Friday, September 20, 2024

ఒకే కుటుంబంలో.. ఒకేసారి 17 మందికి పెళ్లి.. ఒకే శుభలేక

ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. ఎందుకంటే.. ఈ రెండు ప్రతిఒక్కరి జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనవి, అలాగే కష్టంతరమైనదని చెప్పవచ్చు. సాధారణంగా ఇప్పుడున్న రోజుల్లో ఒకరికి సంబంధం చూసి, పెళ్లి చేయడమే ఏదో పెద్ద బాధ్యతగా భారంగా అనిపిస్తుంటుంది. నిజం చెప్పాలంటే ఈరోజుల్లో పెళ్లిళ్లు చేయాలంటే.. కట్న కానుకుల దగ్గర నుంచి వివాహ వేదిక వరకు, విందు భోజనాలు, ఫోటోలు, వీడియోలు ఇలా చెప్పుకుంటు పోతే ప్రతిది బోలెడంత ఖర్చుతో కూడుకున్న విషయం. మరి, అలాంటి పెళ్లిళ్లు ఇంట్లో ఒకరి, ఇద్దరికి చేసినప్పుడు ఉన్నది సరిపోకా, అప్పులు చేసి.. నానా తంటాలు పడుతూ శుభకార్యలను చేస్తుంటారు. అప్పటికే కన్నవారికి చుక్కలు కనిపిస్తుంటాయి. కానీ, తాజాగా ఓ కుటుంబంలో మాత్రం ఒకేసారి 17 మందికి వివాహాలు జరిపించారు. అదేమిటి ఒకే ఇంట్లో ఒకోసారి 17 మందికి పెళ్లి చేశారా అని వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజంగానే జరిగింది. ఇంతకి ఎక్కడంటే..

సాధారణంగా ప్రస్తుత కాలంలో ఒకరికి సంబంధం చూసి పెళ్లిళ్లు చేయడామే పెద్ద సవాలుగా మారుతుంది. ముఖ్యంగా .. ఇంట్లో ఉన్న ఆడపిల్లకు పెళ్లి చేసి ఇళ్లు దేటించాలంటే.. అంతా చిన్న మాట ఏమీ కాదు. ఎందకంటే.. సంబంధం కాయం అయిన నుంచి పెళ్లి చేసి ఇళ్లు దేటించిన వరకు ప్రతిది లక్షల ఖర్చుతో ముడిపడిన విషయమని అందరికి తెలిసిందే. అలాంటి తాజాగా ఓ ఇంట్లో ఒకేసారి 17మందికి పెళ్లి చేసి అందరి చేత ఔరా అనేలా చేశారు. ఆ వివరాళ్లోకి వెళ్తే.. రాజస్థాన్‌కు చెందిన సూర్జారామ్‌ గోదారా అనే వ్యక్తి .. తన ఇంట్లో ఉన్న మనవాళ్లు, మనుమరాళ్లు ఇలా మొత్తం 17 మందికి ఒకేసారి వివాహాలు జరిపించారు. పైగా వీరందరి వివాహాలకు ఒకే శుభలేఖలో ముద్రించి, బంధుమిత్రులను ఆహ్వానించారు. అయితే గోదరా కు చెందిన 5 మనుమలకు ఏప్రిల్‌ 1న వివాహం చేయగా.. మిగిలిన 12 మంది మనుమరాళ్లకు ఆ మర్నాడు పెళ్లిళ్లు చేశారు. అయితే ఇలా బికనీర్‌ జిల్లా, నోఖా మండలం, లాల్‌మదేసర్‌ గ్రామంలో.. ఒకే ఇంట్లో ఇలా సామూహిక వివాహాలు జరగడంతో అందరూ ఈ పెళ్లిలను చూసి ఆశ్చర్యపోతున్నారు. అలాగే మునపెన్నడూ ఇలాంటి వివాహాలు ఎక్కడ చూడటం, వినడం వంటివి జరగలేదని.. మొట్ట మొదటిసారి ఇలా ఒకే ఇంట్లో ఇంత మందికి పెళ్లిళ్లు జరగడమని చర్చించుకుంటున్నారు.

Aadhaar ATM: ఇకపై బ్యాంకు, ఏటీఎంకు వెళ్లకుండానే ఇంటివద్దే నగదు విత్‌డ్రా.. ఎలాగో తెలుసా?

ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోయింది. ఒకప్పుడు ఏదైనా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పని ఉంటే బ్యాంకుకు వెళ్లి చేసుకునే వాళ్లం. కానీ ఇప్పుడు టెక్నాలజీ అభివృద్ధి చెందిన కారణంగా ఇంట్లోనే ఉండి పనులు చేసుకునే వెసులుబాటు వచ్చింది. అయితే మనకు అకౌంట్‌ నుంచి డబ్బు కావాలంటే బ్యాంకుకు వెళ్లిల్సి ఉంటుంది. అత్యవసరంగా డబ్బు అవసరమైతే ఏటీఎంకు వెళ్తుంటాము. కొందరికేమో ఏటీఎంకు వెళ్లే సమయం కూడా ఉండకపోవచ్చు. అలాంటి సమయంలో నగదు కోసం ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మీరు నగదు కోసం, బ్యాంకుకు, ఏటీఎంకు వెళ్లకుండా మీ ఇంటి వద్ద తీసుకునే వెసులుబాటు ఉంది. ఇలాంటి వారికి ఇండియన్‌ పోస్టల్‌ కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఇండియా పోస్టు పేమెంట్స్ బ్యాంకు (IPPB) ఆన్‌లైన్ ఆధార్ ఏటీఎం అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. అంతేకాకుండా.. తాజాగా ఐపీపీబీ దీని గురించి Xలో దీనికి సంబంధించిన ఓ పోస్ట్ ద్వారా వెల్లడించింది. మీకు అత్యవసరం డబ్బు అవసరమైతే ఏటీఎంకు, బ్యాంకుకు వెళ్లకుండా ఈ సర్వీసు ద్వారా మీకు కావాల్సిన నగదును ఇంటికే తెచ్చుకోవచ్చు. ఇక నుంచి IPPBONLINE Aadhaar ATM (AePS) సర్వీస్‌తో నగదును సులభంగా పొందవచ్చు. ఇంటి వద్దే కావాల్సినంత నగదు విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది. ఈ సర్వీసును డోర్‌స్టెప్ సర్వీస్ అని కూడా అంటారు. మీరు ఇంటి వద్దే ఉండి నగదు కోసం అప్లై చేసుకున్నట్లయితే పోస్ట్‌మ్యాన్‌ మీ ఇంటికి వచ్చి నగదును అందజేస్తాడు. అలాగే ఇతర సమాచారం కోసం ఈ వెబ్‌సైట్‌ను సందర్శించండి అని పోస్ట్ చేశారు.
బయోమెట్రిక్‌ విధానం ద్వారా..

ఇక ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (AePS) ద్వారా ఎవరైనా డబ్బులు కావాలనుకునే వ్యక్తి వారి బయోమెట్రిక్ ఉపయోగించడం ద్వారా నగదును తీసుకోవచ్చు. ఇంకా ఆధార్ లింక్డ్ అకౌంట్ ద్వారా డబ్బు తీసుకోవచ్చు. ఖాతాదారుడు తన ఆధార్‌ కార్డును ఉపయోగించడం ద్వారా ఐడెంటిటీ ధ్రువీకరణతో.. క్యాష్ విత్‌డ్రాయల్, బ్యాలెన్స్ ఎంక్వైరీ, బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్‌మెంట్, ఆధార్ టు ఆధార్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ వంటి ఇతర బేసిక్ బ్యాంకింగ్ లావాదేవీలు కూడా చేసుకునే సదుపాయం ఉంది.

https://x.com/IPPBOnline/status/1777287832970858532

ఈ సేవలను ఎలా పొందాలంటే?

మీరు ఈ సర్వీసు ద్వారా ఇంటి వద్దే విత్‌డ్రా సదుపాయం పొందాలంటే ePS తో అనుసంధానమై ఉన్న బ్యాంక్ అకౌంట్ ఉండాలి. బ్యాంకు అకౌంట్‌కు ఆధార్‌ లింకై ఉండాలి. బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారానే లావాదేవీ చేసుకునే సదుపాయం ఉంటుంది. బ్యాంకు అకౌంట్‌కు ఆధార్‌ అనుసంధానం లేకపోతే లావాదేవీలు జరగవు. ఐపీపీబీ ద్వారా డోర్‌స్టెప్ సర్వీస్ ద్వారా లావాదేవీ సక్సెస్ అయిందో లేదో SMS అలర్ట్ ద్వారా తెలుసుకోవచ్చు.

Jawahar reddy: సీఎస్‌పై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు

న్యూఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల సంఘాన్ని టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నేతలు మంగళవారం ఆశ్రయించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల సంఘానికి వారు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో పెన్షన్ల పంపిణి వ్యవహారంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని మానవ హక్కుల సంఘానికి వారు విజ్జప్తి చేశారు.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 09: న్యూఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల సంఘాన్ని టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నేతలు మంగళవారం ఆశ్రయించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల సంఘానికి వారు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో పెన్షన్ల పంపిణి వ్యవహారంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని మానవ హక్కుల సంఘానికి వారు విజ్జప్తి చేశారు.

పెన్షన్ల పంపిణీలో వాలంటీర్లను పక్కన పెట్టి… ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పంపిణీ చేయాలని ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా.. ఆ ఆదేశాలను ఈ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పక్కదారి పట్టించారని ఆ పిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా 33 మంది మరణించారని వారు ఈ సందర్భంగా మానవ హక్కుల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. కదలలేని స్థితిలో ఉన్న వారిని బలవంతంగా గ్రామ సచివాలయాలకు రావాల్సిందేనని వైసీపీ నేతలు చేసిన ప్రచారం కారణంగానే.. వారంతా మరణించారని చెప్పారు.

ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిన తర్వాత కూడా ప్రధాన కార్యదర్శి పదవిలో ఉండి… అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని జవహర్ రెడ్డిపై ఆ పిర్యాదులో పేర్కొన్నారు. కమిషన్‌ వెంటనే జోక్యం చేసుకోవాలన్నారు. అలాగే పెన్షనర్లకు వారి ఇంటి వద్దే గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా పెన్షన్‌ అందించేలా ప్రధాన కార్యదర్శికి తగిన ఆదేశాలు ఇవ్వాలని ఈ సందర్భంగా మానవ హక్కుల సంఘాన్ని కూటమి నేతలు కోరారు. ఇప్పటికే అధికార వైసీపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్న ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డిపై తీవ్రమైన చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఇక పెన్షన్ల పంపిణీకి అవసరమైన నిధులు సకాలంలో సమకూర్చడంలో విఫలమైన ఇతర ఉన్నతాధికారులపై సైతం చర్యలు తీసుకోవాలని ఈ సందర్బంగా మానవ హక్కుల సంఘాన్ని నేతలు కోరారు.

Apple Benefits: యాపిల్‌ ఏ సమయంలో తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది? ఇక్కడ తెలుసుకోండి..

ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాల్లో పండ్లు ముఖ్యమైనవి. వాటిల్లో యాపిల్‌ పండ్లు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాయి. యాపిల్‌లోని పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. తక్కువ కేలరీల కంటెంట్ ఉన్న పండ్లలో యాపిల్ ఒకటి. ఒక యాపిల్‌ పండులో 60 కేలరీలు మాత్రమే ఉంటాయి. షుగర్ లెవల్స్ కూడా పెరగవు. యాపిల్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. దీనిలో ఉండే క్వెర్సెటిన్ అనే పదార్ధం చర్మానికి మేలు చేస్తుంది..

ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాల్లో పండ్లు ముఖ్యమైనవి. వాటిల్లో యాపిల్‌ పండ్లు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాయి. యాపిల్‌లోని పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

తక్కువ కేలరీల కంటెంట్ ఉన్న పండ్లలో యాపిల్ ఒకటి. ఒక యాపిల్‌ పండులో 60 కేలరీలు మాత్రమే ఉంటాయి. షుగర్ లెవల్స్ కూడా పెరగవు. యాపిల్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. దీనిలో ఉండే క్వెర్సెటిన్ అనే పదార్ధం చర్మానికి మేలు చేస్తుంది.

ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఫ్రీ రాడికల్స్ వల్ల వచ్చే సమస్యలను తొలగిస్తాయి. అనేక దీర్ఘకాలిక వ్యాధులను నివారించడానికి ఇది సహాయపడుతుంది. అలాగే యాపిల్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది.

యాపిల్‌లో శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడతాయి. యాపిల్ బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. శరీరంలో ఎలాంటి వాపునైనా తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉంచడంలో ఈ పండు ఉపయోగపడుతుంది.

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఉదయం పూట ఆపిల్ తినడం శరీరానికి మంచిది. అలాగే మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత యాపిల్ తింటే మేలు జరుగుతుందని నిపుణులు అంటున్నారు. అయితే ఉదయం అల్పాహారం సమయంలో యాపిల్ తినడం వల్ల మరింత ప్రయోజనాలు పొందవచ్చట. రాత్రిపూట యాపిల్ తినకపోవడమే మంచిది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఫైబర్ అధికంగా ఉండే ఈ పండును తినడం వల్ల జీర్ణక్రియ ప్రక్రియ సజావుగా సాగుతుంది.

