Sunday, September 8, 2024

ఉద్యోగులకు గుడ్‌న్యూస్ కొత్త పీఎఫ్ రూల్.. ఏప్రిల్ 1 నుండి అమలు!

సాధారణంగా ప్రతి ఒకరు తాను చేసే ఉద్యోగానికి వచ్చే జీతంలో కొంత బాగాన్ని భవిష్యత్ అవసరాల కోసం దాచి పెట్టుకుంటారు . అలాంటి వారి ప్రతి ఒకరికి పీఎఫ్ అకౌంట్ ఉంటుందన్న సంగతి తెలిసిందే.
దీంట్లో మీ వేతనం నుంచి ప్రతి నెలాఎంతో కొంత మొత్తం దీంట్లో జమవుతుంది.అంతేకాకుండా సంస్థ కూడా యాడ్ చేస్తుంటుంది.అయితే పీఎఫ్ చందాదారులకు ఇప్పుడు ప్రభుత్వం ఒక శుభవార్త అందింది. ఉద్యోగం మారిన సమయంలో అకౌంట్ ట్రాన్స్‌ఫర్ కోసం రిక్వెస్ట్ చేసుకోవాల్సిన పని లేకుండా కొత్త నిబంధన తీసుకొస్తోంది ఈ రోజుల్లో చాలా మంది తరచుగా ఉద్యోగాలు మారుతుంటారు. అలాంటి వారు ముఖ్యంగా వారి ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) అకౌంట్‌కు సంబంధించి ఇబ్బందులు పడుతుంటారు. దీనిని కొత్త సంస్థకు ఎలా ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి అనే విషయంలో ఇబ్బంది పడుతూ ఉంటారు .

అందులో ఉన్న డబ్బులు ఎలా విత్‌డ్రా చేసుకోవాలి , వడ్డీ సంగతేంటి ఇలా ఏం చేయాలో తెలియక సతమతం అవుతుంటారు. అలాంటి వారి కోసం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆటోమేటెడ్ పీఎఫ్ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ సిస్టమ్ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిసింది. ఏప్రిల్ 1 నుంచే ఈ కొత్త రూల్ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సమాచారం.

కొత్త రూల్ అందుబాటులోకి వస్తే కనుక ఇక ఎవరైనా ఉద్యోగం మారినప్పుడు మాన్యువల్‌గా అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయాలని దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. పాత సంస్థలో జమ అయి ఉన్న పీఎఫ్ బ్యాలెన్స్ ఆటో కొత్త సంస్థ పీఎఫ్ అకౌంట్లోకి బదిలీ అవుతుందన్నమాట. దీంతో పీఎఫ్ చందాదారులకు తమ అకౌంట్‌కు సంబంధించి ఉన్న సందేహాలను ఇది తొలగిస్తుందని చెప్పొచ్చు. ఈ రూల్ అమల్లోకి వస్తే చాలా వరకు పీఎఫ్ సబ్‌స్క్రైబర్ల ఇబ్బందులు తగ్గుతాయి.

ఇది ఏప్రిల్ 1 నుంచి అందుబాటులోకి వస్తుందని చెబుతున్నా దీనిపై పూర్తి మార్గదర్శకాలు బయటికి రాలేదు. అధికారికంగా ఈపీఎఫ్ఓ దీనిపై ప్రకటన చేయాల్సి ఉంది. అకౌంట్ బ్యాలెన్స్ మాత్రమే ట్రాన్స్‌ఫర్ అవుతుందా.. అకౌంట్ విలీనం అవుతుందా అనే విషయాలు ఇంకా తెలియంసింది ఉంది .
ఇంకా వడ్డీ ఎలా యాడ్ అవుతుంది.. ఇలాంటి అంశాలపై క్లారిటీ రావాల్సి ఉంది. కొత్త కొత్త అవకాశాలు, మంచి జీతాలు ఆశిస్తూ చాలా మంది ఉద్యోగాలు మారుతుంటారు. ఉద్యోగం మారిన చోట కచ్చితంగా కొత్త పీఎఫ్ అకౌంట్ తెరుస్తుంటారు.

వాటిని విలీనం మాత్రం చేయరు. ఎలానో తెలియక కొందరు.. ఏమైనా ఇబ్బందులుంటాయోనని ఇంకొందరు.. దీని గురించి పెద్దగా పట్టించుకోరు.

అయితే ఇందులో ప్రతిసారీ ఒకటే యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) ఉంటుంది. దీనిపైనే కొత్త కొత్త పీఎఫ్ అకౌంట్లు తెరుస్తుంటారు. ఇలా సర్వీసు కాలం ఎక్కువగా ఉన్నట్లు కనిపించదు. సాధారణంగా పీఎఫ్ అకౌంట్ ఐదేళ్లు దాటితే అందులో విత్‌డ్రాలపై టాక్స్ ఉండదు.

అదే విలీనం చేయకుండా రెండు, మూడేళ్లకు సంస్థ మారితే.. ఈ ప్రయోజనం కోల్పోవచ్చు. పీఎఫ్ బ్యాలెన్స్‌ను అకౌంట్ నుంచి విత్‌డ్రా చేసుకునే సదుపాయం ఉంది. రిటైర్మెంట్ తర్వాత లేదా ఉద్యోగం మానేసిన 2 నెలల తర్వాత కూడా ఇతర మెడికల్ ఎమర్జెన్సీ, వివాహం, ఇల్లు రెనోవేషన్ ఇలా పలు అవసరాలకు డబ్బులు తీసుకోవచ్చు. పీఎఫ్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు.ఇలాంటి విషయాలు తేలియక చాల మంది అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు . ఒకవేళ ఈ కొత్త పి ఎఫ్ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ విషయము అమలులోకి వస్తే చిటికి మాటికీ జాబ్స్ మారె వారికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు

IIT Bombay | ఐఐటీ బాంబే విద్యార్ధుల్లో 36 శాతం మందికి దక్కని జాబ్ ఆఫర్లు

IIT Bombay | అంతర్జాతీయ ఆర్ధిక మందగమనం ప్రతిష్టాత్మక విద్యాసంస్ధల ప్లేస్‌మెంట్స్‌పైనా ప్రభావం చూపుతోంది. ఐఐటీ బాంబే విద్యార్ధుల్లో 36 శాతం మంది అభ్యర్ధులకు ప్రస్తుత ప్లేస్‌మెంట్ సీజన్‌లో ఇప్పటివరకూ ఉద్యోగాలు లభించలేదని వెల్లడైంది.
2000 మంది నమోదిత విద్యార్ధుల్లో 712 మందికి ఇప్పటికీ జాబ్ ఆఫర్లు రాలేదు.

అంతర్జాతీయ ఆర్ధిక మందగమనంతో గత ఏడాది తరహాలో క్యాంపస్‌కు కంపెనీలను ఆహ్వానించడంలో సమస్యలు ఎదురవుతున్నాయని ఐఐటీ బాంబే ప్లేస్‌మెంట్ విభాగాధికారి తెలిపారని ఓ వార్తాకథనం తెలిపింది. విద్యాసంస్ధ ముందుగా నిర్ణయించిన వేతన ప్యాకేజ్‌లను అంగీకరించేందుకు చాలా కంపెనీలు తటపటాయిస్తున్నాయని సమాచారం. ప్లేస్‌మెంట్స్‌లో పాల్గొనే ముందు పలు దశల్లో ఆయా కంపెనీలు సంప్రదింపులు జరుపుతున్నాయని అధికారులు తెలిపారు.

ఐఐటీ బాంబే ప్లేస్‌మెంట్స్‌లో నమోదు చేసుకున్న సీఎస్ఈ విద్యార్ధులు పూర్తిస్ధాయిలో జాబ్ ఆఫర్లు పొందలేకపోవడం ఇదే తొలిసారి. ఐఐటీ బాంబేలో ప్లేస్‌మెంట్స్ ప్రక్రియ పురోగతిలో ఉండగా ఈ ఏడాది మే వరకూ ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఈ ఏడాది 35.8 శాతం విద్యార్ధులకు ఇప్పటివరకూ జాబ్ ఆఫర్స్ లభించలేదు. ఇది గత సెషన్ కంటే 2.8 శాతం అధికం కావడం గమనార్హం. ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లో పాల్గొన్న కంపెనీల్లో 380 కంపెనీలు దేశీ కంపెనీలు కాగా, గ్లోబల్ కంపెనీల సంఖ్య ఈసారి తక్కువగా ఉందని చెబుతున్నారు.

Saree Cancer: భయపెడుతున్న చీర క్యాన్సర్.. జాగ్రత్త

Saree Cancer: ప్రస్తుతం ఎలాంటి వ్యాధులు ప్రబలుతాయో? ఎలాంటి వ్యాధులు శరీరాన్ని ఎటాక్ చేస్తాయో తెలుసుకోవడం కష్టమే. క్యాన్సర్స్, టీబీ, హెచ్ఐవి వంటి ప్రాణాంతక వ్యాధులు కూడా ఉన్నాయి.
ఇలాంటి భయంకరమైన వ్యాధులలో క్యాన్సర్ కూడా ఒకటి. ఈ క్యాన్సర్ లలో ఎన్నో రకాల క్యాన్సర్లు ఉన్నాయి. లంగ్స్, స్కిన్, త్రోట్, బ్రెస్ట్, గర్భాశయం, అండాశయం, జీర్ణాశయం, పేగులు, నోటి క్యాన్సర్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఈ వ్యాధి వస్తే కోలుకోవడం కష్టమే. అయితే రీసెంట్ గా చీర క్యాన్సర్ ఇప్పుడు అందరినీ భయపెడుతోంది. ఇంతకీ ఈ క్యాన్సర్ ఎలా వస్తుందంటే..

భారతదేశంలోని స్త్రీలు ఎక్కువగా ధరించే వాటిలో ముఖ్యమైనది చీర. ఈ చీర కట్టుకునే విధానం వల్ల కూడా క్యాన్సర్ వస్తుందట. బీహార్, జార్ఖండ్ లలో చీర క్యాన్సర్ మొదలైందని తెలుస్తోంది. దీన్ని వైద్య భాషలో స్క్వామల్ సెల్ కార్సినోమా అని పిలుస్తారట. ముంబైలోని ఆర్ఎణ్ కూపర్ ఆస్పత్రిలో ఈ చీర క్యాన్సర్ పై పరిశోధనలు చేశారు. 68 సంవత్సరాల మహిళకు ఈ క్యాన్సర్ ఉన్నట్టు బాంబే హాస్పిటల్ వైద్యులు తెలిపారు.
ఆ మహిళ 13 సంవత్సరాల నుంచి చీర కట్టుకుంటుందట. చాలా మంది స్త్రీలు చీరలు కట్టుకుంటారు. చీర కట్టుకోవడానికి పెట్టీకోట్ ను నడుముకు కాటన్ దారంతో గట్టిగా కట్టుకుంటారు. మహిళలు ఎక్కువ సేపు ఒకే వస్త్రాన్ని ధరించినప్పుడు నడుముపై రుద్దినట్టు అవుతుంటుంది. అక్కడ చర్మం దెబ్బతిని క్యాన్సర్ కు కారణం అవుతుంది అంటున్నారు నిపుణులు. సంప్రదాయంగా కట్టుకునే చీరల వల్ల కూడా క్యాన్సర్లు వస్తున్నాయి అని తెలిసి మహిళలు భయపడుతున్నారు. కానీ కాస్త జాగ్రత్త పడితే ఎలాంటి నష్టం ఉండదు అంటున్నారు నిపుణులు.

AP Telangana Weather: భానుడి ప్రతాపానికి అల్లాడిపోతున్న తెలుగు ప్రజలు, నేడు 130 మండలాల్లో వడగాల్పులు: IMD అలర్ట్

Heat Waves In AP And Telangana: తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భానుడి భగభగలతో ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. ఏపీ, తెలంగాణలో దాదాపు అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
కొన్ని జిల్లాల్లో 43 డిగ్రీల గరిష్ణ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, వడగాలులకు వయసు మీద పడిన వారు తట్టుకోలేకపోతున్నారు. ఏపీలో గురువారం (ఏప్రిల్ 4న) 130 మండలాల్లో వడగాల్పులు వీచనున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

బుధవారం నాడు (ఏప్రిల్ 3న) వైయస్సార్ కడప జిల్లా ఒంటిమిట్టలో అత్యధికంగా 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అనంతపురం జిల్లా తెరన్నపల్లి, ప్రకాశం జిల్లా దరిమడుగు, నంద్యాల జిల్లా బ్రాహ్మణకొట్కూరులో 43.3 డిగ్రీలు, కర్నూలు జిల్లా లద్దగిరిలో 43.2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారుు వెల్లడించారు. కడప జిల్లా వీరాపునాయుని మండలంలో తీవ్రవడగాల్పులు, 59 మండలాల్లో వడగాల్పులు వీచాయని.. ప్రజలు మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య అత్యవసరమైతే తప్పా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు.
తెలంగాణలోనూ సుర్రుముంటున్న సూరీడు..
తెలంగాణలోనూ భానుడి ప్రతాపం చూపుతున్నాడు. పలు జిల్లాల్లో 40కి పైగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. పలు జిల్లాల్లో 43 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిర్మల్ జిల్లా నర్సాపూర్లో అత్యధికంగా 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కరీంనగర్, వరంగల్, ములుగు జిల్లాలో పలు చోట్ల 42, 43 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు ఉన్నాయి. ప్రజలు అత్యవసరమైతేనే ఎండ అధికంగా ఉన్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది. క్యాప్ ధరించి ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలని, నీళ్లు అధికంగా తీసుకోవాలని జాగ్రత్తలు చెప్పింది. గ్రేటర్ హైదరాబాద్ (GHMC) పరిధిలో 42 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చందానగర్, ఖైరతాబాద్, మూసాపేట ప్రాంతాల్లో 41, 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో పాటు వడగాల్పుల ప్రభావంతో నగరవాసులు ఎండలకు అల్లాడిపోతున్నారు.

గురువారం 130 మండలాల్లో వడగాల్పులు
ఏప్రిల్ 4న పార్వతీపురంమన్యం జిల్లా కొమరాడలో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉంది. అలాగే 130 మండలాల్లో వడగాల్పులు, ఏప్రిల్ 5వ తేదీన 5 మండలాల్లో తీవ్ర, 253 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.

ఏప్రిల్ 4న వడగాల్పులు వీచే మండలాలు 130 మండలాలు ఇవే
శ్రీకాకుళం జిల్లాలో 4 మండలాలు, విజయనగరం జిల్లాలో 19, పార్వతీపురంమన్యం జిల్లాలో 12, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 4 మండలాలు, అనకాపల్లి జిల్లాలో 13, కాకినాడ జిల్లాలో 9, తూర్పు గోదావరి జిల్లాలో 3 మండలాలు, కృష్ణా జిల్లాలో ఒక్క మండలం, ఎన్టీఆర్ జిల్లాలో 14 మండలాలు, గుంటూరు జిల్లాలో 5, పల్నాడు జిల్లాలో 6, నంద్యాల జిల్లాలో 19 మండలాలు, వైఎస్సార్ జిల్లాలో 20 మండలాల్లో, అనంతపురం జిల్లాలో ఒక్క మండంలో గురువారం నాడు వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఈ ప్రాంతాల ప్రజలు ఎండల నుంచి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

వేసవిలో ప్రజలు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
ప్రజలు వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలని వాతావరణ కేంద్రం అధికారులు సూచించారు. ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్), ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు లాంటివి తాగాలని ఏపీ విపత్తుల సంస్థ ఎండి కూర్మనాథ్ సూచించారు.

