ఎన్డీయేలోకి బీఆర్ఎస్‌. కేసీఆర్ – కేటీఆర్ – హరీష్ మధ్య గొడవలు.?

రాజకీయాల్లో ఇది జరగదు ఇది జరుగుతుంది అని చెప్పేందుకు ఏమీ ఉండవు. ప్రస్తుతం రాజకీయాల్లో నైతిక విలువలు పూర్తిగా దిగజారిపోయాయి. ఇందుకు తాజాగా బీహార్ లో జరుగుతున్న పరిణామాలే నిదర్శనం.
నితీష్ కుమార్ గత నాలుగేళ్లలో ఎలా పిల్లి మొగ్గలు వేశాడో ? ఎలా తన సీఎం పదవిని కాపాడుకున్నాడో చూస్తూనే ఉన్నాం. ఇక ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ పరిణామాలు కూడా శరవేగంగా మారుతున్నాయి. గత పదేళ్లుగా కేసీఆర్‌కు తిరుగులేకుండా రాజకీయం నడిచింది. గత ఎన్నికల్లో టిఆర్ఎస్ ఓడిపోయింది.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

ఇప్పుడు రేవంత్ రెడ్డి తన ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోవడానికి. బీఆర్ఎస్‌ను మరింత లోతుగా తొక్కేయటానికి రకరకాల ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. బి ఆర్ ఎస్ ను ఇప్పట్లో కోలుకోకుండా చేయడం.. సీనియర్ల నుంచి తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవడం.. మెజార్టీ తక్కువ ఉంది కాబట్టి బిఆర్ఎస్ తన అపార ధన రాశులతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనకుండా అడ్డుపడటం.. తెలంగాణలో బిజెపి బలపడకుండా చూడటం ఇలా రేవంత్ రెడ్డికి చాలా టాస్కులు ఉన్నాయి. ఇదంతా ఇంతకుముందు కేసీఆర్ నేర్పించిన పాఠమే కాబట్టి రేవంత్ చేసే పనులను కూడా పూర్తిగా తప్పు పట్టలేము.

ఇక మరో రెండు నెలలలో లోక్‌సభ ఎన్నికలు రానున్నాయి. నేను మళ్లీ ఒంటరిగా పోటీ చేస్తాను.. జనం ఆదరిస్తారు అనే బీఆర్ఎస్ / కేసీఆఆర్ ధీమా ఒక డొల్ల అని చెప్పాలి. బిజెపికి ఎలాగూ నాలుగైదు సీట్లు వస్తాయన్న నమ్మకం ఉంది. అయితే ఇప్పుడు బిఆర్ఎస్ ఎన్డీయేలో చేరే అంశంపై చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. టిఆర్ఎస్ ఎన్డీయేకు దగ్గర అయితే తెలంగాణలో ఉన్న మైనార్టీ ఓట్లు తమ పార్టీకి దూరం అవుతాయన్న భయం ఆందోళన కేసీఆర్ లో కనిపిస్తున్నాయట. అయితే బిఆర్ఎస్‌తో ఎన్డీయేలో చేరకపోతే పార్టీ ఫ్యూచర్ కష్టం అని కేటీఆర్, హరీష్ నుంచి కేసీఆర్ పై తీవ్రమైన ఒత్తిళ్లు ఉన్నాయట.
ఈ క్రమంలోనే తన నమస్తే తెలంగాణ పత్రికతో పాటు తమకు పని చేస్తున్న టీంల ద్వారా కేసిఆర్ బిజెపితో కలిస్తే ఏమిటి ? ఒంటరి పోటీతో ఏమిటి ఇలా రకరకాల కోణాల్లో సర్వేలు చేస్తున్నట్టు తెలుస్తోంది. టిఆర్ఎస్ బిజెపి వైపు మొగ్గితే మోడీ ఓకి అంటాడా ? అంటే తెలంగాణలో ఉన్న బిజెపి నేతల పరిస్థితి ఎలా ఉన్నా వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏకు కాస్త సీట్లు తగ్గుతాయి అన్న సర్వేలు వినపడుతున్నాయి. ఈ క్రమంలో నితీష్ లాంటి వాడు రెండు మూడుసార్లు డ్యాన్సులు చేసినా బిజెపి వాళ్లు కళ్ళకు అద్దుకొని మరి ఎన్డీఏలోకి తీసుకున్నారు.

Related News

ఇప్పుడు మోడీకి తెలంగాణలో బిజెపి ప్రయోజనాల కన్నా తన ప్రధానమంత్రి పీఠం ముఖ్యం. అందుకే కేసిఆర్ తో దోస్తీ కట్టే విషయంలో ఎలాంటి సందేహాలు ఉండవని చెప్పాలి. ఏది ఏమైనా ఎన్డీఏలో చేరే విషయంలో హరీష్ రావు – కేటీఆర్ ఒకవైపు ఉంటే.. కేసీఆర్ మరోవైపు ఉన్నారని ఒక్కసారి బిజెపి చెంత చెరితే ఆ పార్టీ ఎంత బలమైన పార్టీలను అయినా చీలుస్తుందన్న భయం కెసిఆర్ కు ఉందట. ఇప్పుడు ఎన్డీఏలో చేరే విషయమై కెసిఆర్ ఫ్యామిలీలోనే గడబిడలు మొదలైనట్టు తెలంగాణ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా వచ్చే లోకసభ ఎన్నికలు కేసీఆర్ కు, బి ఆర్ ఎస్ పార్టీకి పెద్ద అగ్ని పరీక్ష లాంటివని చెప్పాలి.

Related News