మాజీ మంత్రి డీఎల్ కీలక నిర్ణయం-మైదుకూరు ఎమ్మెల్యేగా వీరికి.. కడప ఎంపీగా వారికి మద్దతు..!

ఏపీలో ఎన్నికల వేళ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఓవైపు టీడీపీ, బీజేపీ, జనసేన ఎన్డీయే కూటమిగా ఉమ్మడి అభ్యర్ధులను నిలబెట్టడంతో రాష్ట్రంలో ఈసారి భారీగా క్రాస్ ఓటింగ్ జరగబోతోంది. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధులుగా కూటమి నిలబెట్టిన స్ధానాల్లో క్రాస్ ఓటింగ్ ఎలాగో తప్పదు. అయితే సీఎం జగన్ సొంత జిల్లా కడపలో సైతం భిన్న పార్టీల మధ్య క్రాస్ ఓటింగ్ తప్పేలా లేదు. కడప జిల్లాల్లో తాజాగా మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఓటర్లకు ఇవాళ మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి కీలక పిలుపు ఇచ్చారు. ముఖ్యంగా గతంలో తాను పలుమార్లు గెలిచిన మైదుకూరు సీటులో ఎవరికి ఓటేయాలో, కడప ఎంపీగా ఎవరికి ఓటు వేయాలన్న దానిపై డీఎల్ ఓటర్లకు ఇచ్చిన పిలుపు ఆసక్తికరంగా ఉంది. మైదుకూరులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి పుట్టా సుధాకర్ యాదవ్ కు ఓటేయాలని డీఎల్ పిలుపునిచ్చారు. అయితే కడప లోక్ సభ స్ధానంపై మాత్రం పరోక్షంగా ఓ పిలుపు ఇచ్చారు.

కడప లోక్ సభ సీటులో వివేకం సినిమా చూసి ఓటేయాలంటూ డీఎల్ రవీంద్రారెడ్డి పిలుపునిచ్చారు. అంటే ఈ సినిమాలో చూపించినట్లుగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య తర్వాత బాధితులుగా మారిన ఆయన కుటుంబం మద్దతిస్తున్న వైఎస్ షర్మిలకు ఓటేయాలని డీఎల్ పరోక్షంగా చెప్పినట్లయింది. అసలే కడప లోక్ సభ సీటులో అవినాష్ వర్సెస్ షర్మిల వార్ కొనసాగుతున్న నేపథ్యంలో డీఎల్ పిలుపు ప్రాధాన్యం సంతరించుకుంది.

టీ తో ప్రధాని మోదీ చిత్రాన్ని అవలీలగా వేసిన కుర్రాడు.. ఫిదా అయిపోయిన నెటిజన్లు..!!

చేసే పని ఇష్టంగా చేస్తే.. అందులోనే అద్భుతాలు సృష్టించవచ్చు. అందుకే అంటారు.. ఏం చేసినా మనసుకు నచ్చిన పనే చేయాలి అని.. అప్పుడే క్రియేటివ్‌గా, స్మార్ట్‌గా ఆలోచించగలుగుతారు. అలాంటిదే ఇప్పుడు చెప్పుకోబోయే స్టోరీ.. కళాకారులు బొమ్మలు వేస్తే..ప్రాణం ఉందా అన్నట్లు కనిపిస్తాయి.. అంత అందంగా వేస్తారు. మధ్యప్రదేశ్‌కి చెందిన యువకుడు మాత్రం ఆహార పదార్ధాలు, ద్రవ పదార్ధాలతో పెయింట్స్ వేస్తూ అందర్ని ఆశ్చర్యపరుస్తున్నాడు.జబల్ఫూర్‌కి చెందిన ఓ యువ కళాకారుడు తాగే టీ తో అద్భుతమైన పెయింటింగ్‌ వేసి అందరిని మంత్రముగ్దులను చేశాడు.

దేశప్రధాని నరేంద్ర మోదీ చిత్రాన్ని వేశాడు..ఇప్పడు ఈ వార్త నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. మధ్యప్రదేశ్‌ జబల్పూర్‌లోని రాంఝీ ప్రాంతానికి చెందిన సింటూ మౌర్య అనే యువకుడు తినే పదార్ధాలు, తాగే పానియాలు ఉపయోగించి.. కేవలం చేతి వేళ్లను బ్రష్‌గా మార్చుకొని అద్భుతమైన బొమ్మలు వేస్తున్నాడు. టమాటో సాస్, కచప్, ఉతికిన బట్టల నుంచి వచ్చే మురికి నీటిని ఉపయోగించి అదిరిపోయే చిత్రాలు వేస్తున్నాడు. తాజాగా తాగే టీతో దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోని వేశాడు సింటు మౌర్య. చిన్న టీ పొడిని డికాషన్‌గా స్టౌవ్ పై వేడి చేసి దాన్ని ఓ పేపర్‌పై పోసి తన చేతి వేలితో ప్రధాని బొమ్మ గీశాడు.
ఫింగర్ పెయింటింగ్ కళాకారులు గురించి మనకు తెలుసుకు.. ఇసుకతో చేతివేళ్లతోనే అద్భుతమైన బొమ్మలు వేస్తారు..కానీ సింటూ మౌర్య తరహాలో తినే పదార్ధాలు, తాగే పానియాలతో బొమ్మలు వేయడం మాత్రం ఇంతకుముందు ఎన్నడూ చూడలేదని స్థానికుల నుంచి నెటిజన్ల వరకూ అందరూ అంటున్నారు. రీసెంట్‌గా ప్రధాని మోదీ ఫోటోని టీతో వేయడం చూసిన నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో లక్షల లైక్‌లు వచ్చాయి. సింటూ మౌర్య టాలెంట్‌ ఉపయోగించి టీ తో వేసిన ఫోటో వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మనలో టాలెంట్ ఉంటే.. అదే ఈ ప్రపంచానికి ఏదో ఒకరోజు మనల్ని పరిచయం చేస్తోంది.. ఏ మూల ఉన్న ఒకరోజు వస్తుంది.. అందరూ నీ టాలెంట్‌ గురించి మాట్లాడుకుంటారు..! ఏమంటారు..?

‘ గేట్ ఆఫ్ హెల్ ‘ లో అంతులేని రహస్యాలు..ఒక్కరూ కూడా బ్రతికి లేరు..

ప్రపంచంలో మనుషుల చేత నిర్మించిన రహస్యాలు ఎన్నో ఉన్నాయి..మరికొన్ని ప్రకృతి నిర్మించిన రహస్యాలు కూడా వున్నాయి.కొన్ని వింతలను తలపించే రహస్యాలు ఉన్నాయి.వాటి కోసం ఎప్పటినుండో తెలుసుకొనే ప్రయత్నిస్తున్నారు.కానీ అదొక అద్భుతంగా వున్న ప్రదేశాలు ఉన్నాయి.ఈ రోజు మనం తెలుసుకోనున్న మిస్టరీ గేట్ ఆఫ్ హెల్ అంటే నరకానికి ద్వారం అని పిలుస్తారు. ఈ గుడిలోపలికి ఎంట్రీ నరమానవులకు లేదు. ఎందుకంటే ఈ గుడిలోపలికి వెళ్లిన వారు మళ్ళీ తిరిగిరాలేదని అంటారు.
ఎన్నో మర్మాలను దాచుకున్న ఈ ఆలయం టర్కీలోని పురాతన నగరంలో ఉంది.హెరాపోలిస్ అనే నగరంలో అతి పురాతన ఆలయం ఉంది. దీనిని ‘గేట్ ఆఫ్ హెల్’ అని పిలుస్తారు. ఈ ఆలయం లోపలికి కాదు కదా.. చుట్టూ తిరిగే వ్యక్తులు కూడా తిరిగి రారు. అందుకనే ఈ ప్రదేశం ఎన్నో సంవత్సరాలు రహస్య ప్రాంతంగా ఉంది. ఎందుకంటే గ్రీకు దేవుడి విషపూరితమైన శ్వాస ఇక్కడికి వచ్చిన వారిని చంపుతుందని ప్రజలు విశ్వసించారు..ఆ పేరు కూడా తియ్యరు.

ఈ ఆలయాన్ని ‘ప్లూటో ఆలయం’ అని పిలుస్తారు. అంటే మృత్యుదేవుని ఆలయం. ఇక్కడ మృత్యుదేవత శ్వాస కారణంగా.. ఆలయాన్ని లేదా దాని పరిసరాలను సందర్శించే వారు చనిపోతారని నమ్ముతారు. తరచుగా మరణాలు సంభవిస్తున్నందున, ఈ ఆలయాన్ని ప్రజలు ‘నరక ద్వారం’ అని పిలుస్తారు..ఈ ఆలయం కింద నుండి విషపూరిత కార్బన్ డయాక్సైడ్ వాయువు నిరంతరం లీక్ అవుతుందని.. ఇది మానవులను, జంతువులు, పక్షులను తాకిన వెంటనే చంపేస్తుంది. కేవలం 10 శాతం కార్బన్ డయాక్సైడ్ వాయువు.. ఏ వ్యక్తినైనా 30 నిమిషాల్లో నిద్రపోయేలా చేయగలదు.

ఈ నేపథ్యంలో ఈ ఆలయంలోని గుహలో కార్బన్ డయాక్సైడ్ వంటి విష వాయువు పరిమాణం 91 శాతం ఉన్నదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అత్యధిక పరిమాణంలో ఉన్న ఈ వాయువు విషంగా మారి ఆలయ సమీపంలోకి వెళ్లినవారిని ప్రాణాలను తీస్తుందని చెబుతున్నారు.అందుకే అక్కడ చనిపొతున్నారని, అక్కడకు ఎవరూ వెళ్ళే సాహసం చెయ్యరు..ఇదండీ ఆ అంతు చిక్కని రహస్యం..

మీ ఫోన్ లో నెట్ స్లో అయ్యిందా?ఇలా చేస్తే క్షణాల్లో స్పీడ్ అవుతుంది..

మొబైల్ లో డేటా కొన్ని కారణాల వల్ల స్లో అవుతుంది.. వాతావరణ పరిస్థితులు కారణంగా కూడా డేటా స్లో అవుతుంది..అలా స్లో అవ్వడం వల్ల వెబ్ పేజ్ లోడ్ అవ్వదు, యూట్యూబ్ లాంటి వీడియో ప్లాట్ ఫాంలో బఫర్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ సమస్య ప్రతి ఒక్కరు కూడా ఎదుర్కొనే ఉంటారు. ఇంటర్నెట్ స్పీడ్ తగ్గినప్పుడు ఏం చేయాలి. మంచి వేగం లభించడం లేదు. ఎందుకు ఇలా జరుగుతుందో చాలా మందికి తెలియదు.

మీరు కూడా ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే.. ఈ రోజు మనం ఆ సెట్టింగ్‌ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.దీని ముఖ్యమైన కారణం తెలిస్తే మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్ నిజమైన వేగాన్ని పొందవచ్చు. మంచి ఇంటర్నెట్ వేగం కోసం, మీరు బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతున్న కొన్ని యాప్‌లను మూసివేయడం. ఎందుకంటే మీ ఫోన్ వెనుక ఈ యాప్స్ పని చేస్తుంటాయి. అందుకే ఇంటర్నెట్ నెమ్మదిగా పనిచేస్తుంటుంది..

నెట్ వాడుతున్నప్పుడు ఒకే సమయంలో రెండు డౌన్‌లోడ్ చేయడం. కొన్నిసార్లు మూడు నుండి నాలుగు ఫైల్‌లను ఉంచకూడదు. లేకపోతే ఫైల్‌లు డౌన్‌లోడ్ చేయబడవు లేదా మీరు వెబ్‌లో సర్ఫ్ చేయలేరు.

ఇంటర్నెట్ వేగాన్ని పెంచడానికి మరొక అత్యంత ప్రభావవంతమైన మార్గం ఉంది. స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న అదనపు ఫైల్‌లను తొలగించి.. దాని నిల్వను విడుదల చేయడానికి పని చేస్తుంది. ఇది తలపై ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇంటర్నెట్ వేగం బాగుంటుంది..

మీ స్మార్ట్‌ఫోన్‌లో అనవసరమైన అనువర్తనాలను డౌన్‌లోడ్ చేసి ఉంటే, మీరు వాటిని వెంటనే తొలగించాలి ఎందుకంటే అనవసరమైన అనువర్తనాలు మీ స్మార్ట్‌ఫోన్‌లో నడుస్తున్న ఇంటర్నెట్ వేగాన్ని తగ్గిస్తాయి..

మోడెమ్ ని రీస్టార్ట్ చేయడం ద్వారా ఏవైనా సాంకేతిక లోపాలు ఉన్నట్లయితే అంటే సాఫ్ట్వేర్ పరంగా ఏవైనా లోపాలు ఉంటే దానంతట అది ఫిక్స్ చేసుకోవాలంటే మీరు ఒకసారి ఆఫ్ చేయాలి, ఆ తర్వాత ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఆగిన తర్వాత మళ్లీ ఎలక్ట్రిక్ ప్లగ్ కి కనెక్ట్ చేసి రీస్టార్ట్ చేయండి..అలా మీ ఫోన్ సమస్యలు తీరిపోయి మళ్ళీ స్పీడ్ అవుతుంది..

ఆ పాత కాయిన్‌ మీ దగ్గర ఉంటే.. పదికోట్లు మీ సొంతం..!!