నిర్లక్ష్యపు డాక్టర్లకు ఐదేళ్ల జైలు శిక్ష.. కొత్త చట్టానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

నిర్లక్ష్య వైద్యంతో రోగి మరణానికి కారణమైతే సదరు డాక్టర్‌కు ఇక నుంచి ఐదేళ్లు జైలు శిక్షను విధించనున్నారు. ప్రస్తుతం ఉన్న రెండేళ్ల కాలాన్ని పెంచుతూ కొత్త చట్టాలను రూపొందించారు.
ఈ మేరకు వైద్యులకు అవగాహన కల్పించాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్​హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ అతుల్ గోయల్ అన్ని రాష్ట్రాల సీఎస్, హెల్త్ సెక్రటరీలకు లేఖ రాశారు. ప్రస్తుతం నిర్లక్ష్యంగా వైద్యం చేసి రోగి ప్రాణాలు తీసే వైద్య సిబ్బందికి ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం జైలు శిక్ష లేదా జరిమానా విధించే అవకాశం ఉన్నది.

కానీ దేశవ్యాప్తంగా ఈ ఏడాది జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్న నూతన న్యాయ చట్టం ప్రకారం కచ్చితంగా జైలు శిక్ష పడే అవకాశం ఉన్నదని కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. అంతేగాక గరిష్ఠంగా ఐదేండ్ల శిక్ష పడేలా చట్ట సవరణ జరిగిందని గుర్తు చేసింది. డాక్టర్‌ అయితే ఐదేండ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తారని, ఆర్‌ఎంపీ అయితే (రిజిస్టర్డ్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్‌) రెండేండ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉన్నదని కేంద్రం పేర్కొన్నది. ప్రస్తుతం దేశంలో ‘ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ 1860’ అమల్లో ఉండగా, దీని స్థానంలో కేంద్ర ప్రభుత్వం భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత, భారతీయ సక్ష్య అభియాన్‌ పేరుతో మూడు కొత్త చట్టాలు అమల్లోకి రానున్నాయి.

Ugadi festival: క్రోధి నామ సంవత్సరం అంటే ఏంటి? ఈ ఏడాది ఎలా ఉంటుంది?

Ugadi festival: 2024 సంవత్సరంలో ఏప్రిల్‌ 9వ తేదీన చైత్రమాస శుక్ల పక్ష పాడ్యమి మంగళవారం ఉగాది పండుగ జరుపుకోనున్నారు. ఈ సంవత్సరం క్రోధి నామ సంవత్సరం.
శ్రీ క్రోధి నామ సంవత్సరం కలియుగం ప్రారంభమై 5,125వ సంవత్సరం.

శ్రీ క్రోధినామ సంవత్సరం అంటే క్రోధమును కలిగించేదని పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ప్రజలు కోపము, ఆవేశముతో వ్యవహరించెదరని చిలకమర్తి తెలిపారు. కుటుంబసభ్యుల మధ్య క్రోధములు వంటివి కలగటం, దేశంలో రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయములు, క్రోధములు కలగడం, దేశాల మధ్య కోపావేశాలు, యుద్ధ వాతావరణం వంటివి కలగడం వంటి సూచనలు అధికముగా ఉన్నాయని చిలకమర్తి తెలిపారు.

ఉగాది అంటే ఏంటి?

“ఉగ” అంటే నక్షత్ర గమనం లేదా జన్మ, ఆయుష్షు అని అర్ధాలు కూడా ఉన్నాయి. వీటికి ఆది ఉగాది. అంటే ప్రపంచంలోని జనుల ఆయుష్షుకు మొదటిరోజు ఉగాది. ఉగస్య ఆది అనేదే ఉగాది. ఇంకొక విధంగా చెప్పాలంటే ‘యుగం’ అనగా రెండు లేక జంట అని కూడ అర్ధం. ఉత్తరాయణ, దక్షిణాయణాల ద్వయ సంయుతం యుగం (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది ఉగాది అయిందని చిలకమర్తి తెలిపారు. అదే సంవత్సరాది ఉగాది – వసంతాలకు గల అవినాభావ సంబంధం, సూర్యునికి సకల రుతువులకు ప్రాతః సాయం కాలాది త్రికాలములకు ఉషా దేవతయే మాతృ స్వరూపం.

భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడు అంటే ఉగాది రోజున సృష్టి జరిగినట్లు పురాణాలు చెప్తున్నాయని చిలకమర్తి తెలియచేశారు. వేదాలను హరించిన సోమకుని వధించి మత్స్యావతారధారియైన విష్ణువు వేదాలను బ్రహ్మ కప్పగించిన శుభతరుణ పురస్కారంగా విష్ణువు ప్రీత్యర్ధం “ఉగాది” ఆచరణలోకి వచ్చెనని పురాణ ప్రతీతి. చైత్ర శుక్ల పాడ్యమినాడు విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు. కనుక సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరుపుకుంటారని చిలకమర్తి తెలిపారు.

శాలివాహన చక్రవర్తి చైత్ర శుక్ల పాడ్యమి నాడే పట్టాభిషిక్తుడై తన శౌర్య పరాక్రమాలతో శాలివాహన యుగకర్తగా భాసిల్లిన కారణాన ఆ యోధాగ్రణి స్మృత్యర్థం ఉగాది ఆచరిస్తారని చారిత్రక వృత్తాంతం.

శిశిరరుతువు ఆకురాలు కాలం. శిశిరం తరువాత వసంతం వస్తుంది. చెట్లు చిగుర్చి ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది. కోయిలలు కుహూ కుహూ అని పాడతాయి. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది. అందుకే ఇది తెలుగు వారి మొదటి పండుగ. ఉగాది రోజున పనులు ప్రారంభించుట పరిపాటి. ఆ రోజున ప్రాతఃకాలమున లేచి ఇళ్లు, వాకిళ్లు శుభ్రపరచుకుంటారు. ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు అలంకరిస్తారు. తలంటు స్నానంచేసి, కొత్తబట్టలు ధరించి, ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. “ఉగాది పచ్చడి” ఈ పండుగకు ప్రత్యేకమైంది.

ఉగాది పచ్చడి విశిష్టత

షడ్రుచుల సమ్మేళనం – తీపి (మధురం), పులుపు (ఆమ్లం), ఉప్పు (లవణం), కారం (కటు), చేదు (తిక్త), వగరు (కషాయం) అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను ఒకే విధంగా స్వీకరించాలన్న సూచిస్తూ ఉగాది పచ్చడి తప్పనిసరిగా తీసుకుంటారు. ఈ పచ్చడి కొరకు చెరకు, అరటిపళ్ళు, మామిడికాయలు, వేపపువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలైనవి వాడుతుంటారు. ఈ రోజున వేపపువ్వు పచ్చడి, పంచాంగ శ్రవణం, మిత్రదర్శనము, ఆర్య పూజనము, గోపూజ, ఏరువాక అనే ఆచారాలు పాటిస్తారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

BRS ఢమాల్.. ఇండియా టీవీ ప్రీ-పోల్ సర్వేలో సంచలన విషయాలు..

తెలంగాణలో బీఆర్ఎస్ గ్రాఫ్ రోజురోజుకూ పడిపోతున్నది. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లకే పరిమితం కానున్నట్లు ఇండియా టీవీ ప్రీ-పోల్ సర్వేలో వెల్లడైంది.
గత ఎన్నికల్లో తొమ్మిది స్థానాల్లో ఉన్న బీఆర్ఎస్ ఈసారి ఒక్క చోట కూడా గెలవదంటూ బీజేపీ, కాంగ్రెస్ చేస్తున్న విమర్శలు ఎలా ఉన్నా రెండు స్థానాలకు మించి సాధ్యం కాదని ఆ సర్వేలో వెల్లడైంది. కాంగ్రెస్ మాత్రం గత ఎన్నికల్లో మూడు స్థానాల్లో గెలుపొందగా ఈసారి అది మూడు రెట్లు పెరిగి తొమ్మిదికి చేరుకుంటుందని తేలింది. బీజేపీ మాత్రం గతంలో నాలుగు స్థానాల్లో గెలవగా ఈసారి మరో స్థానంలో గెల్చుకుని ఐదుకు పరిమితమవుతుందని, మజ్లిస్ యథావిధిగా ఒక్క స్థానంలో గెలుస్తుందని బుధవారం వెల్లడించిన ప్రీ-పోల్ ఫలితాల్లో పేర్కొన్నది. గత నెల 1-30 తేదీల మధ్యలో నిర్వహించిన సర్వేలో ఈ వివరాలు తేలినట్లు పేర్కొన్నది.

అసెంబ్లీ ఫలితాలే రిపీట్

కనీసంగా పన్నెండు స్థానాల్లో గెలుస్తామని, కానీ 14 చోట్ల గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కాంగ్రెస్ ధీమాతో ఉన్నది. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులంతా 14 సీట్లలో గెలుపు ఖాయమని ఇటీవల వ్యాఖ్యానించారు. బీజేపీ మాత్రం గతం కంటే సీట్లు రెట్టింపు దాటి డబుల్ డిజిట్ సాధిస్తామని, మోడీ ఇమేజ్ ఈసారి తెలంగాణలో ఊహకు అందని తీరులో ఫలితాలను ఇస్తుందని పేర్కొన్నది. బీఆర్ఎస్ నిర్దిష్టంగా గెలిచే సీట్ల సంఖ్యను చెప్పకపోయినా గతంలో గెలిచినవాటికి కొంచెం అటూ ఇటుగా ఉంటామనే నమ్మకాన్ని వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన అధ్యయనంలో భాగంగా తెలంగాణలోని ఫలితాలను కూడా వెల్లడించింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్… లోక్‌సభ ఎన్నికల్లోనూ ఫ్రంట్ రన్నర్‌గానే నిలవనున్నది.

స్వల్పంగా మెరుగుపడనున్న బీజేపీ

కాంగ్రెస్ పార్టీ ఇంకా మూడు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయకపోయినా ఆ పార్టీకి తొమ్మిది సీట్లు దక్కుతాయని ప్రజల అభిప్రాయం ప్రీ-పోల్ సర్వే రూపంలో వెల్లడైంది. అభ్యర్థులను ప్రకటించిన తర్వాత, ఆ పార్టీలు మేనిఫెస్టోలను విడుదల చేసిన తర్వాత, ప్రచారం హోరెత్తిన అనంతరం పార్టీల బలాబలాల్లో, ప్రజల అభిప్రాయంలో ఎలాంటి తేడాలు చోటుచేసుకుంటాయనేది రానున్న రోజుల్లో వెల్లడికానున్నది. ఐదేండ్ల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే బీజేపీ స్వల్పంగా మెరుగుపడినట్లు ఈ స్టడీలో తేలింది. కానీ కాంగ్రెస్ మాత్రం అనూహ్యంగా అతి ఎక్కువ సీట్లు సాధించే పార్టీగా ఆవిర్భవించనున్నది. బీఆర్ఎస్ మాత్రం పదేండ్లు అధికారంలో ఉన్నా ఈసారి రెండు స్థానాలకు మాత్రమే పరిమితం అనేది తేలింది.

భిన్నంగా క్షేత్రస్థాయి పరిస్థితులు

తెలంగాణ హక్కులను పార్లమెంటులో ప్రస్తావించేది, కేంద్రం మెడలు వంచి సాధించేది తమ పార్టీ అని గొప్పగా చెప్పుకుంటున్నా క్షేత్రస్థాయి పరిస్థితులు, ప్రజల అభిప్రాయం మాత్రం అందుకు భిన్నంగా ఉన్నది. డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ బీజేపీ గొంతు చించుకుంటున్నా గతంకంటే ఒక్కటి మాత్రమే ఎక్కువ వచ్చే అవకాశమున్నట్లు స్పష్టమైంది.

అమరావతి రైతులకు శుభవార్త.. వైసీపీ 3 రాజధానులు గోవిందా!

మూడు రాజధానులకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజధాని అమరావతి పరిధిలోని మందడం గ్రామంలో మూడు రాజధానుల శిబిరాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
అందులో పాల్గొనే రైతులంతా తమ శిబిరాన్ని ఎత్తేసి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ నేత నారా లోకేష్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. నాలుగు సంవత్సరాలుగా వైసీపీ బహుజన పరిరక్షణ సమితి అనుబంధ విభాగం నేతల ఆధ్వర్యంలో మందడం సీడ్ యాక్సెస్ రోడ్డువద్ద మూడు రాజధానుల శిబిరాన్ని నిర్వహిస్తున్నారు.

వైసీపీ ప్రభుత్వం నాలుగు సంవత్సరాలుగా చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తూ తమను నమ్మించి మోసం చేసిందని వారంతా విమర్శించారు. రాష్ట్రాభివృద్ధి, అభివృద్ధి వికేంద్రీకరణ తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బహుజనులను ఏకం చేసి టీడీపీ గెలుపునకు కృషిచేస్తామన్నారు. వైసీపీ ఎన్టీఆర్ జిల్లా డాక్టర్ సెల్ మాజీ అధ్యక్షుడు సంకే విశ్వనాథ్, యునైటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు అప్పికట్ల జవహర్ తోపాటు పలువురు నాయకులు టీడీపీ కండువా కప్పుకున్నారు.

2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల తర్వాత తాము అభివృద్ధిని వికేంద్రీకరిస్తున్నామంటూ మూడు రాజధానులను ప్రకటించింది. విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా నిర్ణయించింది. దీనిపై అమరావతి రైతులు మండిపడుతూ 29 గ్రామాల పరిధిలో దీక్షా శిబిరాలను ఏర్పాటు చేశారు. ఈ శిబిరాలకు పోటీగా మందడంలో వైసీపీ ఆధ్వర్యంలో మూడు రాజధానుల శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దాన్ని ఎత్తేశారు.

Director Sukumar: సమంతతో లిప్ లాక్.. సినిమా తీసినంత కాలం తననే ఎంచుకుంటా!: డైరెక్టర్ సుకుమార్

Director Sukumar crazy Comments on samantha: ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్న దర్శకుల్లో లెక్కల మాస్టర్ సుకుమార్ ఒకరు. జీనియస్ డైరెక్టర్​గా ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈయన తన కెరీర్​లో స్క్రీన్​ప్లే రైటర్​గా, దర్శకుడిగా, నిర్మాతగా దుసుకుపోతున్నాడు. ఇప్పటి వరకు అతడు తెరకెక్కించిన సినిమాలన్నీ సూపర్ హిట్ కావడం గమనార్హం. అంతేకాకుండా పలు బ్లాక్ బస్టర్ చిత్రాలతో తన కెరీర్​గ్రాఫ్​ను అమాంతగా పెంచుకున్నాడు.

ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో పుష్ప మూవీ చేసి మరింత పేరు సంపాదించుకున్నాడు. ఇండియా వైడ్​గానే కాకుండా వరల్డ్ వైడ్‌కు కూడా తనేంటో, తన క్రియేటివి ఏంటో అందరికీ తెలిసింది. అయితే ఆయన తన జర్నీలో ఎంతో మంది హీరోలను, హీరోయిన్లను చూశారు. కానీ ఆయన తాజాగా ఓ స్టార్ హీరోయిన్‌పై ప్రశంసలు కురిపించాడు. అయితే ఆమె మరెవరో కాదండీ.. హీరోయిన్ సమంత. ప్రస్తుతం సుకుమార్.. సమంతపై చేసిన కొన్ని కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

దర్శకుడు సుకుమార్.. అల్లు అర్జున్‌తో పుష్ప మూవీ ముందు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో రంగస్థలం మూవీ చేసిన విషయం తెలిసిందే. రంగస్థలం అనగానే అందరికీ గుర్తుచ్చేది చిట్టిబాబు. ఈ మూవీకి ప్రేక్షకాభిమానులు ఎంతలా కనెక్ట్ అయిపోయారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో చరణ్ యాక్టింగ్‌కు సలామ్ కొట్టాల్సిందే.

