యధిక మైలేజ్ ఇచ్చే కారుగా నిలిపింది.

సెలెరియో డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు, EBDతో కూడిన ABS, వెనుక తలుపు చైల్డ్ లాక్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, వెనుక కెమెరా వంటి అనేక గొప్ప భద్రతా ఫీచర్స్‌తో వస్తుంది. ఇంకా ఇది స్మార్ట్ రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీని కూడా కలిగి ఉంది.

భారత మార్కెట్లో మారుతి సెలెరియో ధర రూ. 5.64 లక్షల నుండి ప్రారంభమై రూ. 7.37 లక్షల వరకు ఉంటుంది (ఎక్స్-షోరూమ్). సెలెరియో 998cc ఇంజిన్‌తో వస్తుంది. ఇది 65.71 bhp శక్తిని, 89 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మంచి మైలేజీ ఉన్నప్పటికీ, గత కొన్ని సంవత్సరాలుగా సెలెరియో అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. ఎందుకంటే ఈ ధర వద్ద, మారుతి వాగన్ఆర్ కస్టమర్లకు బాగా నచ్చుతోంది.

 

కేవలం రూ. 6499కే రెడ్‌మి A5 స్మార్ట్‌ఫోన్ లాంచ్.. ఫీచర్లు, ధర వివరాలు

Xiaomi తన సరసమైన 4G స్మార్ట్‌ఫోన్ Redmi A5 ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ ఫోన్ 3GB, 4GB RAM ఎంపికలతో మార్కెట్లో విడుదల చేసింది. దీనితో పాటు ఈ Redmi ఫోన్ 4GB వర్చువల్ RAMకు కూడా మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ అమ్మకం ఏప్రిల్ 16 నుండి ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమైంది. దీనిలో దీనిని రూ. 6499 ప్రారంభ ధరకు కొనుగోలు చేయవచ్చు..

Redmi A5 4G: Xiaomi భారతదేశంలో చౌకైన Redmi A5 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ 4G కనెక్టివిటీతో వస్తుంది. ఇది 6.88-అంగుళాల HD + LCD డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. దీనితో పాటు, Redmi ఈ బడ్జెట్ ఫోన్‌లో ఆక్టా-కోర్ Unisoc T7250 ప్రాసెసర్ ఉంది. ఇది 4GB RAM, 4GB వర్చువల్ RAMకి మద్దతు ఇస్తుంది.

Redmi A5 4G స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లాంచ్ చేసింది. దీని మొదటి వేరియంట్ 3GB RAM + 64GB స్టోరేజ్‌తో రూ.8999 ధర ఉంది. ఈ ఫోన్‌ను మొదటి సేల్‌లో రూ. 6499 కు కొనుగోలు చేయవచ్చు. రెండవ వేరియంట్ 4GB RAM + 128GB స్టోరేజ్‌తో రూ.9999 కు వస్తుంది. దీనిని మొదటి సేల్‌లో రూ. 7499 కు కొనుగోలు చేయవచ్చు.

ఈ ఫోన్ మూడు కలర్స్‌లో విడుదల చేసింది. బ్లూ, బ్లాక్, గోల్డ్. ఈ ఫోన్ మొదటి అమ్మకం ఏప్రిల్ 16న మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమైంది. డిస్‌ప్లే విషయానికొస్తే.. 6.88-అంగుళాల (1640 x 720 పిక్సెల్స్) HD+ IPS LCD స్క్రీన్. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ కలిగి ఉంటుంది. ఇది TÜV రీన్‌ల్యాండ్-సర్టిఫైడ్.

ప్రాసెసర్: ఈ ఫోన్‌లో 1.8 GHz ఆక్టా-కోర్ UNISOC T7250 12nm ప్రాసెసర్ ఉంది. దీనిలో గ్రాఫిక్స్ సపోర్ట్ కోసం Mali-G57 MP1 GPU ఉంది. అలాగే ఈ ఫోన్ 3GB, 4GB RAM తో 64GB, 128GB స్టోరేజ్ తో లాంచ్ చేసింది కంపెనీ. దీనితో పాటు, స్టోరేజ్ కోసం ఫోన్‌లో మైక్రో SD కార్డ్ కూడా అందించింది.

అలాగే ఈ ఫోన్‌లో 32MP వెనుక కెమెరా ఉంది, దీనికి f/2.0 ఎపర్చరు ఉంది. దీనితో పాటు, సెల్ఫీ కోసం 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. Redmi ఫోన్ 5200mAh బ్యాటరీని కలిగి ఉంది, ఇది 15W ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. దీనితో పాటు, ఫోన్‌లో USB టైప్-C పోర్ట్ అందించబడింది. ఫీచర్స్‌ విషయానికొస్తే.. కనెక్టివిటీ కోసం ఈ Redmi ఫోన్‌లో డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 802.11 ac 2.4GHz/5GHz, బ్లూటూత్ 5.2, GPS, GLONASS తో గెలీలియో మరియు BDS ఉన్నాయి.

 

భారతదేశం మరియు పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న ఈ గ్రామం భూమిపై స్వర్గం

భారతదేశంలో చూడదగ్గ అందాలతో అలరించే ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఈ ప్రదేశాలు మీకు ఒక కలల ప్రపంచంలా అనిపిస్తాయి. మీరు కూడా ఈ వేసవిలో హిల్ స్టేషన్‌కి వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే.. ఈ రోజు మేము ఒక భూతల స్వర్గపు ప్రదేశం గురించి కనుగొన్నాము. ఈ ప్రదేశం చాలా అందంగా ఉంటుంది. ఒక్కసారి ఇక్కడకు వెళ్తే.. తిరిగి రావాలని మీకు అనిపించదు. ఆ హిల్ స్టేషన్ భారతదేశం.. పాకిస్తాన్ మధ్య ఉన్న అందమైన గ్రామం భూతల స్వర్గం అని చెప్పవచ్చు.