పాత నాణేలు, పాత వస్తువులు, పాత నోట్లు ఇలాంటివి దాచుకోవడం చాలా మందికి అలవాటుగా ఉంటుంది. అవి ఇప్పుడు కాకపోయినా.. ఏదో ఒకరోజు అదృష్టాన్ని తెచ్చిపెడతాయని వారి నమ్మకం. అలాగే.. చాలాసార్లు అలాంటి కాయిన్స్‌, నోట్లు మీ దగ్గర ఉంటే లక్షల్లో డబ్బులు ఇస్తామని ఆఫర్లు కూడా వస్తుంటాయి. అలాంటి ఓ ఆఫరే ఇప్పుడు మార్కెట్లో ఉంది. మీ వద్ద కేవలం ఆ 5 రూపాయిల నోట్ ఉందా..ఉంటే ఇంట్లో కూర్చునే కోట్లకు పడగెత్తవచ్చు. ఇంట్లో కూర్చునే కోటీశ్వరులు కావడమంటే వింటేనే అతిశయోక్తిగా ఉంది కదూ. ఆ 5 రూపాయల నోట్‌తో మీరు ఏ వ్యాపారం లేదా ఏ పనీ చేయాల్సిన అవసరం లేకుండానే ఒక్క ఫోటో తీసి..అప్‌లోడ్ చేస్తే చాలు. ఇంకా పాత 1 రూపాయి నాణెం ఉన్నా సరే..పది కోట్లు మీ సొంతం కానున్నాయి. ఎలా అంటారా..?
మీరు చేయాల్సిందల్లా మీ వద్ద ఉన్న కరెన్సీకు నిర్ధిష్టంగా సూచించిన ప్రత్యేకతలున్నాయా లేదా చెక్ చేసుకోవడమే. 1885లో బ్రిటీషు కాలంలో ముద్రించిన ఈ నాణెం ఉంటే..పది కోట్లు సాధించవచ్చు. ఈ కాయిన్ మీ వద్ద కూడా ఉంటే ఆన్‌లైన్ ఆక్షన్‌లో మీ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటిదే కాయిన్ పది కోట్లకు అమ్ముడైంది.
ఏం చేయాలి, ఎలా చేయాలంటే..
మీ దగ్గర కాయిన్‌ ఉన్నట్లేతే..ముందుగా ఇండియా మార్ట్ అధికారిక వెబ్‌సైట్ www.indiamart.com సందర్శించాలి.
మీ వద్ద ఉన్న ఉన్న పాత కరెన్సీ ఫోటో తీసి అప్‌లోడ్ చేయాలి.
కంపెనీ మీ ప్రకటనను ఫీచర్ చేస్తుంది. ఆసక్తి కలిగినవారు మిమ్మల్మి సంప్రదిస్తారు. మీరు నేరుగా పార్టీతో డీల్ ఫిక్స్ చేసుకోవచ్చు.
అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా..పాత నోట్లు లేదా కాయిన్లను ఆన్‌లైన్‌లో క్రయవిక్రయాలు చేయడంపై హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని అసాంఘిక శక్తులు మోసపూరింగా ఆర్బీఐ పేరు, లోగోను వాడుతూ..క్రయ విక్రయాలకు సంబంధించి కమీషన్, ఛార్జీలు, ట్యాక్స్ వసూలు చేస్తున్నారని తెలిపింది. ఆర్బీఐ ఇలాంటి వ్యవహారాలపై ఎప్పుడూ కమీషన్ లేదా ట్యాక్స్ అడగదని స్పష్టం చేసింది. ఒకవేళ మీ దగ్గర కాయిన్‌ ఉంటే.. జాగ్రత్తగా మోసపోకుండా క్యాష్‌ చేసుకోవాలి.!

రైలులో చివరి బోగికి X గుర్తు ఎందుకు ఉంటుంది..?

మనందరం ట్రైన్‌ జర్నీ చేసే ఉంటాం.. కానీ రైలు గురించి చాలా విషయాలు మనలో చాలమందికి తెలియదు.. ఎప్పుడూ విండో సీట్‌ పక్కన కుర్చోని సాంగ్స్‌ వింటూ ఎంజాయ్‌ చేయడం తప్ప పెద్దగా ఏం పట్టించుకోం.. రైలు ఇంజిన్‌ బరువు ఎంతుంటుందో మీరెప్పుడైనా ఆలోచించారా..? మీరు గమనించారో లేదో.. చివరి బోగికి లైట్‌ ఉండదు. పైగా చివరి బోగీ పైన X అని ఉంటుంది. ఎందుకు అలా ఉంటుంది..?

భారతీయ రైల్వేని ఆసియాలో అతిపెద్ద నెట్‌వర్క్‌గా చెబుతారు. మన దేశంలో 1 లక్షల 15 వేల కిలోమీటర్ల రైల్వే ట్రాక్‌లు ఉన్నాయి. ప్రతిరోజూ సుమారు 12617 రైళ్లు నడుస్తాయి. రోజూ లక్షల మంది ప్రయాణికులు రైలులో ప్రయాణిస్తుంటారు. అయితే రైలు చివరి బోగీపై ఒక క్రాస్‌ గుర్తు ఉంటుంది. అలాగే ఒక రెడ్‌ లైట్‌ ఉంటుంది. వీటికి ప్రత్యేకమైన అర్థం ఉంది. మీరు రైలును చూసినప్పుడల్లా దాని చివరి బోగీలో క్రాస్ (X) గుర్తు ఉంటుంది. ఇది రైలు మొత్తం ఒక స్టేషన్‌ నుంచి మరో స్టేషన్‌ చేరిందా లేదా అని తెలుపుతుంది. కొన్నిసార్లు బోగిలు విడిపోతాయి. ఇలాంటి సంఘటనలని గుర్తించేందుకు చివరిబోగిపై క్రాస్‌ గుర్తు వేస్తారు. ఈ బోగి కనిపించకపోతే ఆ మార్గంలో మరో రైలు ప్రయాణించదు. దీనివల్ల ప్రమాదాన్ని నివారించవచ్చు. అంత పెద్ద మీనింగ్‌ ఉందనమాట..
అలాగే ఆఖరి బోగీలో క్రాస్ కింద లైట్ ఉంటుంది. రాత్రిపూట చీకటి కారణంగా క్రాస్ గుర్తు కనిపించదు. ఈ లైట్ ఏర్పాటు చేయడం వల్ల మనం క్రాస్ గుర్తుని చూస్తాం. దీనిని బర్నింగ్ లైట్ అని పిలుస్తారు. అలాగే చివరి బోగీపై LV అని ఒక బోర్డు ఉంటుంది. LV అంటే చివరి కంపార్ట్‌మెంట్ అని అర్థం. రైలు పూర్తిగా నడుస్తోందని ఏ కోచ్ విడిపోలేదని ఈ LV గుర్తు తెలుపుతుంది. రైలు మొత్తం ఇంజిన్ సహాయంతో నడుస్తుంది. రైలు ఇంజిన్ బరువు సుమారు లక్షా 96 వేల కిలోలు ఉంటుంది. అది మ్యాటర్‌..

ఈ మొక్కతో మూత్రపిండాల్లో రాళ్లు మాయం..షుగర్‌, బీపీకి బెస్ట్‌ సొల్యూషన్..!!

మొక్కల్లో ఉన్నన్ని ఔషదగుణాలు ఇంగ్లీష్‌ మందుల్లో కూడా ఉండవు.. కానీ వాటిని సరిగ్గా వాడుకోవడం తెలిసినప్పుడు వాటి ప్రయోజనాలను పూర్తిగా పొందగలం. మనం ఎన్నో మొక్కలను రోజూ చూస్తాం.. కానీ వాటిపేరు, ఆ మొక్కల వల్ల ప్రయోజనాలు తెలియక లైట్‌ తీసుకుంటాం.. అలా మనం లైట్‌ తీసుకున్న మొక్కల్లో ఈ రణపాల మొక్క కూడా ఒకటి.. ఫోటో చూస్తే.. ఎక్కడో చూసినట్లే అనిపిస్తుంది కదా..! ఈ మొక్క శాస్త్రీయ నామం బ్ర‌యోఫిలం పిన్న‌టం. ఆయుర్వేదంలో ఈ ర‌ణ‌పాల మొక్క‌ను ఎన్నో ఏళ్లుగా అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించే ఔష‌ధంగా ఉప‌యోగిస్తున్నారు. ఈ మొక్కవల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దామా..!

రణపాల మొక్క ప్రయోజనాలు..
ర‌ణ‌పాల మొక్క ఆకులు మందంగా, వ‌గ‌రు, పులుపు రుచితో ఉంటుంది.
ర‌ణ‌పాల మొక్క‌లో యాంటీ వైర‌ల్, యాంటీ ఫంగ‌ల్, యాంటీ బ్యాక్టీరియ‌ల్ ల‌క్ష‌ణాలు పుష్క‌లంగా ఉన్నాయి.
ఈ మొక్క‌ను ఉప‌యోగించ‌డం వల్ల బీపీ, షుగ‌ర్ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయి.
మూత్ర‌పిండాల్లో రాళ్ల‌తో పాటు మూత్ర‌సంబంధింత స‌మ‌స్య‌ల‌ను కూడా ర‌ణ‌పాల మొక్క‌ను ఉప‌యోగించి న‌యం చేసుకోవ‌చ్చు.
అంటు వ్యాధులు, గాయాలు, శ్వాస కోశ సంబంధిత స‌మ‌స్య‌లు ఇలా అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో ర‌ణ‌పాల మొక్క మ‌న‌కు ఎంతో స‌హాయ‌ప‌డుతుంది.
ర‌ణ‌పాల మొక్క ఆకుల‌తో, కాండంతో చేసిన టీ ని తాగ‌డం వల్ల తిమ్మిర్లు, ఉబ్బ‌సం వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.
మూత్ర పిండాల్లో రాళ్ల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు ర‌ణ‌పాల మొక్క ఆకుల‌ను శుభ్ర‌ప‌రిచి నేరుగా న‌మిలి తిన‌వ‌చ్చు. ఇలా తిన‌లేని వారు పావు లీట‌ర్ నీటిలో నాలుగు ర‌ణ‌పాల మొక్క ఆకుల‌ను వేసి క‌షాయంలా చేసుకోవాలి. ఈ క‌షాయాన్ని రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున అలాగే సాయంత్రం తీసుకోవ‌డం వ‌ల్ల మూత్ర‌పిండాల్లో రాళ్ల స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.
జ‌లుబు, ద‌గ్గు, విరేచ‌నాలు వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఈ మొక్క ఆకుల‌ను తిన‌డం వ‌ల్ల ఆయా స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు.

నొప్పులకు..
ఈ మొక్క ఆకుల‌ను పేస్ట్ గా చేసి లేప‌నంగా రాసుకోవ‌డం వ‌ల్ల న‌డుము నొప్పి, త‌ల‌నొప్పి వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.
మొల‌ల స‌మ‌స్య‌తో బాధ‌పడే వారు ర‌ణ‌పాల మొక్క ఆకుల్లో మిరియాలు క‌లిపి తిన‌డం వ‌ల్ల మొల‌ల స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు.
ర‌ణ‌పాల మొక్క ఆకుల ర‌సాన్ని తాగ‌డం వ‌ల్ల క‌డుపులో పండ్లు, అల్స‌ర్లు వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.
ఈ ర‌సాన్ని తీసుకున్న అర‌గంట వ‌ర‌కు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు. షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారు ఈ మొక్క ఆకుల‌ను ప‌ర‌గ‌డుపున న‌మిలి తిన‌డం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధి నియంత్ర‌ణలో ఉంటుంది.
ర‌ణ‌పాల మొక్క ఆకుల రసాన్ని పూట‌కు రెండు టీ స్పూన్ల చొప్పున రెండు పూట‌లా తీసుకోవ‌డం వ‌ల్ల కామెర్ల వ్యాధి త‌గ్గుతుంది.
ఈ మొక్క ఆకుల‌ను వేడి చేసి గాయ‌ల‌పై ఉంచి క‌ట్టుకట్టాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల గాయాల నుండి ర‌క్తం కార‌డం ఆగ‌డంతో పాటు గాయాలు కూడా త్వ‌ర‌గా మానుతాయి.

గడ్డలకు..
ఈ మొక్క ఆకుల‌ను పేస్ట్‌గా చేసి కొవ్వు గ‌డ్డ‌లు, వేడి కురుల‌పై, శ‌రీరంలో వాపులు ఉన్న చోట ఉంచి క‌ట్టు క‌ట్టాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఆయా స‌మస్యలు కూడా త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.
ఈ మొక్క ఆకుల ర‌సాన్ని రెండు లేదా మూడు చుక్క‌ల మోతాదులో చెవిలో వేసుకోవ‌డం వ‌ల్ల చెవిపోటు త‌గ్గుతుంది.
అలాగే 40 నుండి 50 ఎమ్ ఎల్ మోతాదులో ఈ మొక్క ఆకుల‌తో చేసిన క‌షాయాన్ని తీసుకుని అందులో తేనెను క‌లిపి రోజుకు రెండు పూట‌లా తీసుకోవాలి. ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల స్త్రీలల్లో వ‌చ్చే యోని సంబంధిత స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.
ర‌ణ‌పాల మొక్క‌ల ఆకుల ర‌సాన్ని క‌ళ్ల చుట్టూ లేప‌నంగా రాసుకోవ‌డం వ‌ల్ల క‌ళ్ల సంబంధిత స‌మ‌స్య‌లు తగ్గుతాయి.
ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ మొక్క కనిపిస్తే కచ్చితంగా తెచ్చుకోండి.. ఆయుర్వేదంలో ఈ మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అయితే తెలిసి తెలియక ఒకటి అనుకోని ఇంకోటి వాడే ప్రమాదం ఉంది. కన్ఫామ్‌ చేసుకున్నాకే మొక్కను వాడటం మొదలుపెట్టండి. కన్ఫామ్‌ ఎలా చేసుకోవాలంటే.. ఆయుర్వేద నిపుణులు లేదా సర్జికల్‌ షాపుల్లో అడిగినా చెప్తారు.

