Jageshwar Mandir: శివలింగాన్ని పూజించడం ఎక్కడ నుంచి మొదలైందో తెలుసా..! ఆ ఆలయ విశిష్టత, విశేషాలు ఏమిటంటే?

www.mannamweb.com


దేవభూమిని ఉత్తరాఖండ్ ను సాంస్కృతిక నగరంగా కూడా పిలుస్తారు. హిందూ మతపరంగా ముఖ్యమైన అల్మోరా జిల్లాలో అనేక పౌరాణిక , చారిత్రక ఆలయాలు ఉన్నాయి. వాటిలో ఒకటి జగేశ్వర్ ధామ్ ఆలయం.

ఇక్కడ నుంచి శివలింగ ఆరాధన ప్రారంభమైనదిగా పరిగణించబడుతుంది. దేవాలయాల్లో జగేశ్వర ఆలయం విశిష్ట స్థానాన్ని సొంతం చేసుకుంది. ఈ ఆలయం పేరు చరిత్రలో నమోదు చేయబడింది. ఈ ఆలయం సుమారు 2500 సంవత్సరాల నాటిది.

ఇక్కడి నుంచి శివలింగ పూజ ప్రారంభమైంది
జగేశ్వర ధామ్ శివుని ప్రధాన శైవ క్షేత్రాల్లో ఒకటి. జగేశ్వర ధామ్ శివుని తపస్సు చేసే ప్రదేశంగా పరిగణించబడుతుంది. లింగ రూపంలో శివుడిని ఆరాధించే సంప్రదాయం భూమి మీద మొదట ప్రారంభమైన మొదటి ఆలయం ఇదేనని పురాణాల కథనం. జగేశ్వర్‌ను ఉత్తరాఖండ్‌లోని ఐదవ ధామ్ అని కూడా పిలుస్తారు. ఈ జ్యోతిర్లింగాన్ని ఎనిమిదవ జ్యోతిర్లింగంగా పరిగణిస్తారు. దీనిని యోగేశ్వర అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ ప్రదేశం పురాణాలలో కూడా ప్రస్తావించబడింది.

కాంప్లెక్స్‌లో మొత్తం 124 దేవాలయాలు
పార్వతి, హనుమంతుడు, మృత్యుంజయ మహాదేవుడు, భైరవ, కేదార్నాథుడు, దుర్గ వంటి మొత్తం 124 ఆలయాలు ఈ ఆలయ సముదాయంలో ఉన్నాయి. ఈ ఆలయాల్లో నేటికీ పూజలు జరుగుతాయి. నమ్మకం ప్రకారం శివుడు, సప్తఋషులు ఇక్కడ తపస్సు చేయడం ప్రారంభించారు. ఈ ప్రదేశం నుండే శివలింగాన్ని పూజించడం ప్రారంభించారు. ఈ ఆలయానికి సంబంధించిన ఒక విశేషమేమిటంటే.. ఎవరైనా ఈ ఆలయ నిర్మాణాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే.. దీని నిర్మాణం సరిగ్గా కేదార్‌నాథ్ ఆలయాన్ని పోలి ఉంటుంది.

శివుని పాదముద్రలు
అల్మోరాలోని జగేశ్వర్ దేవాలయం కొండకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవిలో భీమా దేవాలయం సమీపంలో శివుని పాదముద్రలు ఉన్నాయి. పాండవులకు కనపడకుండా ఉండేందుకు పరమశివుడు ఒక పాదాన్ని ఇక్కడ, మరో కాలు కైలాసంపై ఉంచాడని చెబుతారు.

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు