Thursday, September 19, 2024

AP Inter Results 2024 : BIEAP to declare 1st, 2nd year results today Here’s how to check

ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను ఈ నెల 12న విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్‌ విద్యామండలి సన్నాహాలు చేస్తోంది.

అమరావతి: ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను ఈ నెల 12న విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్‌ విద్యామండలి సన్నాహాలు చేస్తోంది. ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఒకేసారి ఇవ్వనున్నారు. ఫలితాలకు సంబంధించిన అంతర్గత పనులు బుధవారం మధ్యాహ్నంతో పూర్తికానున్నాయి. ఇందులో ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే ఒకటి, రెండు రోజులు ఆలస్యంగా ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈ ఏడాది రెగ్యులర్‌, ఒకేషనల్‌ విద్యార్థులు కలిపి మొదటి సంవత్సరం 5,17,617, రెండో ఏడాది 5,35,056 మంది పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు.

ఏపీ ఇంటర్‌ ఫలితాల్లో (AP Inter Results) మొదటి సంవత్సరం 67 శాతం, ద్వితీయ సంవత్సరం 78 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. ప్రథమ సంవత్సరంలో బాలికలు 71 శాతం, బాలురు 64 శాతం పాసయ్యారు. ద్వితీయ సంవత్సరంలో బాలికలు 81 శాతం, బాలురు 75 శాతం ఉత్తీర్ణత సాధించారు.

మొదటి సంవత్సరం ఫలితాల్లో 84 శాతంతో కృష్ణా జిల్లా ప్రథమ స్థానం సాధించింది. 81 శాతంతో గుంటూరు ద్వితీయ స్థానం, 79 శాతంతో ఎన్టీఆర్‌ జిల్లా తృతీయ స్థానంలో నిలిచాయి. 48 శాతంతో అల్లూరి సీతారామరాజు జిల్లా చివరి స్థానంలో ఉంది. రెండో సంవత్సరం ఫలితాల్లో 90 శాతంతో కృష్ణా జిల్లా మొదటి స్థానం సాధించగా.. 87 శాతంతో గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లాలు రెండో స్థానంలో నిలిచాయి. 84 శాతంతో విశాఖ జిల్లా మూడో స్థానం దక్కించుకుంది. 63 శాతంతో చిత్తూరు జిల్లా ఆఖరి స్థానంలో నిలిచింది.

రీకౌంటింగ్‌, రీవాల్యుయేషన్‌ ఫీజు చెల్లింపునకు ఈ నెల 18 నుంచి 24 వరకు అవకాశం కల్పించారు. మే 24 నుంచి జూన్‌ 1 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.
AP Inter Results 2024 Live Updates: BIEAP to declare 1st, 2nd year results today at bie.ap.gov.in. Here’s how to check

AP Inter Results 2024 Live: How to check results?
To check your scores for AP Intermediate Results 2024, follow these steps: Visit the official website at bie.ap.gov.in.

Click on the link provided for AP Inter Results 2024 on the homepage.

Log in by entering your credentials.

Your AP Intermediate Result score will be displayed on the screen.

Download the AP Inter Results mark sheet. Keep a hard copy of the mark sheet for future reference.

12/4/2024 ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల!

AP Inter Board Website

INTERMEDIATE PUBLIC REGULAR EXAMINATIONS RESULTS-2024
1st Year General Results Click Here
1st Year Vocational Results Click Here
2nd Year General Results Click Here
2nd Year Vocational Results Click Here

https://resultsbie.ap.gov.in/

 

Eenadu Website

JUNIOR INTER General Vocational
SENIOR INTER General Vocational

sakshi education results

 

Mana Badi Results 

AP Inter 1st Year Results …..click here

AP Inter 2nd Year Results …..click here

Janasena: గ్లాసు గుర్తును పోలిన బకెట్‌.. జనసేనపై ప్రభావం ఎంత..

జనసేన పార్టీలో బకెట్‌ సింబల్‌ చిచ్చు రేపుతోంది. గాజు గ్లాసును పోలి ఉండటంతో ఆ పార్టీకి నిద్రపట్టనివ్వడం లేదంటున్నారు కొందరు పరిశీలకులు. అంతేకాదు.. జనసేన అభ్యర్థుల పేర్లతోనే బకెట్ గుర్తు అభ్యర్థులు కూడా బరిలో ఉండటం ఆ పార్టీని ఆందోళనకు గురిచేస్తోంది. ఏపీలో ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరింది. ఒక వైపు సీఎం జగన్ మేమంతా సిద్దం అంటూ జిల్లాల వారిగా బస్సు యాత్రలు చేస్తున్నారు. ఇదే తరుణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటన తరువాత చంద్రబాబుతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ప్రజాగళం పేరుతో తణుకు రోడ్ షోలో పాల్గొన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో తమ సామాజిక వర్గ ఓటర్లను ఆకర్షించేందుకు కలిసి ప్రచారం చేస్తున్నారు ఇరుపార్టీల అధ్యక్షులు. అయితే ఇలాంటి నేపథ్యంలో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. తమను ఎన్నికల్లో పోటీ చేయొద్దంటూ జనసేన బెదిరిస్తోందని నవరంగ్ పార్టీ చీఫ్‌ జలీల్‌ ఆరోపించారు.

ఎలక్షన్స్‌ అంటే ప్రధాన పార్టీలకు చుక్కలు చూపిస్తుంటాయి చిన్న పార్టీలు. ఎందుకంటే తమ పార్టీ అభ్యర్థుల పేర్లతో బరిలో దిగుతారన్న దిగులు ఓవైపు. అంతకంటే పెద్ద తలనొప్పి ఏంటంటే తమ పార్టీ గుర్తుని పోలిన గుర్తులేమైనా వస్తాయేమోనన్న భయం ఇంకోవైపు. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అలాంటి చిక్కే వచ్చిపడింది. జనసేన పొలిటికల్‌ స్టోరీలోకి నవరంగ్‌ కాంగ్రెస్‌ అనే ఓ సీజనల్‌ పార్టీ తేరంగేట్రం చేసింది. ఇది ప్రస్తుతం జనసేనకు నిద్రలేకుండా చేస్తోంది. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లేని పార్టీలకు ప్రకటించిన గుర్తుల్లో.. నవరంగ్‌ కాంగ్రెస్‌కు బకెట్‌ గుర్తు లభించింది. దీంతో ఆ పార్టీ పండగచేసుకుంటుంటే.. అదే సమయంలో గాజుగ్లాసు గుర్తును సంపాదించుకున్న జనసేన నేతలు మాత్రం తలలు పట్టుకుంటున్నారు. తమ గుర్తును పోలిఉన్న బకెట్‌తో పెద్ద థ్రెట్‌ ఉందని భావిస్తున్నారు. అంతేకాదు.. నవరంగ్‌ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల పేర్లు కూడా జనసేన అభ్యర్థులతో మ్యాచ్‌ అవుతున్నాయి.

పిఠాపురంలో బకెట్ గుర్తు అభ్యర్థి కె.పవన్‌కల్యాణ్‌, తెనాలిలో బకెట్ గుర్తు అభ్యర్థి ఎన్‌.మనోహర్‌, మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా బాలశౌరిని నిలబెట్టామంటున్నారు నవరంగ్‌ కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ జలీల్‌ఖాన్‌. అవి యాధృచ్చికంగా వచ్చాయని చెబుతున్నారాయన. ఇందులో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని తెలిపారు. మరోవైపు నవరంగ్‌ పార్టీ చీఫ్‌ను పిలిపించి మాట్లాడిన జనసేన నేత బాలశౌరి.. ఆయన దగ్గరున్న బీఫామ్స్‌ మొత్తం తీసుకుపోయారన్న ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. బాలశౌరి తన తలపై గన్ను గురిపెట్టి.. బెదిరించి.. బీఫామ్స్‌ మొత్తం కాజేశారంటున్నారు. ఏదైనా ఉంటే చర్చల ద్వారా తేల్చుకోవాలి గాని.. బెదిరించడం దారుణమంటున్నారు. గతంలో తెలంగాణలో బీఆర్ఎస్‎కు కూడా ఇలాంటి కష్టాలు వచ్చాయి. కారు గుర్తుని పోలిఉన్న రోడ్డురోలర్‌, చపాతీ కర్ర, ఆటోరిక్షా, ఇస్త్రీపెట్టె, ట్రక్కు గుర్తులు చాలా ఇబ్బంది పెట్టాయి. ఇప్పుడు జనసేన వంతు వచ్చింది. మరి నవరంగ్‌ పార్టీ అధ్యక్షుడి డిమాండ్లకు తలొగ్గుతారో.. లేదో.. చూడాలి.

Dakshinamurthy sthotram: దక్షిణామూర్తి స్తోత్రం అంటే ఏంటి? ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల కలిగే లాభాలు ఏంటి?

Dakshinamurthy sthotram: సమస్త విశ్వానికి గురువుగా దక్షిణామూర్తి భావిస్తారు. మర్రి చెట్టు కింద కూర్చొని రుషులు చుట్టూ ఉన్నట్లుగా దక్షిణామూర్తి చిత్రపటం ఉంటుంది.

త్రిలోకాలకు ఉపదేశకునిగా దక్షిణామూర్తి జనన మరణ దుఃఖాలను పోగొడతాడు. శ్రీ ఆదిశంకరాచార్యులు స్వరపరచిన దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల ఏకాగ్రత జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

ఈ శ్లోకం శివుడికి సంబంధించినది. క్రమం తప్పకుండా జపిస్తే జీవితంలోనే అడ్డంకులు, సవాళ్లను అధిగమించడంలో సహాయపడుతుంది. ప్రతి గురువారం దక్షిణామూర్తి శ్లోకాన్ని పట్టించడం వల్ల అదృష్టం, అనుకూలమైన పరిస్థితులు కలిసి వస్తాయి.

ఈ స్తోత్రం పఠించడం వల్ల అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్న వివాహం నిశ్చయమవుతుంది. గురు గ్రహ శాంతి కోసం దక్షిణామూర్తిని పూజిస్తారు. విద్యార్థులు ఈ శ్లోకం పఠించడం వల్ల చదువులో ఉన్నతంగా రాణిస్తారు. జ్ఞానాన్ని అందించే గురువులకే గురువుగా దక్షిణామూర్తిని పరిగణిస్తారు.

దక్షిణామూర్తి స్తోత్రం అనేది శివుని రూపాలలో ఒకరైన దక్షిణామూర్తికి అంకితం చేసిన ప్రార్థన. అంతిమ అవగాహన, జ్ఞానం కలిగిన వ్యక్తిగా దక్షిణామూర్తిని పరిగణిస్తారు. అందుకే ఆయన్ని అంతిమ గురువుగా చెప్తారు. దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో దక్షిణామూర్తికి అనేక ఆలయాలు కూడా ఉన్నాయి.

సర్వోన్నత గురువుగా ఆయనను పూజిస్తారు. క్రీస్తు శకం 8వ శతాబ్దంలో దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఆదిశంకరాచార్యులు స్వరపరిచారు. పది శ్లోకాలతో కూడి ఉంటుంది. ప్రతి ఒక్కటి దక్షిణామూర్తి విభిన్న కోణాలను వివరిస్తుందని పండితులు చెబుతారు. జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం ప్రాముఖ్యతను ఈ సూత్రాలు వివరిస్తాయి.

విశ్వం దర్పణదృశ్యమాననగరీతుల్యం నిజాంతర్గతం

పశ్యన్నాత్మని మాయయా బహిరోవోద్భూతం యథా నిద్రయా

యః సాక్షాత్కుఋతే ప్రబోధసమయే స్వాత్మానమేవాద్వయం

తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే..||

బీజస్యాంతరి వాంకురో జగదిదం ప్రాజ్ఞర్వికల్పం పునః

మాయాకల్పిత దేశకాలకలనా వైచిత్ర్యంచిత్రీకృతం

మాయావీయ విజృంభయత్యపి మహా యోగీవ యః స్వేచ్చయా

తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే..|||

యస్వైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే

సాక్షాత్తత్తవ్యమసీతి వేదవచసా యో బోధయత్యాశితాన్

యత్శాక్షాత్కరణాద్భవేన్న పునరావృత్తిర్భవాంభోనిధౌ

తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే|||

నానాచ్చిద్రఘటో దరస్థితమహాదీప ప్రభాభాస్వరం

జ్ఞానం యస్య తు చక్షురాదికరణ ద్వారా బహిః స్పందతే

జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్సమస్తం జగత్

తస్మైశ్రీ గురుమూర్తయే నమా ఇదం శ్రీ దక్షిణామూర్తయే||||

దేహం ప్రాణమా పీంద్రియాణ్యాపి చలాం బుద్ధిః చ శూన్యం విదుః

స్త్రీబాలాంఢజడోపమాస్త్వహమితి భ్రాంతా భృశం వాదినః|

మాయాశక్తివిలాసకల్పితమహా వ్యామోహసంహారిణే

తస్మైశ్రీ గురుమూర్తయే నమా ఇదం శ్రీ దక్షిణామూర్తయే||||

రాహుగ్రస్తదివాకరేందుసదృశో మాయాసమాఛ్ఛాదనాత్

సన్మాత్రః కరణోపసంహరణతో యో భూత్సుషుప్తః పుమాన్

ప్రాగస్వాప్సమితి ప్రభోదసమయే యః ప్రత్యభి జ్ఞాయతే

తస్మైశ్రీ గురుమూర్తయే నమా ఇదం శ్రీ దక్షిణామూర్తయే|||||

బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వవస్థాస్వపి

వ్యావృత్తాస్వను వర్తమానమహమిత్యంతః స్ఫురంతం సదా

స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా

తస్మైశ్రీ గురుమూర్తయే నమా ఇదం శ్రీ దక్షిణామూర్తయే|||||

విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామిసంబంధతః

శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాద్యాత్మనా భేదతః

స్వప్నే జాగ్రతి వా య ఏష పురుషొ మాయాపరిభ్రామితః

తస్మైశ్రీ గురుమూర్తయే నమా ఇదం శ్రీ దక్షిణామూర్తయే|||||

భూరంభాంస్యనలో నిలో మ్బరమహర్నాథో హిమాంశుః పుమాన్

ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యవ మూర్త్వష్టకం

నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్పరస్మాద్విభోః

తస్మైశ్రీ గురుమూర్తయే నమా ఇదం శ్రీ దక్షిణామూర్తయే||||||

సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్ స్తవే

తేనాస్య శ్రావణాత్తదర్థమననాద్ధానాచ్చ సంకీర్తనాత్

సర్వాత్మత్వమహావిభూతిసహితం స్యాదీశ్వరత్వం స్వతః

సిద్ద్ధ్యేత్తత్సునరష్టధా పరిణతం చైశ్వర్యమవ్యాహతం||

బ్రిటిష్ వారికి సైతం అప్పులు ఇచ్చిన భారతీయుడు ఎవరో తెలుసా..?