Also Read: విజయ్ చివరి మూవీ రెమ్యూనరేషన్‌తో మరో బాహుబలి తీయొచ్చు.. ఎన్ని కోట్లో తెలుసా..?

అలాగే సమంత లుక్స్, నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతేకాకుండా ఇతర నటీ నటులు కూడా ఈ చిత్రానికి ప్రాణం పోశారు. ఎన్నో రికార్డులను సైతం ఈ మూవీ తిరగరాసింది. ఇందులో చెవిటి చిట్టిబాబుగా చరణ్‌కి, పల్లెటూరి రామలక్ష్మిగా సమంతకు అద్భుతమైన పేరు వచ్చింది. ఈ చిత్రంతో నటులుగా వీరు మరో స్థాయికి ఎదిగానడంలో సందేహమే లేదు.

అయితే ఇప్పుడు ఈ మూవీ గురించి, ఇందులో సమంత పాత్ర గురించి దర్శకుడు సుకుమార్ తెలిపాడు. ఇందులో హీరోయిన్‌గా మొదట సమంతను కాదనుకున్నారట. అందుకు సంబంధించిన విషయాలను సుకుమార్ అప్పట్లో కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పారు. షూటింగ్ టైంలో సమంత నటన చూసి తాను ఆశ్చర్యపోయినట్లు తాజాగా గుర్తుచేసుకున్నారు.

రంగస్థలం మూవీలో రామ్ చరణ్‌ని తప్ప ఇంకెవరినీ అస్సలు ఊహించుకోలేము. తొలుత ఈ సినిమాలో సమంతను హీరోయిన్​గా తీసుకోవాలనుకోలేదు. కొత్త అమ్మాయి అయితే బాగుంటుందని అనుకున్నాను. ఎందుకంటే ఇద్దరు స్టార్‌లను మేనేజ్ చేయలేనేమో అని అనిపించింది. అందువల్లనే సమంతను మొదట్లో కాదనుకున్నాను.
కానీ పల్లెటూరి అమ్మాయి పాత్రకు సమంత అయితేనే బాగుంటుందని అనుకున్నాను. అందువల్లనే ఆమెను సెలెక్ట్ చేశాను. అయితే షూటింగ్ సమయంలో సమంత నటన చూసి ఎంతో ఆశ్చర్యపోయాను. అనుకున్నదానికంటే ఆమె నటన మరింత స్థాయిలో ఉండటం చూసి ఎంతో ఆనందించాను. అంతేకాకుండా ఆ సినిమాలో సమంతతో లిప్‌లాక్ సీన్ కూడా కథకు ప్రాధాన్యత ఇస్తుందనే పెట్టాను అని అన్నాడు.

ఆమె నటనతో తాను మంత్రముగ్దుడిన అయ్యానని.. తాను సినిమాలు తీసినంతకాలం సమంతను ఎంచుకుంటూనే ఉంటానని అన్నాడు. ఆమెకు ఎంత వయస్సు పెరిగినా.. ఆ వయస్సుకు తగ్గ పాత్రను ఇస్తానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సుకుమార్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి. కాగా ప్రస్తుతం సుకుమార్ పుష్ప 2 మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

EC Big Shock To Janasena : గ్లాస్ పగిలింది.. జనసేనకు ఈసీ బిగ్ షాక్!

xr:d:DAGBV-H06Zc:10,j:4238310963308968729,t:24040313

EC Big Shock To Janasena : రాష్ట్రంలో వేసవి వేడితో పాటు ఎన్నికల వేడి కూడా సెగ పుట్టిస్తోంది. అన్ని పార్టీలు కూడా గెలుపే లక్ష్యంగా సిద్ధం అంటే సిద్ధం అంటున్నాయి. ప్రచారాలను పోటాపోటీగా నిర్వహిస్తున్నాయి. మరి కొద్ది రోజుల్లోనే ఎన్నికలు కూడా జరగనున్నాయి. అయితే ఈ నేపథ్యంలో జనసేనకు ఎన్నికల కమిషన్ బిగ్ షాక్ ఇచ్చింది. జనసేన గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్‌గా గుర్తించింది. ఈ క్రమంలో ఎన్నికల్ కమిషన్ గుర్తింపు పొందిన, గుర్తింపు లేని జాతీయ, ప్రాంతీయ పార్టీల జాబితాను విడుదల చేసింది.
ఎన్నికల కమిషన్ విడుదల చేసి గుర్తింపు జాబితాలో రాష్ట్రం నుంచి వైసీపీ, టీడీపీలు ఉన్నాయి. వైసీపీకి ఫ్యాన్ గుర్తు, టీడీపీకి సైకిల్ గుర్తు కేటాయించింది. ఇదే సమయంలో జనసేనను మాత్రం ప్రాంతీయ పార్టీగా గుర్తించలేదు. కేవలం రిజిష్టర్ పార్టీగానే గుర్తించింది. అందువల్లనే గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్‌గా గుర్తించింది. అయితే జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తును ఇప్పటికే ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. జనాల్లో కూడా ఈ గుర్తు బాగా పాపులర్ అయ్యింది. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా పవన్ కల్యాణ్ గుర్తును ప్రమోట్ చేసుకున్నారు.

ఓ దేవాలయం వద్ద ఉత్సవం జరుగుతుండగా అక్కడ రౌడీలు విధ్వంసం చేస్తుండగా అక్కడికి వచ్చి రౌడీలను చితకబాదుతారు పవన్ కల్యాణ్. ఈ నేపథ్యంలో ఓ విలన్ గాజు గ్లాసు చూపిస్తూ.. నీ రేంజ్ ఇదీ అంటూ పోలీస్ స్టేషన్‍లో దాన్ని పగులకొడతాడు. అప్పుడు వెంటనే భగత్ సింగ్.. గాజు పగిలేకొద్దీ పదునెక్కుద్ది. అని పవర్ ఫుల్ డైలాగ్ చెబుతారు పవన్ కల్యాణ్. 2019 ఎన్నికల్లో ఓటమి ఎదురైనా.. ఇప్పుడు తాము మరింత పదునెక్కామని చెప్పేలా ఈ డైలాగ్ అనిపిస్తోందని జనాల నుంచి టాక్ వినిపిస్తోంది.
ఇదంతా పక్కనబెడితే ఈసీగా తాజాగా గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్‌గా ప్రకటించడంతో జనసేన నేతల్లో కొత్త టెన్షన్ మొదలైంది. ఎన్నికల సమీపిస్తున్న వేళ గుర్తును మారిస్తే జనాల్లో కన్ఫ్యూజన్ మొదలవుతుందని పార్టీ క్యాడర్ కంగారు పడుతోంది. మరి ఎన్నికల సంఘం నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. అధిష్టానం ఈ అంశంపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు సమచారం.

Mercedes Benz: ఒకేసారి 3 బెంజ్ కార్లు కొన్న బార్బర్.. ఖరీదు కోట్లలో.. ఎవరంటే..

ఒకప్పుడు కారంటే విలాసవంతమైన వస్తువుల జాబితాలో ఉండేది. మరి ఇప్పుడో.. కనీస అవసరంగా మారింది. మన దేశంలో కార్లకు డిమాండ్ పెరగడంతో.. ధరలు కూడా అందుబాటులోకి వచ్చాయి. లగ్జరీ కార్లు మినహా.. మిగతా అన్నింటి ధరలు అందుబాటులో ఉండటంతో.. మధ్యతరగతి వారు సైతం కారు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక సెలబ్రిటీలు అయితే మార్కెట్ లోకి వచ్చిన ప్రతి కొత్త మొడల్ లగ్జరీ కారు తమ గ్యారెజ్ లో ఉండాలని భావిస్తారు. చాలా మందికి కార్ల కొనగోలు హాబీగా ఉంటుంది.

అయితే ఓ సామాన్య బార్బర్ మాత్రం సెలబ్రిటీలకు పోటీ వస్తున్నాడు. ఇప్పటికే అతడి గ్యారేజ్ లో వందల సంఖ్యలో కార్లు ఉండగా.. తాజాగా ఒకేసారి ఏకంగా మూడు మెర్సిడెస్ బెంజ్ కార్లు కొనుగోలు చేసి టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాడు. ఇంతకు ఎవరా వ్యక్తి.. ఎందుకు ఇంత ఖరీదైన కార్లు కొన్నాడు అంటే..

రమేష్ బాబు అంటే జనాలకు పెద్దగా తెలియదు కానీ.. బెంగళూరుకు చెందిన బిలియనీర్ బార్బర్ రమేష్ బాబు అంటే చాలా మంది గుర్తు పడతారు. కొనేళ్ల క్రితం రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారు కొని వార్తల్లో నిలిచాడు. ఇక ఇప్పుడు ఏకంగా ఖరీదైన, లగ్జరీ మెర్సిడెస్ బెంజ్ కార్లు.. అది కూడా ఒకేసారి మూడు కొని వార్తల్లో నిలిచాడు. మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ సెడాన్‌లను తన గ్యారేజ్ లోకి తీసుకొచ్చాడు రమేష్ బాబు. ఒక్క కారు ధర 72.80 లక్షలుగా ఉంది. మూడు కార్లంటే 2.20 కోట్ల రూపాయల పైచిలుకు అన్నమాట.

రమేష్ బాబు గ్యారేజిలో రోల్స్ రాయిస్ మాత్రమే కాకుండా దాదాపు అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇందులో మెర్సిడెస్ బెంజ్ మేబ్యాక్ (రూ. 2.7 కోట్లు), బీఎండబ్ల్యూ 7 సిరీస్, మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్, ఈ క్లాస్, బీఎండబ్ల్యూ 5 సిరీస్, అనేక వోల్వో కార్లు, టయోటా క్యామ్రి, హోండా అకార్డ్, హోండా సీఆర్-వీ మొదలైనవి ఉన్నాయి.

ఎవరీ రమేష్ బాబు..
రమేష్ బాబు విషయానికి వస్తే.. పేద కుటుంబం నుంచి వచ్చాడు. ఓపూట తింటే.. మరో పూట తిండి లేని పరిస్థితుల నుంచి బిలయనీర్ గా ఎదిగాడు. తండ్రి బార్బర్ గా పని చేసేవాడు. అతడు రమేష్ కు ఏడేళ్ల వయసప్పుడు చనిపోయాడు. అప్పటి నుంచి రమేష్ తల్లికి చేదోడువాదోడుగా ఉంటూ.. సాయం చేసేవాడు. పదో తరగతితో చదువుకు గుడ్ బై చెప్పాడు.

తండ్రి నడిపిన బార్బర్ షాప్ ను తిరిగి ప్రారంభించి.. అనతి కాలంలో దానికి మంచి గుర్తింపు తీసుకువచ్చాడు. ఈ క్రమంలో ఒక్క కారుతో ట్రావెల్స్ వ్యాపారం ప్రారంభించాడు. అది లాభసాటిగా మారడంతో.. ప్రభుత్వ సాయంతో 2004లో రమేష్ టూర్స్ అండ్ ట్రావెల్స్‌ని లాంచ్‌ చేసి లగ్జరీ కార్ రెంటల్ అండ్‌ సెల్ఫ్ డ్రైవ్ వ్యాపారంలోకి ప్రవేశించాడు. ప్రస్తుతం అతడి వద్ద 300 మంది పని చేస్తున్నారు.

రమేష్‌ అన్ని కార్లను డ్రైవ్‌ చేయగలడు. అతని క్లయింట్ల జాబితాలో ఉన్నవారంతా సెలబ్రిటీలు, బిలియనీర్లే. బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌, సల్మాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్, అమీర్ ఖాన్ లాంటి వారితోపాటు, ప్రముఖ రాజకీయ నాయకులు ధనిక పారిశ్రామికవేత్తలు రమేష్ బాబు కస్టమర్లే. ఒక రోజుకు వసూలు చేసే అద్ద 50వేల రూపాయలకు పై మాటే. వ్యాపారం బాగా నడుస్తున్నప్పటికి అతడు తన వృత్తిని వదులుకోకపోవడం విశేషం. మెర్సిడెస్ లేదా రోల్స్ రాయిస్‌లోని తన దుకాణానికి వెళ్తాడు. 2 బిలియన్‌ డాలర్ల నెట్‌వర్త్‌తో ప్రపంచంలోనే రిచెస్ట్‌ బార్బర్‌గా ఫోర్బ్స్‌ గుర్తించింది.

AP Elections:ఆముదాలవలసలో ఆధిపత్యం ఎవరిది..?

ఉమ్మడి శ్రీకాకుళం (Srikakulam) జిల్లాలో 10 అసెంబ్లీ నియో జకవర్గాలు ఉండగా.. వీటిలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఏకైక నియోజకవర్గం ఆముదాలవలస. పొందూరు, సరుబుజ్జిలి, బూర్జ, ఆముదాలవలస మండలాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు 10 సార్లు ఎన్నికలు జరగ్గా.. ఐదుసార్లు టీడీపీ అభ్యర్థులు గెలిచారు. నాలుగు సార్లు కాంగ్రెస్, ఒకసారి వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు.
ఏపీలో ఎన్నికలకు వేళైంది. అభ్యర్థుల ప్రకటన పూర్తైంది. ఏప్రిల్ 18న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. అభ్యర్థుల ఎంపిక పూర్తికావడంతో గెలుపు కోసం పార్టీలు వ్యూహాలు సిద్ధం చేశాయి. అధికార వైసీపీ (YCP), ప్రతిపక్ష తెలుగుదేశం (Telugu Desam) కూటమి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఇప్పటికే ఎన్ని కల ప్రచారాన్ని ప్రారంభించారు. ఓటర్ల మనసు గెలుచుకునేం దుకు అభ్యర్థులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం (Srikakulam) జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. వీటిలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఏకైక నియోజకవర్గం ఆముదాలవలస. పొందూరు, సరుబుజ్జిలి, బూర్జ, ఆముదాలవలస మండలాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు 10 సార్లు ఎన్నికలు జరగ్గా.. ఐదుసార్లు టీడీపీ అభ్యర్థులు గెలిచారు. నాలుగు సార్లు కాంగ్రెస్, ఒకసారి వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ప్రస్తుతం టీడీపీ, వైసీపీ మధ్య ఈ నియోజకవర్గంలో పోటీ నెలకొంది. వైసీపీ తరపున సీనియర్ నాయకుడు, స్పీకర్ తమ్మినేని సీతారాం పోటీ చేస్తుండగా.. టీడీపీ తరపున మాజీ ప్రభుత్వ విప్ కూన రవికుమార్ పోటీ చేస్తున్నారు. దీంతో ఇక్కడ పోటీ రసవత్తరంగా మారింది.
తమ్మినేనికి పరీక్ష..

