నీటిలో తడిస్తే చేతివేళ్లకు ముడతలు.. ఎందుకో తెలుసా?

స్విమ్మింగ్ చేసినప్పుడు లేదా వర్షంలో ఎక్కువసేపు తడిసినప్పుడు చేతివేళ్లు, కాళ్లపై ఉండే చర్మం ముడతలు పడుతుంది.
కానీ ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పటి వరకు కనిపెట్టలేకపోయారు సైంటిస్టులు. అయితే తాజాగా అందుకుగల కారణాన్ని, దానివల్ల కలిగే లాభాలను తెలుసుకోగలిగారు. చేతివేళ్లు ముడతలు పడటానికి వెచ్చటి నీటిలో అయితే 3.5 నిమిషాలు, చల్లని నీటిలో అయితే 10 నిమిషాల సమయం పడుతుందని, అయినప్పటికీ గరిష్టంగా రింకిల్స్ వచ్చేందుకు 30 నిమిషాలు అవసరమన్నారు.


‘ఓస్మోసిస్’ అని పిలువబడే ప్రక్రియ ద్వారా కణాలలోకి నీరు ప్రవహించడంతో చర్మంపై పొరలు ఉబ్బుతాయి. ఫలితంగా నీటి అణువులు ఇరువైపులా ద్రావణాల సాంద్రతను ఈక్వలైజ్ చేయడానికి పొర మీదుగా కదులుతాయి. దీనివల్ల ముడతలు ఏర్పడతాయని గుర్తించారు. అయితే 1935 నాటికి, మధ్యస్థ నరం తెగిపోయిన గాయాలతో బాధపడుతున్న పేషెంట్లలో ముడతలు పడలేదని కనుగొన్నారు. వారి ఆవిష్కరణ వేలిముద్రల నీటి ప్రేరిత ముడతలు నిజానికి నాడీ వ్యవస్థ ద్వారా కంట్రోల్ చేయబడతాయని సూచించింది. ఆ తర్వాత 1970వ దశకంలో రక్త ప్రసరణ వంటి అపస్మారక ప్రక్రియల నియంత్రణను ప్రభావితం చేసే నరాల నష్టాన్ని అంచనా వేయడానికి చేతులను నీటిలో ముంచడాన్ని శాస్త్రవేత్తలు పరిశీలించారు.

2023 నాటికి న్యూరాలజిస్టులు ఐనార్ వైల్డర్-స్మిత్(Einar Wilder-Smith), అడెలైన్ చౌ (Adeline Chow) రక్త ప్రవాహంలో గణనీయమైన తగ్గుదల ఉన్నప్పుడు చేతివేళ్లు ముడతలు పడటం ప్రారంభించాయని కనుగొన్నారు. 500 మంది వాలంటీర్ల సహాయంతో మరో సైంటిస్టు డేవిస్ ప్లాస్టిక్ వస్తువును పట్టుకోవడానికి ఎంత శక్తిని ఉపయోగించాలో కొలిచాడు. చేతులు తడిగా ఉన్న వ్యక్తుల కంటే పొడిగా, ముడతలు లేని చేతులు ఉన్నవారికి తక్కువ శక్తి అవసరమని అతను కనుగొన్నాడు. కాబట్టి వస్తువుపై వారి పట్టు మెరుగ్గా ఉంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.