నవంతులు అనగానే మనకు అంబానీ, ఆదానీ పేర్లు గుర్తుకువస్తాయి.. బ్రిటీష్ వాళ్ళు దేశాన్ని పాలిస్తున్న కాలంలో అంబానీ కంటే గొప్ప ధనవంతుడు, బ్రిటిష్ వారికి అప్పులిచ్చే వ్యక్తి మన దేశంలో ఉన్నాడని మీకు తెలుసా?

అలాంటి ధనవంతులలో ఒకరు సేథ్ ఫతే చంద్ అలియాస్ ‘జగత్ సేథ్’. అతను 18వ శతాబ్దపు అతిపెద్ద అంతర్జాతీయ బ్యాంకర్. బ్రిటిష్ వారు కూడా అతని నుండి డబ్బు తీసుకుంటున్నందున అతన్ని జగత్ సేథ్ అని పిలిచేవారు. ఆ సమయంలో, అతని నికర విలువ నేటి భారీ సంపదకు సమానం.

గతంలో భారతదేశాన్ని బంగారు పక్షి అని పిలిచేవారు, బ్రిటిష్ వారు కూడా ఈ సౌభాగ్యాన్ని చూసి భారతదేశానికి వచ్చి సంవత్సరాల తరబడి ఇక్కడ పాలించారు. బ్రిటిష్ పాలనలో, భారతదేశం ప్రపంచ వాణిజ్యంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. జగత్ సేథ్ బ్రిటిష్ కాలంలో గొప్ప వ్యాపారవేత్త మరియు బ్యాంకర్, అతను వడ్డీకి డబ్బు ఇచ్చేవాడు. అప్పట్లో ఆయన సంపద నేటి కరెన్సీలో దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలని పలు మీడియా కథనాలు ప్రచురించాయి.

బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అధికారిక చరిత్రకారుడు రాబిన్ ఓర్మే, జగత్ సేథ్‌ను ఆ సమయంలో ప్రపంచంలోనే గొప్ప బ్యాంకర్ మరియు డబ్బు మార్చే వ్యక్తిగా పేర్కొన్నాడు. నేడు, పశ్చిమ బెంగాల్‌లోని జగత్ సేథ్ ఇంటిని మ్యూజియంగా మార్చారు.

మరొక చరిత్రకారుడు, గులాం హుస్సేన్ ఖాన్, జగత్ సేథ్ తన వ్యాపారాన్ని 17వ శతాబ్దం చివరి త్రైమాసికంలో ప్రారంభించాడు. 18వ శతాబ్దం నాటికి, ఇది బహుశా దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థగా మారింది. జగత్ సేథ్ బెంగాల్ ఆర్థిక వ్యవహారాలలో చాలా ప్రభావం చూపాడు. అక్కడ నాణేలను ముద్రించే గుత్తాధిపత్యాన్ని కూడా కలిగి ఉన్నాడు. ఆ సమయంలో, దేశంలోని అనేక ప్రాంతాలలో జగత్ సేథ్ కార్యాలయాలు ఉన్నాయి, అక్కడ నుండి డబ్బు ఇచ్చే పని నిర్వహించబడింది. జగత్ సేథ్ నిరుపేదలకు డబ్బు ఇచ్చేవాడు.

నేడు బ్యాంకుల వ్యాపారం చేసే విధానం, కొంతమేరకు జగత్ సేథ్ కూడా వ్యాపారం చేశాడు. దేశంలోని వివిధ నగరాల మధ్య వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి, వారు దూతలను సంప్రదించే మంచి అంతర్గత కమ్యూనికేషన్ వ్యవస్థను నిర్వహించారు. అతని బ్యాంకింగ్ నెట్‌వర్క్ కోల్‌కతా, ఢాకా, ఢిల్లీ మరియు పాట్నాలో విస్తరించింది. తన పుస్తకం ‘ప్లాసీ: ది బ్యాటిల్ దట్ చేంజ్డ్ ది కోర్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ’లో, సుదీప్ చక్రవర్తి జగత్ సెథ్‌ను తన కాలపు అంబానీ అని కొనియాడారు.

జగత్ సేథ్ లేదా అతని కుటుంబం గుర్తించి పుస్తకాలు ఉన్నాయి. కానీ ధనవంతుల విషయానికి వస్తే, వారు ప్రస్తావించబడలేదు. దీనికి ప్రధాన కారణం జగత్ సేథ్ కుటుంబానికి చెందిన ఆస్తులు పూర్తిగా ధ్వంసం కావడమే. బ్రిటీష్ వారి ఆధిపత్యం కారణంగా కుటుంబం తన పట్టును కోల్పోయింది. అంతే కాదు, బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ జగత్ సేథ్ నుంచి అప్పుగా తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వలేదు. సియార్-ఉల్-ముతాఖేరిన్ ప్రకారం, సిరాజ్‌పై ప్రచారం కోసం జగత్ సేథ్ బ్రిటిష్ వారికి రూ.3 కోట్లు ఇచ్చాడు. రూ.లక్ష ఇచ్చారని, బ్రిటీష్ వారు తిరిగి చెల్లించలేదన్నారు.

20వ శతాబ్దం ప్రారంభంలో, జగత్ సేథ్ కుటుంబం పేరు ఎక్కడా వినబడలేదు. ముఖ్యంగా, మొఘల్ చక్రవర్తి ముహమ్మద్ షా 1723లో ఫతే చంద్‌కు జగత్ సేథ్ అనే బిరుదును ప్రదానం చేశాడు, దీని అర్థం ‘ప్రపంచ బ్యాంకర్’. అతని ఇల్లు ఈరోజు పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో ఉంది. ఇది ఇప్పుడు మ్యూజియం.

వచ్చే నెలలో 50 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు!

వాతావరణ నిపుణుల అంచనా

అసాధారణ ఉష్ణోగ్రతలు అరుదే

2003 మే 28న 49.9 డిగ్రీలతో రెంటచింతల టాప్‌

ఏప్రిల్‌ చరిత్రలో తిరుపతిలో అత్యధికంగా 45.7 డిగ్రీలు

ఆదివారం 46 డిగ్రీలతో ఆ రికార్డును తుడిచేసిన మార్కాపురం

సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో అసాధారణ ఉష్ణోగ్రతలు అరుదుగా నమోదవుతున్నాయి. వేసవిలో రికార్డయ్యే ఈ ఉష్ణోగ్రతలు ఒకింత ఆశ్చర్యం గొలుపుతున్నాయి. ఇటీవల కాలంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది ఏప్రిల్‌ ఆరంభంలోనే మే నెలను తలపించే వడగాడ్పులు, తీవ్ర వడగాడ్పులు వీస్తున్నాయి. మే నెలలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు మించి నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో గడచిన 132 ఏళ్లలో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) గణాంకాలను పరిశీలిస్తే.. మన రాష్ట్రంలో నమోదైన గరిష్ట (పగటి) ఉష్ణోగ్రతలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

1875లో ఐఎండీ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో రికార్డయిన ఉష్ణోగ్రతలను గమనిస్తే.. 2003 మే 28న రెంటచింతలలో (ప్రస్తుత పల్నాడు జిల్లా) అత్యధికంగా 49.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇప్పటివరకు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతల్లో ఇదే రికార్డు. ఆ తర్వాత స్థానంలో ప్రస్తుత తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నిలిచింది. అక్కడ 1962 మే 26న 48.9 డిగ్రీలు నమోదైంది. గన్నవరంలో 2002 మే 11న 48.8, నంద్యాలలో 1994 మే 11న 48.2, మచిలీపట్నంలో 1906 మే 25న 47.8, తునిలో 1998 మే 30న 47.5, విజయవాడలో 1980 మే 26న 47.5, ఒంగోలులో 2003 మే 31న 47.4, నరసారావుపేటలో 1983 మే 2,3 తేదీల్లో 47, నెల్లూరులో 1892 మే 15న, 1894 జూన్‌ 1న 46.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

ఏప్రిల్‌ ఉష్ణోగ్రతలు ఇలా..
ఏప్రిల్‌ నెలలోనూ అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితులున్నాయి. గడచిన పదేళ్లలో (ఏప్రిల్‌లో) 2016 ఏప్రిల్‌ 25న తిరుపతిలో నమోదైన 45.7 డిగ్రీల ఉష్ణోగ్రతే అత్యధికం. ఈ రికార్డును ఆదివారం ప్రకాశం జిల్లా మార్కాపురంలో నమోదైన 46 డిగ్రీల ఉష్ణోగ్రత చెరిపేసింది. ఇంకా ఆదివారం నంద్యాల జిల్లా చాగలమర్రి, నెల్లూరు జిల్లా కలిగిరిలో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏప్రిల్‌లో ఎల్‌నినో వంటి ప్రత్యేక పరిస్థితుల్లో అసాధారణ ఉష్ణోగ్రతలు రికార్డవుతాయని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ ఎస్‌.స్టెల్లా ‘సాక్షి’కి చెప్పారు.

కోట్ల రూపాయలతో అపార్ట్ మెంట్స్ కొన్నాం.. నీళ్లు ఇవ్వండి ప్లీజ్ : రోడ్డెక్కిన ధనవంతులు

కర్ణాటకలో గత కొన్నిరోజులుగా నీళ్ల సమస్య ఏవిధంగా ఉందో మనం చూస్తున్నాం. చేతులు కడుక్కోవడానికి కూడా టిష్యూలు వాడుతున్నారంటే నీటి సమస్య ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఈ సమస్య ఇపుడు మరింత తీవ్ర రూపం దాల్చింది. రాష్ట్ర రాజధాని బెంగళూరు సిటీలో వ్యాపారులు మూతపడ్డాయి. బిజినెస్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. చాలా చిన్నాచితక హోటళ్లు నీటి కొరతతో మూసేసారు. చాలా మంది ఇప్పటికే తమ సొంతూళ్లకు వెళ్లారు.

బెంగళూరులోని మామూలు ప్రాంతాల్లోనే కాదు..ఏకంగా కోట్ల రూపాయలు పెట్టి ఫ్లాట్లు కొన్న రెసిడెన్సియల్ కాలనీల్లోనూ,సొసైటీల్లోనూ నీటి సమస్య తీవ్రమైంది. అపార్ట్ మెంట్ ,రెసిడెన్షియల్ వాసులు నీళ్ల కోసం రోడ్డెక్కుతున్నారు. కోట్టు పెట్టి ఫ్లాట్లు కొన్నా నీళ్లు లేవని ఆందోళన చేస్తున్నారు.

నీటి కొరతను దృష్టిలో పెట్టుకుని బెంగుళూరు నీటి సరఫరా మురుగునీటి బోర్డు (BWSSB) రోజుకు 40 లక్షల నుండి 2 కోట్ల లీటర్ల మధ్య వినియోగిస్తున్న రెసిడెన్షియల్ కాలనీలకు, సొసైటీలకు నీటి సరఫరాలో 10 శాతం కోత విధించారు. దీంతో సెంట్రల్ బెంగళూరులోని షాపూర్జీ పల్లోంజీ పార్క్‌వెస్ట్‌లో కూడా నీటి ఇబ్బందులు తలెత్తాయి. ఈ రెసిడెన్షియల్ లో ఒక్కో ఫ్లాట్‌ ధర దాదాపు రూ. 2 కోట్ల వరకు ఉంది. అయితే కోట్లు పెట్టి కొన్నా నీటి కష్టాలేంటని బిల్డర్ కు వ్యతిరేకంగా రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు నివాసితులు. నిరసన చేస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెద్ద సంఖ్యలో పురుషులు, మహిళలు ప్లకార్డులు పట్టుకుని కోట్టు పెట్టి ఫ్లాట్టు కొన్నా నీటి ఇబ్బందులేంటి..మాకు నీళ్లు కావాలి అంటూ బిల్డర్ కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు.