వేసవి సెలవులు మొదలయ్యాయి. పిల్లలను అందమైన ప్రదేశాలకు తీసుకుని వెళ్ళడానికి తల్లిదండ్రులు ఆసక్తిని చూపిస్తారు. అటువంటి పరిస్థితిలో వేసవి సెలవుల్లో చల్లని ప్రదేశానికి వెళ్లాలని ప్లాన్ చేసుకునేవారు మనాలి, సిమ్లా, ముస్సోరీ లేదా నైనిటాల్ వంటి ప్రదేశాలను సందర్శించాలని ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఈ ప్రదేశాలు ఇప్పటికె రద్దీగా మారాయి. కనుక ఈ రోజు అందమైన .. తక్కువ రద్దీ ఉన్న స్థలం గురించి తెలుసుకుందాం. అంతే కాదు ఈ ప్రదేశం ఏదైనా విదేశీ హిల్ స్టేషన్ అనిపిస్తుంది.

ఈ హిల్ స్టేషన్ భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉన్న కరణ్ లోయ. ఇది జమ్మూ కాశ్మీర్‌లో భారతదేశం.. పాకిస్తాన్ మధ్య నియంత్రణ రేఖకు చాలా దగ్గరగా ఉన్న చాలా అందమైన, ప్రశాంతమైన గ్రామం. కనుక ఈ రోజు ఆ అందమైన హిల్ స్టేషన్ గురించి.. ఇక్కడికి ఎలా చేరుకోవచ్చు, ఏమి చూడవచ్చు? ఇది ఎందుకు అంత ప్రత్యేకమైనది అనే విషయాల గురించి తెలుసుకుందాం?

జమ్మూ కాశ్మీర్‌లోని కుపర్వారాలో ఉన్న ఈ గ్రామం ఇటీవల పర్యాటక రంగం కోసం తెరవబడింది. ఇక్కడకు వచ్చిన పర్యాటకులు అందమైన ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ కరణ్ గ్రామం గురించి మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ గ్రామానికి ఒక వైపు భారతదేశం, మరోవైపు పాకిస్తాన్ ఉన్నాయి. రెండు వైపులా ఒకే నది ప్రవహిస్తుంది. కొన్ని సంవత్సరాల క్రితం వరకు.. రెండు వైపులా ఉన్న ప్రజలు ఒకరినొకరు చూసుకునేవారు. కొంచెం కొంచెం సంభాషణ కూడా చేసుకునేవారు

భద్రతా కారణాల దృష్ట్యా ఇప్పుడు ఈ గ్రామాల మధ్య కొన్ని పరిమితమైన కండిషన్స్ అమలులో ఉన్నాయి. అయితే స్థానిక ప్రజలు ఇప్పటికీ ఆ పాత సోదరభావాన్ని గుర్తుంచుకుంటారు. కరోన్ లోయ అందాలకు కూడా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రదేశం సహజ సౌందర్యం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడకు ఒకసారి వచ్చిన వారు జీవితాంతం ఈ జ్ఞాపకాలను తమ హృదయంలో ఉంచుకుంటారు.

భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉన్న ఈ కొండ ప్రాంతం స్వర్గంలా అందంగా కనిపిస్తుంది. పర్వతాలు, పచ్చదనం, నదులు, చాలా ప్రశాంతత ఉన్న చోట. కరణ్ వ్యాలీకి సంబంధించిన అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఇక్కడ జనసమూహం లేదా హారన్ల శబ్దం ఉండదు. పక్షుల కిలకిలరావాలు, ప్రవహించే నది గర్జన శబ్దం, పచ్చని పర్వతాల నీడ మాత్రమే మీకు లభిస్తుంది.

ఇక్కడి లోయలు చాలా పచ్చగా, విశాలంగా ఉన్నాయి. మీరు సినిమా సెట్ మీద నిలబడి ఉన్నట్లు అనిపిస్తుంది. ఇక్కడ సాంప్రదాయ చెక్క ఇళ్ళు, పొలాల్లో పనిచేసే వ్యక్తులు, ఎత్తైన పర్వతాలను చూస్తారు.

ఈ లోయ గుండా కిషన్ గంగా నది ప్రవహిస్తుంది. ఇది ఈ ప్రాంత అందాన్ని మరింత పెంచుతుంది. నదిలోని స్వచ్ఛమైన,చల్లని నీరు స్ఫటిక నీలం రంగులో కనిపిస్తుంది. దీని ఒడ్డున కూర్చుని సూర్యాస్తమయాన్ని చూడటం ఒక చిరస్మరణీయ అనుభవంగా మారుతుంది.

కరణ్ వ్యాలీకి సమీప విమానాశ్రయం శ్రీనగర్. ఇది ఇక్కడి నుంచి దాదాపు 110 కి.మీ. దూరంలో ఉంది. మీరు శ్రీనగర్ నుంచి కుప్వారాకు టాక్సీ లేదా స్థానిక రవాణా ద్వారా ప్రయాణించవచ్చు. దీని తరువాత కుప్వారా నుంచి కొండ రోడ్ల ద్వారా వాహనాల ద్వారా చేరుకోవచ్చు. ఆ దారి కొంచెం కష్టమే.. అయితే అక్కడికి చేరుకున్నప్పుడు మీ అలసట అంతా మర్చిపోతారు. ఈ ప్రదేశం LOC కి సమీపంలో ఉంది.. కనుక ఇక్కడికి వెళ్లే ముందు స్థానిక గైడ్ అనుమతి, సహాయం తప్పనిసరి.

 

రోజూ బెల్లం తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా? అస్సలు ఊహించలేను..

ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో కొద్దిగా బెల్లం తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఖాలీ కడుపుతో కాస్త బెల్లం తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెప్తున్నారు నిపుణులు. జీర్ణ సమస్యలు దూరమవుతాయి. శరీరంలోని టాక్సిన్లు బయటకు వెళ్లడంలో హెల్ప్ చేస్తుంది. దీనిలోని ఐరన్, జింక్, సెలెనియం వంటి మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వీటిలోని పోషకాలు అనేక సమస్యలను దూరం చేస్తాయి. అవేంటో తెలుసుకుందాం.

ఉదయాన్నే బెల్లం తినటం వల్ల మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడేవారు గోరువెచ్చని నీటితో బెల్లం తీసుకుంటే మంచిది. ఇది లివర్​ని డీటాక్స్ చేసి.. కాలేయంలోని ఫ్లష్​ని, టాక్సిన్లను బయటకు పంపేస్తుంది. ఖాళీ కడుపుతో బెల్లం తీసుకోవటం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ లెవెల్స్​ని పెంచి.. ఎనిమియా సమస్యల నుంచి దూరం చేస్తుంది. సహజమైన కార్బ్స్ శరీరానికి అందుతాయి. ఇవి శరీరానికి మంచి ఎనర్జీని అందిస్తాయి. దంతాల ఆరోగ్యాన్ని కాపాడటంలో బెల్లం సహాయపడుతుంది. దీనిలోని కాల్షియం దంతక్షయం ఏర్పడకుండా రక్షిస్తుంది. చిగుళ్లను బలంగా మారుస్తుంది. బెల్లంలో పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి మలబద్ధకం, గ్యా్స్, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సంబంధ సమస్యలు ఏర్పడుకుండా కాపాడుతాయి.

కొంతమందికి ఉదయం లేవగానే వాంతులు, వికారం వంటి సమస్యలు ఏర్పడుతుంటాయి. వీటి నుంచి బయటపడేందుకు బెల్లం తినడం మంచిది. ఉదయాన్నే 5 నుంచి 10 గ్రాముల బెల్లం తీసుకోవచ్చు. రెగ్యులర్​గా తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. ఎక్కువ బెల్లం తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. కడుపు ఉబ్బరం కూడా అవుతుంది. చలికాలంలో లేదా చల్లగా ఉన్న సమయాల్లో బెల్లం తింటే మంచి ప్రయోజనాలు పొందవచ్చు. నడుము, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి బాధపడేవారు ఉదయం కొద్దిగా బెల్లం తినడం అలవాటు చేసుకోండి. ఇది బెల్లీ ఫ్యాట్ కరిగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.

కొందరు ఉదయం లేవగానే తలనొప్పితో బాధపడుతుంటారు. ఇలాంటి వారు రోజూ బెల్లం తినడం వల్ల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. జుట్టు రాలడం సమస్య ఎక్కువగా ఉన్నవారు ఉదయం పూట బెల్లం తినడం అలవాటు చేసుకోండి. దీనిలోని పోషకాలు జుట్టును ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. బెల్లంలో ఐరన్, కాల్షియం వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా ఉంచడంలో సహాయపడతాయి. ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. బెల్లంలోని పోషకాలు చర్మంపై ముడతలు, మచ్చలు ఏర్పడకుండా కాపాడుతుంది. తద్వారా వయసు పెరిగినా యవ్వనంగా కనిపిస్తారు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

AC కంప్రెసర్ ఎక్కడ ఇన్‌స్టాల్ చేయాలి? చాలా మందికి తెలియని విషయాలు ఇవే!

వంటి కంపెనీల అధికారిక వెబ్‌సైట్‌లో ఏసీని ఇన్‌స్టాల్ చేసేటప్పుడు ప్రత్యక్ష సూర్యకాంతి లేని ప్రదేశంలో అవుట్‌డోర్ యూనిట్‌ను ఇన్‌స్టాల్ చేయాలని చెబుతోంది. అలాగే కంప్రెసర్ నుండి బయటకు వచ్చే వేడి గాలిని ఏదో ఒకదాని ద్వారా నిరోధించబడిన ప్రదేశంలో..

మార్కెట్‌కి వెళ్లి ఏసీ కొనడం పెద్ద విషయం కాదు. కానీ మీ ఎయిర్ కండిషనర్ అవుట్‌డోర్ యూనిట్ ఎక్కడ ఇన్‌స్టాల్ చేయబడిందనే దానిపై AC పనితీరు ఆధారపడి ఉంటుందని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. గదిని చల్లబరచడం కంప్రెసర్ చేతుల్లో ఉంటుంది. అందుకే మీరు కొత్త ఏసీని ఇన్‌స్టాల్ చేసినప్పుడల్లా లేదా ఇంటిని మార్చిన తర్వాత దాన్ని తిరిగి ఇన్‌స్టాల్ చేసినప్పుడల్లా కంప్రెసర్‌ను ఉంచే స్థలం సరిగ్గా ఉండాలని గుర్తుంచుకోండి. ఏసీ కంప్రెసర్‌ను సరైన స్థానంలో ఉంచనట్లయితే అది చాలా నష్టాలను కలిగిస్తుంది.

ఏసీ కంప్రెసర్‌ను తప్పుడు స్థానంలో ఇన్‌స్టాల్ చేయడం వల్ల కలిగే మొదటి ప్రతికూలత ఏమిటంటే AC కూలింగ్‌ సామర్థ్యం తగ్గవచ్చు. దీని అర్థం ఏసీ గదిని చల్లబరచడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీనివల్ల విద్యుత్ వినియోగం పెరుగుతుంది. వినియోగం పెరగడం వల్ల విద్యుత్ బిల్లు కూడా పెరగవచ్చు. ఇది మాత్రమే కాదు, ఏసీని తప్పు స్థానంలో ఉంచినట్లయితే ఉష్ణోగ్రత 50 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటే కంప్రెసర్ వేడెక్కే సమస్య ఉండవచ్చు.

ఏసీ కంప్రెసర్‌ను ఎక్కడ ఉంచాలి?

TCL, Daikin వంటి కంపెనీల అధికారిక వెబ్‌సైట్‌లో ఏసీని ఇన్‌స్టాల్ చేసేటప్పుడు ప్రత్యక్ష సూర్యకాంతి లేని ప్రదేశంలో అవుట్‌డోర్ యూనిట్‌ను ఇన్‌స్టాల్ చేయాలని చెబుతోంది. అలాగే కంప్రెసర్ నుండి బయటకు వచ్చే వేడి గాలిని ఏదో ఒకదాని ద్వారా నిరోధించబడిన ప్రదేశంలో ఏసీ కంప్రెసర్‌ను అమర్చకూడదు.

మీరు మీ ఇంట్లో స్ప్లిట్ ఏసీని ఇన్‌స్టాల్ చేసుకున్నప్పుడు ఇండోర్ యూనిట్ బయటి భాగం ఏ వైపు నుండి బయటకు వస్తుందో గమనించండి. ప్రత్యక్ష సూర్యకాంతి ఉన్న ప్రదేశంలో అవుట్‌డోర్ యూనిట్‌ను ఏర్పాటు చేయకూడదు. మీ AC ఒక ప్రదేశంలో అమర్చబడినప్పటికీ సూర్యకాంతి నేరుగా ఏసీ కంప్రెసర్‌పై పడకుండా నీడను ఏర్పాటు చేసుకోండి.