తమ్మినేని సీతారాం శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో తలపండిన వ్యక్తి. తెలుగుదేశం పార్టీతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన సుదీర్ఘకాలం ఆ పార్టీలో పనిచేశారు. 1983 నుంచి 2019 వరకు 9సార్లు ఈ నియోజకవర్గంలో ఎన్నికలు జరిగితే తమ్మినేని సీతారాం అన్ని ఎన్నికల్లో పోటీ చేశారు. ఇదే నియోజకవర్గం నుంచి పదో సారి పోటీ చేస్తున్నారు. తొమ్మిది సార్లు పోటీ చేయగా.. ఐదు సార్లు గెలుపొందారు. మూడు సార్లు తెలుగుదేశం పార్టీ తరపున గెలవగా.. ఓసారి ఇండిపెండెంట్‌గా, మరోసారి వైసీపీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో 2009లో తెలుగుదేశం పార్టీ వీడి ప్రజారాజ్యం పార్టీలో చేరి ఆముదాలవలస నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోగా.. 2019లో అదే నియోజకవర్గం నుంచి వైసీపీ నుంచి గెలిచారు. సుదీర్ఘకాలం ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గం ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదు. గత ఐదేళ్ల కాలంలో నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని నియోజకవర్గం ప్రజలు చెబుతున్న మాట. వైసీపీపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో వ్యతిరేకత ఉంటే.. ఆముదాలవలస నియోజకవర్గంలో తమ్మినేని సీతారాంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. 2019లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. ఐదేళ్ల కాలంలో ప్రజలను పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. గ్రామాల్లో రహదారులు అధ్వానంగా ఉన్నా.. మరమ్మతులు చేయించలేకపోయారు. ఈ నియోజకవర్గంలో ఇప్పటికీ బహిరంగ మూత్ర విసర్జన చేస్తున్న గ్రామాలు ఉన్నాయి. ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఇంటింటికి కుళాయి ద్వారా నీళ్లు ఇస్తామన్న పథకం పూర్తిస్థాయిలో అమలుకాలేదు.
కమీషన్లకే ప్రాధాన్యత..

తమ్మినేని సీతారాం గత ఐదేళ్ల కాలంలో తన నియోజకవర్గం పరిధిలో ప్రతి పనికి కమీషన్లు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా శ్రీకాకుళం నగరానికి ఈ నియోజకవర్గం సమీపంలో ఉంటుంది. దీంతో చెన్నై, కోల్‌కతా సమీపంలోని భూముల్లో లేఅవుట్ల విషయంలో భారీగా పర్సంటేజీలు వసూలు చేశారనే ఆరోపణలు తమ్మినేనిపై ఉన్నాయి. ఈ విషయంలో తమ్మినేని సీతారాం భార్య కీలకంగా వ్యవహరించారనే ప్రచారం జరగుతోంది. ఏ పని కావాలని వెళ్లినా కమీషన్లు తీసుకునేవారనేది తమ్మినేని సీతారాం కుటుంబంపై ఉన్న ప్రధాన ఆరోపణ. దీంతో ఈసారి నియోజకవర్గంలో ఆయన గెలవడం అసాధ్యమనే ప్రచారం జరుగుతోంది. సొంత సామాజిక వర్గం ప్రజలే ఆయనపై వ్యతిరేకతతో ఉన్నట్లు తెలుస్తోంది.

కూన రవికుమార్‌కే ఛాన్స్..!

కూన రవికుమార్ తమ్మినేని సీతారాంకు స్వయాన మేనల్లుడు. అయినప్పటికీ రాజకీయంగా వీరిద్దరూ వేర్వేరు పార్టీల్లో ఉన్నారు. 2009లో కూన రవికుమార్‌కు టీడీపీ టికెట్ ఇవ్వడంతో తమ్మినేని పార్టీ వీడారు. 2009 నుంచి 2019 వరకు 3 సార్లు కూన రవి కుమార్ ఆముదాలవలస నుంచి పోటీచేసి ఒకసారి గెలుపొందారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటూ వచ్చారని ఇక్కడి ప్రజల నోట వినిపించే మాట. నియోజకవర్గం అభివృద్ధికి తనవంతు కృషి చేశారు. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటూ.. వారి సమస్యల తరపున పోరాటం చేసిన నాయకుడు కూన రవికుమార్. ప్రభుత్వాన్ని అన్ని విషయాల్లో ప్రశ్నిస్తున్నారనే ఉద్దేశంతో.. ఆయనపై తమ్మినేని సీతారాం ప్రోద్భలంతో అక్రమ కేసులు బనాయించారనే ఆరోపణలుు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా కూన రవి పోటీచేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే తమ్మినేనిపై ఉన్న వ్యతిరేకత రవికుమార్‌కు కలిసొచ్చే అంశం. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఆముదాలవలసతో కూన రవి కుమార్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. ఇదే ట్రెండ్ ఎన్నికల పోలింగ్ వరకు కొనసాగితే కూన రవికుమార్ భారీ మెజార్టీతో గెలిచే అవకాశాలున్నట్ల తెలుస్తోంది. అసలు ఫలితం జూన్4న తెలియనుంది.

ఏపీలో తీవ్ర వడగాలులు వీచే అవకాశం.. ఈ ప్రాంతాల వారు జాగ్రత్తలు తీసుకోండి

ఏపీలో వడగాలులు వీచే అవకాశం ఉంది. గురువారం పార్వతీపురంమన్యం జిల్లా కొమరాడలో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉంది. ఏపీలో 130 మండలాల్లో వడగాలులు, ఎల్లుండి 5 మండలాల్లో తీవ్ర, 253 మండలాల్లో వడగాలు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

రేపు వడగాల్పులు వీచే మండలాలు(130): శ్రీకాకుళంలో 4 , విజయనగరం 19, పార్వతీపురంమన్యం 12, అల్లూరిసీతారామరాజు 4, అనకాపల్లి 13, కాకినాడ 9, తూర్పుగోదావరి 3, కృష్ణా1, ఎన్టీఆర్ 14, గుంటూరు 5, పల్నాడు6, నంద్యాల 19, అనంతపురం 1, వైఎస్సార్ 20.

బుధవారం వైయస్సార్ కడప జిల్లా ఒంటిమిట్టలో43.4 డిగ్రీలు, అనంతపురం జిల్లా తెరన్నపల్లి, ప్రకాశం జిల్లా దరిమడుగు, నంద్యాల జిల్లా బ్రాహ్మణకొట్కూరులో 43.3 డిగ్రీలు, కర్నూలు జిల్లా లద్దగిరిలో 43.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. అలాగే కడపజిల్లా వీరాపునాయుని మండలంలో తీవ్రవడగాల్పులు, 59 మండలాల్లో వడగాలులు వీచాయన్నారు.

ప్రజలు వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలి. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి. డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ఓఆర్ఎస్ (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్), ఇంట్లో తయారుచేసిన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి తాగాలని విపత్తుల సంస్థ ఎండి కూర్మనాథ్ సూచించారు.

ఎండ వేడికి గుండె జాగ్రత్త! అధిక ఉష్ణోగ్రత ప్రభావమూ తక్కువేమీ కాదు.

ఎండ వేడికి గుండె జాగ్రత్త!
గుండెజబ్బు ముప్పు కారకాలనగానే అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌, అధిక బరువు వంటివే గుర్తుకొస్తాయి. అధిక ఉష్ణోగ్రత ప్రభావమూ తక్కువేమీ కాదు.
గుండెజబ్బు ముప్పు కారకాలనగానే అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌, అధిక బరువు వంటివే గుర్తుకొస్తాయి. అధిక ఉష్ణోగ్రత ప్రభావమూ తక్కువేమీ కాదు. ఇది రోగనిరోధక వ్యవస్థకు చేటు చేస్తుందని.. ఫలితంగా వాపు ప్రక్రియ పెరిగి, గుండెరక్తనాళాల ఆరోగ్యం దెబ్బతింటుందని తాజా అధ్యయన ఫలితాలు చెబుతున్నాయి.

వేసవిలో అధిక వేడి మూలంగా వడదెబ్బ, నిస్త్రాణ, పిక్కలు పట్టే యటం, తలనొప్పి, చర్మం కమలటం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. అôతే ఇవే కాదు.. ఇతరత్రా సమస్యల ముప్పూ పొంచి ఉంటుంది. ఉదాహరణకు- గుండెజబ్బులు. అప్పటికే గుండె జబ్బులతో బాధపడుతుంటే తీవ్రమవుతాయి కూడా. ఇంతకీ వేడికీ గుండెకూ ఏంటీ సంబంధం? వాపు ప్రక్రియే. గుండెజబ్బుల విషయంలో అధిక వేడిని అంతగా పట్టించుకోరు గానీ ఇదీ ముఖ్యమైన ముప్పు కారకమేనని అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్‌ డేనియల్‌ డబ్ల్యూ. రిగ్స్‌ చెబుతున్నారు. వేసవిలో ఎండ ప్రభావానికి గురైనవారి రక్తంలో వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్‌) సూచికల మోతాదులు పెరుగుతున్నాయని వివరిస్తున్నారు. అలాగే ఇన్‌ఫెక్షన్లతో పోరాడే బి కణాల సంఖ్య తగ్గటమూ గమనార్హం. రోగనిరోధక వ్యవస్థ సామర్థ్యాలూ తగ్గుతున్నాయనటానికి ఇది నిదర్శనం. ఇన్‌ఫెక్షన్లు, గాలి ద్వారా వ్యాపించే జబ్బుల వ్యాప్తికి ఉష్ణోగ్రత, తేమ దోహదం చేస్తాయి. అంటే అధిక ఉష్ణోగ్రత ప్రభావంతో ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశమే కాకుండా వాపు ప్రక్రియతో ముడిపడిన గుండె జబ్బుల వంటి సమస్యల ముప్పూ పెరుగుతుందన్నమాట.

Germany: గిఫ్ట్‌గా 20,000 ఏనుగులను పంపమంటారా: జర్మనీని హెచ్చరించిన బోట్సువానా

జర్మనీ (Germany) ముచ్చటపడితే 20,000 ఏనుగులను గిఫ్ట్‌గా ఇస్తామని బోట్సువానా (Botswana) అధ్యక్షుడు మసిసి హెచ్చరించారు. ఈ ఏడాది ప్రారంభంలో జర్మనీ పర్యావరణ మంత్రిత్వ శాఖ హంటింగ్‌ ట్రోఫీలపై కఠిన ఆంక్షలు విధించే అంశాన్ని ప్రతిపాదించింది. వన్యప్రాణుల వేటను తగ్గించడానికి ఈ చర్య చేపట్టింది. దీనిపై బోట్సువానా అధ్యక్షుడు మండిపడ్డారు. ఆ చర్య తమ దేశాన్ని మరింత పేదరికంలోకి నెడుతుందన్నారు. అంతేకాదు.. తమ దేశంలో ఏనుగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడానికి కారణమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వాటి సంతతిని అదుపులో ఉంచడానికి వేట తప్పనిసరి అని మసిసి పేర్కొన్నారు. అవి జనావాసాలపైకి వచ్చి పంటలను ధ్వంసం చేయడం, ఇళ్లను కూల్చివేయడం చేస్తున్నాయని తెలిపారు. ‘‘బోట్సువానా సమస్యల గురించి బెర్లిన్‌లో కూర్చొని చెప్పడం చాలా తేలిక. ప్రపంచం కోసం ఆ జంతువులను కాపాడి మేం భారీ మూల్యం చెల్లించుకుంటున్నాం. మాకు చెప్పినట్లే మీరు కూడా జంతువులతో కలిసి జీవించండి. ఇది జోక్‌ కాదు’’ అని వ్యాఖ్యానించారు.

బోట్సువానాలో 1,30,000 ఏనుగులు ఉన్నాయి. ప్రపంచంలోనే ఇవి అత్యధికంగా జీవిస్తున్న తొలి మూడు దేశాల్లో ఇది కూడా ఒకటి. 2014లో వీటి వేటను అక్కడి ప్రభుత్వం నిషేధించింది. కానీ, స్థానికులు తీవ్రమైన ఒత్తిడి చేయడంతో 2019లో తొలగించింది. ఇప్పుడు వార్షిక వేట కోటాను ప్రభుత్వం నిర్ణయించి అనుమతులు జారీ చేస్తోంది. స్థానికులకు అది ప్రధాన ఆదాయ వనరుగా మారింది. ఇప్పటికే అంగోలాకు 8,000, మోజాంబిక్‌కు 5,000 ఏనుగులను ఇచ్చింది.

ఈ ఏడాది మార్చిలో 10,000 ఏనుగులను పంపిస్తామని లండన్‌ను బోట్సువానా అధికారులు హెచ్చరించారు. ఇప్పుడు అలాంటి గిఫ్టే జర్మనీకి కూడా ఇస్తామని ఆ దేశాధ్యక్షుడు పేర్కొన్నారు. ఐరోపా సమాఖ్యలో హంటింగ్‌ ట్రోఫీలను అత్యధికంగా ఆఫ్రికా నుంచి దిగుమతి చేసుకుంటున్న దేశం జర్మనీ. ఇక ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌, బెల్జియం దేశాలు వీటిపై పూర్తిగా నిషేధం విధించాయి. మరోవైపు మిసిసి వ్యాఖ్యలపై జర్మనీ ప్రతినిధి మాట్లాడుతూ బోట్సువానా తమ వద్ద ఎలాంటి ఆందోళనా వ్యక్తం చేయలేదని తెలిపారు.

Viral: డబుల్ ఇస్మార్ట్.. ఏం కిర్రాక్ బుర్రరా నీది.. ఈ ఆన్సర్ చూశారా..?

ఎంత టఫ్ సిట్యువేషన్ అయినా.. హైరానా పడకుండా కొంచెం రిలాక్స్‌గా థింక్ చేస్తే.. ఈజీగా బయటపడొచ్చు. అందుకే ఇస్మార్ట్‌గా ఆలోచించడం చాలా ఇంపార్టెంట్.
ఇప్పుడు మీ ముందుకు అలాంటి కిర్రాక్ స్టూడెంట్‌ను తీసుకొచ్చాం. ఇతగాడు ఎగ్జామ్‌లో ఇచ్చిన ప్రశ్నకు దిమ్మతిరిగిపోయే ఆన్సర్ రాశాడు. అతడి తెలివికి టీచర్ ఎక్స్ ట్రా మార్కులు ఇవ్వక తప్పలేదు. అంతేకాదు తెలివైనవాడు అంటూ కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు. ఏవైనా 5 ఇంగ్లీష్ పదాలు స్పెల్లింగ్‌ రాయి (Write Five Words You Can Spell) అనే ప్రశ్నను ఇంగ్లీషులో ఇచ్చారు. దానికి 5 మార్కులు కేటాయించారు. అయితే ఆ ఇస్మార్ట్ స్టూడెంట్ కొత్త పదాల జోలికి పోలేదు. ప్రశ్నలోనే ఉన్న ఐదు ఇంగ్లీషు పదాలను ( Five, Words, You, Can, Spell) ఆన్సర్ షీట్‌లో నింపేశాడు. అతగాడి మెరుపు ఆన్సర్‌కు టీచర్ ఫిదా అయ్యి… 5 కు మరో 2 మార్కులు జత కలిపి 7 మార్కులు వేశారు. వెరీ క్లవర్ అనే కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు.