అయితే నివాసితుల నీటి సమస్యలు తీర్చడానికి తాము ప్రయత్నిస్తున్నామని షాపూర్జీ పల్లోంజీ రియల్ ఎస్టేట్ యాజమాన్యం ప్రకటించింది. నీటి సమస్యను దృష్టిలో పెట్టుకుని సొసైటీ ఆఫీస్ బేరర్లతో మాట్లాడుతున్నామని షాపూర్జీ పల్లోంజి అధికార ప్రతినిధి మీడియాకు తెలిపారు. నీటి ట్యాంకర్లకు ఆర్డర్ ఇచ్చినా వంద శాతం సరఫరా చేయలేకపోతున్నామని చెప్పారు.

దడ పుట్టిస్తున్న పుత్తడి.. తులం 80 వేలకు చేరనుందా? ఈ రోజు ధర ఎంతంటే?

ప్రస్తుతం దేశంలో పసిడి ధరలు వరుసగా పెరిగిపోతూ వస్తున్నాయి. ఓ వైపు పెళ్లిళ్ల సీజన్ కావడంతో కొనుగోలుదారులకు షాక్ ఇస్తుంది పసిడి. దీనికి కారణం అంతర్జాతీయ మార్కెట్ లో నెలకొన్న ఆర్థిక సంక్షోభమే అంటున్నారు ఆర్థిక నిపుణులు. కొంత కాలంగా డాలర్ విలువ హెచ్చుతగ్గులు, వడ్డీ రేట్లలో పలు మార్పుల ప్రభావం బంగారం, వెండి పై తీవ్రంగా పడుతుందని అంటున్నారు నిపుణులు. ప్రస్తుతం పసిడి ధరలు చూస్తుంటే కళ్లు తిరుగుతున్నాయి. రికార్డు మోత మోగిస్తూ రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉంది. ఒకటీ రెండు రోజులు కాస్త తగ్గుముఖం పట్టినా… మళ్లీ ఆకాశాన్నంటుతున్నాయి ధరలు. నేడు మార్కెట్ లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

ప్రపంచంలో అత్యంత విలువైనది బంగారం. అందుకే పసిడి కొనుగోలు చేయడానికి ఇష్టపడుతుంటారు. ఇది కేవలం ఆభరణాలుగా మాత్రమే కాదు.. ఆపద సమయంలో పనికి వచ్చే ఇన్వెస్ట్‌మెంట్ గా భావిస్తుంటారు. ఈ కారణం చేతనే గత కొంత కాలంగా పసిడి కొనుగోలు విపరీతంగా పెరిగిపోయింది. మన దేశంలో ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది.. దీంతో పసిడి, వెండి కొనుగోలు బాగా పెరిగిపోవడంతో ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు ఎలా ఉన్నాయంటే.. హైదరాబాద్,వరంగల్, విశాఖ, విజయవాడ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,210 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,230 వద్ద కొనసాగుతుంది. కిలో వెండి ధర రూ.88,400వద్ద కొనసాగుతుంది.

ప్రధాన నగరాల్లో నేటి ధరలు ఎలా ఉన్నాయంటే.. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,360 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,380 వద్ద కొనసాగుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై, బెంగుళూరు, కోల్‌కొతా, కేరళాలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.65,760లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.71,740 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,260 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,370 వద్ద కొనసాగుతుంది. బెంగుళూరు లో కిలో వెండి ధర రూ.84,600, ముంబై, కోల్‌కొతాలో కిలో వెండి ధర రూ.84,900వద్ద ట్రెండ్ అవుతుంది. చెన్నై కిలో వెండి ధర రూ.88,400 లు ఉండగా, ఢిల్లీ లో రూ.84,900 వద్ద ట్రెండ్ అవుతుంది. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే సరైన సమయం అంటున్నారు నిపుణులు. రేపు మార్కెట్ లో బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పులు ఉండబోతాయో చూడాలి.

Eye Vision Exercises: కంటి చూపుకు పదును పెట్టే ఎక్సర్‌సైజ్‌లు.. రోజుకు రెండు సార్లు చేశారంటే..

వయసు పెరిగే కొద్దీ కంటిచూపు మందగింజడం సహజం. అయితే అతి చిన్న వయసులోనే కంటి పవర్ రోజురోజుకు తరిగిపోతుంటే మాత్రం వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి. మరీ ముఖ్యంగా నేటి కాలంలో ఎలక్ట్రిక్‌ గాడ్జెట్స్ కారణంగా చాలా మందికి అనేక రకాల కంటి సమస్యలు వస్తున్నాయి.

రోజంతా ల్యాప్‌టాప్, ఫోన్‌తో కూర్చోవడమే అందుకు కారణం. అయితే ఈ కింది కంటి వ్యాయామాలు చేస్తే కంటిచూపు బాగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం..

గతితప్పిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ఈ రోజుల్లో అన్ని వయసుల వారికి కంటి చూపు మందగిస్తుంది. అటువంటి పరిస్థితులలో ప్రత్యేక కంటి సంరక్షణ అవసరం. అలాగే కళ్ల చుట్టూ నల్లటి వలయాలు, ముడతలు ఏర్పడుతున్నాయి. కాబట్టి వీటిని నివారించడానికి క్రమం తప్పకుండా కంటి వ్యాయామాలు చేయాలి.

కొన్ని నిమిషాల పాటు వేళ్లతో కనురెప్పను తేలికగా నొక్కాలి. తర్వాత కనురెప్పపై వేలితో ఒకసారి సవ్యదిశలో, మరోసారి అపసవ్య దిశలో తిప్పుతూ ఉండాలి. పని చేస్తున్నప్పుడు ఒక్కోసారి కళ్ళు నొప్పిగా ఉంటాయి. ఆ నొప్పి క్రమంగా తలనొప్పిగా మారుతుంది. కొన్ని నిమిషాల పాటు ఈ వ్యాయామం చేయడం ద్వారా ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

కళ్లకు ఫోకస్ చేయడం, రొటేషన్, పైకి క్రిందికి చూడటం వంటి వ్యాయామాలు కూడా చేయవచ్చు. ఈ వ్యాయామం కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది నల్లటి వలయాలను కూడా తొలగిస్తుంది.

ఈ వ్యాయామం రోజుకు రెండుసార్లు లేదా మీకు సమయం దొరికినప్పుడల్లా చేయవచ్చు. అయితే కంటి చూపు మెరుగుపడాలంటే రాత్రి పూట ఫోన్ వాడకాన్ని నివారించాలి.

అధిక చెమటను ఈ చిట్కాలతో నివారించండి

ఎండాకాలం వచ్చేసింది. ఈసారి ఎండలు మండిపోతున్నాయి. అయితే ఎండాకాలంలో కొంతమందికి చెమట ఎక్కువగా పట్టి చిరాకు పుట్టిస్తూ ఉంటుంది. అలాగే చాలా అసౌకర్యంగా అన్పిస్తుంది కూడా. అయితే ఈ సమస్యను నివారించడానికి అనేక సింపుల్ గా ఇంటి చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. ఈ ఇంటి చిట్కాలు అధిక చెమటను నిరోధించడానికి బాగా పని చేస్తాయి. ప్రతిరోజూ ఇంట్లో తయారు చేసిన ఒక గ్లాసు తాజా టమాట జ్యూస్ తాగండి. ఇది చెమటను తగ్గిస్తుంది. వీట్‌గ్రాస్ జ్యూస్ కూడా తాగొచ్చు. ఈ జ్యూస్ లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఇది చెమటను తగ్గిస్తుంది. అంతేకాదు వీట్ గ్రాస్ జ్యూస్ లో విటమిన్ బి 6, ప్రోటీన్, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి 12 బాగా లభిస్తాయి. చెమటను తగ్గించే ఇంకో సులభమైన చిట్కా కార్న్ ఫ్లార్, బేకింగ్ సోడా కాంబినేషన్. 1/2 కప్పు కార్న్‌స్టార్చ్, 1/2 కప్పు బేకింగ్ సోడా, కొన్ని చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ తీసుకుని అండర్ అర్మ్స్ కు పట్టించండి. అరగంట తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇంకా ఎండాకాలంలో వదులుగా ఉండే సౌకర్యవంతమైన బట్టలు చెమటను నివారించడంలో సహాయపడతాయి. ఎక్కువగా కెఫిన్ తీసుకోవడం వల్ల చెమట ఎక్కువగా పడుతుంది. అందుకే కాఫీ, టీలు కొంచం తక్కువగా తాగండి. ఇంకా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు, ఆల్కహాల్, వెల్లుల్లి, ఉల్లిపాయలు, అధిక కొవ్వు కలిగిన ఆహార పదార్థాలు, కారంగా ఉండే వంటకాలు ఎక్కువగా తినడం వల్ల కూడా చెమట ఎక్కువగా పడుతుంది.

CMSS: సెంట్రల్‌ మెడికల్ సర్వీసెస్‌ సొసైటీలో మేనేజర్‌ పోస్టులు

న్యూదిల్లీలోని సెంట్రల్‌ మెడికల్‌ సర్వీసెస్‌ సొసైటీ- ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీల వివరాలు:

1. అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌ (లాజిస్టిక్స్‌ అండ్‌ సప్లై చైన్): 01 పోస్టు

2. అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌ (ఫైనాన్స్‌): 01 పోస్టు

3. అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌ (ప్రొక్యూర్‌మెంట్): 02 పోస్టులు

4. అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌ (క్వాలిటీ అస్యూరెన్స్‌): ఒక పోస్టు

5. మేనేజర్ (ప్రొక్యూర్‌మెంట్): 02 పోస్టులు

6. మేనేజర్ (లాజిస్టిక్స్‌ అండ్‌ సప్లై చైన్): 02 పోస్టులు

7. మేనేజర్ (ఫైనాన్స్‌): 02 పోస్టులు

8. మేనేజర్ (క్వాలిటీ అస్యూరెన్స్‌): 02 పోస్టులు

9. ఆఫీస్‌ అసిస్టెంట్: 01 పోస్టు

10. వేర్‌ హౌస్‌ మేనేజర్ (ఫార్మాసిస్ట్‌): 01 పోస్టు

మొత్తం పోస్టులు: 15.

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, ఐసీడబ్ల్యూఏ, సీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయో పరిమితి: మేనేజర్‌, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు 40 ఏళ్లు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, వేర్‌హౌస్‌ మేనేజర్‌ పోస్టులకు 45 ఏళ్లు మించకూడదు.

వేతనం: నెలకు అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌ పోస్టులకు రూ.1,00,000; మేనేజర్‌, వేర్‌హౌస్‌ మేనేజర్‌ పోస్టులకు రూ.50,000; ఆఫీస్‌ అసిస్టెంట్ పోస్టులకు రూ.30,000.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 20-05-2024.

Loan Rules: గడువు ముందే రుణం చెల్లిచేస్తున్నారా..?? దీనికి ఆర్బీఐ నియమాలేంటో తెలుసా..

Loan Foreclosure: చాలా మంది నేటి కాలంలో తమ ఆర్థిక అవసరాలు, ఇతర కోరికల కలలను తీర్చుకునేందుకు బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల నుంచి రుణాలను తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే వీటి చెల్లింపులకు సంబంధించిన విషయంలో రిజర్వు బ్యాంక్ తీసుకొచ్చిన నియమ నిబంధనలు చాలా తక్కువ మందికి ఇప్పటికీ తెలియవు.

హోమ్ లోన్ నుంచి బిజినెస్ లోన్ వరకు అవసరానికి అనుగుణంగా బ్యాంకులు వ్యక్తులకు సులువుగా లోన్స్ నేటి కాలంలో అందిస్తున్నాయి. అయితే సమయానికి వీటి ఈఎంఐలు చెల్లించటం ఒక పెద్ద బాధ్యతని తెలిసిందే. కొంత మంది హోమ్ లోన్ లాంటి దీర్ఘకాలిక రుణాల విషయంలో వీలైనంత త్వరగా చెల్లించాలని ప్లాన్ చేస్తుంటారు. గడువుకు ముందే లోన్ ఫోర్‌క్లోజర్ చేస్తుంటారు. కొన్ని బ్యాంకులు దీనికి అదనపు చార్జీలు వసూలు చేస్తుంటాయి.