 

దివ్యాంగులకు సర్టిఫికెట్ల జారీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

దివ్యాంగులకు గుర్తింపు కార్డులు అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలో దివ్యాంగులకు గుర్తింపు కార్డుల జారీకి అవసరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అధికారులను ఆదేశించారు. అమరావతి వెలగపూడి సచివాలయంలో శుక్రవారం దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమంపై సంబంధిత అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా సదరం సర్టిఫికెట్లు, పీఎంజేఏవై వందన వయోవృద్ధుల హెల్త్ స్కీమ్‌పై మంత్రి చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ…. గ్రామ సచివాలయాలు, మీసేవ కేంద్రాలతో పాటు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సదరం స్లాట్ బుకింగ్‌కు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. స్లాట్ బుకింగ్ చేసుకున్న రోజు నుంచి నెల రోజుల లోపు సదరం సర్టిఫికెట్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సుదూర ప్రాంతాలు, గిరిజన తండాల నుంచి వచ్చే దివ్యాంగులకు ఇబ్బందులు లేకుండా సదరం క్యాంపులు నిర్వహించాలని ఆదేశించారు.

దివ్యాంగులకు గుర్తింపు కార్డులు అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఈ గుర్తింపు కార్డులో అంగవైకల్య శాతం, దివ్యాంగుల వివరాలు ఉంటాయన్నారు. గుర్తింపు కార్డులు తయారీ, జారీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని తెలిపారు. 70 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ పీఎంజేఎవై వందన స్కీమ్ ద్వారా రూ.5 లక్షల వరకూ ఉచిత వైద్యం అందిస్తామని మంత్రి తెలిపారు.

 

వాతావరణ శాఖ నుంచి శుభవార్త.. ఈసారి వర్షాలు నాలుగు రోజులు ముందుగానే వస్తాయి.

మాడు పగిలే ఎండతో అల్లాడిపోయిన ప్రజలకు వాతావరణశాఖ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. రుతుపవనాలు రెండు, మూడు రోజుల్లో మాల్దీవులు.. మధ్య బంగాళాఖాతం వరకు విస్తరిస్తాయని తెలిపింది. దీని ప్రభావంతో రానున్న మూడు, నాలుగు రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఈసారి సాధారణం కంటే నాలుగు రోజులు ముందుగానే వర్షాలు వస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఐఎండీ చల్లని కబురు చెప్పింది. ఐఎండీ శుభవార్తతో తీవ్ర ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం లభించనుంది. నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతం, దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ దీవులులోకి మరింతగా ప్రవేశించాయని ఐఎండీ తెలిపింది. రానున్న మూడు, నాలుగు రోజుల్లో ఇవి దక్షిణ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి విస్తరిస్తాయని వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు ఈ నెలాఖరు నాటికి కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని, ఈసారి సాధారణం కంటే నాలుగు రోజులు ముందుగానే వర్షాలు వస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

ఉత్తర కోస్తాకు ఆనుకుని బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని విశాఖ తుఫాన్‌ హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఏపీలో వారం రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు వాతావరణశాఖ అధికారులు. మన్యం, అల్లూరి జిల్లా, ఏలూరులో వర్షాలు కురుస్తాయని.. బాపట్ల, ప్రకాశం జిల్లాలకు వర్ష సూచన చేసింది.

తెలంగాణ వ్యాప్తంగా రాబోయే నాలుగు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఇవాళ రేపు కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని తెలిపింది. హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో రానున్న రెండు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. రాబోయే మూడు రోజులు పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. రెండు రోజులుగా నగరంలో కురుస్తున్న వర్షాలతో వాతావరణం చల్లబడి, ఉక్కపోత నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది.

 

మీరు దానిమ్మపండ్లు తింటారా? కానీ ఈ విషయాలు మీ కోసమే

తాజా దానిమ్మ గింజలు లేదా జ్యూస్ ని తీసుకోవడం వల్ల శరీరానికి సహజ శక్తిని ఆరోగ్యాన్ని అందిస్తుంది. దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు ఇతర పోషకాలు కాన్సర్ కణాలను అడ్డుకోవడానికి సహాయపడతాయి. ఇంకో విషయం ఏంటంటే దానిమ్మను డైలీ తినడం వల్ల రొమ్ము కాన్సర్ ప్రోస్టేట్ కాన్సర్లకు చెక్ పెట్టే అవకాశం ఉంటుంది. దానిమ్మ పండు రుచికరమైన రుచితో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే సూపర్ ఫుడ్. ఇందులో విటమిన్ సి, విటమిన్ కె, ఫోలేట్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. దానిమ్మ పండులో ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి. అందుకే దానిమ్మ పండును తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దానిమ్మలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది మీ బాడీలో ఇమ్యూనిటీ పవర్ ను అమాంతం పెంచేస్తుంది. మీ మెదడును చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. అలాగే మీ బాడీలో తెల్ల రక్త కణాల సంఖ్యను కూడా పెంచుతుంది. ఇంకో విషయం ఏంటంటే దానిమ్మను డైలీ తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటుంది. ఫ్లూ, జలుబు, దగ్గు, జ్వరం ఇలాంటివి మీ దరిచేరకుండా ఉంటుంది. దానిమ్మలో కెలోరీలు, కొవ్వు తక్కువగా ఉంటాయి. ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

100 రోజుల్లో సిక్స్ ప్యాక్.. 49 ఏళ్ల వయసులో సూర్య కుర్రాడిలా కనిపిస్తున్నాడు.. హీరో డైట్ ప్లాన్

దక్షిణాది సినీప్రియులకు ఇష్టమైన హీరోలలో సూర్య ఒకరు. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించిన కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఇటీవలే రెట్రో సినిమాతో ప్రేక్షకులను ముందుకు వచ్చిన సూర్య.. మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నారు. తాజాగా తన డైట్ సీక్రెట్ రివీల్ చేశారు సూర్య.