క్షణాల్లో..ఈ బకెట్‌ వాటర్‌ను హీట్‌ చేసేస్తుంది.. ప్రొడక్ట్‌ పర్‌ఫెక్ట్‌..!!

చలికాలంలో అందరూ వేడినీళ్లతో స్నానం చేయాలనే అనుకుంటారు.. కానీ అందరి ఇళ్లలో గీజర్లు ఉండవు.. అంత ఖర్చుపెట్టి కొనలేం అనుకునేవాళ్లు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్లంతా వాటర్‌ హీటర్‌ తెచ్చుకుని వాడతారు.. ఇక ఊర్లల్లో అయితే.. కట్టెల పొయ్యిమీద నీళ్ల బిందె వేసి వేడి చేసుకుంటారు. నిజానికి ఇలా కట్టెల పొయ్యిమీద కాగిన నీళ్లే ఉత్తమం.. ఎలాంటి సమస్యా ఉండదు.. కాకపోతే ఈ వెసులుబాటు అందరి ఇళ్లలో ఉండదు.. అయితే వాటర్‌ హీటర్‌ వల్ల పెద్దతలనొప్పి.. అది పెడితే.. ఆ చుట్టుపక్కలకు చిన్నపిల్లలు, వృద్ధులు వెళ్లకుండా చూసుకోవాలి.. తెలిసితెలియక అందులో వేల్లుపెడితే ప్రాణాలకే ప్రమాదం.. గీజర్‌కు బదులుగా వాటర్‌ను హీట్‌ చేయడానికి ఓ బకెట్‌ ఆన్‌లైన్లో ఉంది. దీని గురించి మీకు తెలిసి ఉండకపోవచ్చు.. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ బకెట్‌ అందుబాటులో ఉంది. ఇది ఎలా పనిచేస్తుంది, ధర ఎంతో చూద్దామా..!
ఫ్లిప్‌కార్ట్ ఒక బకెట్‌ను విక్రయిస్తుంది. ఇది గీజర్‌కు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. దీని ధర కూడా చాలా తక్కువ.. ఇది విద్యుత్ ఆదా చేయడంలో కూడా సహాయపడుతుంది. దీంతో.. డబ్బు ఆదా చేయవచ్చు. అదే అభిరామి 20 ఎల్ ఇన్‌స్టంట్ వాటర్ గీజర్. ఈ బకెట్‌ ధర రూ.2,499..ఫ్లిప్‌కార్ట్ నుంచి డిస్కౌంట్ ద్వారా రూ.1,599కే కొనుగోలు చేయవచ్చు.
ఈ ఉత్పత్తిపై కస్టమర్లకు కంపెనీ ఒక సంవత్సరం వారంటీ కూడా ఇస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో 10 రోజుల పాటు రీప్లేస్‌మెంట్ ఆఫర్ కూడా ఉంది. ఈ మల్టీపర్పస్ వాటర్ హీటర్ 20 లీటర్ల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ గీజర్ లాంటి బకెట్ నిమిషాల్లో నీటిని వేడి చేస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో అందించిన సమాచారం ప్రకారం.. ఈ ఉత్పత్తిని స్నానం చేయడానికి.. తాగే నీరు వేడి చేసేందుకు.. వంటగది అవసరాలతో పాటు, అనేక ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు.
ఈ గీజర్ లాంటి బకెట్ నిమిషాల్లో నీటిని వేడి చేస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో అందించిన సమాచారం ప్రకారం.. ఈ ఉత్పత్తిని స్నానం చేయడానికి.. తాగే నీరు వేడి చేసేందుకు.. వంటగది అవసరాలతో పాటు మరియు అనేక ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు. ఇది పోర్టబుల్ ఉత్పత్తి.. ఇంకా షాక్‌ప్రూఫ్ డిజైన్‌తో వస్తుంది. దీన్ని ఎక్కడికైనా సులువుగా తీసుకువెళ్లవచ్చు. దీంతో.. బకెట్‌లో నీరు తీసుకోవడానికి కుళాయి కూడా ఉంది. మీకు అవసరం ఉంటే.. ఓసారి ట్రే చేసి చూడండి. నచ్చకపోతే..రిటర్న్‌ చేసేయండి.!

Hyderabad: అమెరికాలో ఏం జరుగుతోంది.. వరుసగా చనిపోతున్న ఇండియన్ స్టూడెంట్స్, తాజాగా మరొకరు!

విదేశాల్లో భారతీయ విద్యార్థులు వరుసగా చనిపోతున్నారు. తాజాగా మరొకరు చనిపోయారు. ఈ ఏడాది అమెరికాలో 11వ ఘటన. వీరిలో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారు. వరుస మరణాలు అమెరికాలోని భారతీయ విద్యార్థులను, భారత్ లోని వారి కుటుంబాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

విదేశాల్లో భారతీయ విద్యార్థులు వరుసగా చనిపోతున్నారు. తాజాగా మరొకరు చనిపోయారు. ఈ ఏడాది అమెరికాలో 11వ ఘటన. వీరిలో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారు. వరుస మరణాలు అమెరికాలోని భారతీయ విద్యార్థులను, భారత్ లోని వారి కుటుంబాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. 2022-2023 సెషన్లో 2.6 లక్షల మంది భారతీయ విద్యార్థులు తమ దేశానికి వలస వచ్చారని అమెరికా తెలిపింది. అయితే ఇటీవల ఇండియన్స్ స్టూడెంట్స్ అనుమానస్పందగా చనిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది.

మాస్టర్స్ కోసం 2023లో అమెరికా వెళ్లిన హైదరాబాద్ కు చెందిన 25 ఏళ్ల విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు న్యూయార్క్ భారత రాయబార కార్యాలయం తెలిపింది. మహ్మద్ అబ్దుల్ అర్ఫత్ దాదాపు మూడు వారాలుగా కనిపించకుండా పోయాడని, అబ్దుల్ కుటుంబంతో సంప్రదింపులు జరుపుతున్నామని, అతని ఆచూకీ కోసం స్థానిక చట్ట అమలు సంస్థలతో కలిసి పనిచేస్తున్నామని రాయబార కార్యాలయం ఇంతకు ముందు తెలిపింది. ఇవాళ ఉదయం ఆయన చనిపోయినట్లు రాయబార కార్యాలయం తెలిపింది.

‘ఓహియోలోని క్లీవ్ ల్యాండ్ లో గాలింపు చర్యలు చేపట్టిన మహ్మద్ అబ్దుల్ అర్ఫత్ శవమై కనిపించాడని తెలిసి చాలా బాధపడ్డాం. మహ్మద్ అర్ఫత్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం’ అని రాయబార కార్యాలయం పేర్కొంది. మహ్మద్ అబ్దుల్ అర్ఫత్ మృతిపై సమగ్ర దర్యాప్తు కోసం IndiainNewYork స్థానిక సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది. ఆయన పార్థివదేహాన్ని భారత్ కు తరలించేందుకు కుటుంబ సభ్యులకు అన్ని విధాలా సహకరిస్తున్నామని తెలిపింది. అయితే డెడ్ బాడీని ఇండియాకు తరలించేందుకు 1,200 డాలర్లు చెల్లించాలని అబ్దుల్ తండ్రికి బెదిరింపు కాల్ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే విదేశాల్లో భారతీయ విద్యార్థులు చనిపోతుండటం తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోంది.

వెంకట్రామిరెడ్డి మీటింగ్ ఎఫెక్ట్..106 మంది ఉద్యోగుల సస్పెండ్

సిద్దిపేట : ఎన్నికల కోడ్ ఉల్లగిస్తూ రాజకీయ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న 106 మంది ప్రభుత్వ ఉద్యోగులపై వేటు పడింది. ఈ మేరకు 38 మంది సెర్ప్ ఉద్యోగుల్లో 14 ఎపీఎంలు, 18 మంది సీసీలు, 4 గురు వీవోలు, ఒక్కరు సీఓ, ఒక్కరు సీబీ ఆడిటర్స్, అలాగే 68 మంది ఈజీఎస్ ఉద్యోగుల్లో 4 మంది ఏపీఎంలు, 7 ఈసీలు, 38 మంది టీఏలు, 18 మంది సీఓలు, ఒక్కరు ఎఫ్ ఎ లను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ మంగళవారం మిక్కిలినేని మనుచౌదరి ఉత్తర్వులు జారీ చేశారు.

వివరాల్లోకి వెళ్లితే.. సిద్దిపేట పట్టణంలోని రెడ్డి పంక్షన్ హాల్‌లో అదివారం రాత్రి బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సెర్ప్, ఈజీఎస్ ఉద్యోగులతో సమావేశం అయ్యాడన్న సమాచారం మేరకు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అక్కడి వెళ్లి గేట్లకు తాళం వేసి ఆందోళన చేశారు. విషయం తెలుసుకొని సంఘటన స్థలానికి చేరుకొని సదరు ఫంక్షన్ హాల్‌లో సీసీ పుటేజ్ ను ఎలక్షన్ కమిషన్, పోలీస్ అధికారులు సేకరించారు. పంక్షన్ హాల్‌లోని వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇదిలా ఉండగా ఫ్లయింగ్ స్వ్కాడ్ ఇంచార్జి పృథ్వి ఫిర్యాదు మేరకు బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, సుడా మాజీ చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి లపై కేసు నమోదైన విషయం తెలిసిదే.

Chandrababu: మేం అధికారంలోకి రాగానే వాలంటీర్లకు రూ.10 వేలు : చంద్రబాబు

మంగళగిరి: తెలుగు వారు గొప్పగా నిర్వహించుకునే పండగ ఉగాది అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. కొత్త ఏడాదిలో రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. ఆయనకు వేదపండితులు ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వాలంటీర్లకు తీపికబురు చెప్పారు. తాము అధికారంలోకి రాగానే వారికి రూ.5 వేలు కాదు.. రూ. 10 వేల గౌరవ వేతనం ఇస్తామని హామీ ఇచ్చారు. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని తాము ముందే చెప్పామని వెల్లడించారు. ప్రజలకు సేవచేస్తే.. తాము అండగా ఉంటామని వాలంటీర్లకు తెలిపామని వివరించారు.

‘‘మన దశ, దిశ నిర్దేశించుకునే వేడుక.. కొత్త ఉత్సాహం అందించే పండగ ఇది. ఉగాది సందర్భంగా కొత్త లక్ష్యాలు నిర్దేశించుకోవాలి. ఈ ఏడాదిలో సాధికారత రావాలి. నూతన సంవత్సరంలో ధరలు తగ్గాలి.. సంక్షేమం ఉండాలి. ఉగాది పచ్చడిలో తీపి, వగరు, చేదు.. అన్నీ ఉంటాయి. ఈ ఐదేళ్లలో బకాసురుడిని మించిన పాలన సాగింది. రాష్ట్రంలో కారం, చేదు రుచులే ఉన్నాయి. అశాంతి, అభద్రతాభావం కనిపిస్తున్నాయి. సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలను ఆదుకున్న పార్టీ తెలుగుదేశం. నదుల అనుసంధానంతో ప్రతి ఎకరాకూ నీళ్లు ఇవ్వొచ్చు. సహజ వనరులన్నీ వైకాపా దోపిడీ చేసింది. తెలుగు జాతికి మళ్లీ పూర్వవైభవం తీసుకురావాలని మనమంతా సంకల్పం తీసుకోవాలి. ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలబడాలి.. ఇదే మన సంకల్పం’’ అని చంద్రబాబు అన్నారు.

చంద్రబాబుకు అధికార యోగం ఉంది: పంచాంగకర్త మాచిరాజు
ఈ సందర్భంగా పంచాంగకర్త మాచిరాజు వేణుగోపాల్‌ నేతృత్వంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. రాష్ట్రంలో త్రిమూర్తుల కలయికతో ఏపీకి మేలు జరుగుతుందని తెలిపారు. 128 అసెంబ్లీ, 24 లోక్‌సభ స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారని చెప్పారు. చంద్రబాబుకు అధికార యోగం ఉందని వివరించారు. ఆయనే రాజధాని అమరావతి నిర్మాణం చేపడతారని వెల్లడించారు.