చాలా మంది రుణాల విషయంలో బయపడుతుంటారు. సమయానికి చెల్లింపులు చేయగలమా లేదా అని ఆందోళన చెందుతుంటారు. అందుకే గడువుకు ముందే డబ్బు కూడబెట్టి వాటిని తిరిగి చెల్లించాలని ప్లాన్ చేస్తుంటారు. అయితే దీనికి కొన్ని ప్రత్యేక నిబంధనలు ఉంటాయని చాలా మందికి తెలియదు. వాస్తవానికి, వ్యక్తిగత రుణాలు, విద్యా రుణాలు, వ్యాపార రుణాలు, బైక్ రుణాలు, కారు రుణాలు వంటి రకాలు కూడా లోన్ ఫోర్‌క్లోజర్ ఆప్షన్ కలిగి ఉంటాయి. రుణాన్ని ముందుగా చెల్లించినందుకు క్లోజర్ చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని ఆర్‌బీఐ నిబంధనలు చెబుతున్నాయి. మీరు ఫ్లోటింగ్ వడ్డీ రేటు రుణాన్ని తీసుకున్నట్లయితే.. RBI వడ్డీ రేటును మార్చడంతో మీ రుణంపై వడ్డీ రేటు మారుతుంది. కాబట్టి ఫ్లోటింగ్ వడ్డీ రేటు లోన్‌తో మీరు ముందస్తుగా తిరిగి చెల్లించాలనుకుంటే ఎలాంటి ముందస్తు క్లోజర్‌కు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇదే క్రమంలో మీరు టర్మ్‌కు ముందు అంటే ఫిక్స్‌డ్ వడ్డీ రేటుతో రుణం తీసుకున్నప్పుడు దానిని మూసివేయాలనుకుంటే లోన్ క్లోజర్ ఛార్జీలు చెల్లించాలి.

ముందస్తు రుణ చెల్లింపులకు ఎందురు ఛార్జీలు బ్యాంకులు వసూలు చేస్తాయనే అనుమానం మనలో చాలా మందికి ఉంటూనే ఉంటుంది. రుణగ్రహీత గడువు తేదీకి ముందే రుణాన్ని పూర్తిగా తిరిగి చెల్లించినట్లయితే.. అతనిపై రుణ బాధ్యత తీసివేయబడుతుంది. అయితే దీని వల్ల బ్యాంకులకు భారీ నష్టం వాటిల్లుతోంది.

కాబట్టి రుణగ్రహీత గడువు తేదీకి ముందే రుణాన్ని తిరిగి చెల్లిస్తే, బ్యాంకులు లోన్ ఫోర్క్లోజర్ ఛార్జీలను వసూలు చేస్తాయి. ఇది మీరు చెల్లించాల్సిన బకాయి బ్యాలెన్స్‌లో 5% వరకు ఉంటుంది. లోన్ తీసుకునే సమయంలో బ్యాంకులు దీనికి సంబంధించిన నియమాలను పత్రాల్లో పొందుపరుస్తాయి. అందువల్ల లోన్ తీసుకునే సమయంలోనే ఫోర్ క్లోజర్ రూల్స్ అడిగి తెలుసుకోవటం ఉత్తమం.

ఏడువారాల నగల వెనుక ఇంత చరిత్ర దాగి ఉందా..!!!

ఏడువారాల నగలు అంటే తెలియని వారు ఉండరు. వారం రోజుల్లో రోజుకో రకంగా నగలని ధరిచేవారు. ఏడువారాల నగలకి పూర్వం ఎంతటి క్రేజ్ ఉండేదో ఇప్పుడు కూడా అంతే క్రేజ్ ఉంది. అయితే చాలా మందికి ధర్మ సందేహం ఏమిటంటే. అసలు ఏడువారాల నగలు ఎందుకు వేసుకోవాలి. వాటిని వేసుకోవడం వలన లాభం ఏమిటి..?? వారానికో రకం చప్పున ఎందుకు వీటిని ధరించాలి..??

ఏడువారాల నగల ప్రాముఖ్యత ఏమిటంటే. మన పూర్వీకులు గ్రహాల యొక్క అనుగ్రహం కోసం, ఆరోగ్యంగా ఉండటం కోసం ఏడువారాల నగలు ధరించేవారు. ఆదివారం మొదలు శనివారం వరకూ రోజుకో ఆభరణాన్ని ధరించే వారు. గ్రహాలకి అనుకూలంగా ఉండేలా ఈ నగలు ధరించేవారు. మరి ఏ రోజుకి ఏ ఆభరణం ధరిస్తే మంచిదో ఇప్పుడు చూద్దాం.

చంద్రునికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు సోమవారం ఈ రోజున ముత్యాల హారాలు ముత్యాల గాజులతో అలంకరించుకునే వారు.
మంగళవారం కుజుడికి ఎంతో ఇష్టమైన రోజు ఆ రోజున పగడాలతో చేసిన నగలు పెట్టుకుంటే ఎంతో శుభం జరుగుతుందని మన పూర్వీకులు భావించేవారు.

బుధవారం రోజు బుద్ధుడికి ఇష్టమైన పచ్చల హారాలు గాజులు వేసుకుంటే ఎంతో మంచిది అలాగే

గురువారం బృహస్పతికి ఇష్టమైన రోజు, అందుకే గురువారం పుష్పరాగం తో చేసిన చెవి దిద్దులు ఉంగరాలు ధరించటం ఎంతో శుభసూచకం

శుక్రవారం శుక్రుడికి ఇష్టమైన రోజు కాబట్టి ఇ ఆరోజు వజ్రాల హారాలు ముక్కుపుడకను ధరించి లక్ష్మీదేవిల అలంకరించుకుని నిండుగా ఉండాలని అంటుంటారు

శనివారం రోజు ఊ శని భగవానుడికి ఇష్టమైన రోజు ఆ రోజున ఆయనకు ఇష్టమైన నా నీలమణి నగలు తగ్గించడంతోపాటు నెలలో చేసిన నగలు ముక్కుపుడక పెట్టుకోవటం ఎంతో మంచిది నవరత్నాలతో పాపిడి బిల్ల వంకీలు ఇలా ఎన్నైనా చేయించుకోవచ్చు

Jasprit Bumrah: చరిత్ర సృష్టించిన బుమ్రా.. IPLలో ఏకైక బౌలర్​గా అరుదైన రికార్డు!

ముంబై ఇండియన్స్ ఏస్ పేసర్ జస్​ప్రీత్ బుమ్రా చెలరేగిపోయాడు. ఐపీఎల్-2024లో ఇప్పటిదాకా ఆడిన 4 మ్యాచుల్లో 6 వికెట్లే తీశాడతను. వికెట్లు పడకపోయినా అతడి ఎకానమీ 6 లోపే ఉంది. బుమ్రా బౌలింగ్​ను జాగ్రత్తగా ఆడుతున్న బ్యాటర్లు.. ఇతర బౌలర్లను అటాక్ చేయబోయి దొరికిపోతున్నారు. దీంతో కసి మీద ఉన్న పేసుగుర్రం తన కోపం మొత్తాన్ని ఆర్సీబీ మీద చూపించాడు. ఆ టీమ్​తో జరుగుతున్న మ్యాచ్​లో బుమ్రా తన విశ్వరూపం చూపించాడు. వికెట్ల మీద వికెట్లు తీస్తూ బెంగళూరు బ్యాటర్లను గడగడలాడించాడు. ఓపెనర్ విరాట్ కోహ్లీతో వికెట్ల వేటను మొదలుపెట్టాడు బుమ్రా. ఆ తర్వాత మరో నలుగురికి పెవిలియన్​ దారి చూపించాడు. ఈ మ్యాచ్​తో అతడు చరిత్ర సృష్టించాడు.

స్టార్ బ్యాటర్​ కోహ్లీ (3)ని మ్యాజికల్ డెలివరీతో బోల్తా కొట్టించిన బుమ్రా.. ఆ తర్వాత ఆసీబీ కెప్టెన్ ఫాఫ్​ డుప్లెసిస్ (61)​ను కూడా వెనక్కి పంపాడు. ఇన్నింగ్స్ ఆఖర్లో మహిపాల్ లోమ్రోర్ (0)​తో పాటు సౌరవ్ చౌహాన్ (9), వైఖాఖ్ విజయ్ కుమార్ (0)ను పెవిలియన్​కు పంపాడు. 5 వికెట్ హాల్​ను పూర్తి చేసుకున్నాడు బుమ్రా. అయితే ఈ మ్యాచ్​తో అతడో అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్​ హిస్టరీలో అత్యధిక సార్లు 3 వికెట్లు తీసిన బౌలర్​గా నిలిచాడు బుమ్రా.

క్యాష్ రిచ్ లీగ్​లో మూడు వికెట్లు తీయడం బుమ్రాకు ఇది 20వ సారి కావడం గమనార్హం. ఈ లిస్ట్​లో టాప్​లో ఉన్న లసిత్ మలింగ (19 సార్లు)ను అధిగమించాడు. ఈ మ్యాచ్​తో మరో రికార్డును కూడా బుమ్రా తన అకౌంట్​లో వేసుకున్నాడు. ఆర్సీబీ మీద 5 వికెట్లు తీసిన ఫస్ట్ బౌలర్​గా అతడు నిలిచాడు. ఓవరాల్​గా ఈ మ్యాచ్​లో 4 ఓవర్లు వేసిన బుమ్రా.. 21 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. మరి..

AP News: బీ అలెర్ట్.! ఏపీలో తీవ్ర వడగాల్పులు… తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు ఇవే

శుక్రవారం అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలో తీవ్ర వడగాల్పులు, 62 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఎల్లుండి 33 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

నేడు తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(62)..
శ్రీకాకుళంలో 17 మండలాలు, విజయనగరంలో 21 మండలాలు, పార్వతీపురం మన్యంలో 12 మండలాలు, అల్లూరిలో 2 మండలాలు, అనకాపల్లిలో 3 మండలాలు, కాకినాడలో 1 మండలం, తూర్పుగోదావరి 5 మండలాలు, ఏలూరు జిల్లా వేలేర్పాడు మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.

గురువారం నంద్యాల జిల్లా నందవరంలో 42.6 డిగ్రీలు, వైయస్సార్ జిల్లా చక్రాయపేటలో 42.5 డిగ్రీలు, ప్రకాశం జిల్లా దరిమడుగులో 41.7 డిగ్రీలు, కర్నూలు జిల్లా వగరూరులో 41.6 డిగ్రీలు, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో 41.4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. అలాగే శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలంలో తీవ్రవడగాల్పులు, 20 మండలాల్లో వడగాల్పులు వీచాయన్నారు.

ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలి. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి. డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్), ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి త్రాగాలని విపత్తుల సంస్థ ఎండి కూర్మనాథ్ సూచించారు.

Hardik and Krunal Pandya: పాండ్యా బ్రదర్స్ మోసపోయారు..

క్రికెట్ లో ఆడటం, ఓడిపోవడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. ఎల్లవేళలా గెలుస్తూ ఆడలేం, అలాగని ఓడిపోతూ ఉండలేం. కానీ ఇదే ఫార్ములాని బయట బిజినెస్ లో అప్లై చేస్తే తీవ్రంగా నష్టపోతాం. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా సోదరులు ఇద్దరూ కలిసి, వరసకు సోదరుడైన వైభవ్ పాండ్యాతో కలిసి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టారు. తీరా సొదరుడు మోసం చేశాడని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు రంగప్రవేశం చేసి సోదరుడిని అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు.
వివరాల్లోకి వెళితే హార్దిక్ పాండ్యా సోదరుడు కృనాల్ పాండ్యా.. ఇద్దరూ క్రికెట్ ఆడతారనే సంగతి తెలిసిందే. కృనాల్ బరోడా జట్టులో ఆడుతున్నాడు. ఐపీఎల్ లో లక్నో జట్టు తరఫున ఆడుతున్నాడు. వీరిద్దరూ కలిసి వరసకి సోదరుడైన వైభవ్ పాండ్యాతో కలిసి పాలిమర్ ప్లాస్టిక్ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఇందులో బ్రదర్స్ ఇద్దరూ 40 శాతం చొప్పున పెట్టుబడులు పెట్టారు. అంటే ఇద్దరూ 80శాతం పెట్టారు. వైభవ్ పాండ్యా ఏం చేశాడంటే తను 20 శాతం పెట్టాడు.

వ్యాపార నిర్వహణంతా వైభవ్ చూసుకునేలా బాధ్యతలను అప్పగించారు. కొన్ని నెలలు బాగానే ఉంది. వచ్చిన లాభాలను ఇదే నిష్పత్తి లో పంచుకున్నారు. అయితే పాండ్యా సోదరులకు తెలియకుండా కొద్దిరోజుల క్రితం వైభవ్ సొంతంగా మరో పాలిమర్ వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఇదే సమయంలో బిజినెస్ లో లాభాలను 20 శాతం నుంచి 33 శాతానికి పెంచుకున్నాడు. అలాగే సంస్థ అకౌంట్ నుంచి డబ్బులను భారీ మొత్తంలో తన ఖాతాకు మళ్లించుకున్నాడు.
అలా మొత్తంగా సుమారు రూ.4.3 కోట్లకు పాండ్యా బ్రదర్స్ కి టోపీ పెట్టాడు. విషయం గురించి బ్రదర్స్ ఇద్దరూ వైభవ్ ని గట్టిగా నిలదీశారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే పరువు తీస్తానంటూ వైభవ్ బెదిరించినట్టు సమాచారం. దీంతో హార్దిక్, కృనాల్ ఇద్దరూ ముంబాయి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వైభవ్ ను అరెస్ట్ చేశారు. దీనిపై తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.

ముంబై జట్టులో తలనొప్పులకు తోడు, ఇవి కూడా తోడవడంతో హార్దిక్ పాండ్యా తలపట్టుకున్నాడని అంటున్నారు.