తమిళ చిత్రపరిశ్రమలో అగ్ర హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు సూర్య. హీరోయిజం సినిమాలు కాకుండా విభిన్న కంటెంట్ చిత్రాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవలే కంగువా, రెట్రో చిత్రాలతో అడియన్స్ ముందుకు వచ్చారు. కొన్ని రోజుల క్రితం డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన రెట్రో సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటించింది. ఇదిలా ఉంటే.. సూర్య వయసు ప్రస్తుతం 49 సంవత్సరాలు. కానీ ఇప్పటికీ యంగ్ కుర్రాడిలా కనిపిస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాడు. సూర్య ఫిట్నెస్ ప్రియుడు.

49 ఏళ్ల వయసులో కూడా, ఫిట్‌నెస్‌ను కాపాడుకునే విషయంలో సూర్య రాజీ పడటానికి ఇష్టపడటం లేదు. గతేడాది విడుదలైన కంగువ చిత్రంలో సిక్స్ ప్యాక్ తో కనిపించి వయసు కేవలం నంబర్ మాత్రమే అని మరోసారి నిరూపించాడు. అయితే ఇటీవల తన ఫిట్నెస్ సీక్రెట్ రివీల్ చేశారు సూర్య. 49 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్ పొందడం అనేది అంత తేలికైన పని కాదని.. ఇప్పటికీ రోడ్డుపై పరుగులు పెడుతున్నట్లుగా అనిపిస్తుందని అన్నారు. అలాగే తనతోపాటు తన భార్య, కూతురు సైతం భోజన ప్రియులు అని.. తన కొడుకు ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాడని చెప్పుకొచ్చాడు.

కంగువ సినిమా కోసం తాను 100 రోజుల డైట్ ప్లాన్ పాటించానని..అందులో భాగంగా కేలరీలను పూర్తిగా తగ్గించానని.. కార్డియో వ్యాయామాలను చేయడం.. జీవనశైలిలో పూర్తిగా మార్పులు చేశానని తెలిపారు. 100 రోజులు కఠినమైన డైట్ పాటించానని అన్నారు. 49 ఏళ్ల వయసులో జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వల్ల సానుకూల ఫలితాలు వస్తాయని డైటీషియన్ విధి చావ్లా అన్నారు. ఈ వయసులో డైట్ పాటించడం వల్ల బరువు నియంత్రణ, ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని అన్నారు.

 

ఓటీటీలో వచ్చిన హారర్ థ్రిల్లర్.. ఈ రేంజ్ సస్పెన్స్ ఊహించలేనిది.

హారర్, థ్రిల్లర్, సస్పెన్స్, మిస్టరీ సినిమాలకు జనాల్లో ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఈమధ్య కాలంలో ఓటీటీల్లో ఇలాంటి జానర్ చిత్రాలు ఎక్కువగా స్ట్రీమింగ్ అవుతున్నాయి. మూవీ లవర్స్ ను ఆకట్టుకునేందుకు ఈజానర్ చిత్రాలను రూపొందించేందుకు మేకర్స్ సైతం ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా మీరు ఊహించని సస్పెన్స్ లతో ఉండే సినిమా ఇప్పుడు అడియన్స్ ముందుకు వచ్చింది.

సాధారణంగా హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు అదే సినిమాలను ఇతర భాషలలోకి డబ్ చేసి ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల థియేటర్లలో సూపర్ హిట్ అయిన సినిమాల్లో హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ మూవీ ఉల్ఫ్ మ్యాన్ ఒకటి. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన ఈ చిత్రానికి లీ వానెల్ దర్శకత్వం వహించారు. ఇందులో క్రిస్టఫర్ అబాట్, జూలియా గార్నర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ ఏడాది జనవరి 17న థియేటర్లలో విడుదలైన ఈ మూవీకి అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పటికే కొన్ని ఓటీటీల్లో రెంటల్ విధానంలో అందుబాటులో ఉంది ఈ సినిమా. ఇక ఇప్పుడు రెంటల్ విధానంలో కాకుండా రెగ్యులర్ స్ట్రీమింగ్ అవుతూ ఓటీటీలోకి వచ్చేసింది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ లో మే 17 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఆంగ్లంతోపాటు హిందీ డబ్బింగ్ లోనూ ఈ సినిమా అందుబాటులో ఉంది. ఈ రెండు భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఉల్ఫ్ మ్యాన్ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంటల్ విధానంలో అందుబాటులో ఉండగా.. ఇప్పుడు జియో హాట్ స్టార్ లో మాత్రం ఉచితంగానే చూడొచ్చు. కానీ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ ఉన్నవారు మాత్రమే ఈ చిత్రాన్ని రెంటల్ విధానంలో కాకుండా ఫ్రీగా చూడొచ్చు.

ఇక కథ విషయానికి వస్తే.. వింత జీవులు దాడి చేసేందుకు రావడంతో తన భార్, కూతురిని రక్షించుకునేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించడమే ఈ సినిమా కథ. కానీ భార్య, కూతురుని రక్షించే వ్యక్తి ఆకస్మాత్తుగా ప్రమాదకరంగా మారితే.. ఇలాంటి ట్విస్టులు సినిమాలో క్షణ క్షణం ప్రేక్షకులను కట్టిపడేస్తుంటారు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.

 

హైవేపై ట్యాంకర్ నుంచి వెలువడిన తెల్లటి వాయువు.. భయంతో పరుగులు తీసిన ప్రజలు

అది అనకాపల్లి జిల్లాలోని జాతీయ రహదారి.. నిత్యం ఆ రూట్ లో వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. ఒక్కసారిగా కలకలం. భారీ శబ్దంతో ఓ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది.. హైవేపై నుంచి పక్కనున్న పొలంలోకి దూసుకెళ్లింది. వెంటనే తెల్లగా వాయువులు బయటకు వచ్చాయి..

అది అనకాపల్లి జిల్లాలోని జాతీయ రహదారి.. నిత్యం ఆ రూట్ లో వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. ఒక్కసారిగా కలకలం. భారీ శబ్దంతో ఓ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది.. హైవేపై నుంచి పక్కనున్న పొలంలోకి దూసుకెళ్లింది. వెంటనే తెల్లగా వాయువులు బయటకు వచ్చాయి.. దట్టంగా ఆ ప్రాంతమంతా కమ్మేసింది. దీంతో స్థానికులకు ఒకటే ఆందోళన. భయంతో పరుగు అందుకున్నారు.