Jeens | జీన్స్‌తో పర్యావరణానికి ఊహించనంత హాని.. ఒక జత జీన్స్‌తో 2.5 కిలోల కార్బన్‌డయాక్సైడ్‌

ఒక జత జీన్స్‌తో 2.5 కిలోల కార్బన్‌డయాక్సైడ్‌ ఉత్పత్తి
ఇది కారులో 10 కిలోమీటర్లు ప్రయాణించటంతో సమానం
చైనా వర్సిటీ అధ్యయనంలో వెల్లడి
Jeens | బీజింగ్‌, ఏప్రిల్‌ 7: జీన్స్‌తో పర్యావరణానికి ఊహించనంత హాని కలుగుతున్నదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. మారుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా జీన్స్‌ ఉత్పత్తి అవుతున్నది. దీని ప్రభావంతో కార్బన్‌ డయాక్సైడ్‌ భారీ స్థాయిలో వెలువడుతున్నదని పరిశోధకులు తెలిపారు. చైనాలోని గాంగ్‌డాంగ్‌ యూనివర్సటీ ఆఫ్‌ టెక్నాలజీ పరిశోధకులు జీన్స్‌ వల్ల కలిగే పర్యావరణ కాలుష్యంపై పరిశోధనలు చేయగా.. ఒక జత జీన్స్‌ ధరించటం వల్ల 2.5 కిలోల కార్బన్‌ డయాక్సైడ్‌ ఉత్పత్తి అవుతున్నదని తేలింది.

అంటే.. పెట్రోల్‌ కారులో ఒకసారి 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించటంతో సమానం అని వెల్లడించారు. సంప్రదాయ జీన్స్‌తో పోల్చితే ఫాస్ట్‌ ఫ్యాషన్‌ జీన్స్‌ (ట్రెండ్‌కు తగ్గట్టు తయారుచేసి మార్కెట్‌లోకి విడుదల చేసే జీన్స్‌) జీన్స్‌ సగటున 7సార్లు మాత్రమే ధరిస్తున్నారని, దాంతో అదనంగా 11 రెట్లు కాలుష్యం పెరుగుతున్నదని వివరించారు. ఒక రకంగా 95-99 శాతం ఎక్కువ కార్బన్‌డయాక్సైడ్‌ ఉత్పత్తి అవుతున్నదని స్పష్టం చేశారు. జీన్స్‌ వల్ల వెలువడే కార్బన్‌ డయాక్సైడ్‌లో 48 శాతం ఉతకడం, ఆరబెట్టడం, ఇస్త్రీ చేయడం వల్లే కలుగుతున్నదని పేర్కొన్నారు.

Post Office FD: పోస్టాఫీసు ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌తో మంచి వడ్డీ.. ఐదేళ్లకు ఎంత రాబడి వస్తుందంటే..

Post Office FD: ప్రస్తుతం మార్కెట్‌లో చాలా రకాల ఇన్వెస్ట్‌మెంట్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ అందుబాటులో ఉన్నాయి. అయితే స్థిరత్వం, భద్రత కారణంగా ఎక్కువ మంది పోస్టాఫీసు పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. రిస్కు తక్కువగా ఉండటం, రిటర్న్స్‌కి కేంద్ర ప్రభుత్వ హామీ ఉండటంతో కొన్ని సంవత్సరాలుగా పోస్టాఫీసు సేవింగ్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ స్కీమ్‌లు పాపులర్‌ అయ్యాయి. అయితే బ్యాంకులు అందించే ఫిక్స్‌డ్ డిపాజిట్ల మాదిరిగానే, పోస్టాఫీసులు స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్స్ అందిస్తున్నాయి. ఇవి ఇప్పుడు పాపులర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆప్షన్‌గా మారాయి.

కొత్త ఆర్థిక సంవత్సరం ఇప్పటికే ప్రారంభమైనందున, పన్నులను ఆదా చేయడానికి, మెరుగైన రాబడిని పొందడానికి సంవత్సరం ప్రారంభం నుంచే వివిధ పోస్ట్-ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ స్కీమ్‌లో ఐదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే, ఎంత రాబడి అందుతుందో తెలుసుకోండి.

పోస్టాఫీస్‌లో వన్‌ ఇయర్‌, టూ ఇయర్స్, త్రీ ఇయర్స్‌, ఫైవ్‌ ఇయర్స్‌ వంటి విభిన్న టెన్యూర్‌లతో ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రభుత్వ మద్దతుతో, గ్యారెంటీడ్‌ రిటర్న్స్‌ అందిస్తాయి. అయితే ఆదాయ పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80C ప్రకారం ఈ స్కీమ్స్ అన్నీ రూ.1.50 లక్షల వరకు ట్యాక్స్ బెనిఫిట్స్ అందించవు. కేవలం ఐదేళ్ల FD మాత్రమే డిపాజిట్లపై రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. ఇతర టెన్యూర్స్‌కు చేసే ఎఫ్‌డీలతో ఎలాంటి పన్ను ప్రయోజనాలు ఉండవు

* పోస్టల్ ఎఫ్‌డీ ప్రత్యేకతలు

పోస్టాఫీసు ఫిక్స్‌డ్ డిపాజిట్ పేర్కొన్న పదవీకాలం పూర్తయిన తర్వాత మీ పెట్టుబడిపై ఫిక్స్‌డ్‌ రిటర్న్‌ అందిస్తుంది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ మెచ్యూర్ అయినప్పుడు, మీరు పెట్టుబడి సమయంలో ఇచ్చిన అసలు మొత్తం, వడ్డీ సహా డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. పోస్టాఫీస్‌ ఒక సంవత్సరం, రెండు సంవత్సరాలు, మూడు సంవత్సరాలు, ఐదు సంవత్సరాల వంటి వివిధ టెన్యూర్స్‌లో ఫిక్స్డ్‌ డిపాజిట్‌ ఆప్షన్‌లు అందిస్తోంది.

ఐదు సంవత్సరాల పోస్టాఫీసు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌, 7.5 శాతం వడ్డీ రేటును ఇస్తుంది. వడ్డీ రేటును యాన్యువల్లీ చెల్లిస్తుంది, కానీ త్రైమాసికం ప్రాదిపదికన కాలిక్యులేట్‌ అవుతుంది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లో ఒక వ్యక్తి కనీసం రూ.1,000 డిపాజిట్‌ చేయాలి. గరిష్ట పరిమితి ఉండదు. రూ.100 మల్టిపుల్స్‌లో ఎంత డబ్బు అయినా పెట్టుబడి పెట్టవచ్చు. మైనర్ తరఫున గార్డియన్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేయవచ్చు. ఐదేళ్ల ఎఫ్‌డీ స్కీమ్‌ మెచ్యూరిటీ 18 నెలల కాలానికి కూడా పొడిగించవచ్చు.

* ఐదేళ్ల పోస్టల్ ఎఫ్‌డీలపై రాబడి

ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టే మొత్తాన్ని బట్టి వడ్డీ రేటు మారుతుంది. ఐదేళ్ల పోస్టాఫీసు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకంలో రూ.3 లక్షల పెట్టుబడికి, రూ.1,34,984 వడ్డీని పొందవచ్చు, మెచ్యూరిటీ మొత్తం రూ. 4,34,984 అవుతుంది. ఇదే స్కీమ్‌లో రూ.5 లక్షల పెట్టుబడికి, రూ. 2,24,974 వడ్డీని పొందవచ్చు, మెచ్యూరిటీ మొత్తం రూ. 7,24,974 అవుతుంది. ఇన్వెస్టర్ రూ.10 లక్షల పెట్టుబడికి, రూ. 4,49,948 వడ్డీ పొందవచ్చు, మెచ్యూరిటీ మొత్తం రూ. 14,49,948 అవుతుంది. అంటే ఇన్వెస్టర్లు ఈ స్కీమ్‌తో భారీగానే లాభాలు అందుకోవచ్చు.

త్వరలో ఆర్‌బీఐ కొత్త మొబైల్‌ యాప్‌.. పెట్టుబడులు పెట్టడం మరింత సులువు

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఓ కొత్త మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తేనుంది. రిటైల్‌ ఇన్వెష్టర్ల కోసం తీసుకొస్తున్న ఈ యాప్‌ ద్వారా ప్రభుత్వ బాండ్లు లేదా సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెట్టడం మరింత సులువు అవుతుందని ఆర్‌బీఐ తెలిపింది. ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడుల కోసం ఆర్‌బీఐ రిటైల్‌ డైరెక్ట్‌ స్కీమ్‌ను 2021 నవంబర్‌లో ప్రారంభించింది. ఆర్‌బీఐ డైరెక్ట్‌ పోర్టల్‌ ద్వారా ప్రస్తుతం.. ప్రైమరీ, సెకండరీ మార్కెట్‌ ప్రభుత్వ సెక్యూరిటీల్లో మదుపు చేయొచ్చు.
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఓ కొత్త మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తేనుంది. రిటైల్‌ ఇన్వెష్టర్ల కోసం తీసుకొస్తున్న ఈ యాప్‌ ద్వారా ప్రభుత్వ బాండ్లు లేదా సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెట్టడం మరింత సులువు అవుతుందని ఆర్‌బీఐ తెలిపింది. ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడుల కోసం ఆర్‌బీఐ రిటైల్‌ డైరెక్ట్‌ స్కీమ్‌ను 2021 నవంబర్‌లో ప్రారంభించింది. ఆర్‌బీఐ డైరెక్ట్‌ పోర్టల్‌ ద్వారా ప్రస్తుతం.. ప్రైమరీ, సెకండరీ మార్కెట్‌ ప్రభుత్వ సెక్యూరిటీల్లో మదుపు చేయొచ్చు. రిటైల్‌ ఇన్వెస్టర్లు వేలంలో ఈ సెక్యూరిటీలను అమ్మడం/ కొనడం చేసే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడులను మరింత సులభతరం చేసే ఉద్దేశంతో రిటైల్‌ డైరెక్ట్‌ పోర్టల్‌కు సంబంధించిన మొబైల్‌ యాప్‌ను తీసుకురానున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వెల్లడించారు. ఆర్‌బీఐ మానిటరీ పాలసీ నిర్ణయాలను తెలియజేసే క్రమంలో యాప్‌కు సంబంధించిన అంశాలను శక్తికాంత దాస్‌ ప్రస్తావించారు. యాప్ సిద్ధమవుతోందని, త్వరలోనే అందుబాటులోకి రానుందని ఆయన చెప్పారు.

ప్రతిరోజూ ఉదయాన్నే ఈ నీటిని తాగడం అలవాటు చేసుకోండి.. ఎక్కువ కాలం యవ్వనంగా ఉంటారు..!

ఈ నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎల్‌డిఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది హార్ట్‌ ఎటాక్‌ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండే మెంతి గింజల నీరు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో చాలా మంది కాఫీ, టీలు తాగుతుంటారు. కానీ, ఈ అలవాటు ఆరోగ్యానికి మంచిది కాదు.. దీంతో అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే, ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఇలాంటి నీటిని తాగటం వల్ల మీరు మేలు కలుగుతుంది. ప్రతిరోజూ ఉదయాన్నే ఈ నీటిని తాగటం అలవాటు చేసుకుంటే.. అనేక ఆరోగ్య ప్రయోజనాలతో పాటు వృద్ధాప్యాన్ని కూడా దూరంగా ఉంచుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం..

వంటింట్లో ఉండే మసాల దినుల్లో మెంతులు ఒకటి. ఇవి ఆరోగ్యానికి ఔషధంగా ఉపయోగించే ఒక ములిక. మెంతులు కొంచెం చేదు రుచిని కలిగి ఉంటాయి. వీటిని తరచుగా భారతీయ వంటకాల్లో, ఆయుర్వేద ఔషధాల్లో విరివిగి ఉపయోగిస్తుంటారు. మెంతి గింజలను నీటిలో నానబెట్టి తయారు చేసిన మెంతి నీరు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యం డయాబెటిస్‌ ఉన్నవారికి ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే ఇతర అనారోగ్య సమస్యలకు కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. మెంతులలో ఐరన్‌, మెగ్నీషియం, మాంగనీస్‌తో సహా ఫైబర్, విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా ఉంటాయి. జీర్ణక్రియకు సహాయపడటం, రక్తంలో చక్కెర నియంత్రణను మెరుగుపరచడం, కడుపులో మంటను తగ్గించడం మొదలైనవి ప్రయోజనాలు ఉంటాయి. రోజూ ఉదయాన్నే మెంతిగింజల నీరు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

మెంతి గింజలలో కరిగే ఫైబర్, గెలాక్టోమన్నన్ వంటి సమ్మేళనాలు ఉన్నాయి. ఇది కార్బోహైడ్రేట్లు, చక్కెర శోషణను నెమ్మదిస్తుంది. రక్తంలో చక్కెరను నియంత్రణలో ఉంచుతుంది. మెంతి గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం ఈ నీటిని తాగితే మంచి ఫలితాలను పొందుతారు. ఉబ్బరం, మలబద్ధకం, జీర్ణ సమస్యలను పరిష్కరించడానికి మెంతి గింజలను సాంప్రదాయకంగా ఉపయోగిస్తారు. మెంతి నీటిలో తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ ఉంటుంది. అధిక ఫైబర్ ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. బరువు తగ్గడంలో మెంతి నీరు కూడా చాలా ఉపయోగకరంగా ఉండటానికి ఇదే కారణం.

మెంతి నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎల్‌డిఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది హార్ట్‌ ఎటాక్‌ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండే మెంతి గింజల నీరు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మెంతి నీటిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని వివిధ ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుంచి రక్షిస్తాయి.

రోజూ ఉదయాన్నే మెంతి నీళ్ళు తాగడం వల్ల అనేక రకాల వ్యాధులు దూరమవుతాయి. మెంతి గింజలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తాయి. ఇది వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తుంది. మెంతి నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలను తగ్గించడం వల్ల స్పష్టమైన ఛాయను ప్రోత్సహిస్తుంది. సహజమైన కాంతిని అందిస్తుంది. మెంతులలో ప్రొటీన్, నికోటినిక్ యాసిడ్ ఉంటాయి. క్రమం తప్పకుండా మెంతి నీరు తాగడం వల్ల జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు. జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. అలాగే చుండ్రు లేదా దురద వంటి స్కాల్ప్ సమస్యలను నివారిస్తుంది.