AP Elections 2024: ఈనెల 18న ఏపీ ఎన్నికల నోటిఫికేషన్: ఈసీ

AP Elections 2024: గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. అన్ని పార్టీలో రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాయి. ఓటర్లను ఆకర్షించేందుకు భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా కీలక విషయాన్ని వెల్లడించారు. ఎన్నికల నోటిఫికేషన్ ఏ తేదీన విడుదల చేస్తామన్నది తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ లో 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ను ఈ నెల 18వ తేదీన విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. దీంతో పాటుగా నామినేషన్లు, వాటి ఉపసంహరణ తేదీలను కూడా ప్రకటించారు.

18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ల దాఖలు చేసుకోవచ్చన్నారు. ఏప్రిల్ 26న అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ల పరిశీలన జరుగుతుందని ఏపీ సీఈఓ మీనా తెలిపారు. ఏప్రిల్ 29వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుందన్నారు.

Also Read: సిద్ధం అంటున్నవారికి మరిచిపోలేని యుద్ధం ఇద్దాం: చంద్రబాబు

రాష్ట్రంలో మే 13న నిర్వహించే ఎన్నికలు.. పారదర్శకంగా, స్వేచ్ఛగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఈ విషయాలను వెల్లడించారు.

నేటి పంచాంగం , నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా… (12/04/24)

నేటి పంచాంగం (12 -04 -2024) : ఈ రోజు శుభ, అశుభ గడియలు ఇవే.. !
ఈ పంచాంగం శుభ సమయాల గురించి, అశుభ సమయాల గురించి దుర్ముహుర్తం సమయం , యమగండం సమయం, రాహూకాలం సమయం, సూర్యోదయం సమయం, సూర్యాస్తమయం సమయం.. ఇలాంటి వాటి గురించి మనకి చెబుతుంది.


సూర్యోదయం సమయం : ఉదయం 06:27 గంటల నుంచి సూర్యోదయం మొదలవుతుంది.

సూర్యాస్తమయం సమయం : సాయంత్రం 06:22 గంటలకు సూర్యాస్తమయం అవుతుంది.

నేడు ఏప్రిల్ 12 శుభ సమయాలు

బ్రహ్మ ముహుర్తం సమయం : తెల్లవారుజామున 05:09 గంటల నుంచి ఉదయం 05:57 గంటల వరకు ఉంటుంది.

అభిజిత్ ముహుర్తం సమయం : ఉదయం 11:59 నుంచి మధ్యాహ్నం 12:47 గంటల వరకు ఉంటుంది.

గోధూళి ముహూర్తం సమయం : లేదు.

అమృత కాలం సమయం : రాత్రి 09:21 నుంచి రాత్రి 11:17 గంటల వరకు ఉంటుంది.

నేడు ఏప్రిల్ 12 అశుభ సమయాలు

యమగండం సమయం : ఉదయం 03:22 నుంచి సాయంత్రం 04:55 గంటల వరకు ఉంటుంది.

దుర్ముహర్తం సమయం : ఉదయం 08:34 నుంచి ఉదయం 09:23 గంటల వరకు ఉంటుంది.

రాహూకాలం సమయం : ఉదయం 10:44 నుంచి మధ్యాహ్నం 12:16 గంటల వరకు ఉంటుంది.

గులిక్ కాలం సమయం : ఉదయం 07:38 నుంచి ఉదయం 09:11 గంటల వరకు ఉంటుంది.

 
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా… (12/04/24)

మేషం
శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. గతంలో నిర్లక్ష్యం చేసిన కొన్ని అంశాలు ఇబ్బంది పెడతాయి. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. గోసేవ చేయడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు.

వృషభం
కీలక వ్యవహారంలో ముందడుగు పడుతుంది. బంధు,మిత్రులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. శ్రీ‌సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం మంచిది.

మిథునం
అందరినీ కలుపుకొనిపోవడం అవసరం. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం.

కర్కాటకం
ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. స్వస్థాన ప్రాప్తి సూచనలు ఉన్నాయి. స్థిర నిర్ణయాలతో చేసే పనులు ఫలిస్తాయి. దుర్గాస్తుతి చదివితే బాగుంటుంది.

సింహం
మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. అభివృద్ధి గురించి ఆలోచిస్తారు. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. అపోహలతో కాలాన్ని వృథా చేయకండి. ఈశ్వర దర్శనం శుభప్రదం.

కన్య
సంతోషకరమైన వార్త వింటారు. ఆత్మీయులు మీ పై ప్రేమాభిమానాలు కురిపిస్తారు. సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ధనలాభం సూచితం. వివాదాల్లో తలదూర్చకండి. శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి సందర్శనం శ్రేయోదాయకం.

తుల
కీలక వ్యవహారాలలో ఆచితూచి అడుగేయాలి. ఒత్తిడి పెరగకుండా ముందు జాగ్రత్తతో వ్యవహరించాలి. బంధు, మిత్రుల వలన మేలు జరుగుతుంది. అనవసర ఖర్చులకు అడ్డుకట్ట వేయాలి. శ్రీసుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి చదివితే బాగుంటుంది.

వృశ్చికం
ఉన్నతమైన ఆలోచనా విధానంతో అనుకున్నది సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. శ్రీసుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం మంచిది.

ధనుస్సు
మీ మీ రంగాలలో పరిస్థితులు క్రమక్రమంగా మీకు అనుకూలంగా ఏర్పడతాయి. ఏ పని తలపెట్టినా ఇట్టే పూర్తిచేస్తారు. సంకల్పం సిద్ధిస్తుంది. మిత్రబలం పెరుగుతుంది. కుటుంబ సభ్యులకు మేలైన కాలం. ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు.

మకరం
ప్రారంభించిన పనులలో చిన్నపాటి సమస్యలు ఎదురైనా పూర్తిచేయగలుగుతారు. మీ మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని వ్యవహారాలలో బుద్ధిచాంచల్యంతో వ్యవహరిస్తారు. విష్ణు నామస్మరణ ఉత్తమం.

కుంభం
మీ మీ రంగాల్లో శుభఫలితాలు ఉంటాయి. శ్రమకు తగిన ఫలితాలు వస్తాయి. మనఃస్సౌఖ్యం ఉంది. బంధు,మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆదిత్య హృదయం చదవడం శుభకరం.

మీనం
స్థిరమైన బుద్ధితో వ్యవహరిస్తే ఉద్యోగంలో ఉన్నతస్థితి ఏర్పడుతుంది. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు అవసరం అవుతాయి. సకాలంలో ఆదుకునేవారు ఉన్నారు. శివారాధన శ్రేయోదాయకం.

రైల్వే సూపర్ యాప్.. బుకింగ్, ట్రాకింగ్ అన్నీ సేవలు ఒకే యాప్ లో!

ఇండియన్ రైల్వే సిస్టమ్స్ ను ఎంతో మంది ఉపయోగిస్తూ ఉంటుంటారు. దేశంలో అన్ని మారుమూల ప్రాంతాలను కనెక్ట్ చేయడంలో భారతీయ రైల్వేలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. తక్కువ ధరలకు అయిపోతుంటాయి కాబట్టి చాలా మంది.. ప్రయాణానికి రైల్వే సదుపాయాలనే ఉపయోగిస్తూ ఉంటారు, అయితే ఈ క్రమంలో గత కొంత కాలంగా రైల్వే సంస్థలు అనేక సమస్యల గురి కావడంతో.. ఇప్పుడు మారుతున్న టెక్నాలజీతో వాటికి కొత్త పరిష్కారాలను కనుగొంటోంది. టెక్నాలజీ మారుతోంది కాబట్టి.. ప్రపంచంలో ఏ సమస్యకైనా సరే ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది. దీనితో ఇప్పుడు రైల్వేస్ కూడా ఉన్న సమస్యలను తొలగించేందుకు.. ఒక సూపర్ యాప్ ను డెవలప్ చేసింది. ఈ సూపర్ యాప్ అందించే సేవలన్నిటిని ఒకే చోట ప్రజలకు అందించబోతుంది. మరి ఏ ఏ సదుపాయలు ఈ యాప్ లో అందుబాటులో ఉన్నాయో చూసేద్దాం.

ఆధునికంగా ప్రపంచం ఎంతో ముందుకు వెళ్తుంది. దీనితో ఎటువంటి సమస్యనైనా కానీ క్షణాల్లో పరిష్కారం కనుక్కోవచ్చు. ఈ క్రమంలోనే ఇండియన్ రైల్వేస్ లో ఎదురయ్యే సమస్యలకు పరిష్కార మార్గాలు వచ్చేశాయి. దాదాపు అన్ని సేవలను ఒకే చోట ఉపయోగించే విధంగా ఈ యాప్ పనిచేస్తుంది. ఈ యాప్ లోనే టికెట్ బుకింగ్, ట్రైన్ ట్రాకింగ్ ఇలా అన్ని చెక్ చేసుకోవచ్చు. అలాగే టికెట్ క్యాన్సిలేషన్ కూడా చాలా సులభంగా చేసుకోవచ్చు. అంతేకాకుండా టికెట్ వాపస్ కోసం.. 24/7 సర్వీస్ ను కూడా ప్రారంభించబోతుంది. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు.. దీనిని ప్రారంభించాలనే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం వీటికోసం యాప్స్ ఉన్నా కూడా.. ఇప్పుడు అన్ని సేవలను కలిపి ఒకటే యాప్ లో ఉపయోగించుకునేలా దీనిని ప్రారంభిస్తున్నారు.

ఇక ప్రస్తుతం అత్యధికంగా అందరు ఉపయోగిస్తున్న యాప్ IRCTC రైల్ కనెక్ట్ యాప్. ఇప్పటివరకు ఈ యాప్ 10 కోట్ల డౌన్లోడ్స్ ను కలిగి ఉంది. ఇక ఇది కాకుండా.. రైల్ మదద్, యుటీఎస్ , సతార్క్ లాంటి ఎన్నో యాప్స్ ను ఉపయోగిస్తూ ఉన్నారు. అలాగే ట్రైన్ ట్రాకింగ్ చేయడానికి వేర్ ఈజ్ మై ట్రైన్ అనే యాప్ ను వినియోగిస్తూ ఉన్నారు. వాటిలో అప్పుడప్పుడు సాంకేతిక కారణాల వలన ఇబ్బందులు తలెత్తొచ్చు. ఈ యాప్ లు అన్నిటిని కలిపి ఒకే అప్లికేషన్ కిందకు తెచ్చేందుకు.. రైల్వే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే.. కలకత్తా మెట్రో మొబైల్ యాప్ ను 4 లక్షల మందికి పైగా ఉపయోగిస్తున్నారు. ఇది వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉండడంతో.. ఇప్పుడు ఈ సూపర్ యాప్ లాంచ్ చేసే దిశగా అధికారులు సన్నద్ధం అవుతున్నారు. త్వరలోనే ఈ సూపర్ యాప్ అందరికి అందుబాటులోకి రానుంది.

HYDలో భారత్ రైస్ అమ్మకాలు.. స్టోర్ల వివరాలు ఇవే!

ప్రస్తుతం మార్కెట్ లో బియ్యం ధరలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. అయితే దేశమంతటా వరి ఉత్పత్తి బాగా పెరిగినప్పటికీ.. బియ్యం ధరలు మాత్రం ఆకాశాన్నంటుతున్నాయి. అందుకోసం కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం భారత్ రైస్ అందిస్తామని ప్రకటించింది.కేవలం రూ. 29కే సన్నబియ్యం అందిస్తామని చెప్పి 50 రోజులు కావొస్తున్నా.. కేంద్రం నుంచి బియ్యం జాడే ఇప్పటి వరకు లేదు. అయితే అతి తక్కువ ధరకు సబ్సిడీ బియ్యం ఎప్పుడూ వస్తాయా.. అని సామన్యులు, నిరుపేద ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసిన కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్నా భారత్ రైస్ కోసమే అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ భారత్ రైస్ అనేది తాజాగా మార్కెట్ లో అందుబాటులోకి వచ్చింది. అలాగే ఈ రైస్ విక్రయాలు అనేవి కొన్ని ప్రైవేట్‌ సంస్థలు, వ్యాపారుల ద్వారా మొదలయ్యాయి. ఇంతకి ఈ భారత్ రైస్ హైదరాబాద్ లో ఎక్కడ అమ్ముతున్నారంటే..

తాజాగా కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన భారత్ రైస్ మార్కెట్ లో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ రైస్ విక్రయాలు అనేవి కొన్ని ప్రైవేట్‌ సంస్థలు, వ్యాపారుల ద్వారా మొదలయ్యాయి. కాగా, ఈ రైస్ విక్రయ బాధ్యతలను..నేషనల్‌ అగ్రికల్చరల్‌ కో–ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (నాఫెడ్‌)(NAFED), నేషనల్‌ కో–ఆపరేటివ్‌ కన్స్యూమర్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌సీసీఎఫ్‌), కేంద్రీయ భండార్‌ వంటి సంస్థలకు అప్పగించింది. ప్రస్తుతం భారత్‌ రైస్‌ విక్రయాలు అనేవి నాఫెడ్‌ ద్వా రా గ్రేటర్‌ పరిధిలోని 24 కేంద్రాల్లో జరుగుతున్నాయి. దాదాపు 15 రోజుల నుంచి ఈ అమ్మకాలు మొదలుపెట్టినట్లు నాఫెడ్‌ అధికారులు తెలిపారు. ఇక తెలంగాణలో భారత్ రైస్ విక్రయాలను 5 వేల క్వింటాళ్ల వరకు అమ్మకాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కూడా తెలిపారు. కానీ, ఎటువంటి ప్రచారం లేకపోవడంతో.. భారత్‌ రైస్‌ అమ్మకాలు ఊపందుకోలేదు. ఈ రైస్‌ మొదటి రకానికి అయి ఉంటాయని చాలా మంది భావించారని, అన్నం వండిన తర్వాత కాస్త దొడ్డుగా ఉంటోందని వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నారని వ్యాపారులు పేర్కొంటున్నారు.

