Ayodhya Ram lalla: ద్యావుడా.. అయోధ్యలో భక్తులకు తిలకం పెడుతూ బాలుడు ఈ రేంజ్ లో సంపాదిస్తున్నాడా..?.. వైరల్ వీడియో..

Boy who applies tilak in ayodhya ram lalla mandir revealing his daily earnings: వందల ఏళ్ల నాటి కల రామజన్మభూమిలో రామ్ లల్లా ఆలయం ప్రతిష్టాపన కార్యక్రమం వేడుకగా సాగింది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రామ్ లల్లా విగ్రహాస్థాపన కార్యక్రమం జరిగింది. బాలరాముడి విగ్రహాప్రతిష్టాపనకు అతీరథ మహరథులు అన్నిరంగాలకు చెందిన ప్రముఖులు హజరయ్యారు. కులమతాలకు అతీతంగా భక్తులు కూడా బాల రాముడిని దర్శించుకోవడానికి బారులు తీరారు. రామయ్యను కన్నులారా చూసుకొని వెళ్దామని దూర ప్రాంతాలనుంచి వస్తున్నారు. ఇప్పటికి కూడా ప్రతిరోజు వేలాదిగా భక్తులు ప్రతిరోజు వస్తున్నారు. రామయ్యను జీవితంలో ఒక్కసారైన లైవ్ లో చూడాలని భక్తులు పరితపిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బాలరాముడి దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు.


విమానాలు,రైల్వేలు, బస్సుల సౌకర్యం కల్పించాయి. ఇదిలా ఉండగ.. బాల రాముడికోసం ప్రతి ఒక్క భక్తుడు తమ వంతుగా హుండీలో కానుకలు వేసి మొక్కులు తీర్చుకుంటున్నారు. లడ్డులు, బుందీలు, జిలేబీలు టన్నుల కొద్ది భక్తులు తమ బాలరాముడికి నైవేద్యంగా సమర్పించి, అక్కడికి వస్తున్న భక్తులకు పంచిపెడుతున్నారు. ఇదిలా ఉండగా.. అయోధ్యలో ఒక బాలుడు ప్రతిరోజు అక్కడికి వస్తున్న భక్తులకు కుంకుమ, చందనం తిలకంనామాలు పెడుతుంటాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రోడ్డుమీద గడుపుతూ వచ్చి పోయే భక్తులకు తిలకం పెడుతుంటాడు.

వీరిలో కొందరు విదేశీయులు కూడా బాలరాముడి కోసం వస్తుంటారు. ఈక్రమంలో కొందరు బాలుడ్ని.. రోజు తిలకంగా పెట్టుకుంటూ ఎంత సంపాదిస్తావని సరదాగా అడిగారు. దీంతో అతను ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు టెంపుల్కు వచ్చిపోయే భక్తులకు కుంకుమ, చందనంతో తయారు చేసిన తిలకం దిద్దుతుంటానని, ఇలా రోజు దాదాపు.. పదిహేను వందల వరకు సంపాదిస్తానంటూ చెప్పాడు.
అంతేకాకుండా.. ఒక్కొక్క రోజు ఇంకా ఎక్కువే సంపాదిస్తున్నానంటూ నవ్వుకుంటూ చెప్పేశాడు. అక్కడున్న యువకులు అతని మాటలను వీడియో తీశారు. డాక్టర్ ల కన్నా.. తాను ఏంతక్కవ సంపాదించట్లేదని కూడా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఈ వీడియోప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.