Diabetes : షుగర్ 500 ఉన్నా.. మీరు 15 రోజుల్లో ఇలా తగ్గించుకోండి…!

Diabetes :  ప్రస్తుతం భారతదేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య షుగర్. అదే మదుమేహ వ్యాధి. దీన్నే ఇంగ్లీష్ లో డయాబెటిస్ అంటారు. ప్రతి ఐదుగురిలో ఒకరు ప్రస్తుతం ఈ వ్యాధితో బాధపడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా ప్రస్తుతం ఈ వ్యాధి ప్రతి ఒక్కరిని కలవరపెడుతోంది. దీంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ప్రజలు ఉన్నారు. మారుతున్న మనిషి జీవన శైలే డయాబెటిస్ వ్యాధికి కారణం అవుతోంది.


తెల్లన్నం తినడం పూర్తిగా మానేయాలి
షుగర్ రావడానికి ప్రధాన కారణం మనం తినే అన్నం. అవును.. మన భారతదేశంలో ఎక్కువగా అన్నం తినే వాళ్లలో తెలుగు రాష్ట్రాలు ముందుంటాయి.మనం తినే బియ్యం బాగా పాలిష్ చేసినవి. వాటిలో ఉండే విటమిన్స్, మాంసకృత్తులు అన్నీ పోయి.. కేవలం కార్బోహైడ్రేట్స్ మాత్రమే మిగులుతాయి. కార్బోహైడ్రేట్స్ అంటే కేవలం పిండి పదార్థాలు మాత్రమే. బియ్యంలో 77 గ్రాములు కార్బొహైడ్రేట్స్ ఉంటాయి. ఎక్కువగా అన్నాన్నే తింటూ ఉండటం అలవాటు చేసుకోవడం వల్ల.. షుగర్ వ్యాధి తొందరగా బాడీని అటాక్ చేస్తుంది.షుగర్ వ్యాధిని నయం చేయాలంటే ముందు అన్నం తినడం మానేయాలి. అలాగే చాలా మంది అన్నం ఎక్కువ కూర తక్కువ తింటుంటారు. కానీ.. అన్నం తక్కువ తిని కూర ఎక్కువ తినాలి. కురల్లో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది. అందుకే కూరలు ఎక్కువ తిని అన్నం తక్కువ తింటే.. షుగర్ వెంటనే డౌన్ అయిపోతుంది. చిన్నప్పటి నుంచి కూరలు ఎక్కువగా తినే వాళ్లకు అసలు షుగర్ రానే రాదు. ఎప్పుడూ కంట్రోల్ లో ఉంటుంది.
Diabetes : ఉప్పు వాడకం తగ్గించాలి
షుగర్ ఎక్కువ ఉన్నవాళ్లు ఉప్పు వాడకాన్ని తగ్గించాలి. రోజుకు 2.5 గ్రాముల ఉప్పు కంటే ఎక్కువ తినేవాళ్లకు 70 శాతం షుగర్ వచ్చే అవకాశం ఉంది. అందుకే.. రోజుకు 2.5 గ్రామ్స్ కంటే ఎక్కువ ఉప్పును వాడకూడదు.

Diabetes : మొలకెత్తిన విత్తనాలు
రోజూ ఉదయమే మొలకెత్తిన విత్తనాలను తినండి. పరిగడుపున మూడు రకాల గింజలను తినండి. ఉదయం పూట టిఫిన్ బదులు.. మొలకలు, పండ్లను తీసుకోండి.
Diabetes : చెమటలు పట్టేలా వ్యాయామం చేయండి
ఉదయం పూట ఖచ్చితంగా వ్యాయామం చేయండి. రోజూ ఉదయం అర్ధగంట చెమటలు పట్టేలా వ్యాయామం చేయండి. రాత్రి పూట అన్నం తిన్న తర్వాత ఓ అర్ధగంట నడవండి.