చూశారుగా చదువు అంటే బట్టి పట్టడం కాదు.. అర్థం చేసుకోవడం. బట్టి పడితే పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయి. జీవితంలో ఎదగాలి అనుకునేవారు.. తెలివిగా సబ్జెక్ట్ అర్థం చేసుకోవాలి. ప్రశ్న ఏదైనా కాస్త బుర్ర పెట్టి ఆన్సర్ చేయాలి. ప్రజంట్ జనరేషన్ ఎంత ఫాస్ట్ ఉందో చూస్తూనే ఉన్నారు కదా.. వారితో నెగ్గుకురావాలనుకుంటే.. ఇస్మార్ట్‌గా ఆలోచించాల్సిందే. లేదంటే మీరు వెనకబడిపోతారు. మీరు మీ స్కూల్, కాలేజ్ డేస్‌లో ఇలా ఎప్పుడైనా ఆన్సర్స్ రాశారా..? వాటిని టీచర్స్ గమనించి మీకు కాంప్లిమెంట్స్ ఇచ్చారా..? ఆ అనుభవాలను మాతో షేర్ చేసుకోండి.

Tooth Brush: అరిగే దాకా టూత్ బ్రష్ వాడుతున్నారా.. ? ఎన్ని వారాలకు మార్చాలో తెలుసా.. ?

Tooth Brush: నోటిని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే తరచూ వాడే టూత్ బ్రష్ పైనే ఆధారపడి ఉంటుంది. ఒకసారి టూత్ బ్రష్ కొంటే అది అరిగిపోయి, దానికి ఉండే పళ్లు ఉడిపోయినా సరే అలాగే వాడేస్తుంటారు. కానీ అలా చేయడం వల్ల పళ్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. అందువల్ల ప్రతీ రోజు రెండు సార్లు బ్రష్ చేయడం ఎంత ఇంపార్టెంటో.. అదే విధంగా వాడుతున్న బ్రష్‌ను ఎన్నిసార్లు మార్చాలో కూడా తెలుసుకోవడం ముఖ్యమే. తరచూ వాడే బ్రష్‌ను మార్చకపోవడం వల్ల దంత సమస్యలు ఏర్పడతాయి. అందువల్ల టూత్ బ్రష్ ను మార్చడం అనేది చాలా ముఖ్యం. నిర్ణిత సమయంలోనే బ్రష్‌ను మార్చడం వల్ల నోటి దుర్వాసన, బ్యాక్టీరియా వంటి సమస్యలు దూరమవుతాయి. అంతేకాదు బ్రష్ తో పాటు పేస్ట్ ను కూడా మార్చడం మంచిది.

ముఖ్యంగా ఆ సమయంలో..

ముఖ్యంగా జలుబు, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్స్, ఫ్లూ వంటి సమస్యల నుంచి కోలుకున్న తర్వాత టూత్ బ్రష్‌ను మార్చాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తరచూ టూత్ బ్రష్ వాడుతాం కాబట్టి.. వాటిపై బ్యాక్టీరియా, వైరస్‌లు ఉంటాయి. అందువల్ల అనారోగ్యం తరువాత టూత్ బ్రష్‌ను మార్చడం వల్ల పళ్ల ఆరోగ్యం దెబ్బతినకుండా ఉంటుంది.

సాధారణ బ్రష్..

సాధారణ బ్రష్‌లు వాడే వారు అయితే మూడు లేదా నాలుగు నెలలకు ఒకసారి బ్రష్‌లను మారుస్తూ ఉండాలి. ఈ మేరకు సీడీసీ(సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) తెలిపింది. నాలుగు నెలలకంటే ఎక్కువ రోజులు బ్రష్ ను ఉపయోగిస్తే అరిగిపోతుంది. అరిగిపోయిన బ్రష్ ను వాడడం వల్ల దంత సమస్యలు తలెత్తుతాయి. చిగుళ్లు దెబ్బతినడం, సరిగ్గా క్లీన్ కాకపోవడం వంటి సమస్యల బారిన పడే ఛాన్స్ ఉంటుంది.

ఎలక్ట్రానిక్ బ్రష్‌లు..

సాధారణ బ్రష్‌ల కంటే ఎలక్ట్రానిక్ బ్రష్ లను 12 వారాలకు ఒకసారి మారుస్తూ ఉండాలి. ఎలక్ట్రానిక్ బ్రష్‌లకు ఉండే హెడ్ వద్ద చిన్న ముళ్లు ఉంటుంది. అది త్వరగా అరిగిపోతుంది. అందువల్ల 12 వారాలు అంటే 3 నెలలకు ఒకసారి మారుస్తూ ఉండాలి.

పిల్లల బ్రష్..

పిల్లల బ్రష్ లను అయితే కనీసం 3 లేదా 4 వారాలకు ఒకసారి మారుస్తూ ఉండాలి. ఎందుకంటే పిల్లల బ్రష్ లు చాలా చిన్నగా ఉంటాయి. అందువల్ల బ్రష్ లు త్వరగా అరిగిపోతాయి. చిన్న వయస్సులోనే వారికి దంతసమస్యలు ఏర్పడితే ఇక భవిష్యత్తులో చాలా సమస్యలు ఎదుర్కునే అవకాశాలు ఉంటాయి. అందువల్ల పిల్లల బ్రష్ లలో జాగ్రత్త తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

విరాళంలో రికార్డులు సృష్టించిన జామ్‌ సెట్జీ టాటా..లిస్ట్‌లో లేని ఎలోన్ మస్క్, జెఫ్ బెజోస్‌ల పేర్లు

డబ్బున్న వారు విరాళాలు చేస్తుంటారు.. విరాళం అనగానే మనకు ముందు గుర్తుకు వచ్చే పేరు రతన్‌ టాటా.. కానీ దానంలో వీరకంటే ఎక్కువ చేసిన వ్యక్తి చరిత్రలో ఒకరు ఉన్నారు. భారతదేశపు అతిపెద్ద సమ్మేళన సంస్థ అయిన టాటా గ్రూప్‌ను స్థాపించిన ఒక మార్గదర్శక భారతీయ పారిశ్రామికవేత్త. టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు అతని పేరే జామ్‌ సెట్జి టాటా.. ఎడెల్‌గివ్ ఫౌండేషన్ హురున్ రిపోర్ట్ 2021 ప్రకారం, అతను రూ. 8,29,734 కోట్లు విరాళంగా అందించారు.
టాటా హీరాబాయి దాబూను వివాహం చేసుకున్నారు. వారి కుమారులు, దొరాబ్జీ టాటా మరియు రతన్‌జీ టాటా , టాటా తర్వాత టాటా గ్రూప్ ఛైర్మన్‌లుగా ఉన్నారు. జామ్‌సెట్జీ టాటా విద్య మరియు ఆరోగ్య రంగాలకు భారీ విరాళాలు అందించారు. నివేదికల ప్రకారం, అతను 1892లో తన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను ప్రారంభించాడు. అతను 1904లో మరణించినప్పటి నుంచి టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటా టాటా గ్రూప్ దాతృత్వ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ఆయన భార్య మెలిండా రెండో స్థానంలో ఉన్నారు. వీరిద్దరూ 74.6 బిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చారు.

USD 37.4 బిలియన్ల విరాళంతో ప్రముఖ పెట్టుబడిదారు వారెన్ బఫెట్ మూడవ స్థానంలో ఉన్నారు.

USD 34.8 బిలియన్లతో జార్జ్ సోరోస్ మరియు USD 26.8 బిలియన్లతో జాన్ డి రాక్‌ఫెల్లర్ తర్వాతి స్థానంలో ఉన్నారు. .

టాప్ 50 ప్రపంచ దాతల జాబితాలో మరో భారతీయుడు మాత్రమే చోటు దక్కించుకున్నాడు. అతనే విప్రో వ్యవస్థాపకుడు అసిమ్ ప్రేమ్‌జీ. అతను 22 బిలియన్ అమెరికన్ డాలర్లను విరాళంగా ఇచ్చాడు.

ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన ఎలోన్ మస్క్, జెఫ్ బెజోస్‌ల పేర్లు జాబితాలో లేకపోవడం.

APPSC Group 2 Result Date: ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 ప్రిలిమ్స్‌ ఫలితాల విడుదల తేదీ ఇదే.. 1:100 నిష్పత్తిలో ఫలితాలు వెలువడేనా?

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ఈ ఏడాది ఫిబ్రవరి 25న గ్రూప్‌ 2 ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. 24 జిల్లాల్లో దాదాపు 1327 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్ష జరిగి 2 నెలలు గడుస్తోన్న ఫలితాలు మాత్రం ఇంకా వెడువల లేదు. దీంతో అభ్యర్ధులు ఎప్పుడెప్పుడు ఫలితాలు ప్రకటిస్తారా? అని ఎదురు చూస్తున్నారు. ఇక ఈ నెల 13వ తేదీ లోగా గ్రూప్‌ 2 ప్రిలిమ్స్‌ ఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ఈ ఏడాది ఫిబ్రవరి 25న గ్రూప్‌ 2 ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. 24 జిల్లాల్లో దాదాపు 1327 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్ష జరిగి 2 నెలలు గడుస్తోన్న ఫలితాలు మాత్రం ఇంకా వెడువల లేదు. దీంతో అభ్యర్ధులు ఎప్పుడెప్పుడు ఫలితాలు ప్రకటిస్తారా? అని ఎదురు చూస్తున్నారు. ఇక ఈ నెల 13వ తేదీ లోగా గ్రూప్‌ 2 ప్రిలిమ్స్‌ ఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను ఏపీపీఎస్సీ సాధారణంగా 1:50 నిష్పత్తిలో ప్రకటిస్తుంది. అయితే ఈ సారి నిర్వహించిన గ్రూప్‌ ప్రిలిమ్స్‌ ఫలితాలను మాత్రం 1:100 నిష్పత్తిలో ఫలితాలు ప్రకటించాలని అభ్యర్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు.

గ్రూప్‌ 2 నోటిఫికేషన్‌ జారీకి, ప్రిలిమ్స్‌ పరీక్ష తేదీ మధ్య తక్కువ సమయం ఉందని, సన్నద్ధతకు మయం సరిపోకపోవడంతోపాటు ప్రశ్నపత్రం కఠినంగా ఉండడం తమను తీవ్ర నిరాశకు గురిచేసిందని వాపోతున్నారు. పైగా ఇండియన్‌ సొసైటీ చాప్టర్‌కు సంబంధించిన పుస్తకాలు మార్కెట్లోకి ఆలస్యంగా రావడం వంటి ఇబ్బందుల కారణంగా ఆశించిన స్థాయిలో పరీక్షకు సన్నద్ధం కాలేకపోయామని అభ్యర్థులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పోస్టుల సంఖ్యకు అనుగుణంగా ఒక్కో పోస్టుకు 100 మంది చొప్పున మెయిన్స్‌ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించాలని అభ్యర్ధులు కోరుతున్నారు. ఈ మేరకు ఏపీపీఎస్సీకి పలువురు అభ్యర్ధులు తమ అభ్యర్థనలు పంపిస్తున్నారు. దీనిపై కమిషన్‌ సానుకూలంగా స్పందించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ప్రిలిమ్స్‌ ఫలితాల విడుదలనాటికి దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక తాజాగా జరిగిన గ్రూప్‌ 1 పరీక్షకు సంబంధించి కూడా ఇదే విధమైన అభ్యర్ధనలు వస్తున్నాయి. గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌లో పోస్టుల సంఖ్యకు అనుగుణంగా ఒక్కో పోస్టుకు 1:100 నిష్పత్తిలో మెయిన్స్‌ రాసేందుకు అభ్యర్థులను ఎంపిక చేయాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. అంతేకాకుండా క్వశ్చన్ పేపర్‌లో ఇంగ్లిష్‌ నుంచి తెలుగులోకి అనువదించిన పలు ప్రశ్నలు తప్పుల తడికగా ఉన్నాయని, సన్నద్ధతకూ తగిన సమయం లేకపోవడం కారణాల వల్ల మెయన్స్‌ పరీక్ష ఎక్కువ మంది రాసేందుకు వీలు కల్పించాలని అభ్యర్ధులు కోరుతున్నారు. ఇక ఈ అభ్యర్ధనలపై కమిషన్‌ ఏ విధంగా స్పందిస్తుందనేది వేచి చూడాలి.

OnePlus Nord CE 4: మార్కెట్లోకి వచ్చేసిన వన్‌ప్లస్ కొత్త ఫోన్‌.. బడ్జెట్‌ ధరలోనే..

ఈ స్మార్ట్ ఫోన్‌లో ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 ఎస్వోసీ చిప్ సెట్ ప్రాసెసర్‌ను అందించారు. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత ఆక్సిజన్‌ ఓఎస్ 14 వెర్షన్‌పై పనిచేస్తుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో 100 వాట్స్‌ సూపర్‌ వూక్ ఫాస్ట్…
స్మార్ట్‌ఫోన్‌ యూజర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఫోన్‌ విడుదలైంది. చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం వన్‌ప్లస్ మార్కెట్లోకి ఎట్టకేలకు కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. వన్‌ప్లస్ నార్డ్‌ సీఈ4 పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ స్మార్ట్ ఫోన్‌లో ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 ఎస్వోసీ చిప్ సెట్ ప్రాసెసర్‌ను అందించారు. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత ఆక్సిజన్‌ ఓఎస్ 14 వెర్షన్‌పై పనిచేస్తుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో 100 వాట్స్‌ సూపర్‌ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5500 ఎంఏహెచ్‌ కెపాసిటీగల బ్యాటరీని అందించారు. ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

వన్‌ప్లస్ నార్డ్‌ సీఈ4 స్మార్ట్‌ ఫోన్‌లో 6.7 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 93.40 శాతం స్క్రీన్ టూ బాడీ రేషియో ఈ స్క్రీన్‌ సొంతం. ఈ స్మార్ట్‌ ఫోన్‌ 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యుయల్ బాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.4, జీపీఎస్, గ్లోనాస్, బీడీఎస్, గాలిలియో, యూఎస్బీ టైప్ – సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లతో తీసుకొచ్చారు.

ఇక ధర విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌ను 15 నిమిషాలు ఛార్జ్‌ చేస్తే రోజంతా పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. అలాగే బ్యాటరీ ఫుల్ ఛార్జ్‌ కావడానికి 29 నిమిషాలు పడుతుంది. ధర విషయానికొస్తే.. 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 24,99, 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 26,999గా నిర్ణయించారు. ఏప్రిల్‌ 4వ తేదీ నుంచి అమెజాన్‌లో అందుబాటులో ఉండనుంది.

Names of 100 Kouravas: మహాభారతంలో 100 మంది కౌరవుల పేర్లు తెలుసా.. ఎప్పుడైనా విన్నారా?

