ద్రోణి ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో వర్షాలు

ఏపీపై ద్రోణి ప్రభావం కొనసాగుతోంది.
దీంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శుక్ర, శని వారాల్లో తేలికపాటి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, వైఎస్సార్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని, మన్యం, అల్లూరి, ప.గో, కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాలు పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అటు పిడుగులు సైతం పడతాయని, పశువుల కాపరులు చెట్ల కింద ఉండొద్దని వాతావరణ శాఖ సూచించింది.