SBI: ఎస్‌బీఐ అదిరే గుడ్‌న్యూస్.. అమృత్ కలశ్ స్కీమ్ గడువు మళ్లీ పొడిగింపు.. రూ. 5 లక్షలకు ఎంతొస్తుంది?

SBI Extends Amrit Kalash FD: ఒకప్పటితో పోలిస్తే ఈ రోజుల్లో చాలా మందికి తమ సంపాదనలో నుంచి ఎంతో కొంత ఆదా చేసి.. దీనిని దేంట్లోనైనా ఇన్వెస్ట్ చేయాలనే ఆలోచన ఉంటుంది. దాని కోసం పెద్దగా రిస్క్ లేకుండా మంచి రిటర్న్స్ వచ్చే పెట్టుబడి సాధనాలవైపు చూస్తుంటారు. వీటిల్లో బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. కొంతకాలంగా కస్టమర్లకు.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బంపర్ రిటర్న్స్ వస్తున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే.. చాలా బ్యాంకులు FD పై అధిక వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి. ఇంకా కొన్ని బ్యాంకులు కస్టమర్లను ఆకర్షించేందుకు రెగ్యులర్ డిపాజిట్ల కంటే అధిక వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తూ.. స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాల్ని కూడా లాంఛ్ చేస్తున్నాయి. వీటిల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎస్‌బీఐ అమృత్ కలశ్ పథకం గురించి
ఈ అమృత్ కలశ్ స్పెషల్ ఎఫ్‌డీ పథకాన్ని ఎస్‌బీఐ 2023 ఏప్రిల్ 12న లాంఛ్ చేసింది. ఈ డిపాజిట్ టెన్యూర్ 400 రోజులుగా ఉంది. ఇటీవల మార్చి 31న గడువు ముగియగా.. తాజాగా బ్యాంక్ శుభవార్త చెప్పింది. గడువును మరోసారి పొడిగించింది. ఇప్పుడు 2024, సెప్టెంబర్ 30 వరకు అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ కోరుకునే వారికి మరో 6 నెలల సమయం ఇచ్చిందన్నమాట.

అంతకుముందు కూడా పలుమార్లు గడువులు ముగియగా.. వరుసగా నాలుగోసారి గడువు పొడిగిస్తూ వచ్చింది. మొదటగా 2023, జూన్ 23 వరకు.. తర్వాత ఆగస్ట్ 15 వరకు.. మళ్లీ డిసెంబర్ 31 వరకు గడువు పొడిగించగా.. చివరగా మార్చి 31 వరకు ఈ స్కీం కొనసాగించింది. ఇప్పుడైతే ఏకంగా మరో 6 నెలలు పొడిగించడం విశేషం.

ఈ స్కీం గురించి చూసినట్లయితే 400 రోజుల డిపాజిట్. డొమెస్టిక్ రిటైల్ టర్మ్ డిపాజిట్లకు అవకాశం ఉంటుంది. NRI రూపీ టర్మ్ డిపాజిట్లు కూడా చేసుకోవచ్చు. గరిష్టంగా రూ. 2 కోట్ల వరకు మాత్రమే డిపాజిట్‌కు అవకాశం ఉంది. కొత్త, రెనివల్ డిపాజిట్లకు ఛాన్స్ ఉంది. ఈ స్కీం కిందే SBI డిపాజిట్లపై అత్యధిక వడ్డీ ఆఫర్ చేస్తోంది. దీంట్లో రెగ్యులర్ సిటిజెన్లకు 7.10 శాతం, సీనియర్ సిటిజెన్లకు 7.60 శాతం వడ్డీ అందిస్తోంది. దీంట్లో లోన్ ఫెసిలిటీ కూడా పొందొచ్చు. నేరుగా బ్రాంచుకు వెళ్లి ఎఫ్‌డీ తెరవొచ్చు. లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో ఛానెల్స్ ద్వారా కూడా ఇందులో చేరే అవకాశం ఉంది.

రూ. 5 లక్షల డిపాజిట్‌పై ఎంతొస్తుందంటే?
ఇప్పుడు ఎస్‌బీఐ అమృత్ కలశ్ పథకంలో రూ. 5 లక్షలు డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీకి అంటే 400 రోజులకు ఎంత రిటర్న్స్ వస్తాయో తెలుసుకుందాం. రెగ్యులర్ సిటిజెన్లకు 7.10 శాతం వడ్డీ రేటు లెక్కన రూ. 38,834 వడ్డీ అందుతుంది. మొత్తం చేతికి మెచ్యూరిటీ సమయంలో రూ. 5,38,834 అందుతుంది. ఇదే సీనియర్ సిటిజెన్లకు అయితే 7.60 శాతం వడ్డీ రేటు కింద 5 లక్షల డిపాజిట్‌పై రూ. 41,569 పొందుతారు.

ఎన్నికల వేళ వివేకా కేసులో బిగ్ ట్విస్ట్ లు-దస్తగిరి రివర్స్-నిందితుల బెయిల్ పోరు తీవ్రం..!

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఇప్పటివరకూ అప్రూవర్ గా మారి సీబీఐకీ, వివేకా కుమార్తె సునీతకు అనుకూలంగా మాట్లాడిన దస్తగిరి ఇప్పుడు ఆమెతో పాటు వైఎస్ షర్మిలపైనా ఈసీని ఆశ్రయించాడు. అదే సమయంలో కీలక నిందితుడు శివశంకర్ రెడ్డికి హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఎన్నికల్లోపు బెయిల్ కోసం మిగతా నిందితులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు నత్తనడకన సాగుతుండటంపై సుప్రీంకోర్టు అక్షింతలు వేసిన నేపథ్యంలో సీబీఐ స్పీడు పెంచింది. అదే సమయంలో నిందితుల డిశ్చార్జ్ పిటిషన్లను ఆమోదించవద్దంటూ సీబీఐ కోర్టునూ కోరుతోంది. అలాగే నిందితులు బెయిల్ కోసం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో కీలక నిందితుడు, అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడు శివశంకర్ రెడ్డికి బెయిల్ లభించిన నేపథ్యంలో అప్రమత్తమైంది.

తాజాగా వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి తమకూ శివశంకర్ రెడ్డి తరహాలోనే బెయిల్ ఇవ్వాలంటూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ పిటిషన్ పై సీబీఐ తమ అభిప్రాయం తెలిపింది. మాజీ ఐపీఎస్ లనే ప్రభావితం చేయగలిగిన వీరికి సామాన్య సాక్ష్యులు ఓ లెక్కా అంటూ అఫిడవిట్ లో వ్యాఖ్యానించింది. ఇలాంటి పలుకుబడి కలిగిన వ్యక్తులు బెయిల్ పై బయట ఉంటే సాక్ష్యం చెప్పేందుకు ఎవరూ ముందుకు రారని తెలిపింది. దీంతో కోర్టు తీర్పును రిజర్వు చేసింది. మరోవైపు ఇన్నాళ్లూ వివేకా హత్య చేసిన తర్వాత అప్రూవర్ గా మారి ఆయన కుమార్తె సునీతారెడ్డికి అండగా ఉన్న దస్తగిరి ఎన్నికల వేళ ప్లేటు మార్చాడు. వివేకా హత్యను జనంలోకి తీసుకెళ్తున్న షర్మిల, సునీత, టీడీపీ ప్రయత్నాలను అడ్డుకునేలా ఈసీని ఆశ్రయించాడు. దీంతో ఇప్పుడు దస్తగిరి వ్యవహారం సంచలనంగా మారింది. షర్మిల, సునీత, టీడీపీ వివేకా హత్యను జనంలోకి తీసుకెళ్తే నష్టం ఎవరికి?, అటువంటప్పుడు వీరిని అడ్డుకోవాలని ఈసీని దస్తగిరి ఆశ్రయించడం వెనుక కారణమేంటన్నది ఇప్పుడు అందరికీ సులువుగానే అర్ధమవుతోంది.

Chaturgrahi Yoga: 500 ఏళ్ల తర్వాత ఏర్పడిన చతుగ్రాహి యోగం.. ఈ మూడు రాశుల వారు పట్టిందల్లా బంగారమే..

ఈ సూర్యగ్రహణం రోజే చతుగ్రాహి యోగం కూడా ఏర్పడింది. ఈ యోగం దాదాపు 500 సంవత్సరాల తర్వాత సూర్యగ్రహణం రోజున ఏర్పడినందున ఎంతో శుభప్రదమని జ్యోతిష్యులు చెప్పారు. ఇప్పటికే సూర్యుడు మీన రాశిలో సంచరిస్తున్నాడు. దీంతో ఈ గ్రహం శుభస్థానంలో ఉన్నవారికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలుగుతుంది. ఆకస్మికంగా ధన లాభాన్ని పొందుతారు. ఈ నేపథ్యంలో చతుగ్రాహి యోగం వలన ఏ రాశుల వారు అదృష్ట వంతులో ఈ రోజు తెలుసుకుందాం..

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహణాలు ప్రత్యేక స్థానం ఉంది. గ్రహణ సమయం అశుభంగా పరిగణిస్తారు కూడా.. ఈ నేపథ్యంలో ఈ ఏడాదిలో మొదటి సూర్య గ్రహణం ఏర్పడింది. ఈ గ్రహణం అమెరికా, కెనెడా వంటి దేశాల్లో కనిపించినా మన దేశంలో కనిపించలేదు. అయినప్పటికీ గ్రహణ ప్రభావం రాశులపై ఉంటుందని జ్యోతిష్కులు పేర్కొన్నారు. అంతేకాదు ఉగాది ముందు రోజు ఏర్పడిన ఈ సూర్యగ్రహణానికి ప్రత్యేక ఉంది. ఈ సూర్యగ్రహణం రోజే చతుగ్రాహి యోగం కూడా ఏర్పడింది. ఈ యోగం దాదాపు 500 సంవత్సరాల తర్వాత సూర్యగ్రహణం రోజున ఏర్పడినందున ఎంతో శుభప్రదమని జ్యోతిష్యులు చెప్పారు.

ఇప్పటికే సూర్యుడు మీన రాశిలో సంచరిస్తున్నాడు. దీంతో ఈ గ్రహం శుభస్థానంలో ఉన్నవారికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలుగుతుంది. ఆకస్మికంగా ధన లాభాన్ని పొందుతారు. ఈ నేపథ్యంలో చతుగ్రాహి యోగం వలన ఏ రాశుల వారు అదృష్ట వంతులో ఈ రోజు తెలుసుకుందాం..

మేష రాశి: ఈ రాశికి చెందిన వారికి సూర్య గ్రహణం రోజు ఏర్పడిన చతుగ్రాహి యోగం అదృష్టాన్ని తెచ్చింది. అనేక ప్రయోజనాలు కలుగనున్నాయి. ముఖ్యంగా ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్న సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో ఎలాంటి పని చేపట్టినా సక్సెస్ అయ్యేలా చేస్తారు. వృత్తి, వ్యాపార రంగంలో ఉన్నవారికి శుభ్ర ప్రదంగా ఉంటుంది. ఆర్థిక లాభాలు పొందే అవకాశాలుఉన్నాయి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నవారి ప్రయత్నాలు ఫలించి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెద్దల ఆస్తులు పొందే అవకాశం ఉంది. అంతేకాదు ఆరోగ్యంగా ఉంటారు.

ధనస్సు రాశి: ఈ రాశికి చెందిన వారికీ ఈ చతుగ్రాహి యోగం వలన ఆర్ధికంగా లాభాలను పొందుతారు. పట్టిందల్లా బంగారమే. సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగాలకు కొత్త అవకాశాలు లభిస్తాయి. వ్యాపారస్థులు కొత్త పెట్టుబడులను పెడతారు. ఏ పని చేపట్టినా విజయాన్ని పొందుతారు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారు, మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ సమయం చాలా కలిసి వస్తుంది.

సింహ రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు చతుగ్రాహి యోగం శుభ ఫలితాలను తెస్తుంది. ఆత్మవిశ్వాసం పెరిగి చేపట్టిన పనులను పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. పోత్సాహంతో జీవితంలో ముందడుగు వేస్తారు. వ్యాపారస్తులు లాభలను అందుకుంటారు. ఉద్యోగస్తులకు పనుల విషయంలో ప్రశంసలను అందుకుంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలను సొంతం చేసుకుంటారు.

వైట్‌రైస్ బదులు బ్రౌన్‌రైస్ తింటే ఈ సమస్యలన్నీ దూరం..

బ్రౌన్‌రైస్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. చాలా మంది వైట్ రైస్ బదులు బ్రౌన్‌రైస్ తింటారు. బ్రౌన్‌రైస్ చూడ్డానికి కాస్తా లేత గోధుమ రంగులో ఉంటాయి. బ్రౌన్‌రైస్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని వైట్ రైస్ బదులు తీసుకుంటే ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరం ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసుకోండి.

పోషకాలు ఎక్కువ..
మీ రోజువారీ ఆహారంలో బ్రౌన్‌రైస్ తీసుకుంటే పోషకాలు అందుతాయి. ముఖ్యంగా ఇందులో సెలీనియం, కాల్షియం, మాంగనీస్, మెగ్నీషియం మనకి అందుతాయి.ఇందులో ఫైబర్, ఫోలేట్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి అన్నింటి కంటే తక్కువ కేలరీలు, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచివి.

