దురదృష్టవశాత్తు, ఎవరైనా ఉద్యోగి మరణిస్తే.. అలాంటి సందర్భాల్లో, ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ మరణించిన సభ్యుల కుటుంబానికి ఉపశమనం కలిగించేలా ప్రకటన చేసింది. ఈ మార్పుకు సంబంధించి ఈపీఎఫ్వో గురువారం కొత్త సర్క్యులర్ జారీ చేసింది. దీని ప్రకారం.. ఇకపై.. మరణించిన చందాదారుడి ఖాతాలోని పీఎఫ్ మొత్తం.. నేరుగా అతడి మైనర్ పిల్లల పిల్లల ఖాతాల్లో నేరుగా డబ్బు జమకానుంది. కొత్త EPFO సర్క్యులర్ ప్రకారం, PF మొత్తాన్ని ఇకపై.. ఆ చనిపోయిన ఉద్యోగి యొక్క మైనర్ పిల్లల ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేస్తారు. దీనికి ఇకపై.. గతంలో మాదిరిగా కోర్టు నుంచి గార్డియన్షిప్ సర్టిఫికేట్ కూడా తీసుకురానవసరం లేదు. ఇప్పటివరకు, ఒక EPF సభ్యుడు మరణిస్తే, వారి కుటుంబం PF, పెన్షన్ లేదా బీమా మొత్తాలు పొందటానికి నెలల తరబడి ప్రాసెస్ సాగేది. ఇది ఆర్థికంగా ఆ కుటుంబాలకు భారమవుతోందని భావించిన కేంద్రం.. తాజాగా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. క్లెయిమ్ మొత్తం సజావుగా విడుదలయ్యేలా చూసుకోవడానికి, EPFO సభ్యుని ప్రతి బిడ్డ పేరు మీద ప్రత్యేక బ్యాంకు ఖాతాను తెరవాల్సి ఉంటుంది. PF, బీమా మొత్తం నేరుగా ఈ ఖాతాలలో జమ చేయబడుతుంది. క్లెయిమ్ మొత్తం జమ అయిన తర్వాత, దానిని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉపసంహరించుకోవచ్చు. EPFO ఒక నిర్దిష్ట EPF ఫారమ్ 20ని ఉపయోగిస్తుంది.. ఇది మరణించిన సభ్యుని PF ఖాతా నుండి డబ్బును ఉపసంహరించుకోవడానికి ఉద్దేశించబడింది. ఈ ఫారమ్ను మరణించిన సభ్యుని నామినీ, చట్టపరమైన వారసుడు లేదా సంరక్షకుడు పూరించవచ్చు. ఇది PF ఖాతా నుండి తుది క్లెయిమ్ చేయడానికి ఉపయోగించబడుతుంది.
Also Read
Education
- All
- Students
- Teachers
- School Apps - Web Links
- IMP GOs
- CSE Proceedings
- Softwares
- Applications and Forms
- Special Programmes in Schools
- Usefull Videos
- AP MDM
- FA and SA Exams
- Dpt .Tests
- 10th Class / SSC
- Lesson Plans
- Service Rules
- PRC Related
- Time Tables
- Grants
- Leave Rules
- Income Tax
- APGLI / ZPPF / GSI
- CFMS
- NT Books
- Trainings
More
