అది అనకాపల్లి జిల్లాలోని జాతీయ రహదారి.. నిత్యం ఆ రూట్ లో వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. ఒక్కసారిగా కలకలం. భారీ శబ్దంతో ఓ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది.. హైవేపై నుంచి పక్కనున్న పొలంలోకి దూసుకెళ్లింది. వెంటనే తెల్లగా వాయువులు బయటకు వచ్చాయి.. దట్టంగా ఆ ప్రాంతమంతా కమ్మేసింది. దీంతో స్థానికులకు ఒకటే ఆందోళన. భయంతో పరుగు అందుకున్నారు.

 

ట్విన్ సిస్టర్స్ అదుర్స్ – లుక్ లోనే కాదు మార్కులలో కూడా వాళ్ళు ఒకేలా ఉంటారు.

 కవలలు అనగానే ఇద్దరూ చూసేందుకు ఒకేలా కనిపిస్తారు. కొన్ని సార్లు వాళ్లని గుర్త పట్టడం కూడా కష్టమే. అయితే వారి మార్కులు కూడా సేమ్​గా ఉంటే ఎంత అశ్చర్యంగా ఉంటుంది కదూ. తమిళనాడుకు చెందిన కవలలు పదో తరగతి పరీక్షల్లో ఒకే మార్కులు సాధించింది అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.

కోయంబత్తూరులోని రామనాథపురం ప్రాంతానికి చెందిన సుందరరాజన్, భారతి సెల్విల కుమార్తెలు కవిత, కనిక కవల పిల్లలు. ఈ ఇద్దరు అదే ప్రాంతంలోని మున్సిపల్ స్కూల్లో పదోతరగతి చదువుతున్నారు. అయితే తాజాగా పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. వాటిని తెలుసుకునేందుకు వెళ్లి ఈ సిస్టర్స్ ఆశ్చర్యానికి గురయ్యారు. ఇద్దరికీ ఒకే మార్కులు వచ్చాయి.

గణితంలోనూ సేమ్​
కవిత మార్కులు చూస్తే, తమిళం- 95, ఇంగ్లీష్-98, గణితం – 94, సైన్స్ – 89, సోషల్– 98, మొత్తంగా 474 మార్కులు వచ్చాయి. ఇక కనిక మార్కులు చూసే, తమిళం– 96, ఇంగ్లీష్ – 97, గణితం – 94, సైన్స్ – 92, సామాజిక శాస్త్రం – 95, మొత్తంగా 474 మార్కులు వచ్చాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గణితంలో ఇద్దరికి ఒకే మార్కులు వచ్చాయి.

 

మీ జీవితాన్ని మార్చే 5 శక్తివంతమైన అలవాట్లు

జీవితంలో ఏదో సాధించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కొన్నిసార్లు పక్కా ప్లానింగ్ ప్రకారమే ముందుకెళ్లినా విజయం ముంగిట బోల్తా పడతుంటారు. లేకపోతే లక్ష్యానికి ఆమడ దూరంలోనే ఉండిపోతారు. అయితే, సాయంత్రం దినచర్యలో ఈ 5 పనులను భాగం చేసుకున్నారంటే మాత్రం మీకిక తిరుగుండదు.

ప్రతి ఒక్కరూ అద్భుతమైన, సంతోషకరమైన, ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుంటారు. తమ ఆకాంక్షలు, లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి నిరంతరం కష్టపడి పనిచేస్తారు. కానీ, సాయంత్రం కాగానే తరచూ అందరూ టీవీ లేదా ఫోన్ చూడటం లేదా అలసిపోయి ఏమీ చేయకుండా ఉండటం వంటివి చేసి సమయం వృథా చేస్తుంటారు. ఇందుకు బదులుగా ప్రతి సాయంత్రం ఈ 5 పనులు చేయడం అలవాటు చేసుకుంటే మీ జీవితమే పూర్తిగా మారిపోతుంది. మీ ఆలోచన, ఆరోగ్యం, జీవనశైలిలో అద్భుతమైన మార్పులు తెచ్చి సక్సెస్‌ఫుల్ పర్సన్‌గా తీర్చిదిద్దుతుంది. మీ విజయానికి నిచ్చెనగా మారే ఆ 5 అలవాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఆత్మపరిశీలన

ప్రతి సాయంత్రం అన్ని వ్యాపకాలను పక్కనపెట్టి 10-15 నిమిషాల పాటు మౌనంగా ఒక చోట కూర్చోండి. ఆ రోజు ఎలా గడిచిందో ఆలోచించండి. నిద్ర మేల్కొన్నప్పటి నుంచి ఏం చేశారు? ఏ పని బాగా చేసారు? ఏ తప్పులు చేసారు? వాటి నుంచి ఏమి నేర్చుకున్నారు? ఇలా మిమ్మల్మి మీరే ప్రశ్నించుకోండి. ఇలా ప్రశాంతమైన మనస్సుతో కూర్చుని ఆత్మపరిశీలన చేసుకున్నప్పుడు మీ బలాలు, బలహీనతల గురించి క్లారిటీ వస్తుంది. స్వీయ-అవగాహన పొందడం ద్వారా భవిష్యత్తులో చేయబోయే పనుల్లో తప్పులు దొర్లకుండా జాగ్రత్తపడతారు. ఒత్తిడి తగ్గి జీవితంలో సానుకూలంగా ముందుకు సాగడానికి ఈ అలవాటు సహాయపడుతుంది.

మరుసటి రోజు కోసం ప్లానింగ్

ఈ రోజు, ఈ క్షణం మీరు చేసే పని, తీసుకున్న నిర్ణయాలే మీ విజయంలో, పరాజయంలో కీలక పాత్ర పోషిస్తాయి. చిన్నదో, పెద్దదో ఏదైనా రేపు చేయాల్సిన పని గురించి ఇవాళే ప్లాన్ చేసుకుంటే సక్సెస్‌ఫుల్ పర్సన్‌గా ఎదుగుతారు. కాబట్టి, మరుసటి రోజు చేయవలసిన పనుల జాబితాను రాత్రి పడుకునే రెండు, మూడు గంటల ముందే తయారు చేసుకోండి. దీని వలన ఉదయం మీ సమయం వృథా కాదు. తర్వాతి రోజును స్పష్టమైన లక్ష్యంతో ప్రారంభించగలుగుతారు. ఈ అలవాటు మీ పనిలో ఏకాగ్రతని, ఉత్పాదకతని రెండింటినీ పెంచుతుంది.

