పార్లమెంట్ ఎన్నికల వేళ కీలక పరిణామం.. ఎన్నికల కమిషనర్ అరుణ్ గోల్ రాజీనామా

పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో దేశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికల కమిషనర్ అరుణ్ గోల్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ఆయన జాతీయ ఎన్నికల కమిషనర్లు గా ఉన్న ముగ్గురిలో గోయెల్ ఒకరు. అయితే ఆయన తన రాజీనామకు సంబంధించిన కారణాలు మాత్రం ప్రకటించలేదు. గోయెల్ రాజీనామాను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందించగా.. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. కాగా ఆయన పదవీ కాలం 2027 వరకు ఉన్నప్పటికి అనూహ్యంగా మధ్యలో అది కూడా పార్లమెంట్ ఎన్నికల వేళ రాజీనామా చేయడంతో అందరూ పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.