కొలెస్ట్రాల్ తగ్గడం..
పీచుతో కూడిన బ్రౌన్‌రౌస్‌ని రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్‌ని పెంచుతుంది.

అజీర్ణ సమస్యలు..
బ్రౌన్‌రైస్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియని మెరుగ్గా చేస్తుంది. దీంతో అజీర్ణ సమస్యలు దూరమవుతాయి. ఈ బ్రౌన్‌రైస్‌ని వరిపై పొట్టుని మాత్రమే తీసి ఉంచుతారు. పాలిష్ ఉండదు. దీని వల్ల పేగు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. జీర్ణక్రియ మెరుగవుతుంది.

షుగర్ కంట్రోల్..
ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్స్ కారణంగా రక్తంలో చక్కెర పెరుగుతుంది. తెల్ల బియ్యంలో ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే షుగర్ ఉన్నవారు బ్రౌన్‌రైస్ తీసుకోవాలి. ఇందులో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. ఫైబర్, సూక్ష్మపోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర, ఇన్సులిన్ ఉత్పత్తిని స్థిరంగా ఉంచడంలో సాయపడతాయి. ఇది తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్‌ని కలిగి ఉన్నందున రక్తంలో చక్కెర పెరుగుదల నెమ్మదిగా ఉంటుంది. కాబట్టి, షుగర్ ఉన్నవారు వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ తినొచ్చు.

బరువు తగ్గేందుకు..
ఇతర సీజన్స్ కంటే సమ్మర్‌ని భరించడం కాస్తా కష్టమైనది. ఈ టైమ్‌లో డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. దీని వల్ల పోషకాహార లోపం ఏర్పడుతుంది. వీటిని అధిగమించాలంటే ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గడం కాస్త కష్టమైన పనే. దీనికోసం బ్రౌన్‌రైస్ మీకు హెల్ప్ చేస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు తమ రోజువారీ ఆహారంలో బ్రౌన్‌రైస్‌ని తప్పనిసరిగా చేర్చుకోవాలి. దీని వల్ల చాలా కాలం పాటు ఆకలి కంట్రోల్ అవుతుంది. ఆకలిని ప్రేరేపించే హార్మోన్స్ కూడా కంట్రోల్ అవుతాయి. దీంతో కేలరీను కూడా తగ్గించుకోవచ్చు. దీంతో బరువు తగ్గుతారు.

బ్రౌన్‌రైస్‌తో సైడ్‌ఎఫెక్ట్స్..
వీటిని తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలుండవు. కొంతమందికి కొన్ని ధాన్యాల్లో ఆర్సెనిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక వ్యాధులని పెంచుతాయి. బ్రౌన్‌రైస్‌లో ఆ ఆర్సెననిక్ గుణం కూడా ఉంటుంది. రోజుకి అరకప్పు బ్రౌన్‌రైస్ తినండి. ఇందులో దాదాపు 110 కేలరీలు ఉంటాయి. కాబట్టి, బరువు తగ్గేవారు రోజూ తీసుకోవచ్చు.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే. వీటిని పాటించే ముందు డైటీషియన్‌ని సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

AP Election 2024: ఈసీ సంచలన నిర్ణయం.. సీఎం జగన్‌కు బిగ్ షాక్..!

ఎన్నికల వేళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు(YS Jagan) కేంద్ర ఎన్నికల కమిషన్(Election Commission of India) బిగ్ షాక్ ఇచ్చింది. రాష్ట్రం నుంచి కొల్లి రఘురామిరెడ్డిని(Raghuram Reddy) పంపించేసింది. సిట్ చీఫ్‌గా ఉన్న కొల్లి రఘురామిరెడ్డిపై వేటు వేసింది ఈసీ. అసోం పోలీస్ ఎన్నికల పరిశీలకుడిగా నియమించింది.

ఎన్నికల వేళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు(YS Jagan) కేంద్ర ఎన్నికల కమిషన్(Election Commission of India) బిగ్ షాక్ ఇచ్చింది. రాష్ట్రం నుంచి కొల్లి రఘురామిరెడ్డిని(Raghuram Reddy) పంపించేసింది. సిట్ చీఫ్‌గా ఉన్న కొల్లి రఘురామిరెడ్డిపై వేటు వేసింది ఈసీ. అసోం పోలీస్ ఎన్నికల పరిశీలకుడిగా నియమించింది. ఈ మేరకు సోమవారం రాత్రి ఉత్తర్వులు పంపించింది ఎన్నికల సంఘం. ఈసీ ఆదేశాల నేపథ్యంలో కొల్లి రఘురామిరెడ్డి రాష్ట్రం వీడాల్సి ఉంటుంది. గువహటి కేంద్రంగా ఆయన పని చేయనున్నారు.

అయితే, రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కళ్లు, చెవులు మొత్తం రఘురామిరెడ్డే అని పోలీస్ వర్గా్ల్లో భాగా ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో రఘురామిరెడ్డిని ఎన్నికల సంఘం ఇతర విధులకు కేటాయించడం హాట్ డిస్కషన్‌గా మారింది. అయితే, రఘురామిరెడ్డి నియామకాన్ని ఆపేందుకు వైసీపీ కీలక నేతలు తీవ్రంగా ప్రయత్నించారట. కానీ, అది సాధ్యపడకపోవడంతో వైసీపీ నేతలు నైరాశ్యంలో ఉన్నారట.

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును కొల్లి రఘురామిరెడ్డి అరెస్ట్ చేశారు. సోమవారం ఉదయం సిట్ కార్యాలయం వద్ద కీలక కేసులో హెరిటేజ్ పత్రాలను దగ్ధం చేశారు. ఈ వివాదం కొనసాగుతున్న క్రమంలోనే.. రఘురామిరెడ్డి విషయంలో ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. పోలీస్ పరిశీలకుడిగా అసోం పంపించేసింది కేంద్ర ఎన్నికల కమిషన్.

Pushpa 2 Teaser: 12 గంటల్లోనే 51 మిలియన్స్.. ‘తగ్గేదేలే’!

Allu Arjun’s Pushpa 2 Teaser Record: అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా నిన్న రిలీజ్ అయిన ‘పుష్ప 2’ టీజర్‌కు యునానిమస్ రెస్పాన్స్ వచ్చింది. 68 సెకండ్ల నిడివి గల టీజర్‌తోనే ఆడియెన్స్ చేత మరోసారి అస్సలు తగ్గేదేలే అని పుష్పరాజ్ చెప్పించాడు. అది కూడా ఒక్క డైలాగ్ లేకుండా.. గూస్ బంప్స్ తెప్పించాడు. గంగమ్మ జాతర సెటప్‌లో అమ్మవారి గెటప్‌లో బన్నీని చూస్తే.. అభిమానులకే కాదు సోషల్ మీడియాకే అమ్మోరు పూనినట్టుంది. బన్నీ ఫ్యాన్స్ చేస్తున్న రచ్చకు.. ప్రస్తుతం సోషల్ మీడియా కూడా పూనకాలు వస్తున్నట్టుగా ఊగిపోతోంది. పుష్పరాజ్ దెబ్బకు డిజిటల్ రికార్డ్స్ అన్ని బ్రేక్ అవుతున్నాయి.

పుష్ప 2 టీజర్ అలా రిలీజ్ అయిందో లేదో.. మిలియన్స్ ఆఫ్ వ్యూస్ రాబట్టింది. కేవలం 101 నిమిషాల్లోనే 500K లైక్స్ వచ్చాయి. దీంతో.. అత్యంత వేగంగా ఐదు లక్షల లైక్స్ సాధించి.. ఆల్ టైం రికార్డ్ సృష్టించిందని మేకర్స్ ప్రకటించారు. ఇక యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో దూసుకెళ్తూ.. 12 గంటల్లోనే 51 మిలియన్స్ వ్యూస్ సొంతం చేసుకుంది. అలాగే 1 మిలియన్స్ లైక్స్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. దాంతో పుష్పరాజ్‌కు సంబంధించిన ట్యాగ్స్ టాప్‌లో ట్రెండ్ అవుతున్నాయి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ తగ్గేదేలే అంటూ రచ్చ చేస్తున్నారు.

టీజర్‌తోనే పుష్ప2 సినిమాపై అంచనాలు పీక్స్‌కు వెళ్లిపోయాయి. టీజర్‌ ఈ రేంజ్‌లో ఉంటే.. ఇక ట్రైలర్‌ను హై ఓల్టేజ్ యాక్షన్‌గా కట్ చేస్తే ఆగష్టు 15న బాక్సాఫీస్ దగ్గర భారీ ఓపెనింగ్స్‌తో పాటు వెయ్యి కోట్లు ఖాతాలో పడినట్టే. లెక్కల మాస్టర్ సుకుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కన్నడ సోయగం రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రంను నిర్మిస్తున్నారు. పార్ట్ 1తో నేషనల్ అవార్డ్ అందుకున్న అల్లు అర్జున్.. పార్ట్ 2లో నట విశ్వరూపం చూపించనున్నారు.

ఎయిర్ పోర్టులో 490 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

AAI Degree Recruitment 2024: ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) డైనమిక్ మరియు అర్హత కలిగిన వ్యక్తులను జూనియర్ ఎగ్జిక్యూటివ్‌లుగా తమ బృందంలో చేరమని ఆహ్వానిస్తుంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ఏవియేషన్‌లో కీలక పాత్ర పోషిస్తున్న ప్రతిష్టాత్మక సంస్థలో భాగం అయ్యే అవకాశాన్ని అందిస్తుంది.

AAI ఖాళీల విభజన
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఆర్కిటెక్చర్): 3
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజనీరింగ్-సివిల్): 90
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజనీరింగ్-ఎలక్ట్రికల్): 106
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రానిక్స్): 278
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ): 13

AAI రిక్రూట్‌మెంట్ అర్హత ప్రమాణాలు
అర్హతలు:

జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఆర్కిటెక్చర్) కోసం ఆర్కిటెక్చర్‌లో డిగ్రీ
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజనీరింగ్-సివిల్) కోసం సివిల్ ఇంజనీరింగ్/టెక్నాలజీలో డిగ్రీ
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజనీరింగ్-ఎలక్ట్రికల్) కోసం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/టెక్నాలజీలో డిగ్రీ
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రానిక్స్) కోసం ఎలక్ట్రానిక్స్/టెలీకమ్యూనికేషన్స్/ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/టెక్నాలజీలో డిగ్రీ
కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ ఇంజినీరింగ్/ఐటీ/ఎలక్ట్రానిక్స్‌లో డిగ్రీ, జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) కోసం MCA
వయో పరిమితి:

గరిష్ట వయస్సు: 27 సంవత్సరాలు (01-05-2024 నాటికి)
వయస్సు సడలింపు:
OBC అభ్యర్థులు: 3 సంవత్సరాలు
SC, ST అభ్యర్థులు: 5 సంవత్సరాలు
PWBD అభ్యర్థులు: 10 సంవత్సరాలు
దరఖాస్తు రుసుము:

SC/ST/PWBD అభ్యర్థులు: రూ. శూన్యం
మిగతా అభ్యర్థులందరూ: రూ. 300/-
చెల్లింపు విధానం: ఆన్‌లైన్
ఎంపిక ప్రక్రియ:

గేట్ మార్కుల ఆధారంగా
ఇంటర్వ్యూ

AAI రిక్రూట్‌మెంట్ (జూనియర్ ఎగ్జిక్యూటివ్) ఉద్యోగాలకు ఎలా దరఖాస్తు చేయాలి
అర్హత గల అభ్యర్థులు AAI అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు .
దరఖాస్తు వ్యవధి: 02-04-2024 నుండి 01-మే-2024 వరకు.
దరఖాస్తు చేయడానికి ముందు, మీరు మీ పత్రాల కాపీలను స్కాన్ చేశారని నిర్ధారించుకోండి.
రిజిస్ట్రేషన్ కోసం చెల్లుబాటు అయ్యే ఇమెయిల్ ID మరియు మొబైల్ నంబర్‌ను అందించండి మరియు వాటిని అప్‌డేట్‌ల కోసం యాక్టివ్‌గా ఉంచండి.
ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను ఖచ్చితమైన వివరాలతో పూరించండి, ఎందుకంటే మార్పులు వినోదాత్మకంగా ఉండకపోవచ్చు.
దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో చెల్లించండి (వర్తిస్తే).
అప్లికేషన్‌ను సమర్పించండి మరియు భవిష్యత్తు సూచన కోసం అప్లికేషన్ నంబర్‌ను సేవ్ చేయండి/ప్రింట్ చేయండి.
ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: 02-04-2024
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 01-మే-2024

AAI నోటిఫికేషన్ ముఖ్యమైన లింక్‌లు

అధికారిక నోటిఫికేషన్ PDF

Onine వర్తించు

aai.aero
AAIతో మీ కెరీర్‌లో కొత్త శిఖరాలకు ఎదగడానికి ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి! ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి మరియు భారతదేశం యొక్క ఏవియేషన్ ఎక్సలెన్స్‌లో భాగం అవ్వండి.

Govt Jobs : No Fee 10th అర్హ‌త‌తో వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో 6192 పైగా ఉద్యోగ ఖాళీలు.. దరఖాస్తు చేశారా?