Do You Know Names of 100 Kouravas Here is the Full list: మహాభారతం తెలిసిన వారు చాలా మంది ఉంటారు కానీ అందరికీ కౌరవులు అనగానే 100 మంది పాండవులు 5 మంది అని మాత్రమే తెలుసు. కానీ కౌరవుల పేర్లలో రెండు మూడు తప్ప మిగతావి ఎవరికీ ఎక్కువగా తెలియదు. ధుర్యోధనుడు అందరికన్నా పెద్దవాడు, అసలైన వాడు కాబట్టి అందరికీ తెలుసు తెలుసు. దుశ్సాసనుడు చీర లాగాడు కాబట్టి, దుశ్మలుడు ..ద్రౌపది చీర లాగకుండా ధర్మం మాట్లాడాడు కాబట్టి తెలుసు. ఇక మిగిలిన వారందరి పేర్లు ప్రత్యేకంగా తెలీవు. కానీ కన్నడ సింగర్ ఒకాయన తాజాగా జీ కన్నడ ప్రోగ్రాం లో పాడిన పద్యం వైరల్ అవుతోంది.
నిజానికి వ్యాస మహర్షి చాలా దూరం ప్రయాణం చేసి వచ్చినప్పుడు ఆయన గాయాలకు గాంధారి సేవ చేసి, ఆయనకు కావలసిన సపర్యలు చేస్తుంది. ఆయన సంతోషంగా నీకు ఎలాంటి కోరిక ఉన్నా తీరుస్తాను అని ఆమెకు ప్రమాణం చేయగా గాంధారి తనకు 100 మంది కొడుకులు కావాలని కోరుతుంది. దీంతో మహర్షి వరంతో గాంధారికి వంద మంది పుత్రులు కలుగుతారు. వీరినే కౌరవులుగా మహాభారతంలో చెబుతారు. ఇక ఈ వంద మంది పేర్లు చాలా మందికి తెలియదు. ఇప్పుడు మీకోసం

1. దుర్యోధనుడు
2. దుశ్సాసనుడు
3. దుస్సహుడు
4. దుశ్శలుడు
5. జలసంధుడు
6. సముడు
7. సహుడు
8. విందుడు
9. అనువిందుడు
10. దుర్దర్షుడు
11. సుబాహుడు
12. దుష్పప్రదర్శనుడు
12. దుర్మర్షణుడు
13. దుర్మఖుడు
15. దుష్కర్ణుడు
16. కర్ణుడు
17. వివింశతుడు
18. వికర్ణుడు
19.శలుడు
20. సత్వుడు
21. సులోచనుడు
22. చిత్రుడు
23. ఉపచిత్రుడు
24. చిత్రాక్షుడు
25. చారుచిత్రుడు
26. శరాసనుడు
27. ధర్మధుడు
28. దుర్విగాహుడు
29. వివిత్సుడు
30. వికటాననుడు
31. నోర్ణనాభుడు
32. నునాభుడు
33. నందుడు
34. ఉపనందుడు
35. చిత్రాణుడు
36. చిత్రవర్మ
37. సువర్మ
38. దుర్విమోచనుడు
39. అయోబావుడు
40. మహాబావుడు
41. చిత్రాంగుడు
42. చిత్రకుండలుడు
43. భీమవేగుడు
44. భీమలుడు
45. బలాకుడు
46. బలవర్థనుడు
47. నోగ్రాయుధుడు
48. సుషేణుడు
49. కుండధారుడు
50. మహోదరుడు
51. చిత్రాయుధుడు
52. నిషింగుడు
53. పాశుడు
54. బృఎందారకుడు
55. దృఢవర్మ
56. దృఢక్షత్రుడు
57. సోమకీర్తి
58. అనూదరుడు
59. దఢసంధుడు
60. జరాసంధుడు
61. సదుడు
62. సువాగుడు
63. ఉగ్రశ్రవుడు
64. ఉగ్రసేనుడు
65. సేనాని
66. దుష్పరాజుడు
67. అపరాజితుడు
68. కుండశాయి
69. విశాలాక్షుడు
70. దురాధరుడు
71. దుర్జయుడు
72. దృఢహస్థుడు
73. సుహస్తుడు
74. వాయువేగుడు
75. సువర్చుడు
76. ఆదిత్యకేతుడు
77. బహ్వాశి
78. నాగదత్తుడు
79. అగ్రయాయుడు
80. కవచుడు
81. క్రధనుడు
82. కుండినుడు
83. ధనుర్ధరోగుడు
84. భీమరధుడు
85. వీరబాహుడు
86. వలోలుడు
87. రుద్రకర్ముడు
88. దృణరదాశ్రుడు
89.అదృష్యుడు
90. కుండభేది
91. విరావి
92. ప్రమధుడు
93. ప్రమాధి
94. దీర్గరోముడు
95. దీర్గబాహువు
96.ఉడోరుడు
97. కనకద్వజుడు
98. ఉపాభయుడు
99. కుండాశి
100. విరజనుడు
101వ బిడ్డగా దుశ్శల అనే ఆడపిల్ల జన్మిస్తుంది.

కచ్చతీవు ద్వీపం ఎక్కడుంది.. భారత్- శ్రీలంక వివాదం ఎందుకు.. దీని స్టోరీ ఏంటీ?

ఆర్టీఐ సమాచారం ప్రకారం ఓ న్యూస్‌ పేపర్‌లో వచ్చిన వార్తతో కచ్చతీవు హాట్ టాపిక్ అయింది. ఆ తర్వాత ప్రధాని మోదీ ట్వీట్ చేయడంతో రాజకీయ రచ్చ స్టార్ట్ అయింది.

Home » National » Where Is Katchatheevu Island And What The Controversy

కచ్చతీవు ద్వీపం ఎక్కడుంది.. భారత్- శ్రీలంక వివాదం ఎందుకు.. దీని స్టోరీ ఏంటీ?
ఆర్టీఐ సమాచారం ప్రకారం ఓ న్యూస్‌ పేపర్‌లో వచ్చిన వార్తతో కచ్చతీవు హాట్ టాపిక్ అయింది. ఆ తర్వాత ప్రధాని మోదీ ట్వీట్ చేయడంతో రాజకీయ రచ్చ స్టార్ట్ అయింది.
Katchatheevu Island Issue: లోక్‌సభ ఎన్నికలకు ముందు తమిళనాడులో కచ్చతీవు ద్వీపం పొలిటికల్ హాట్ టాపిక్ అయింది. కాంగ్రెస్, డీఎంకే, బీజేపీ మధ్య మాటల యుద్దం నడుస్తోంది. 1974లో నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ ఈ దీవిని శ్రీలంకకు అప్పనంగా అప్పగించారని నరేంద్ర మోదీ ఆరోపించారు. డీఎంకే కూడా కచ్చతీవుపై రెండు నాల్కల ధోరణి పాటించిందంటూ ప్రధాని మోదీ విమర్శలు చేయడంతో ఈ అంశం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

తమిళనాడులోని రామేశ్వరానికి 33 కిలోమీటర్ల దూరంలో, శ్రీలంకలోని జాఫ్నాకు 62 కిలోమీటర్ల దూరంలో హిందూ మహాసముద్రంలో కచ్చతీవు దీవి ఉంది. స్వాతంత్రానికి ముందు ఈ దీవి బ్రిటిష్ పాలకుల పరిధిలోని మద్రాస్ ప్రెసిడెన్సీ ఆధీనంలో ఉండేది. స్వాతంత్ర్యం తర్వాత భారత్, శ్రీలంక ఈ దీవి తమకే చెందుతుందని ప్రకటించుకున్నాయి. అప్పటినుంచి రెండు దేశాల మధ్య కచ్చతీవుపై వివాదం కొనసాగుతుంది.

కచ్చతీవు సమస్యను శాశ్వతంగా పరిష్కరించే ఉద్దేశంతో 1974లో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ లంకతో రాజీకి సిద్ధపడ్డారు. ఇండో శ్రీలంకన్ మారిటైం అగ్రిమెంట్ పేరుతో కచ్ఛతీవు దీవిపై హక్కును వదులుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ ఒప్పందం ప్రకారం భారత జాలర్లు ఈ దీవి పరిధిలోని సముద్ర జలాల్లోనూ చేపల వేట సాగించొచ్చు. కానీ లంక ప్రభుత్వం ఈ నిబంధనను పట్టించుకోలేదు. భారత జాలర్లు కేవలం విశ్రాంతి తీసుకొనేందుకే ఈ దీవికి రావొచ్చని, తమ దీవి పరిధిలో చేపల వేటను అంగీకరించబోమని వాదించింది.
అంతకముందు పెద్దగా పట్టించుకోని శ్రీలంక.. 2009 నుంచి కచ్చతీవు దగ్గర బలగాలను మోహరించి.. దీవి దగ్గరకు వెళ్లే భారత జాలర్లను అరెస్టు చేస్తూ వస్తోంది. అప్పటి నుంచి ఈ దీవిని భారత్ తిరిగి స్వాధీనం చేసుకోవాలన్న డిమాండ్లు తమిళనాడు ప్రజల నుంచి వస్తున్నాయి. 2011లో నాటి తమిళనాడు సీఎం జయలలిత ఈ అంశంపై అసెంబ్లీలో తీర్మానం చేయడంతోపాటు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. రాజ్యాంగ సవరణ చేయకుండా ఈ దీవిని లంకకు అప్పగించడం చెల్లదని వాదించారు. అంతకముందు 2006లో నాటి డీఎంకే అధినేత కరుణానిధి ఈ అంశంపై నాటి ప్రధాని మన్మోహన్‌కు లేఖ రాశారు. 2023లో తమిళనాడు ప్రస్తుత సీఎం, కరుణానిధి కుమారుడు స్టాలిన్ సైతం ప్రధాని మోదీకి మరో లేఖ రాశారు.
ఆర్టీఐ సమాచారం ప్రకారం ఓ న్యూస్‌ పేపర్‌లో వచ్చిన వార్తతో కచ్చతీవు హాట్ టాపిక్ అయింది. ఆ తర్వాత ప్రధాని మోదీ ట్వీట్ చేయడంతో రాజకీయ రచ్చ స్టార్ట్ అయింది. తమిళనాడు ప్రజలు ఎక్కువగా చేపలవేటపై ఆధారపడి బతుకుతుండటంతో పార్టీలన్నీ ఈ ఎజెండాను ఎత్తుకున్నాయి.
డీఎంకే, కాంగ్రెస్‌ కేంద్రాన్ని కార్నర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. కేంద్రం వాదన మాత్రం భిన్నంగా ఉంది. 1974లో కచ్చతీవును కాంగ్రెస్‌ ప్రభుత్వం వదులుకుందని.. 1976లో చేపలవేటపై కూడా హక్కులు వదులుకున్నారని వాదిస్తోంది కేంద్రం. అందుకు అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు కేంద్రమంత్రులు. కచ్చతీవు విషయంలో గతంలో ఏమీ జరగనట్లు కాంగ్రెస్, డీఎంకే చెప్తుండటం జోక్‌గా ఉందంటున్నారు. 20ఏళ్లలో వేలమంది మత్స్యకారులను, బోట్లను శ్రీలంక తమ అదుపులోకి తీసుకుందని చెప్తోంది కేంద్రం. కచ్చతీవును తిరిగి స్వాధీనం చేసుకుంటారో లేదో తెలియదు కానీ.. ఇప్పుడు మాత్రం రాజకీయ రగడకు ఈ అంశం కారణం అవుతోంది.

Drinking Warm Water: రోజూ 8 గ్లాసుల వేడినీరు తాగితే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా..? ఆసక్తికర విషయాలు..

కొన్నిసార్లు మంచి ఆరోగ్యం కోసం చల్లని నీటికి బదులుగా వేడి నీటిని తాగాలని సలహా ఇస్తారు. మరికొందరు బరువు తగ్గడానికి నిరంతరం వేడి నీటిని తాగుతారు. జలుబు, దగ్గు, జ్వరం వంటి వైరల్ వ్యాధులలో వేడి నీటిని తాగడం మంచిది. అలాగని కొందరు ఎక్కువ సార్లు వేడి నీటిని మాత్రమే తాగుతుంటారు. కానీ శరీరంపై దాని ప్రభావం ఎలా ఉంటుందో వారికి పెద్దగా తెలియదు. అయితే, రోజుకు ఎనిమిది గ్లాసుల వేడినీరు తాగితే ఏమవుతుందో తెలుసా..?
నీరు మన శరీరానికి చాలా అవసరం. నీరు లేనిదే జీవం లేదన్నారు. నీరు లేకుండా మనం జీవించలేము. ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీరు తాగిన తర్వాతే రోజును ప్రారంభించడం ఆరోగ్యకరం. మరీ ముఖ్యంగా వేసవిలో నీరు ఎక్కువగా తాగడం శరీరానికి చాలా అవసరం. నిరంతరం చెమట పట్టడం వల్ల శరీరంలో నీరు తగ్గిపోయి, డీహైడ్రేషన్‌కు దారి తీస్తుంది. ఇలాంటప్పుడు శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడానికి ఎక్కువగా నీరు తాగడం అవసరం. అయితే, వేడినీరు తాగడం మీ శరీరానికి మంచిదేనా? కొన్నిసార్లు మంచి ఆరోగ్యం కోసం చల్లని నీటికి బదులుగా వేడి నీటిని తాగాలని సలహా ఇస్తారు. మరికొందరు బరువు తగ్గడానికి నిరంతరం వేడి నీటిని తాగుతారు. జలుబు, దగ్గు, జ్వరం వంటి వైరల్ వ్యాధులలో వేడి నీటిని తాగడం మంచిది. అలాగని కొందరు ఎక్కువ సార్లు వేడి నీటిని మాత్రమే తాగుతుంటారు. కానీ శరీరంపై దాని ప్రభావం ఎలా ఉంటుందో వారికి పెద్దగా తెలియదు. అయితే, రోజుకు ఎనిమిది గ్లాసుల వేడినీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు, సైడ్‌ఎఫెక్ట్స్‌ ఎలా ఉంటాయో ఇక్కడ తెలుసుకుందాం..

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది..

వేడి నీటిని తాగడం వల్ల అజీర్ణం నుండి ఉపశమనం లభిస్తుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. జీర్ణక్రియ సక్రమంగా ఉంటే గ్యాస్ లేదా ఎసిడిటీ ఉండదు. అలాగే, వేడి నీరు జీర్ణక్రియకు ఆటంకం కలిగించే కడుపులోని విషయాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది.

బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది..

వేడి నీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. రోజు తిన్న తర్వాత గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. బరువు పెరగకుండా అదుపులో ఉంచుతుంది. దీనితో పాటు వేడినీరు తాగడం వల్ల విపరీతమైన ఆకలి ఉండదు.

హైడ్రేట్ చేయడానికి సహాయం చేస్తుంది..

ఉదయం నిద్ర లేవగానే రాత్రి పడుకునే ముందు వేడినీళ్లు తాగితే ఆ నీరు శరీరం హైడ్రేటెడ్ గా ఉండేలా చేస్తుంది.

* వేడినీరు తాగడం వల్ల కలిగే నష్టాలు కూడా ఉన్నాయి.. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

గొంతులో మంట: వేడి నీటిని ఎక్కువగా తాగడం వల్ల నోరు, గొంతు, పొట్టలో మంట మొదలవుతుంది. కాబట్టి నీటిని త్రాగేటప్పుడు, సాధారణ ఉష్ణోగ్రత లేదా గోరువెచ్చని నీటిని మాత్రమే తాగాలి.

అంతర్గత అవయవాలకు నష్టం: వేడి నీటిని ఎక్కువగా తాగడం వల్ల శరీరంలోని అంతర్గత అవయవాలపై కూడా చెడు ప్రభావం పడుతుంది. ఎక్కువ వేడి నీరు కడుపు చికాకు కలిగిస్తుంది. శరీరం అంతర్గత కణజాలాలు సున్నితంగా ఉంటాయి. వేడి నీరు ఎక్కువగా తాగితే.. ఇది బొబ్బలకు దారితీస్తుంది.

అన్నవాహిక దెబ్బతింటుంది: వేడినీరు తాగడం అన్నవాహికపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. ఇది నోటిని, కడుపుని కలిపే అన్నవాహిక. వేడినీరు తాగడం వల్ల ఈ అన్నవాహిక దెబ్బతింటుంది. దీనితో పాటు, మంట కూడా మొదలవుతుంది. ఈ నొప్పి దీర్ఘకాలికమైనది.