సాయంత్రం డిజిటల్ డీటాక్స్

నేటి కాలంలో మొబైల్, ల్యాప్‌టాప్, కంప్యూటర్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారాయి. ఆఫీసులో ఎక్కువ భాగం ల్యాప్‌టాప్, మొబైల్‌లో మాత్రమే పని చేయాల్సి వస్తుంది. ఏ పని చేయని వారూ మొబైల్ ఫోన్‌లను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. కానీ వాటిని రోజూ కొంతసేపు దూరం పెట్టడం అవసరం. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో డిజిటల్ ప్రపంచానికి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. నిద్రపోవడానికి కనీసం 1 గంట ముందు మొబైల్, ల్యాప్‌టాప్ లేదా టీవీకి దూరంగా ఉండండి. బదులుగా ధ్యానం చేయండి లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడండి. మ్యూజిక్ ఎంజాయ్ చేయండి. ఈ పనుల వల్ల త్వరగా నిద్రపట్టడమే కాదు. టెన్షన్ తగ్గి మానసిక ప్రశాంతత పొందుతారు.

శరీరానికి సమయం

రోజంతా పని చేశాక అలసిన శరీరానికి విశ్రాంతి అవసరం. ముఖ్యంగా, సాయంత్రం పూట శరీరం కోసం కొంత సమయం కేటాయించండి. ఈ సమయంలో తేలికపాటి స్ట్రెచింగ్, యోగా లేదా వాకింగ్ చేయవచ్చు. ఇది శరీర అలసటను తొలగించి మంచి నిద్ర పట్టడానికి సహాయపడుతుంది. మీరు బాగా నిద్రపోయినప్పుడే మరుసటి రోజును ఉత్సాహంగా ప్రారంభించగలరు.

పుస్తక పఠనం

మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి పుస్తక పఠనం కంటే మంచి మార్గం మరొకటి లేదు. కాబట్టి, ప్రతి రాత్రి పడుకునే ముందు మీకు ఇష్టమైన పుస్తకాన్ని కాసేపు చదవండి. ఇది మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఏకాగ్రతను పెంచుతుంది. మీకు ఏ సబ్టెక్ట్ ఇష్టం ఉంటే ఆ పుస్తకాలు ఎంపిక చేసుకోండి. ఫిక్షన్, నాన్-ఫిక్షన్, ఆధ్యాత్మికం, మోటివేషన్ ఇలా జోనర్ అయినా సరే. నిద్రపోయే ముందు పుస్తకం చదవడం అలవాటు చేసుకోండి.

మీ ఖాతాలో డబ్బు లేకపోయినా మీరు Google Pay మరియు Phone Pay లను ఉపయోగించవచ్చు.

మీ ఖాతాలో డబ్బు లేకపోతే, మీరు లావాదేవీలు చేయలేరు.. కానీ NPCI ప్రవేశపెట్టిన కొత్త ఫీచర్‌ని ఉపయోగించి, మీరు Google Pay మరియు Phone Pay వంటి UPI లావాదేవీలను సులభంగా చేయవచ్చు. కొత్తగా ప్రవేశపెట్టిన ఈ ఫీచర్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి.

ఇది డిజిటల్ లావాదేవీల యుగం. ఏదైనా కొనడానికి మీకు లిక్విడ్ క్యాష్ అవసరం లేదు. డిజిటల్ డబ్బు ఉంటే చాలు. అంటే, మీ ఖాతాలో డబ్బు ఉంటే. దానిని డ్రా చేసి కొనాల్సిన అవసరం లేదు. అందుకే చాలా మంది UPIని ఉపయోగిస్తున్నారు. అంటే, Google Pay, Paytm, PhonePe, BHIM యాప్‌ల ద్వారా UPI లావాదేవీలు జరుగుతున్నాయి. ఇప్పుడు కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. బ్యాంక్ బ్యాలెన్స్ సున్నా అయినప్పటికీ UPI లావాదేవీలు చేయవచ్చు. NPCI ఈ ప్రత్యేక సేవను ప్రవేశపెట్టింది.

సాధారణంగా, ప్రతి ఒక్కరి UPI ID వారి బ్యాంక్ ఖాతాకు లింక్ చేయబడుతుంది. చెల్లింపులు చేసినప్పుడు, మీ ఖాతా నుండి డబ్బు డెబిట్ చేయబడుతుంది. ఇప్పుడు NPCI ఒక అద్భుతమైన సేవను ప్రవేశపెట్టింది. మీ ఖాతాలో డబ్బు లేకపోయినా UPI ద్వారా చెల్లింపులు చేయవచ్చు.

క్రెడిట్ కార్డ్ లాంటి సౌకర్యం

UPI క్రెడిట్ సౌకర్యం క్రెడిట్ కార్డ్ లాంటిది. అంటే, ప్రతి కస్టమర్‌కు ఒక నిర్దిష్ట పరిమితి ఇవ్వబడుతుంది. మీరు ఈ సౌకర్యాన్ని పొందాలనుకుంటే, మీరు మీ బ్యాంకుకు వెళ్లి మీ UPI IDకి క్రెడిట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. దీనికి ముందు, ఈ ఖాతాను మీ UPI IDకి లింక్ చేయాలి.

45 రోజుల్లోపు తిరిగి చెల్లించండి

బ్యాంక్ నుండి ఆమోదం పొందిన తర్వాత, మీ ఖాతాలో డబ్బు ఉందా లేదా అని మీరు UPI ద్వారా చెల్లింపులు చేయవచ్చు. ఈ డబ్బును తిరిగి చెల్లించడానికి మీకు 45 రోజుల సమయం ఉంది. బ్యాంక్ ఎటువంటి వడ్డీని వసూలు చేయదు. మీరు 45 రోజుల్లోపు డబ్బు చెల్లించకపోతే, మీరు వడ్డీని చెల్లించాలి. ప్రస్తుతం, ఈ సేవ ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలలో ప్రారంభించబడింది.

మీ దగ్గర డబ్బు లేకపోయినా మీరు కొనుగోలు చేయవచ్చు

ఈ ఫీచర్ BHIM, Paytm, PayZapp, G Payలలో కూడా అందుబాటులో ఉంది. ఈ సౌకర్యం కారణంగా మరిన్ని లావాదేవీలు జరుగుతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇకపై ఏదైనా కొనుగోలు చేసే ముందు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బ్యాంకులో డబ్బు లేకపోయినా మీరు హాయిగా కొనవచ్చు.