ఇక అన్నం రుచిగా ఉంటున్నప్పటికీ.. సన్నగా ఉండకపోవడం వల్ల చాలామంది ఈ రైస్ పై ఆసక్తి చూపడం లేదని చెబుతున్నారు. ఈ క్రమంలోనే.. ఓ ట్రెడర్ తెలిసిన వారికి పది కిలోల బ్యాగ్‌లను విక్రయించానని తెలిపారు. అయితే పది కిలోల బ్యాగ్‌లను 40 వరకు తెచ్చి, అమ్మడానికి నానా తంటాలు పడ్డానని చెప్పారు. కాగా, రెండోసారి ఎవరూ ఈ బియ్యం తీసుకోలేదన్నారు. అలాగే, కాచిగూడలోని ఓ ట్రేడర్‌ విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ.. తాను 15 రోజుల నుంచి అమ్మకాలు చేస్తున్నానని, వినియోగదారులకు ముందుగా నమునా బియ్యం చూపించి విక్రయిస్తున్నానని చెప్పారు. మొదట 10 కిలోల బ్యాగులు 200 తెప్పించి, పూర్తిగా విక్రయించానని, రెండో సారి 100 తీసుకొచ్చినట్లు తెలిపారు. మరి నగరంలో పలు ప్రాంతాల్లో ఈ భారత్ రైస్ ను పంపిణీ చేస్తున్నారు. అయితే ఆ పంపీణీ కేంద్రాలు ఈ కింద విధంగా ఉన్నాయి.

పంపిణీ కేంద్రాలు..
ఏపీ రైస్‌ స్టోర్స్‌, మెట్టుగూడ
చంద్రమౌళి ట్రేడర్స్‌, కార్వాన్
ధనలక్ష్మి ఎంటర్‌ప్రైజెస్‌,
ఎస్‌ఆర్‌నగర్‌
డింగ్‌డాంగ్‌ సూపర్‌ మార్కెట్‌
గౌతమ్‌రైస్‌ డిపో, కాప్రా
జై తుల్జాభవానీ ఏజెన్సీ, లంగర్‌హౌజ్‌
మాణిక్య ట్రేడర్స్‌, ఆర్‌కే పురం
మురళీ కిరణ్‌ అండ్‌ జనరల్‌ స్టోర్స్‌, పటాన్‌చెరువు
ముత్తయ్య గ్రాండ్‌ బజార్‌, శేరిలింగంపల్లి
ఖైసర్‌ కిరాణా అండ్‌ జనరల్‌ స్టోర్‌, హైదరాబాద్‌
సాయిదీప్‌ సూపర్‌ స్టోర్స్‌, మెదక్‌
సిర్వి ట్రేడర్స్‌, బోడుప్పల్‌
శంకర్‌ ట్రేడింగ్‌ కంపెనీ, సికింద్రాబాద్‌
శ్రీ గోవిందా ట్రేడర్స్‌, కాచిగూడ
శ్రీ వీరభద్ర ట్రేడర్స్‌, కవాడిగూడ
శ్రీ అంబ ట్రేడర్స్‌, హైదరాబాద్‌
శ్రీ బాలాజీ రైస్‌ డిపో, రాంనగర్‌
శ్రీ సాయిబాబా రైస్‌ డిపో, కార్వాన్‌
సాయిశివ రైస్‌ ట్రేడర్స్‌, కర్మన్‌ఘాట్‌
శ్రీ సాయి ట్రేడర్స్‌, కొత్తపేట
శ్రీ ట్రేడర్స్‌, చందానగర్‌
ఉజ్వల్‌ ట్రేడర్స్‌, మల్లేపల్లి
ఉప్పు రాజయ్య ట్రేడర్స్‌, షాపూర్‌నగర్‌
రిలయన్స్‌, దేవరయంజాల్‌

మార్కెట్ లోకి నయా పల్సర్.. ఫీచర్స్ చూస్తే వావ్ అనాల్సిందే?

మార్కెట్ లో ఎన్ని రకాల బైక్స్ ఉన్నా పల్సర్ బైక్స్ కు ఉండే క్రేజ్ వేరు. యూత్ కు కనెక్ట్ కావడంతో మార్కెట్ లో ఫుల్ డిమాండ్ ఉంటుంది పల్సర్ బైక్ లకు. పల్సర్ లవర్స్ ను ఏమాత్రం నిరుత్సాహపర్చకుండా ఎప్పటికప్పుడు బజాజ్ కంపెనీ సరికొత్త మోడల్స్ తో సర్ ప్రైజ్ చేస్తుంటుంది. అంతేకాదు ఆధునిక టెక్నాలజీని జోడించి స్టన్నింగ్ లుక్స్, అదిరిపోయే ఫీచర్లతో పల్సర్ బైక్ లను లాంచ్ చేస్తోంది. ఇప్పుడు మరోకొత్త పల్సర్ బైక్ అందుబాటులోకి వచ్చింది. బజాజ్ కంపెనీ 2024 బజాజ్ పల్సర్ ఎన్ 250ని ఏప్రిల్ 10న మార్కెట్ లోకి విడుదల చేసింది. స్మార్ట్ ఫీచర్లతో కూడిన ఈ బైక్ నయా టెక్నాలజీతో బైక్ లవర్స్ ను ఫిదా చేస్తోంది. ఇక దీని ధర రూ .1.51 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించారు.

పల్సర్ బైక్ పైన రైడింగ్ అంటే హార్స్ రైడింగ్ చేసినట్లే అని అంటుంటారు బైక్ లవర్స్. ఈ నేపథ్యంలోనే బజాజ్ కంపెనీ అప్ గ్రేడ్ వర్షన్లతో పల్సర్ బైక్ లను ఆటోమొబైల్ మార్కెట్ లోకి లాంచ్ చేస్తూ ఆకట్టుకుంటోంది. 2024బజాజ్ పల్సర్ ఎన్250 పేరుతో వచ్చిన ఈ బైక్ లో నయా ఫీచర్లు యాడ్ చేసి అప్ గ్రేడ్ చేశారు. ఈ నయా పల్సర్ ఫీచర్లు తెలిస్తే వావ్ అనాల్సిందే. ఈ కొత్త పల్సర్ బైక్ లో ముందువైపు రెండు డీఆర్ఎల్ లతో సింగిల్ హెడ్ లైట్ ఉంటుంది. మోటార్‌సైకిల్ ట్యాంక్ ఎక్స్ టెన్షన్లు, అండర్‌బెల్లీ ఫెయిరింగ్, సైడ్-స్లంగ్ ఎగ్జాస్ట్‌తో పాటు దాని ట్యాంక్ డిజైన్‌ అలాగే ఉంది.

ఈ బైక్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్‌తో వస్తుంది. పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌తో కలిగి ఉంటుంది. బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది. ఇందులో ఏబీఎస్‌ డిస్క్ బ్రేక్‌ సిస్టమ్‌ అత్యంత అప్రమత్తంగా పనిచేస్తుంది. కొత్త పల్సర్ ఎన్ 250కి మూడు ఏబీఎస్ కలర్ మోడ్‌లు ఉన్నాయి. అవి రెయిన్, రోడ్, ఆఫ్-రోడ్. బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు కాల్ అలర్ట్స్, ఎస్ఎంఎస్ అలర్ట్స్, ఫోన్ బ్యాటరీ స్టేటస్, లెఫ్ట్ స్విచ్ క్యూబ్ లోని బటన్ ను ఉపయోగించి కాల్స్ ను స్వీకరించడం వంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇక ఇంజిన్‌ విషయానికొస్తే.. పల్సర్ ఎన్ 250 లో 249 సీసీ, సింగిల్-సిలిండర్, ఆయిల్-కూల్డ్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇది 24.1 బీహెచ్పీ మరియు 21.5 ఎన్ఎం గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మోటార్‌ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

రూ.లక్ష కోట్ల బ్యాంక్‌ స్కాం.. ప్రముఖ మహిళా వ్యాపారవేత్తకు మరణ శిక్ష విధించిన కోర్టు!

మన దేశంలో అయితే బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టినా.. బడాబాబులు విదేశాల్లో దర్జాగా తిరుగుతారు. కానీ వియత్నం లాంటి దేశాల్లో ఆ పప్పులేం ఉడకవ్‌.. ఆ దేశ ప్రభుత్వాలు గాలెం వేసి పట్టి మరీ శిక్షిస్తారు. తాజాగా వియత్నాంకి చెందిన దిగ్గజ వ్యాపార వేత్త ట్రూంగ్‌ మై లాన్‌.. ఆ దేశ బ్యాంకును రూ.లక్ష కోట్లకు పైగా మోసం చేసినందుకుగానూ అక్కడి న్యాయస్థానం మరణ శిక్ష విధించింది. ఈ మేరకు కోర్టు గురువారం (ఏప్రిల్‌ 11) తీర్పు వెలువరించింది.

ఎవరీ ట్రూంగ్‌ మై లాన్‌..
వియత్నాంలోని దిగ్గజ వ్యాపారవేత్తల్లో ఆమె ఒకరు. ‘వాన్‌ థిన్‌ ఫాట్‌’ రియల్‌ ఎస్టేట్‌ సంస్థకు ఛైర్మన్‌గా కొనసాగుతోంది. అయితే వియత్నాంలోనిసైగాన్ కమర్షియల్ బ్యాంక్ (SCB) నుంచి ఆమె పదేళ్ల కాలంలో దాదాపు12.5 బిలియన్‌ డాలర్లు (భారత కరెన్సీలో రూ.లక్ష కోట్లు) సంబంధించి మోసాలకు పాల్పడినట్లు రుజువైంది. ఈ కేసులో ఆమె దోషిగా తేలడంతో ఆమెకు అక్కడి న్యాయస్థానం మరణశిక్ష విధించింది. వియత్నం దేశంలోని అతిపెద్ద స్కాంలలో ఇది ఒకటి. దీంతో కేసులో కోర్టు తీర్పు ఎలా ఉండబోతోందనే విషయంపై ఆ దేశ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూశారు. లాన్‌తో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న మరో 85 మంది దోషులను ఐదు వారాలపాటు విచారించారు. లాన్‌ సహా నిందితుల జాబితాలో మాజీ సెంట్రల్ బ్యాంకర్లు, మాజీ ప్రభుత్వ అధికారులు, మాజీ SCB అధికారులు ఉన్నారు. అధికార దుర్వినియోగం, లంచం, బ్యాంకింగ్‌ చట్టాల ఉల్లంఘన వంటి ఆరోపణలు వీరిపై వచ్చాయి.

ట్రూంగ్‌ మై లాన్‌కు స్థానిక సైగాన్‌ కమర్షియల్‌ బ్యాంకు (SCB)లో దాదాపు 90 శాతం వాటా ఉంది. కొన్నేళ్లుగా ఆమె వియత్నాంలోని ప్రభుత్వ ప్రతినిధులు, వ్యాపార వేత్తలు లక్ష్యంగా ఈ బ్యాంకులో ఆమె మోసాలకు పాల్పడ్డారు. 916 నకిలీ దరఖాస్తులు సృష్టించి 2012 నుంచి 2022 మధ్య SCB బ్యాంకు నుంచి 304 ట్రిలియన్‌ డాంగ్‌ (వియత్నాం కరెన్సీ)లు తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. అంటే 12.5 బిలియన్‌ డాలర్లకుపైగా ఆమె కాజేసింది. ఇది ఆ దేశ జీడీపీలో 3 శాతం. 2022లో ఈ కుంభకోణం బయటపడింది. దీంతో ఆమెను అదే ఏడాది అక్టోబరులో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఈ స్కాం వల్ల దాదాపు 42 వేల మంది నష్టపోయారు. దీంతో ఈ వ్యవహారం ఆగ్నేయాసియా దేశమంతటా షాక్‌కు గురి చేసింది. ఇందుకు గానూ SCB అధికారులు 5.2 మిలియన్‌ డాలర్లు లంచంగా తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు.

Central Government: ఈపీఎఫ్ఓ వేతన పరిమితి రూ.21 వేలకు పెంచే యోచనలో కేంద్రం

ఈపీఎఫ్ఓ కింద ఉన్న ఉద్యోగుల గరిష్ఠ వేతన పరిమితిని పెంచాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం ఇది రూ.15వేలుగా ఉంది. ఈ మొత్తాన్ని రూ.21 వేలకు పెంచే యోచన చేస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఈ మొత్తాన్ని పెంచాలని చాలా ఏళ్లుగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. కొత్త ప్రభుత్వం కొలువుదీరాక ఈపీఎఫ్ఓ కింద ఉన్న ఉద్యోగుల గరిష్ఠ వేతన పరిమితి పెంపుకు సంబంధించి నిర్ణయం వెలువడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. వేతన పరిమితిని పెంచడం వల్ల ప్రభుత్వంతో పాటు ప్రయివేటు రంగం పైనా భారం పడుతుంది. అయితే ఉద్యోగులకు మాత్రం మేలు జరుగుతుంది.