అందుకే వేడినీరు త్రాగేటప్పుడు, నీరు చాలా వేడిగా ఉండకుండా చూసుకోండి. రోజుకు ఎనిమిది గ్లాసుల వేడినీరు తాగడం వల్ల వివిధ ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. అలాగే, ప్రతి ఒక్కరూ ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే.. నీరు గోరువెచ్చగా ఉండేలా చూసుకోండి. ఎక్కువ వేడిగా ఉండకూడదు.

స్మార్ట్ TVపై క్రేజీ ఆఫర్.. 74 వేల TV కేవలం 28 వేలకే!

మరికొన్ని రోజుల్లో విద్యార్థులకు సమ్మర్ హాలిడేస్ ప్రారంభంకాబోతున్నాయి. వేసవి సెలవుల్లో చాలామంది ఇళ్లకే పరిమితమవుతుంటారు. ఈ సమయంలో కాలక్షేపం కోసం టీవీల ముందు వాలిపోతుంటారు. ఈ రోజుల్లో దాదాపు అందరి ఇళ్లలో టీవీలు ఉన్నయనే చెప్పుకోవచ్చు. అయితే ఎవరైనా టీవీలు కొనాలని భావిస్తే మార్కెట్లో అద్భుతమైన టీవీలు అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ టీవీలు అయితే ఉన్నాయి గానీ.. మరి ధరల సంగతేంటీ అంటారా? ధరలు కూడా మీ బడ్జెట్ ధరల్లోనే ఉన్నాయి. స్మార్ట్ టీవీలపై కళ్లు చెదిరే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ టీవీపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ. ఆఫర్ లో భాగంగా రూ. 74 వేల స్మార్ట్ టీవీని కేవలం రూ. 28 వేలకే సొంతం చేసుకోవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

మీరు కొత్త స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలనుకుంటే అద్భుతమైన ఆఫర్ అందుబాటులో ఉంది. 55 ఇంచుల స్మార్ట్ టీవీపై ఊహించని డిస్కౌంట్ ప్రకటించింది ఈ కామర్స్ సంస్థ. ఏకంగా టీవీ ధరలో 61 శాతం భారీ తగ్గింపు ప్రకటించింది. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజ కంపెనీలో ఐఫాల్కన్ బ్రాండ్ కు చెందిన ఐఫాల్కన్ 55 ఇంచుల అల్ట్రా హెచ్‌డీ 4కే స్మార్ట్ గూగుల్ టీవీ తక్కువ ధరకే లభిస్తోంది. ఇందులో డాల్బే ఆడియో, హెచ్‌డీఆర్ 10, గూగుల్ అసిస్టెంట్, వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. నెట్ ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో వంటి యాప్స్ ను అందించారు.

ఈ స్మార్ట్ టీవీ అసలు ధర రూ. 73,990. అయితే ఈ స్మార్ట్ టీవీపై 61 శాతం భారీ డిస్కౌంట్ ప్రకటించింది ప్రముఖ ఈ కామర్స్ సంస్థ. దీంతో 55 ఇంచుల 4కే స్మార్ట్ గూగుల్ టీవీ కేవలం రూ. 28, 999కే దక్కించుకోవచ్చు. అంటే రూ. 44,991 ఆదా అవుతుందన్నమాట. ఇలాంటి ఆఫర్ మళ్లీ మళ్లీ రాదు. సూపర్ ఫీచర్లు కలిగిన ఈ స్మార్ట్ టీవీని అస్సలు మిస్ చేసుకోకండి. డిస్కౌంట్ తో పాటు ఎక్సేంజ్ ఆఫర్, బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మరి మీరు ఈ ఐఫాల్కన్ 55 ఇంచుల అల్ట్రా హెచ్‌డీ 4కే స్మార్ట్ గూగుల్ టీవీని కొనుగోలు చేయాలి అనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Curd Benefits: పెరుగుని ఇలా తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గుతుందట..

Curd Benefits : పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే, దీనిని తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గుతుందా..అందుకోసం ఎలా తీసుకుంటే మంచిదో తెలుసుకోండి.
కొలెస్ట్రాల్‌లో రెండు రకాలు ఉన్నాయి. చెడు కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్. బాడీలో కొలెస్ట్రాల్ పెరిగితే రక్తనాళాల్లో ఇబ్బందులు వస్తాయి. దీనికారణంగా హైబీపి పెరుగుతుంది.
ఈ రోజుల్లో అధిక కొలెస్ట్రాల్ సమస్య పెరుగుతుంది. దీని కారణంగా రక్తప్రసరణ ప్రభావితం చేసే ధమనుల్లో కొవ్వు పేరుకుపోతుంది. దీని వల్ల గుండె సమస్యలు కూడా వస్తాయి. ఈ సమస్యని దూరం చేసుకోవాలంటే హెల్దీ డైట్ ఫాలో అవ్వాలి. దీని వల్ల కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది. అందుకోసం పెరుగు హెల్ప్ అవుతుంది.
కొలెస్ట్రాల్‌ని కంట్రోల్ చేయడంలో పెరుగు కూడా హెల్ప్ చేస్తుంది. డైట్‌లో పెరుగుని యాడ్ చేస్తే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. చాలా మంది జీర్ణ సమస్యలు దూరం చేసుకోవడానికి పెరుగు తీసుకుంటారు. దీని వల్ల ఈస్ట్ బ్యాక్టీరియా బ్యాలెన్స్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. దీని వల్ల యోని ఇన్ఫెక్షన్లు దూరం అవుతాయి.
NIH నివేదిక ప్రకారం, పెరుగు తీసుకుంటే కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది. పెరుగులో విటమిన్ సి, ట్రై గ్లిజరైడ్స్, ఫాస్టింగ్ గ్లూకోజ్ ఉంటే ఇన్సులిన్‌ని కంట్రోల్ చేయడమే కాకుండా బీపి కంట్రోల్ అవుతుంది. దీంతో పాటు ఇది లిపోప్రోటీన్(LDL) లేదా మంచి కొలెస్ట్రాల్‌ని ప్రోత్సహిస్తుంది.
కొలెస్ట్రాల్ తగ్గేందుకు పెరుగుని ఇలా తీసుకోవాలంటే ఓ గిన్నె పెరుగులో కొద్దిగా ఉప్పు కలపండి. దీనిని తీసుకోండి. కొలెస్ట్రాల్ తగ్గడానికి ఇది హెల్ప్ అవుతుంది. దీని వల్ల చాలా సమస్యలు దూరమవుతాయి. జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే. వీటిని పాటించే ముందు డైటీషియన్‌ని సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

ఈ 8 వస్తువులను ఎవరికీ బహుమతిగా ఇవ్వకండి

బంధువులకు, స్నేహితులకు, మనకు ఇష్టమైన వారికి సందర్భాన్ని బట్టి బహుమతులు ఇస్టుంటాం. ఆ ఫంక్షన్‌ను బట్టి వారికి ఏది నచ్చుతుందో అలాంటి బహుమతులు ఇవ్వాలని అందరూ ఆలోచిస్తారు. అయితే అది ఎలాంటి సందర్భం అయినా.. కొన్ని వస్తువులు బహుమతిగా ఇవ్వడానికి సరైనవి. అయితే నిత్య జీవితంలో ఉపయోగించే వస్తువులను బహుమతిగా ఇవ్వాలనే హడావుడిలో చాలా మంది కొన్ని వస్తువులను బహుమతిగా ఇస్తుంటారు.
వాస్తు శాస్త్రంలో మనం ఇచ్చే బహుమతికి ముఖ్యమైన స్థానం ఉంది. అందువల్ల, కొన్ని వస్తువులను బహుమతిగా ఇవ్వడం ఉచితం కాదు. మనం ఇచ్చే వస్తువులు ఆ ఇంటిని మరియు అక్కడి శక్తి ప్రవాహాన్ని ప్రభావితం చేస్తాయి. దాని వల్ల అక్కడి శక్తి వ్యవస్థలో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. ఈ విధంగా, వాస్తు శాస్త్రం ప్రకారం, 8 ముఖ్యమైన వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ బహుమతిగా ఇవ్వకూడదు. మీరు మీ బంధువుల జీవితంలో సానుకూల పురోగతిని కోరుకుంటే, ఈ వస్తువులను బహుమతిగా ఇవ్వవద్దు అని వాస్తు శాస్త్రం చెబుతోంది.

పదునైన వస్తువులు
కత్తులు, ఎలాంటి పదునైన లేదా సూటిగా ఉండే వస్తువులు ఏ కారణం చేతనైనా బహుమతిగా ఇవ్వకూడదు. ఇవి ప్రతికూల శక్తిని కలిగిస్తాయి. ఐక్యత సానుకూలతను ప్రోత్సహించడానికి మాత్రమే బహుమతులు ఇవ్వాలి.

నలుపు రంగు వస్తువులు
నలుపు రంగు ప్రతికూల అర్థాన్ని కలిగి ఉంటుంది. అందుచేత నల్లని వస్త్రంతో సహా ఎలాంటి నల్లని పదార్థాన్ని బహుమతిగా ఇవ్వకూడదు.

కాక్టి లేదా ముళ్ల
మొక్కలను బహుమతిగా ఇవ్వడం సర్వసాధారణం. ఇతర మొక్కలు ఏవైనా ఇవ్వవచ్చు, కానీ కాక్టస్ వంటి ముళ్ళు ఉన్న మొక్కలను ఇవ్వకూడదు. ఇవి ప్రతికూలతను పెంచుతాయని, అన్ని రంగాల్లో అవరోధాలను సృష్టిస్తాయని వాస్తు శాస్త్రం హెచ్చరిస్తోంది.

గడియారం
గడియారం బహుమతిగా ఇవ్వడం చాలా సాధారణం. అయితే, వాస్తు శాస్త్రంలో, గడియారం లేదా గడియారం బహుమతి కాదు. ఇవి సమయ పరిమితిని (టైమ్ లిమిట్) సూచిస్తాయి, తక్కువ సమయం మాత్రమే ఉందని చెబుతాయి. సమయంతో ముడిపడి ఉన్న గడియారం సంబంధాన్ని ప్రోత్సహించదు. ప్రేమ మరియు శృంగార సంబంధాన్ని మెరుగుపరచడానికి సమయ పరిమితిని మించిన ఏదైనా వస్తువును బహుమతిగా ఇవ్వవచ్చు.

ఎలక్ట్రానిక్ గాడ్జెట్
ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను బహుమతిగా ఇవ్వడం కూడా కామన్‌. ఇవి ఇంట్లో సహజ శక్తి ప్రవాహానికి ఆటంకం కలిగిస్తాయి. ప్రశాంతమైన వాతావరణాన్ని ప్రోత్సహించే వస్తువులను బహుమతిగా ఇవ్వడం ఉత్తమం.

అద్దాలు
శక్తి ప్రవాహంపై అద్దాలు తీవ్ర ప్రభావం చూపుతాయి. ఇంట్లో ఎక్కడా అద్దాలు పెట్టుకోకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. అలాగే ఇది బహుమతిగా ఇవ్వదగిన వస్తువు కాదు. అద్దాలు ప్రతికూల శక్తిని ప్రతిబింబిస్తాయి. రెట్టింపు చేస్తాయి. సంతోషాన్ని, సానుకూలతను పెంచే వస్తువులను ఇవ్వడం ప్రయోజనకరం.

లెదర్ వస్తువులు
చాలా మంది వ్యక్తులు పర్సులు, బ్యాగులు ఇతర తోలు వస్తువులను బహుమతిగా ఇస్తారు. అయితే, తోలు వస్తువులు బహుమతికి తగినవి కావు. చర్మం ప్రతికూల శక్తితో ముడిపడి ఉంటుంది.

ఆర్ట్ వర్క్
పెయింటింగ్, స్కల్ప్చర్ వంటి ఆర్ట్ వర్క్‌లను ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే, వారు ప్రతికూల మరియు దూకుడు వైఖరిని ప్రేరేపించగలరు. ఆనందాన్ని, శాంతిని ఇచ్చే వాటిని మాత్రమే ఎంచుకోవాలి.

28 లక్షల జీతం వచ్చే ఉద్యోగం మానేసిన ఐఐటీ గ్రాడ్యుయేట్.. ఇప్పుడు నెలకు కోటి ఆదాయం

ఐఐటీ, ఐఐఎం వంటి ప్రఖ్యాత విద్యాసంస్థల్లో చదివిన వారు సాధారణంగా అత్యధిక జీతం వచ్చే ఉద్యోగాన్ని ఎంచుకుంటారు. అయితే ఇటీవలి కాలంలో ఐఐటీలు, ఐఐఎంలలో చదివిన వారు వినూత్న స్టార్టప్‌లను ప్రారంభించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. కొందరు ఇండస్ట్రీలో సక్సెస్‌లు సాధిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. వారిలో సాయికేష్ గౌడ్ ఒకరు. సాయికేష్ ఐఐటీ గ్రాడ్యుయేట్ మరియు ఇటీవల తన వెంచర్ కోసం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. సాయికేష్ సొంతంగా వ్యాపారం పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఏడాదికి రూ.28 లక్షలు వచ్చే ఉద్యోగాన్ని వదిలేశాడు. ఆ తర్వాత కంట్రీ చికెన్ కో అనే కంపెనీని స్థాపించిన సాయికేశ్.. ప్రస్తుతం నెలకు రూ.కోటి సంపాదిస్తున్నాడు. దీని ద్వారా పారిశ్రామికవేత్త కావాలని కలలు కంటున్న యువతకు సాయికేష్ స్ఫూర్తిగా నిలిచారు.

సాయికేశ్ ఐఐటీ వారణాసి నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. వెంటనే ఓ కంపెనీ నుంచి రూ.28 లక్షలు జీతంతో ఉద్యోగం వచ్చింది. అయితే, వ్యాపారవేత్త కావాలనే అతని కల అతన్ని ఈ ఉద్యోగాన్ని విడిచిపెట్టేలా చేసింది. సాయికేశ్‌ ఉత్సాహాన్ని, అభిరుచులను గమనించిన హేమాంబర్‌రెడ్డి పరిశ్రమలో అతనితో చేతులు కలపడానికి ముందుకు వచ్చారు. ఆ తర్వాత మహ్మద్ సమీ ఉద్దీన్‌తో కలిసి ‘కంట్రీ చికెన్ కో.’ ప్రారంభించారు హేమాంబర్ రెడ్డికి పౌల్ట్రీ పరిశ్రమలో నైపుణ్యం ఉంది. మాంసం పరిశ్రమ ప్రక్రియల గురించి కూడా అవగాహన ఉంది. అలా హేమాంబర్ రెడ్డి అనుభవంతో పాటు సాయికేష్ నిబద్ధత, కఠోర శ్రమతో ఈ వెంచర్ తక్కువ కాలంలోనే విజయవంతమైంది.

మొదట్లో, చాలా మంది అతని వ్యాపారం గురించి అసహ్యించుకున్నారు. అయితే, సాయికేష్ సంకల్పం మరియు పట్టుదల కంట్రీ చికెన్ కోను విజయపథంలో నడిపించాయి. ఇప్పుడు సాయికేష్ మరియు అతని బృందం భారతదేశపు మొట్టమొదటి ప్రామాణికమైన ఆర్గానిక్ చికెన్ రెస్టారెంట్‌ను కూడా ప్రారంభించారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, ప్రగతినగర్‌లో ఈ రెస్టారెంట్లను ప్రారంభించారు. ఈ రెస్టారెంట్లు ఏర్పాటయ్యాక 70 మందికి ఉపాధి లభించింది.

