హిందువుల శతాబ్దాల కల అయిన అయోధ్య బాలరాముని ప్రతిష్టపై ప్రజలలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్యను ఎంతో సామరస్యంగా పరిష్కరించి ప్రస్తుతం అయోధ్య శ్రీరాముడి ఆలయం ప్రారంభోత్సవం చేస్తున్న కారణంగా హిందువులంతా ఆనంద తన్మయత్వంతో ఉన్నారు.
ఇక అయోధ్య రాముడి అక్షింతలు ఇంటింటికీ పంపిణీ జరుగుతున్న క్రమంలో దేశ వ్యాప్తంగా జై శ్రీరాం అంటూ జనం ఊగిపోతున్నారు.
రామయ్య విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవాన్ని తిలకించటానికి తెగ తాపత్రయపడుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే అయోధ్య రామయ్య ఆలయ ప్రారంభోత్సవానికి అనుబంధంగా దేశ వ్యాప్తంగా ఆలయాలను శుభ్రం చెయ్యాలని ప్రధాని మోడీ పిలుపునివ్వటంతో ఆలయాలను శుద్ధి చేస్తున్నారు. ఇక అయోధ్య రామయ్య ఆలయ ప్రారంభోత్సవం నాడు కూడా దేశ ప్రజలంతా చెయ్యవలసిన విధులను పండితులు ఇప్పటికే చెప్పారు.
అయోధ్యలో చారిత్రాత్మక ఘట్టంగా బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరిగే రోజు అయిన జనవరి 22 న తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవాలని హిందూ మత పెద్దలు చెబుతున్నారు. కాలకృత్యాల అనంతరం స్నానం చేసి దేవుడి దగ్గర దీపం వెలిగించాలి. ఆ తరువాత సీతారామ, లక్ష్మణ, భరత, శతృఘ్న సమేత ఆంజనేయుడికి షోడశోపచార పూజలు చేయాలి.
Related News
ఇటీవల కాలంలో ఏ వస్తువు కొనుగోలు చేయాలన్నా అందరూ వినియోగిస్తున్న విధానం నో కాస్ట్ ఈఎంఐ. ఇది వినియోగదారులకు ఎక్కువ వెసులుబాటును కలుగజేస్తుండటంతో అందరూ దీనిని ఎంచుకుంటున్నారు.
ఇది ...
Continue reading
తెలుగువారి తొలి పండుగ ఉగాది తరువాత వచ్చే మరో విశిష్టమైన పండుగ శ్రీరామ నవమి. శ్రీమహావిష్ణువు ఏడో అవతారమైన శ్రీరాముని జన్మదినాన్ని రామ నవమిగా జరుపుకుంటారు.
దేశవ్యాప్తంగా కూడా శ్రీ...
Continue reading
బీజేపీ పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోను ప్రధాని మోడీ విడుదల చేశారు. ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మహిళలకు భారీ గుడ్న్యూస్ చెప్పారు. వచ్చే ఐదేళ్లలో ...
Continue reading
RBI : ఇటీవల జరిగిన ద్రవ్య విధాన సమావేశాలలో RBI కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. దీనిలో భాగంగానే ఈసారి రెపో రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. అంటే 7వ సారి కూడా రేట్లు స్థిరంగానే ఉంచిందని...
Continue reading
బాలీవుడ్ ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. ఇటీవలే ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైన ఆయనకు తీవ్రమైన ఛాతీ నొప్పి రావడంతో కోల్కతాలోన...
Continue reading
హిందూ మతానికి ప్రకృతికి ప్రత్యేక అనుబంధం ఉంటుంది. ప్రకృతిలో ఉండే రకరకాల చెట్లను జంతువులను హిందూమతంలో పూజిస్తూ ఉంటారు. కొన్ని జంతువుల అయితే దేవుడి వాహనాలుగా కొలుస్తూ ఉంటారు. ఇక ప్రత...
Continue reading
బిజెపి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి అనేక కార్యక్రమాలను చేపట్టింది. అందులో ముఖ్యంగా అయోధ్య రామాలయం గురించి అందరికీ తెలిసిందే. దేశంలో ఎన్నో విగ్రహాలను ఏర్పాటు చేశ...
Continue reading
అయోధ్యలో రామాలయంలో సోమవారం ప్రాణ ప్రతిష్ట వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. రామ్ లల్లా విగ్రహానికి ప్రధాని నరేంద్ర మోడీ తన చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ట చేశారు.
ఈ వేడుకను దేశ, విదేశాల్...
Continue reading
ఏదైనా ప్రత్యేకమైన కార్యక్రమానికి హాజరయ్యే సమయంలో ఆ సందర్భానికి తగిన వస్తువులను తీసుకువెళ్లి విశిష్టమైన బహుమతిగా ఇవ్వడం ప్రధానమంత్రి నరేంద్రమోడీకి అలవాటు.
ఆ అలవాటు ప్రకారమే ఏపీ కొత్...
Continue reading
Ayodhya Ram Mandir Darshan timings: ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా ముగిసింది. కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు..
తన జన్మస్థలంలో క...
Continue reading
అయోధ్య రామాలయంలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా పూర్తి అయ్యింది. శ్రీరామోత్సవం కసం మొత్తం నగరాన్ని ఎంతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.
ప్రధాన మంత్రి నరేంద్ర...
Continue reading
అయోధ్యలో జనవరి 22న రామప్రాణ ప్రతిష్ట జరగనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం కోసం రాముడి భక్తులందరూ వేల కళ్లతో ఎదురు చూస్తున్నారు.
ఎవరినోట విన్నా ఆ శ్రీరాముని పేరే వినిపిస్తుంది. అం...
Continue reading
పానకం, వడపప్పు నైవేద్యం సమర్పించాలని చెప్తున్నారు . పండ్లు, టెంకాయ మొదలైనవి సమర్పించాలి. జైశ్రీరాం అంటూ నగర సంకీర్తన చేస్తే చాలా మంచిది. అభిజిత్ ముహూర్తం వరకు దీపారాధన కొండెక్కకుండా చూసుకోవాలి. ఐదు దీపాలను తప్పకుండా వెలిగించాలని చెప్తున్నారు. ఆ రోజు విధిగా హిందువులంతా రామయ్యను మనసులో నిలుపుకుని పూజాధికాలు చెయ్యాలి.
ఇక మరోవైపు ఈ నెల 22న జరగనున్న అయోధ్య బాల రాముని ప్రతిష్టా కార్యక్రమాన్నిపురస్కరించుకుని ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో శ్రీరామ జ్యోతిని వెలిగించాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు నిచ్చారు. ప్రతి ఒక్కరూ రాముడు చూపిన బాటలో నడవాలన్నదే తమ ఉద్దేశమని మోడీ వెల్లడించారు.రామాలయ ప్రారంభోత్సవంలో పాల్గొననుండటం తన పూర్వ జన్మ సుకృతం అన్నారు.