RBI : రుణ గ్రహీతలకు RBI శుభవార్త… EMI భారం తగ్గింపు…!

RBI : ఇటీవల జరిగిన ద్రవ్య విధాన సమావేశాలలో RBI కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. దీనిలో భాగంగానే ఈసారి రెపో రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. అంటే 7వ సారి కూడా రేట్లు స్థిరంగానే ఉంచిందని చెప్పాలి. ఒకవేళ ఆర్.బి.ఐ రెపో రేట్లను మార్చినట్లయితే దాని ప్రభావం మీరు బ్యాంకులో తీసుకున్న రుణాలపై పడే అవకాశంశం ఉంటుంది. అంటే మీ EMI విపరీతంగా పెరుగుతుందన్నమాట. అయితే ప్రస్తుత కాలంలో చాలామంది బ్యాంకులలో వివిధ రకాలుగా రుణాలను తీసుకుంటున్నారు. గృహ రుణం ,వాహన రుణం ఇతర ఏవైనా రుణాలు తీసుకున్నట్లయితే ఈ EMI లో కాస్త మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.

RBI : రెపో స్థిరత్వం
తాజాగా జరిగిన ద్రవ్య విధాన సమావేశాలలో ఆర్.బీ.ఐ వరుసగా 7వ సారి కూడా రెపో రేట్లను స్థిరంగా ఉంచేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతో రెపో రేట్లు ప్రభావితం ఇప్పుడు రుణాలపై పడే అవకాశం లేదు కాబట్టి రుణ గ్రహీతల లోన్స్ EMI ప్రస్తుతానికి అలాగే కొనసాగుతాయి. ఉదాహరణకు. .. మీరు ఒక 20 సంవత్సరాలకు గాను 8.60% వడ్డీటు తో 25 లక్షల గృహరుణాన్ని తీసుకున్నారు అనుకోండి. దీనికి గాను నెలకు EMI రూ.21,854 అవుతుంది. ఇదే నిబంధన ప్రకారం 40 లక్షల రుణాన్ని పొందినట్లయితే దానికి గాను నెలకు EMI రూ.34,967 ,అవుతుంది. అయితే ప్రస్తుతం ఆర్.బి.ఐ రెపో రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు కాబట్టి మీ యొక్క EMI లలో కూడా ఎలాంటి మార్పు ఉండదు.

RBI భవిష్యత్తులో జరిగే మార్పులు..
రాబోయే కాలంలో ఒకవేళ RBI ద్వారా రెపో రేట్లు ఏమైనా మార్పులు చెందినట్లయితే బ్యాంకులలో మరియు ఆర్థిక సంస్థల ద్వారా తీసుకున్న రుణాలపై వడ్డీ రేట్లు పై కూడా సవరణలు జరుగుతాయి. ఒకవేళ రెపో రేట్లు పెరిగినట్లయితే రుణ వడ్డీ రేట్లు కూడా పెరిగిపోతాయి. దీనికి విరుద్ధంగా RBI రెపో రేటు తగ్గించినట్లయితే వడ్డీ రేట్లు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఫలితంగా మీరు మరింత సరసమైన రుణాలను అందుకుంటారు. మొత్తానికి ఇప్పుడు రెపో రేట్లు స్థిరత్వంగా ఉండటం వలన రుణ గ్రహీతలు ప్రయోజనాలను పొందారనే చెప్పాలి.

RBI : గుడ్‌న్యూస్‌.. క్రెడిట్ కార్డ్ వాడే వారికి ఆర్బీఐ కొత్త రూల్స్.. బిల్స్ ఎప్పుడు, ఎలా క‌ట్టాలి అంటే..!

RBI : ఈ రోజుల్లో చాలా మంది క్రెడిట్ కార్డ్ వాడుతుండడం మ‌నం గ‌మ‌నిస్తూనే ఉన్నాం. క్రెడిట్ కార్డ్ సాధార‌ణ‌, మ‌ధ్య త‌ర‌గతి వారికి చాలా ఉప‌యోగ‌ప‌డుతుంది. క్రెడిట్ కార్డ్ విష‌యంలో బాధ్యతాయుతంగా వ్యవహరించినట్లయితే క్రెడిట్ స్కోరు కూడా బాగానే ఉంది. క్రెడిట్ కార్డ్ వాడిన వారు స‌కాలంలో బిల్లులు చెల్లిస్తే ఎలాంటి స‌మ‌స్య‌లు ఉండ‌వు. అయితే క్రెడిట్ కార్డ్ విష‌యంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఇటీవల పలు కొత్త రూల్స్ తీసుకొచ్చింది. 2022 ఏప్రిల్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా క్రెడిట్, డెబిట్ కార్డులకు సంబంధించి కొత్త నిబంధ‌న‌లు తీసుకురాగా, ఆ రూల్స్ ప్ర‌కారం ఎవ‌రైన స‌రే తమ క్రెడిట్ కార్డ్ బిల్లింగ్ సైకిల్‌ను ఒకసారి మార్చుకోవడానికి మాత్ర‌మే బ్యాంకు అనుమ‌తి ఇవ్వాల్సి ఉంటుంది. కాని ఇప్పటి రూల్ ప్ర‌కారం ఆర్బీఐ ప‌లు మార్పులు చేసింది.

క్రెడిట్ కార్డ్ బిల్లింగ్ సైకిల్‌ను ఒకటి కంటే ఎక్కువసార్లు మార్చుకోవడానికి అవ‌కాశం క‌ల్పిస్తూ ఆర్బీఐ ప‌లు రూల్స్ జారీ చేసింది. గ‌తంలో బిల్లింగ్ సైకిల్ వ్యవధి 28 నుండి 32 రోజుల వరకు ఉండ‌గా, ఆ బిల్లింగ్ సైకిల్ అనేది ఎప్పుడు క్రెడిట్ కార్డ్ యాక్టివ్ అయితే అప్ప‌టి నుండి మొద‌ల‌వుతుంది. అయితే స్టేట్‌మెంట్ జ‌న‌రేట్ అయిన త‌ర్వాత బిల్లు చెల్లించ‌డానికి పది నుండి ప‌దిహేను రోజుల స‌మ‌యం ఉంటుంది కాబట్టి 30-రోజుల బిల్లింగ్ సైకిల్, గడువు తేదీ వరకున్న 10-15 రోజులు కలిపి 45 రోజులు మొత్తం ఫ్రీ పిరియ‌డ్ పొందుతారు. మీరు ప్రతి నెలా 1వ తేదీ, 10వ తేదీ మధ్య క్రెడిట్ కార్డు వాడిన‌ట్టైతే , 25వ తేదీ తర్వాత స్టేట్‌మెంట్ తేదీని అడ్జెస్ట్ చేస్తారు. అప్పుడు మీకు గ‌డువు తేదిని వ‌చ్చే నెల 10 నుండి 15 వ‌ర‌కు ఉంటంది.

దీని వల‌న వినియోగ‌దారుడికి చాలా లాభం ఉంటుంది. క్రెడిట్ కార్డుల్లో ఎంత మొత్తం వాడుకోవచ్చనే దానిపై కూడా ఒక‌ప్పుడు కొంత లిమిట్ ఉంటుంది. కస్టమర్ల అనుమతితో దానికి మించి వాడుకునే ఆప్షన్ సంస్థలు ఇప్పుడు ఇవ్వొచ్చు అనే నిబంధ‌న కూడా తీసుకు వ‌చ్చారు. ఒక వేళ క‌స్ట‌మ‌ర్‌కి ఇష్టం లేదంటే దానిని డియాక్టివేట్ చేయ‌వ‌చ్చు. కస్టమర్‌కు తెలియకుండా అదనపు పరిమితిని అనుమతించడం, దానిపై ఛార్జీలు వసూలు చేయడం ఏమాత్రం చేయ‌వ‌ద్దు. ఇక క్రెడిట్ కార్డుల్ని బ్లాక్ లేదా డీయాక్టివేషన్ చేసినట్లయితే వాడేటందుకు ఏ మాత్రం కుద‌ర‌దు. మీరు రిక్వెస్ట్ పెట్టుకుంటే 7 రోజుల్లోగా సంస్థలు ఖాతా మూసేయాల్సి న ప‌రిస్థితి నెల‌కొని ఉంటుంది.

కవితను అరెస్ట్ చేసిన సీబీఐ: బిగుసుకున్న ఉచ్చు ..

Kalvakuntla Kavitha: దేశవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టించిన ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన భారత్ రాష్ట్ర సమితి శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత కష్టాలు మరింత పెరిగాయి. ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆమె జ్యుడీషియల్ కస్టడీలో కొనసాగనున్నారు. తీహార్ జైలులో ఉంటూ ఈడీ విచారణను ఎదుర్కొంటోన్నారు. తాజాగా ఇదే కేసులో సీబీఐ అధికారులు కూడా కవితను అరెస్ట్ చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం పాలసీలో కొన్ని గంటల పాటు విచారించిన అనంతరం కవితను అదుపులోకి తీసుకున్నారు. తీహార్ జైలులోనే ఈ విచారణ కొనసాగింది. అక్కడే ఆమెను అరెస్ట్ చేశారు సీబీఐ అధికారులు.

కవితను విచారించడానికి అనుమతి ఇవ్వాలంటూ కొద్దిరోజుల కిందటే సీబీఐ అధికారులు దాఖలు చేసుకున్న పిటీషన్‌పై సానుకూలంగా స్పందించింది ఢిల్లీ రోస్ అవెన్యూ న్యాయస్థానం. విచారణకు అనుమతి ఇచ్చింది. ఢిల్లీ మద్యం పాలసీలో సీబీఐ అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు కవిత నుంచి సరైన, సంతృప్తికర సమాధానం లభించకపోవడం వల్లే అరెస్ట్ చేశారని తెలుస్తోంది. మద్యం పాలసీ కేసులో కిందటి నెల 15వ తేదీన ఈడీ అధికారులు ఆమెను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ రోస్ అవెన్యూ న్యాయస్థానం ముందు ఆమెను హాజరుపర్చాగా జ్యుడీషియల్ కస్టడీకి తరలిస్తూ ఆదేశాలు ఇచ్చారు న్యాయమూర్తులు. మూడుసార్లు ఆమె కస్టడీని పొడిగించారు. ఈ నెల 23వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీలో కొనసాగాల్సి ఉంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు సాక్ష్యాధారాలను సేకరిస్తోన్నామని, ఆమె నుంచి మరింత సమాచారాన్ని రాబట్టుకోవాల్సి ఉందని న్యాయస్థానానికి వివరించారు ఈడీ అధికారులు. ఇదే కేసులో సీబీఐ సైతం కవిత కస్టడీని కోరుతూ పిటీషన్ దాఖలు చేసిందని ఈడీ తరఫు న్యాయవాది గుర్తు చేశారు. దీన్ని బట్టి చూస్తే ఈ కేసు తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు.
సమాజంలో పలుకుబడి ఉన్న నాయకురాలు కావడం వల్ల కవితకు బెయిల్ మంజూరు చేస్తే- సాక్ష్యులను ప్రభావితం చేయగలరని ఈడీ తరఫు న్యాయవాది వాదించారు. సాక్ష్యాధారాలను ట్యాంపర్ చేసే అవకాశాలు లేకపోలేదని చెప్పారు. అందుకే మరో 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ కావాలని కోరారు.

నీళ్లు కావాలని అడిగి మరి దాహం తీర్చుకున్న ఉడుత..!

మనుషులకి దాహం వేస్తె అడిగి మరి దప్పిక తీర్చుకుంటాం. కానీ ఉడుత చేసిన సాహసం అందరిని అబ్బుర పరిచింది. దాహం వేసి నాలుక పిడచకట్టుకుపోవడంతో ఓ ఉడుత నీళ్ల కోసం చేసిన పోరాటం నెటిజన్లను ఆకర్షిస్తోంది. మనిషికి దండం పెడుతూ.. వెంటపడింది. నీరు పోసే వరకు వెంట తిరిగి తీరా దాహార్తి తీర్చుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి.

రోడ్డుపై నీళ్ల బాటిల్ తీసుకొని వెళ్తున్న ఓ యువ జంటను ఉడుత గమనించింది. దానిలో నీరు కనిపించడంతో అది ఆ యువకుడి వెంట పడింది. వెనక కాళ్లపై పైకి లేస్తూ.. ప్లీజ్ నీళ్లు పోయండి అన్నట్టుగా ప్రాధేయపడింది. ముందుగా ఆ యువకుడికి అది ఎందుకు వెంటపడుతోందో అర్థం కాలేదు. తర్వాత అర్థం చేసుకున్నాడు. తన చేతిలోని నీటిని దానికి తాగించగా, దప్పిక తీర్చుకొని వెళ్లిపోయింది. నీళ్ల కోసం ఆ ఉడుత చేసిన సైగలు పలువురి హృదయాలను కట్టిపడేసింది. ఎక్కడ జరిగిందో తెలియదు కానీ సోషల్ మీడియాలో ఇది తెగ వైరల్ అవుతోంది.

https://x.com/susantananda3/status/1283744266620043264

APPSC Group 2 Mains Date: ఏపీపీఎస్సీ గ్రూపు 2 మెయిన్స్‌ పరీక్ష తేదీ ఇదే.. మెయిన్స్‌కు ఎంత మంది క్వాలిఫై అయ్యారంటే!