కంట్రీ చికెన్ కో. ఇది దక్షిణ భారత రాష్ట్రాలలో 15,000 మంది రైతులతో టై-అప్‌లను కలిగి ఉంది. వారి నుండి నాటు కోళ్లను పోటీ ధరలకు కొనుగోలు చేస్తుంది. ఇకపై కంట్రీ చికెన్ కో. ఆరోగ్యకరమైన కోళ్ల పెంపకం పద్ధతులపై రైతులకు శిక్షణ కూడా ఇస్తున్నారు. ఈ అభ్యాసం కస్టమర్‌లకు రుచికరమైన, అద్భుతమైన నాణ్యమైన చికెన్‌ని అందించడానికి కంపెనీని ఎనేబుల్ చేసింది. తాజా నివేదికల ప్రకారం, 2022-2023 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ. 5 కోట్లను ఆర్జించనుంది. ముఖ్యంగా జనవరి 2022 నుండి ఏప్రిల్ 2023 మధ్య కాలంలో ఈ కంపెనీ గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. ఇప్పుడు దాని నెలవారీ ఆదాయం రూ.3 లక్షల నుంచి రూ.1.2 కోట్లు. వరకు పెరిగింది. 2023-2024 ఆర్థిక సంవత్సరంలో 50 కోట్లు.

Personal Loan: పర్సనల్ లోన్‌ను గడువు కంటే ముందే చెల్లిస్తే ఇన్ని లాభాలు!

Benefits Of Personal Loan Prepayment: ప్రజలు బ్యాంక్‌ల నుంచి తీసుకునే రుణాల్లో వ్యక్తిగత రుణాల సంఖ్య చాలా ఎక్కువ. పర్సనల్ లోన్ ఒక అసురక్షిత రుణం (Unsecured Loan). ఈ లోన్‌ కోసం ఏ ఆస్తిని తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. రుణం చాలా సులభంగా లభిస్తుంది. పేపర్ వర్క్ కూడా తక్కువ.

అయితే.. మిగిలిన బ్యాంక్‌ లోన్లతో పోలిస్తే వ్యక్తిగత రుణం కాస్త ఖరీదైనది, దీనిలో వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. అంటే, రుణ వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యయాన్ని పరిమితం చేయడానికి పర్సనల్‌ లోన్‌ ముందస్తు చెల్లింపు (Prepayment Of Personal Loan) ఒక సరైన మార్గం.

ముందస్తు చెల్లింపు అంటే ఏంటి?
పర్సనల్ లోన్ ప్రిపేమెంట్ అంటే లోన్ అగ్రిమెంట్‌లో చెప్పిన సమయం లేదా లోన్‌ టెన్యూర్‌ కంటే ముందే మొత్తం బాకీని లేదా లోన్‌లో కొంత భాగాన్ని చెల్లించడం. మీరు తీసుకున్న వ్యక్తిగత రుణాన్ని గడువుకు ముందే తిరిగి చెల్లించినప్పుడు, బ్యాంకులు ఔట్‌ స్టాండింగ్ అమౌంట్‌కే (మిగిలివున్న రుణ మొత్తం) ఛార్జీ విధిస్తాయి. దీనిని ఫోర్‌క్లోజర్ ఛార్జ్ (Foreclosure charge) అంటారు. రుణం తీసుకోవడానికి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉన్నట్లే, రుణాన్ని మూసివేయడానికి కూడా ఫోర్‌క్లోజర్ ఛార్జీలు చెల్లించాలి.

ఫోర్‌క్లోజర్ ఛార్జ్ ఎంత ఉంటుంది?
ఇది, తీసుకున్న రుణం, రుణదాత (బ్యాంకు) నిబంధనలు & షరతులపై ఆధారపడి ఉంటుంది. ఒక బ్యాంక్‌కు, మరో బ్యాంక్‌కు ముందస్తు చెల్లింపుపై ఛార్జీ మారుతుంది. చాలా బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCs) లోన్ ప్రి-పేమెంట్‌పై లాక్-ఇన్ పీరియడ్‌ను (Lock-in period on loan prepayment) విధిస్తాయి. ఈ లాక్‌-ఇన్‌ పిరియడ్‌లో లోన్‌ క్లోజ్‌ చేయడానికి ఉండదు, బ్యాంక్‌ను బట్టి ఇది కొన్ని నెలలు ఉంటుంది. ఈ వ్యవధి తర్వాత రుణం పూర్తిగా లేదా పాక్షికంగా తిరిగి చెల్లించొచ్చు. ఈ కేస్‌లో, ఔట్‌ స్టాండింగ్‌ అమౌంట్‌ మీద 2 నుంచి 5 శాతం వరకు ప్రి-పేమెంట్ పెనాల్టీ లేదా ఫోర్‌క్లోజర్ ఛార్జీని వసూలు చేస్తారు.

ఇప్పుడు కొన్ని బ్యాంక్‌లు ఫోర్‌క్లోజర్ ఛార్జీలు వసూలు చేయడం లేదు. అంటే.. లాక్‌-ఇన్‌ పిరియడ్‌ ముగిసిన తర్వాత మిగిలిన ఔట్‌స్టాండింగ్‌ మొత్తాన్ని కట్టేస్తే చాలు. బ్యాంక్‌లు అదనంగా ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదు.

వడ్డీ డబ్బు ఆదా
వ్యక్తిగత రుణాన్ని ముందుగానే తిరిగి చెల్లించడం వల్ల వడ్డీ రూపంలో ఖర్చు చేసే డబ్బు తగ్గుతుంది. మీరు ఎంత త్వరగా రుణాన్ని తిరిగి చెల్లిస్తే అంత తక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం, వివిధ బ్యాంకుల వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లు (Interest rates on personal loans) 9.99% నుంచి 24% మధ్య ఉన్నాయి. అధిక వడ్డీకి లోన్‌ తీసుకున్న వ్యక్తులు, అ అప్పును ముందుగానే తిరిగి చెల్లించడం మంచిది. పర్సనల్ లోన్ ప్రి-పేమెంట్ వల్ల, వడ్డీ రూపంలో చెల్లించే డబ్బు ఆదా అవుతుంది.

మరికొన్ని ప్రయోజనాలు
వ్యక్తిగత రుణాన్ని గడువుకు ముందే తిరిగి చెల్లించడం వల్ల లోన్‌ EMI మిగులుతుంది, మీ నెలవారీ బడ్జెట్ మెరుగుపడుతుంది. ఇతర రుణం తీసుకోవడానికి డౌన్ పేమెంట్‌ రూపంలో పొదుపు చేయడం, పెట్టుబడిగా పెట్టి సంపద సృష్టించడం లేదా పదవి విరమణ ప్రణాళిక వంటి ఇతర ఆర్థిక లక్ష్యాల కోసం మీరు ఆ డబ్బును ఉపయోగించవచ్చు.

పర్సనల్ లోన్ ప్రి-పేమెంట్ తర్వాత మీ క్రెడిట్ స్కోర్‌పై తక్షణం ఉండదు. అయితే, మొత్తం లోన్‌ను ముందుగానే చెల్లించినందున దీర్ఘకాలంలో క్రెడిట్ స్కోర్‌పై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. దీనివల్ల మీరు భవిష్యత్తులో తక్కువ వడ్డీ రేటుతో రుణాన్ని పొందొచ్చు.

85 అంగుళాల 4K స్మార్ట్ టీవీ ని లాంచ్ చేసిన Xiaomi ! ధర,స్పెసిఫికేషన్లు

షియోమీ సంస్థ నుండి కొత్త Xiaomi TV S85 Mini LED స్మార్ట్ టీవీ మోడల్‌ను లాంచ్ చేసింది. ముఖ్యంగా ఈ 85 అంగుళాల టీవీ 64జీబీ స్టోరేజ్, క్వాడ్ కోర్ ప్రాసెసర్, వై-ఫై 6 వంటి అనేక ప్రత్యేక ఫీచర్లతో విడుదలైంది.ఈ అద్భుతమైన టీవీ ధర మరియు ఫీచర్ల వివరాలను పరిశీలిద్దాం.
షియోమీ టీవీ S85 మినీ LED స్పెసిఫికేషన్‌ల వివరాలు: ఈ టీవీలో మినీ LED ప్యానెల్ ఉంది. ముఖ్యంగా Xiaomi TV S85 మినీ LED మోడల్ 1200 nits బ్రైట్‌నెస్ సౌకర్యంతో వచ్చింది. షియోమీ సంస్థ ఈ టీవీ డిజైన్ రూపకల్పనపై చాలా శ్రద్ధ చూపింది.

అదేవిధంగా, ఈ షియోమీ 85 అంగుళాల టీవీ 4K రిజల్యూషన్ మరియు 144 Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతుతో వస్తుంది. కాబట్టి ఈ టీవీ అత్యుత్తమ స్క్రీన్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ అద్భుతమైన షియోమీ టీవీకి ప్రత్యేకంగా మాస్టర్ పిక్చర్ క్వాలిటీ ఇంజిన్ మద్దతు ఇస్తుంది.

ఈ మాస్టర్ పిక్చర్ క్వాలిటీ ఇంజిన్ టెక్నాలజీ ఆప్టిమైజ్ కలర్స్, కాంట్రాస్ట్, క్లారిటీ మరియు మోషన్‌తో సహా పలు ప్రత్యేక ఫీచర్లను అందిస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే ఇది ప్రత్యేకమైన స్క్రీన్ అనుభవాన్ని అందిస్తుంది.

ఈ టీవీ 95% DCI-P3 కలర్ గామట్, అధిక కాంట్రాస్ట్ రేషియోతో సహా అద్భుతమైన ఫీచర్లతో వస్తుంది. ఈ అద్భుతమైన టీవీ లో బ్లూ లైట్ టెక్నాలజీ మరియు ఫ్లికర్ తగ్గింపుకు కూడా మద్దతు ఇస్తుంది.

ఈ Xiaomi TV S85 మినీ LED మోడల్ శక్తివంతమైన క్వాడ్-కోర్ A73 ప్రాసెసర్ మద్దతుతో వచ్చింది. ఈ ప్రాసెసర్ మెరుగైన పనితీరును అందిస్తుంది. అలాగే, ఈ టీవీ HyperOSలో పనిచేస్తుంది. కాబట్టి ఈ 85 అంగుళాల టీవీలో రకరకాల కొత్త ఫీచర్లు అందుబాటులో ఉండటం గమనార్హం.

ఈ టీవీ ప్రత్యేకంగా గేమింగ్ ప్రియుల కోసం రూపొందించబడింది. Xiaomi TV S85 Mini LED మోడల్ 4GB RAM మరియు 64GB స్టోరేజ్‌తో విడుదల చేయబడింది. కాబట్టి ఈ టీవీలో అన్ని యాప్‌లను సజావుగా ఉపయోగించుకోవచ్చు. ఈ టీవీ వేరియబుల్ రిఫ్రెష్ రేట్ (VRR), ALLM (ఆటో తక్కువ లేటెన్సీ మోడ్) కూడా సపోర్ట్ చేస్తుంది.

ఇది డాల్బీ విజన్ పనోరమిక్ సౌండ్ సపోర్ట్‌తో నాలుగు స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. కాబట్టి ఈ టీవీ అత్యుత్తమ ఆడియో అనుభూతిని అందిస్తుంది. అలాగే, ఈ అద్భుతమైన స్మార్ట్ టీవీ Wi-Fi 6, HDMI పోర్ట్, USB పోర్ట్ మొదలైన వాటితో సహా వివిధ కనెక్టివిటీ ఫీచర్లకు మద్దతుతో వస్తుంది.

ముఖ్యంగా షియోమీ TV S85 మినీ LED మోడల్ ప్రస్తుతం చైనాలో మాత్రమే లాంచ్ చేయబడింది. త్వరలోనే ఈ టీవీని భారత్‌తో పాటు ఇతర దేశాల్లో కూడా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా, ఈ షియోమీ టీవీ ధర 7999 యువాన్లు (భారత కరెన్సీలో రూ. 92,163) గా లాంచ్ అయింది.

అదేవిధంగా, షియోమీ త్వరలో భారతదేశంలో వివిధ అద్భుతమైన టీవీలను లాంచ్ చేయాలనీ యోచిస్తోంది. ఈ సంస్థ తీసుకొచ్చిన ప్రతి స్మార్ట్ టీవీకి మంచి ఆదరణ లభిస్తుండడం గమనార్హం.

Gold Rate: గోల్డ్ @ 71000.. నేడు కళ్లు తిరిగే రేటుకు పసిడి పరుగు.. ఇంకెంత కాలం..??

Gold Price Today: ప్రస్తుతం పెరుగుతున్న బంగారం ధరలతో ప్రజలు కళ్లతో చూసి ఆనందపడటమే తప్ప చేతితో కొనుక్కోలేని పరిస్థితులు నెలకొన్నాయి. పసిడి రేటు పరుగులకు హద్దు అదుపు లేకుండా పోవటంతో నేడు దాదాపు 10 గ్రాముల ధర సరికొత్త గరిష్ఠమైన రూ.71 వేల మార్కుకు చేరుకుంది.
దీంతో దేశంలోని పసిడి ప్రియుల కళ్లలో బాధ కనిపిస్తోంది. వేగంగా పెరుగుతున్న బంగారం ధరలు అసలు ఏ కారణంగా పెరుగుతున్నాయి, ఇంకెంత కాలం ఈ ధోరణి కొనసాగుతుందనే ఆందోళనలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే ఈ ఏడాది మధ్యలో వడ్డీ రేట్లను సెంట్రల్ బ్యాంకులు తగ్గించే అవకాశాలు కనిపిస్తుండటంతో పెట్టుబడిదారులు తమ డబ్బును పసిడి, వెండిలోకి తీసుకొస్తున్నారని తెలుస్తోంది. దీంతో ఊహించని రీతిలో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతున్నాయి. ఇది సాధారణ ఆభరణాల కొనుగోలుదారుల జేబులకు పెద్ద కన్నం వేస్తున్నాయి.

నేడు 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.750 పెరిగింది. ఈ క్రమంలో దేశంలోని వివిధ నగరాల్లో రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.65,000, దిల్లీలో రూ.64,250, ముంబైలో రూ.64,100, కలకత్తాలో రూ.64,100, కేరళలో రూ.64,100, బెంగళూరులో రూ.64,100, వడోదరలో రూ.64,150, జైపూరులో రూ.64,250, మంగళూరులో రూ.64,100, నాశిక్ లో రూ.64,130, అయోధ్యలో రూ.64,250, బళ్లారిలో రూ.64,100, గురుగ్రాములో రూ.64,250, నోయిడాలో రూ.64,250 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర నేడు నిన్నటితో పోల్చితే రూ.760 పెరిగింది. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో పెరిగిన రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.70,910, దిల్లీలో రూ.70,020, ముంబైలో రూ.69,870, కలకత్తాలో రూ.69,870, కేరళలో రూ.69,870, బెంగళూరులో రూ.69,870, వడోదరలో రూ.69,920, జైపూరులో రూ.70,020, మంగళూరులో రూ.69,870, నాశిక్ లో రూ.69,900, అయోధ్యలో రూ.70,020, బళ్లారిలో రూ.69,870, గురుగ్రాములో రూ.70,020, నోయిడాలో రూ.70,020గా ఉన్నాయి.

ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.64,100గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.69,870 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి రూ.2000 పెరిగి రూ.84,000 వద్ద కొనసాగుతోంది.

Health

సినిమా