Staff Selection Commission CHSL Job Notification 2024 in Telugu Apply Now : గ్రూప్ C పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో స్టాఫ్ సెలక్షన్ కమీషన్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్ ఎగ్జామినేషన్ ద్వారా వివిధ ప్రభుత్వ కార్యాలయంలో పోస్టుల కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

పోస్ట్: లోయర్ డివిజనల్ క్లర్క్/జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్లు తదితర పోస్టులో మీకు జాబ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది.

మొత్తం పోస్ట్: 3712 పోస్ట్లు

అర్హత: కేవలం ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి.

వయో పరిమితి: 18 నుండి 27 సంవత్సరాలు

దరఖాస్తు రుసుము: GEN/OBC/EWSకి రూ.100/- & SC/ST మహిళ అభ్యర్థులకు ఫీజు – Nil

ప్రారంబపు తేది: 08/04/2024

చివరి తేదీ: 07/05/2024

జీతం: పోస్టును అనుసరించి రూ.19,900/- to రూ.81,100/- మధ్యలో జీతం ఇస్తారు.

ఆన్‌లైన్ అధికారిక వెబ్‌సైట్: https://ssc.gov.in/

గమనిక: (పురుష & స్త్రీ) అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

✅Full Notification Pdf Click Here

✅Apply Link Click Here

✅Official Website Click Here

Kidney Stones: ఈ చిట్కాలు పాటించండి.. కిడ్నీలో రాళ్లు సులభంగా తొలగిపోతాయి..!

Kidney Stones: కిడ్నీలో రాళ్లు.. ఇది చాలామందిలో ఈ సమస్య కనిపిస్తుంది. కిడ్నీలో రాళ్ల కారణంగా విపరీతమైన నొప్పి బాధిస్తూ ఉంటుంది. మూత్రానికి వెళ్లేప్పుడు విపరీతమైన మంట వస్తూ ఉంటుంది. రాళ్ల పరిమాణం, సంఖ్యను బట్టి కిడ్నీలో రాళ్లు రావడానికి చాలా వారాలు, నెలలు పట్టవచ్చు. నీళ్లు తక్కువగా తాగడం, మాంసాహారం ఎక్కువగా తిన్నా, విటమిన్‌ బి6, సీ లోపం, విటమిన్‌ డి అధికంగా ఉన్నా, మద్యం ఎక్కువగా తాగేవారికి, ఆలస్యంగా భోజనం చేస్తున్నా.. కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. కిడ్నీలో రాళ్లకు సకాలంలో చికిత్స తీసుకోకపోతే.. రాళ్ల పరిమాణం పెరిగి.. శస్త్రచికిత్సకు దారితీసే అవకాశం ఉంది. రాళ్లను కరిగించడానికి.. అనేక మందులు, చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కిడ్నీ స్టోన్ అనేది మూత్రంలో ఏర్పడే స్ఫటికాల నుంచి ఏర్పడే గట్టి పదార్థం. కాల్షియం స్టోన్స్ ఎక్కువగా కనిపించే మూత్రపిండాల్లో రాళ్లు, తర్వాత యూరిక్ యాసిడ్ రాళ్లు ఉంటాయి. కిడ్నీలో రాళ్లను తొలగించాలంటే ఏం చేయాలి? నీరు ఎక్కువగా తాగడం వల్ల చిన్న చిన్న రాళ్లు తొలగిపోతాయని నమ్ముతారు. అయితే రాళ్లు ఎక్కువగా ఉన్నా, పెద్దవిగా ఉంటే తినడం, తాగడం వంటి వాటిపై మరింత శ్రద్ధ వహించాలి. నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ (NKF) ప్రకారం, మీరు మూత్రపిండాల తొలగింపు కోసం మందులతో పాటు క్రింది నివారణలను ప్రయత్నించాలి.

రోజుకు 3 లీటర్ల కంటే ఎక్కువ ద్రవాలు త్రాగాలి
రోజుకు కనీసం 2.5లీటర్ల ద్రవాలు తాగడం వల్ల మంచి మొత్తంలో మూత్రవిసర్జన జరుగుతుంది, ఇది రాళ్లను తొలగిస్తుంది.

అధిక ఆక్సలేట్ ఆహారాలకు దూరంగా ఉండండి
మీకు మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నట్లయితే, బచ్చలికూర, అనేక బెర్రీలు, చాక్లెట్, గోధుమ ఊక, గింజలు, దుంపలు, టీ, రబర్బ్‌లను మీ ఆహారం నుండి పూర్తిగా తొలగించాలి. ఎందుకంటే వాటిలో అధిక మొత్తంలో ఆక్సలేట్ ఉంటుంది, ఇది రాళ్లను ఏర్పరుస్తుంది.

కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి
కిడ్నీ రాళ్లు ఏర్పడిన పేషెంట్లు రోజూ వారి ఆహారంలో పాల ఉత్పత్తులను చేర్చుకోవాలి. కాల్షియం తీసుకోవడం వల్ల రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

కాల్షియం సప్లిమెంట్లను తీసుకోవడం మానుకోండి
కాల్షియం అధికంగా తీసుకోవడం వల్ల కూడా రాళ్లు ఏర్పడతాయి. మీకు రాళ్లు ఉంటే, మీరు కాల్షియం సప్లిమెంట్లను తీసుకోకుండా ఉండాలి. కాల్షియం సప్లిమెంట్లను మీ వైద్యుడు, నమోదిత కిడ్నీ డైటీషియన్ ద్వారా వ్యక్తిగతీకరించాలి.

ప్రోటీన్ తగ్గించండి, ఉప్పు తీసుకోవడం నివారించండి
అధిక ప్రోటీన్ తీసుకోవడం వల్ల మూత్రపిండాలు ఎక్కువ కాల్షియాన్ని విసర్జించబడతాయి, ఇది మూత్రపిండాలలో ఎక్కువ రాళ్ళు ఏర్పడటానికి దారితీస్తుంది. ఇది కాకుండా, సోడియం అధికంగా తీసుకోవడం వల్ల మూత్రంలో కాల్షియం పెరుగుతుంది, ఇది రాళ్ళు వచ్చే అవకాశాలను పెంచుతుంది. బీపీని నియంత్రించడానికి ఉప్పు తక్కువగా ఉండే ఆహారం కూడా ముఖ్యం.

విటమిన్ సి అధిక మోతాదులను తీసుకోవడం మానుకోండి..
మీరు ప్రతిరోజూ 60 mg విటమిన్ సి తీసుకోవాలని సిఫార్సు చేయబడింది. రోజుకు 1000 mg లేదా అంతకంటే ఎక్కువ మోతాదులో విటమిన్‌ సి ఉంటే శరీరం మరింత ఆక్సలేట్‌ను ఉత్పత్తి చేస్తుంది, ఇది రాళ్ల నిర్మాణానికి దారితీస్తుంది.

Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా… (09/04/24)

మేషం
అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. కనకధారాస్తవం పఠించాలి.

వృషభం
శారీరక శ్రమ పెరుగుతుంది. కొన్ని కీలకమైన వ్యవహారాలలో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. శివ అష్టోత్తర శతనామావళి పారాయణ చేయడం మంచిది.

మిథునం
చేపట్టే పనుల్లో శుభఫలితాలు సాధిస్తారు. మనః సంతోషాన్ని పొందుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. విష్ణు సహస్రనామాలు చదివితే మంచి జరుగుతుంది.

కర్కాటకం
సమాజంలో గొప్ప పేరు ప్రతిష్ఠలను సంపాదిస్తారు. ఆత్మీయులతో కలిసి మరువలేని మధుర క్షణాలను గడుపుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. విష్ణు సహస్రనామం పఠించాలి.

సింహం
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. మానసికంగా ద్రుఢంగా ఉంటారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఆంజనేయ దర్శనం చేయడం మంచిది.

కన్య
కీలక వ్యవహారాల్లో సమాచారలోపం లేకుండా చూసుకోవాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. ఎవరితోనూ వాదోపవాదాలు చేయరాదు. ఇష్టదైవ ప్రార్థన చేస్తే మంచిది.

తుల
అనుకూల సమయం. తోటి వారి సహకారాలు అందుతాయి. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలను పొందుతారు. ప్రయాణాలు ఫలిస్తాయి. గణపతి ఆరాధన చేస్తే మంచిది.

వృశ్చికం
ఉత్సాహంగా పనిచేస్తారు. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతి విషయాన్ని కుటుంబంతో చర్చించి మొదలుపెట్టాలి. లక్ష్మీ సహస్రనామం చదివితే మంచి జరుగుతుంది.

ధనుస్సు
పట్టుదలతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. కొందరి ప్రవర్తన మీ మనసును చికాకుపరుస్తుంది. అకారణ కలహసూచన ఉంది. దైవారాధన ఎట్టిపరిస్థితుల్లోనూ మానకండి. ఇష్టదైవ సందర్శనం శుభప్రదం.

మకరం
ధర్మచింతనతో వ్యవహరిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది. నలుగురికీ ఆదర్శంగా నిలుస్తారు. ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి. సూర్యనారాయణ మూర్తి ఆరాధన శుభదాయకం.

కుంభం
శుభకాలం. ఇష్టులతో కాలాన్ని గడుపుతారు. ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఒక వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. బుద్ధిబలం బాగుంటుంది. కీలక సమయాలలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠించడం మంచిది.

మీనం
పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు. అధికారులతో సత్సంబంధాలు ఏర్పడుతాయి. కార్యసిద్ధి విశేషంగా ఉంది. తోటి వారి సహకారంతో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.

కేంద్రీయ విద్యాలయాల్లో 1వ తరగతి అడ్మిషన్స్.. ఈ అవకాశాన్ని వదులుకోవద్దు!

ప్రస్తుత రోజుల్లో విద్యకు ప్రాధాన్యత పెరిగింది. తమ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు తల్లిదండ్రులు కృషి చేస్తున్నారు. పేదరికాన్ని పారద్రోలడానికైనా, ఉన్నత శిఖరాలను అధిరోహించడానికైనా చదువు కీలక పాత్ర పోషిస్తుందని విశ్వసిస్తున్నారు. పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేందుకు ఖర్చుకు కూడా వెనకాడకుండా ప్రముఖ స్కూళ్లలో చేర్పించేందుకు తల్లిదండ్రులు రెడీ అవుతున్నారు. ఇలాంటి వారికి శుభవార్త. తమ పిల్లల భవిష్యత్ ను బంగారుమయంగా మార్చేందుకు అవకాశం వచ్చింది. కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతిలో అడ్మిషన్స్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. దరఖాస్తు గడువుకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ సువర్ణావకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు.

మీరు మీ పిల్లలను స్కూళ్లో చేర్పించాలనుకుంటే ఇదే మంచి ఛాన్స్. నాణ్యమైన విద్యను అందించే కేంద్రీయ విద్యాలయాల్లో పిల్లలను చేర్పిస్తే భవిష్యత్ కు తిరుగుండదు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వార్యంలో పనిచేస్తున్న ఈ పాఠశాలలు అత్యున్నత ప్రమాణాలను కలిగి ది బెస్ట్ ఎడ్యుకేషన్ ను అందిస్తుంటాయి. ఇంతటి ప్రాధాన్యత ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతిలో ప్రవేశాల కోసం అప్లికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 15న ముగియనున్నది. దరఖాస్తు చివరి తేదీలోగా.. ఏప్రిల్ 01 2024 వరకు ఆరేళ్లు నిండిన పిల్లలు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తైన తర్వాత కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతి చదివేందుకు ఎంపికైన విద్యార్థులతో మొదటి ప్రొవిజినల్ జాబితా ఏప్రిల్ 19న, రెండో ప్రొవిజినల్‌ జాబితా (ఆర్‌టీఈ/సర్వీస్‌ ప్రియారిటీ (I & II)/ రిజర్వేషన్‌ కోటా) ఏప్రిల్‌ 29 విడుదల చేస్తారు (సీట్లు ఖాళీలను బట్టి). ఇకపోతే మూడో ప్రొవిజినల్‌ జాబితాను మే 8న విడుదల చేస్తారు.

కాగా కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ దక్కించుకోవాలంటే అనుకున్నంత ఈజీ కాదు. అప్లికేషన్ నుంచి ఎంట్రెన్స్ ఎగ్జామ్ వరకు ఎంతో జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ప్రవేశ పరీక్షలో అర్హత సాధించాల్సి ఉంటుంది. దరఖాస్తులో తప్పులు దొర్లితే అడ్మిషన్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. 2024 ఏప్రిల్ 1 నాటికి 6 ఏళ్లు నిండిన విద్యార్థుల తరఫున వారి తల్లిదండ్రులు కేంద్రీయ విద్యాలయ అధికారిక వెబ్‌సైట్ https://kvsonlineadmission.kvs.gov.in ద్వారా ఆన్‌ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇకపోతే, ఆయా పాఠశాలల్లో సీట్ల ఖాళీలను బట్టి రెండో తరగతి నుంచి ఆ పైతరగతులకు (పదకొండో తరగతి మినహా) ఆఫ్‌లైన్‌ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఏప్రిల్‌ 10 వరకు కొనసాగనుంది. ఎంపికైన అభ్యర్థుల లిస్ట్‌ను ఏప్రిల్‌ 15న విడుదల చేస్తారు. మరి మీ పిల్లలను కేంద్రీయ విద్యాలయాల్లో చేర్పించాలనుకుంటే వెంటనే దరఖాస్తు చేయండి.

Health

సినిమా