 

“తల్లికి వందనం” విడుదల తేదీ వచ్చేసింది.. ఈ డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోండి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన తల్లికి వందనం (Talliki Vandanam) కార్యక్రమం ద్వారా విద్యార్థుల తల్లులకు సంవత్సరానికి రూ.15,000 నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ స్కీమ్ ద్వారా విద్యార్థుల చదువుకు ఆర్థికంగా సహాయపడటమే లక్ష్యం.

ఎప్పుడు వస్తుంది డబ్బు?

ఈ సంవత్సరం తల్లికి వందనం నిధులు 2025 జూన్ 12న విడుదల చేయనున్నట్టు ప్రభుత్వ అధికారులు స్పష్టంచేశారు. ప్రభుత్వం ఇప్పటికే లబ్ధిదారుల ఖాతాలను పరిశీలించి, అర్హత కలిగినవారి లిస్టును సిద్ధం చేసింది.

✅ ఎవరు అర్హులు?

  • ప్రభుత్వ, గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు
  • విద్యార్థి తల్లి/గార్డియన్ పేరు బ్యాంక్ ఖాతా ఉండాలి
  • విద్యార్థి అకడమిక్ అటెండెన్స్ 75% కంటే ఎక్కువ ఉండాలి
  • కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.2 లక్షల లోపు ఉండాలి

📄 అవసరమైన డాక్యుమెంట్లు:

  • విద్యార్థి ఆధార్
  • తల్లి ఆధార్
  • బ్యాంక్ ఖాతా వివరాలు
  • పాఠశాల అటెండెన్స్ సర్టిఫికేట్
  • ఆదాయ ధ్రువీకరణ పత్రం

💡 డబ్బు వచ్చిందా ఎలా తెలుసుకోవాలి?

మీ బ్యాంక్ ఖాతా SMS లేదా grama sachivalayam ద్వారా ఈ వివరాలను తెలుసుకోవచ్చు. లేదా https://navasakam.ap.gov.in/ వెబ్‌సైట్‌లో మీరు లబ్ధిదారుల జాబితా చూడవచ్చు.

📌 చివరి మాట:

తల్లికి వందనం వల్ల ఎన్నో కుటుంబాలు ఉపశమనాన్ని పొందుతున్నాయి. విద్యార్థులు చదువులో కొనసాగేందుకు ఇది ఒక గొప్ప ఆర్థిక మద్దతు. జూన్ 12న డబ్బు వచ్చిందో లేదో తప్పక చెక్ చేయండి!

 

స్కూల్ కింద నుంచి వింత శబ్దాలు వస్తున్నాయి.. భయంగానే తవ్వి చూడగా

స్కూల్ రినోవేషన్ పనుల్లో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఏకంగా ఓ స్మశానవాటిక బయటపడింది. ఆస్థిపంజరాలు, ఎముకులు, పుర్రెలు చూసి దడుసుకున్నారు విద్యార్ధులు. ఈ ఘటన మెక్సికోలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం మరి.

ఓ స్కూల్‌లో రినోవేషన్ పనులు జరుగుతున్నాయి. కొద్దిరోజులుగా కూలీలు తమ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఇదిలా ఉండగా.. వారికి ఓ మారు మార్బుల్ రాళ్ల కింద నుంచి ఏవో వింత చప్పుళ్లు వినిపించాయి. మొదటిగా అవేవో ఎలుకలు లేదా పందికొక్కులు అయి ఉంటాయిలే అనుకునేరు. కానీ అదే భయం భయంగా కొంచెం కొంచెంగా తవ్వి చూశారు. అంతే.! బయటపడింది చూసి దెబ్బకు షాక్ అయ్యారు.

వివరాల్లోకి వెళ్తే.. మెక్సికోలోని ఓ ప్రాధమిక పాఠశాల కింద పిల్లల శ్మశానవాటిక ఒకటి బయటపడింది. ఎముకలు, పుర్రె లాంటివి బయటపడటం చూసి విద్యార్ధులకు దెబ్బకు దడుసుకున్నారు. స్కూల్ పునరుద్ధరణ పనుల్లో భాగంగా కూలీలు గోతులు తవ్వుతుండగా.. ఈ వింతైన శ్మశానవాటిక బయటపడింది. 80 చదరపు సెంటీమీటర్ల కుహరంలో ఎనిమిది మంది పిల్లలు, ఒక యువకుడి అస్థిపంజర అవశేషాలను కనుగొన్నారు. 80 x 35 సెం.మీ. కొలతలు కలిగిన చెక్క శవపేటికలో ఓ చిన్నారి అస్థిపంజరం లభ్యమైంది. ఆ శవపేటికను నీలం, వజ్రాల ఆకారపు చెక్కడాలతో అలంకరించడమే కాదు.. అవశేషాలను గోధుమ రంగు కవచంలో చుట్టి ఉంచారు.

మెక్సికోలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంత్రోపాలజీ అండ్ హిస్టరీ(INAH) నిపుణులు ఈ బయటపడ్డ స్మశానాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఖనన ఆచారాలు కొంచెం కొత్తగా ఉండటంతో.. ఆ ఆస్థిపంజరాలు ఏకాలం నాటివి అనేది చెప్పలేకపోతున్నారు. ఈ ఆస్థిపంజరాలతో పాటు 1862 నాటి ఓ నాణేన్ని గుర్తించడంతో.. వీరందరినీ 19వ శతాబ్దంలో ఖననం చేసి ఉంటారని అంచనా వేస్తున్నారు. అలాగే స్కూల్ కింద తవ్విన గొయ్యి నుంచి బటన్లు, వస్త్రపు ముక్కలు, సిరామిక్స్, లోహాలు, వింత భాషలో రాసిన ఓ కాగితం ముక్క స్వాధీనం చేసుకున్నారు పురావస్తు శాస్త్రవేత్తలు. వీటన్నింటిని గ్వాడాలుపేలోని ఓ మ్యూజియానికి తరలించారు. కాగా, ఆ అస్థిపంజరాలపై లోతైన దర్యాప్తు చేపట్టారు.

Health

సినిమా