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 ప్రిలిమ్స్‌ 2024 పరీక్ష ఫలితాలు బుధవారం (ఏప్రిల్‌ 10) కమిషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. పరీక్షలకు హాజరైన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. రాష్ట్రలోని వివిధ శాఖలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 899 గ్రూప్‌ 2 ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ ప్రకటన వెలువరించింది. ఇందుకు సంబంధించి ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్‌ 21 నుంచి జనవరి 17 వరకు కొనసాగింది. ప్రిలిమినరీ పరీక్షలను ఫిబ్రవరి 25న ఏపీపీఎస్సీ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4,04,037 మంది అభ్యర్ధులు హాజరయ్యారు.

పరీక్షకు హాజరైన లక్షలాది మంది అభ్యర్థులు కొన్ని వారాల నుంచి ఎంతో ఉత్కంఠగా ఈ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఎట్టకేలకు ఏపీపీఎస్సీ ఈ పరీక్ష ఫలితాలను వెలువరించింది. ప్రిలిమినరీ పరీక్షలొ దాదాపు 92,250 మంది మెయిన్స్‌కు క్వాలిఫై అయ్యారు. మరో 2557 మంది అభ్యర్థులను వివిధ కారణాలతో ఏపీపీఎస్సీ రిజెక్ట్‌ చేసింది. ఇందుకు సంబంధించిన ఫలితాలను ఏపీపీఎస్సీ తన వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. తదుపరి దశ అయిన మెయిన్స్‌కు అర్హత సాధించిన వారి వివరాలతోపాటు రిజెక్ట్ అయిన అభ్యర్థుల జాబితాలను కూడా వేర్వేరుగా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 మెయిన్స్‌ పరీక్షలు జులై 28న నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా కమిషన్‌ స్పష్టం చేసింది. కాగా మెయిన్స్‌కు 1 : 100 నిష్పత్తిలో అభ్యర్థులను కమిషన్‌ ఎంపిక చేసింది. ఇక త్వరలోనే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలను కూడా ఏపీపీఎస్సీ ప్రకటించనుంది.

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 ప్రిలిమ్స్‌ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 రిజెక్ట్‌ అభ్యర్ధుల జాబితా కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

జవహర్ రెడ్డికి స్థాన చలనం – నూతన సీఎస్ గా రేసులో..!?

ఏపీలో ఎన్నికల పోరు హోరా హోరీగా మారుతోంది. కూటమి నేతలు వైసీపీ అనుకూల అధికారులు అంటూ కొందరి పైన ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పై లేఖ రాసారు. అందులో భాగంగా ప్రస్తుత సీఎస్ జవహర్ రెడ్డి మార్పు పైన అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. జవహర్ రెడ్డికి స్థాన చలనం కలిగితే నూతన సీఎస్ గా పరిశీలనలో అయిదుగురు పేర్లు ఉన్నాయి.

సీఎస్ జవహర్ రెడ్డి వైసీపీ ప్రభుత్వానికి అత్యంత అనుకూలంగా పని చేస్తున్నారని ఎన్నిక సంఘానికి పురందేశ్వరి లేఖ రాసారు. సీఎస్ తో పాటుగా డీజీపీ, పలువురు సివిల్ సర్వీసు అధికారుల పేర్లు అందులో ప్రస్తావించారు. ఈ లేఖ పైన ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వ స్పందన కోరింది. సీఎస్ గా జవహర్ రెడ్డికి స్థాన చలనం ఖాయమని చెబుతున్నారు. ఇదే సమయంలో జవహర్ రెడ్డిని తప్పిస్తే ఇంఛార్జ్ సీఎస్ గా అయిదుగురి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. సీనియర్ ఐఏఎస్ అధికారులు నీరబ్ కుమార్ ప్రసాద్, ఆర్‌పి సిసోడియా, రజత్‌ భార్గవ్‌, శ్రీలక్ష్మి, అనంతరామ్‌లతో కూడిన జాబితాను ఈసీ పరిశీలనకు.. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మీనా పంపినట్లు తెలుస్తోంది.

ఆ క్రమంలో నీరబ్ కుమార్ ప్రసాద్ లేదా సిసోడియాలలో ఒకరికి తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే ఫిర్యాదుల ఆధారంగా ఏపీలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల విషయంలో ఎన్నికల సంఘం స్పందించింది. అధికారులను బదిలీ చేసింది. ఈ క్రమంలో పురందేశ్వరి చేసిన ఫిర్యాదు పైన రాజకీయంగానూ దుమారం చెలరేగింది. వాలంటీర్ల ను పెన్షన్ల పంపిణీ విధుల నుంచి దూరంగా ఉంచాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఆ సమయంలో అధికారుల తీరు పైన ప్రతిపక్ష నేతలు ఫిర్యాదులు చేసారు. దీంతో, ఇప్పుడు సీఎస్ జవహర్ రెడ్డి విషయంలో ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.

రంగంలోకి భారతి, అటు షర్మిల – సమరమే…!!

ఏపీ ఎన్నికల సమరం ఆసక్తి కరంగా మారుతోంది. కూటమి – వైసీపీ మధ్య పోరు ప్రతిష్ఠాత్మకంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ – వామపక్షాల కూటమి బరిలోకి దిగింది. పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి షర్మిల దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు కడప ఎంపీగా బరిలో నిలచారు. దీంతో..కడప పోరు ఉత్కంఠ పెంచుతోంది. ఇదే సమయంలో సీఎం జగన్ సతీమణి ఎన్నికల ప్రచారంలోకి అడుగు పెడుతున్నారు. కడప లో కొత్త రాజకీయం ఆసక్తిని పెంచుతోంది. హోరెత్తుతున్న ప్రచారం ఏపీలో ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరంది. సీఎం జగన్ బస్సు యాత్ర ద్వారా ప్రస్తుతం గుంటూరు జిల్లాకు చేరుకున్నారు. అటు చంద్రబాబు – పవన్ ఉమ్మడి సభలు నిర్వహిస్తున్నారు. పీసీసీ చీఫ్ షర్మిల ఎన్నకల ప్రచారం కొనసాగిస్తున్నారు. జనసేన తమ స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించింది. ఈ నెల 18 న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ రోజు నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. సీఎం జగన్ ీ నెల 22న పులివెందులలో నామినేషన్ వేయనున్నారు. బస్సు యాత్ర పూర్తయిన తరువాత పులివెందులో నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తరువాత రోజుకు మూడు నియోజకవర్గాల చొప్పున ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనేలా షెడ్యూల్ సిద్దం అవుతోంది.

పులివెందులలో భారతి జగన్ సతీమణి భారతి ఎన్నికల ప్రచారానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. జగన్ నామినేషన్ తరువాత భారతి పులివెందులలో ప్రచారం చేస్తారని పార్టీ నేతల సమాచారం. పులివెందుల టీడీపీ అభ్యర్దిగా బీటెక్ రవి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్ది ఖరారు కావాల్సి ఉంది. 2019 ఎన్నికల సమయంలోనూ భారతి వైసీపీకి మద్దతుగా కడప జిల్లాలో ప్రచారం చేసారు. ఈ సారి పులివెందుల తో పాటుగా కడప జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ప్రచారం చేస్తారని చెబుతున్నారు. అయితే, ఈ సారి కడప ఎంపీగా షర్మిల బరిలో ఉన్నారు. వైసీపీ నుంచి అవినాశ్ పోటీ చేస్తున్నారు. షర్మిల, సునీత తమ ప్రచారంలో వివేకా హత్య కేసు ప్రధానంగా ప్రస్తావిస్తూ అవినాశ్ ను టార్గెట్ చేస్తున్నారు. ఆసక్తి కర రాజకీయం సీఎం గా జగన్ వైఫల్యం చెందారని షర్మిల తన ఎన్నికల ప్రచారంలో విమర్శిస్తున్నారు. ఈ సమయంలో భారతి కడప జిల్లా లో ఎన్నికల ప్రచారానికి వస్తుండటంతో జిల్లా రాజకీయాల్లో ఆసక్తి పెరుగుతోంది. జగన్ కడప లో జరిగిన సభలో వివేకా హత్య గురించి ప్రస్తావించారు. షర్మిల, సునీత గురించి ప్రస్తావించినా..ఎక్కడా విమర్శలు చేయలేదు. ఇప్పుడు భారతి సైతం వైసీపీ అభ్యర్దులకు మద్దతుగా ప్రచారం చేస్తారని.. షర్మిల గురించి ప్రస్తావన చేసే అవకాశం ఉండదని పార్టీ నేతల అంచనాగా కనిపిస్తోంది. అదే సమయంలో భారతి ప్రచారంలోకి దిగితే షర్మిల ఎలా స్పందిస్తారనేది కీలకంగా మారుతోంది. దీంతో..కడప కేంద్రంగా చోటు చేసుకోనున్న ప్రచారం ఎన్నికల వేళ ఆసక్తిగా మారుతోంది.

Best Schemes: ఈ మూడు ప్రభుత్వ పథకాలలో ఇన్వెస్ట్‌ చేస్తే డబ్బు రెట్టింపు.. అద్భుతమైన స్కీమ్స్‌

మీరు కూడా పెట్టుబడి నుండి రెట్టింపు లాభం పొందాలనుకుంటే ఈ వార్త మీకు ఉపయోగకరంగా ఉంటుంది. వాస్తవానికి, మీరు మీ ఆర్థిక భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవాలనుకుంటే డబ్బును ఆదా చేయడం మాత్రమే కాదు, దాన్ని పెంచుకోవడం కూడా అంతే ముఖ్యం. చిన్న పొదుపు పథకం ఈ పనిలో మీకు సహాయం చేస్తుంది. మీరు మీ డబ్బును సురక్షితంగా పెంచుకోవడానికి పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రభుత్వం ఇలాంటి అనేక పథకాలను అమలు చేస్తుంది. ఈ రోజు 3 అటువంటి స్కీమ్‌ల గురించి తెలుసుకుందాం. ఇవి ఇటీవల పెట్టుబడిదారుల పెట్టుబడి మొత్తాన్ని రెట్టింపు చేశాయి.

కిసాన్ వికాస్ పత్ర:
ఈ పథకం కింద ప్రస్తుతం ఏడాదికి 7.5 శాతం వడ్డీ ఇస్తోంది. ఈ స్కీలో డబ్బును పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు దానిని కొన్ని సంవత్సరాలలో రెట్టింపు చేయవచ్చు. కిసాన్ వికాస్ పత్రలో కనీస పెట్టుబడి పరిమితి రూ. 1000. గరిష్టపెట్టుబడికి పరిమితి లేదు. ఇది ఏకమొత్తం పెట్టుబడి పథకం. అంటే ఒక్కసారి మాత్రమే డబ్బు పెట్టి వదిలేయవచ్చు. మీరు మళ్లీ మళ్లీ వాయిదాలలో డబ్బు జమ చేయాల్సిన అవసరం లేదు. మీరు పెట్టుబడి పెట్టిన మొత్తం కూడా పెరుగుతూనే ఉంటుంది. మీరు పెడుతున్న పెట్టుబడి 115 నెలల్లో రెట్టింపు అవుతుంది. 115 నెలలు అంటే 9 సంవత్సరాల 7 నెలలు. మీరు రూ. 5 లక్షలు పెట్టుబడి పెడితే, ఈ సమయం తర్వాత మీ మొత్తం రూ. 10 లక్షలకు పెరుగుతుంది. అయితే, మీరు రూ. 4 లక్షలు డిపాజిట్ చేస్తే ఈ మొత్తం రూ. 8 లక్షలకు పెరుగుతుంది.

పీపీఎఫ్‌ స్కీమ్‌:
పీపీఎఫ్‌పై వడ్డీ రేట్లు 7.1 శాతం, పోస్టాఫీసు సేవింగ్స్ డిపాజిట్లపై 4 శాతంగా ఉంచారు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ప్రజలకు దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం పొదుపు చేయడంలో సహాయపడుతుంది. ఈ పథకం పన్ను ఆదాలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రస్తుతం పీపీఎఫ్‌లో 7.1 శాతం వడ్డీ ఇస్తోంది. అటువంటి పరిస్థితిలో 72 నియమం ప్రకారం, మీ డబ్బు రెట్టింపు కావడానికి 10 సంవత్సరాల కంటే తక్కువ సమయం పడుతుంది.

సుకన్య సమృద్ధి యోజన:
సుకన్య సమృద్ధి యోజన కింద డిపాజిట్ చేసిన మొత్తంపై 8.2 శాతం వడ్డీ రేటు అందుబాటులో ఉంటుంది. అదే సమయంలో పోస్టాఫీసు మూడేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ 7.1 శాతంగా ఉంటుంది. సుకన్య సమృద్ధి (SSY) అనేది ప్రభుత్వ చిన్న పొదుపు పథకం. ఇది ఆడపిల్లల భవిష్యత్తు కోసం చదువు, పెళ్లి ఖర్చులకు తోడ్పడుతుంది. ఈ పథకం 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న కుమార్తెలకు అందుబాటులో ఉంది. పథకం కింద మీరు సంవత్సరానికి కనిష్టంగా రూ. 250, గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు.

Health

సినిమా