Pensioners: పెన్షనర్లకు కేంద్రం గుడ్ న్యూస్.. సమస్యలన్నింటికీ ఒకేచోట పరిష్కారం..

అందుబాటులోకి వస్తున్న ఆధునిక సాంకేతికత మనిషికి అన్ని అంశాల్లోనూ మేలు చేస్తోంది. అన్ని రంగాల్లోనూ ఆధునిక టెక్నాలజీ వినియోగంలోకి రావడంతో వినియోగదారులకు సమయం, శ్రమ రెండూ ఆదా అవుతున్నాయి.


ఇదే క్రమంలో ఇప్పుడు పెన్షనర్లకు మెరుగైన అనుభవాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ పెన్షనర్స్ పోర్టల్ ను ప్రారంభించింది. పెన్షనర్ల అన్ని అవసరాలు, సమస్యలు ఒక్క చోటే పరిష్కారం లభించనుంది. ఇంతకీ ఏంటీ ఇంటిగ్రేటెడ్ పెన్షనర్స్ పోర్టల్? దీనిలో ఏముంటుంది? దీనితో పెన్షనర్లకు ఒరిగే ప్రయోజనాలు ఏమిటి? తెలుసుకుందాం రండి..

ఇంటిగ్రేటెడ్ పెన్షనర్స్ పోర్టల్ అంటే..

ఇంటిగ్రేటెడ్ పెన్షనర్స్ పోర్టల్ అనేది పెన్షన్ ప్రాసెసింగ్, చెల్లింపు సేవలను క్రమబద్ధీకరించడానికి రూపొందించిన ఒక సమగ్ర డిజిటల్ ప్లాట్ఫారమ్. పెన్షన్ సేవలను డిజిటలైజ్ చేయడమే ఈ పోర్టల్ లక్ష్యం అని పెన్షన్ అండ్ పెన్షనర్ల సంక్షేమ శాఖ (డీఓపీపీడబ్ల్యూ) వెల్లడించింది. ఇది పింఛనుదారులకు వివిధ పెన్షన్- సంబంధిత సౌకర్యాలను యాక్సెస్ చేయడానికి యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ ఫేస్ ను అందిస్తుంది.

పోర్టల్ ఎలా పనిచేస్తుందంటే..

ఐదు బ్యాంకుల పెన్షన్ ప్రాసెసింగ్, చెల్లింపు సేవలను ఒకే విండోలో ఏకీకృతం చేయడం ద్వారా, పోర్టల్ పదవీ విరమణ చేసిన వారికి పెన్షన్ నిర్వహణ ప్రక్రియను సులభతరం చేస్తుంది. ఈ ఇంటిగ్రేటెడ్ పోర్టల్ ముఖ్య ఫీచర్లను పరిశీలిస్తే.. ఈ పోర్టల్ వల్ల పదవీ విరమణ పొందినవారు తమ నెలవారీ పెన్షన్ స్లిప్పులను సౌకర్యవంతంగా యాక్సెస్ చేయడానికి, లైఫ్ సర్టిఫికెట్ల స్థితిని తనిఖీ చేయడానికి, ఫారమ్ 16 ను సమర్పించడానికి, చెల్లించిన బకాయిల స్టేట్ మెంట్ లను వీక్షించడానికి వీలు కల్పిస్తుంది.

ప్రధాన బ్యాంకులతో ఇంటిగ్రేషన్..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ), బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్ వంటి ప్రధాన బ్యాంకుల నుంచి పెన్షన్ పోర్టల్ ను భవిష్య పోర్టల్ తో అనుసంధానించారు. దీని వల్ల పెన్షనర్లకు అదనపు మరింత అదనపు సౌకర్యాన్ని అందిస్తుంది.

భవిష్య ప్లాట్ఫారమ్ మేలు..

భవిష్య ప్లాట్ఫారమ్ అనేది ఈ పెన్షనర్ల ఇంటిగ్రేటెడ్ పోర్టల్లో అంతర్భాగం. ఇది పెన్షన్ ప్రాసెసింగ్, చెల్లింపు విధానాల ఎండ్-టు-ఎండ్ డిజిటలైజేషన్ ను సులభతరం చేస్తుంది. ఈ ప్లాట్ఫారమ్ పదవీ విరమణ చేసిన వారి పనిని సులభతరం చేసే అనేక లక్షణాలను అందిస్తుంది. ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో పెన్షన్ చెల్లింపు ఆర్డర్ (పీపీఓ) జారీకి పెన్షన్ ఫారమ్లను ఆన్లైన్లో సమర్పించడాన్ని కలిగి ఉన్న పారదర్శక పెన్షన్ మంజూరు ప్రక్రియ కోసం ప్లాట్ఫారమ్ రూపొందించబడింది. దీని వల్ల
పదవీ విరమణ పొందిన వారికి ఎస్ఎంఎస్ లేదా ఈ-మెయిల్ ద్వారా వారి పెన్షన్ మంజూరు పురోగతిపై సకాలంలో నవీకరణలు అందుతాయి. ఈ పోర్టల్లో సీపీఈఎన్జీఆర్ఏఎంఎస్ ను కూడా కలిగి ఉంది. ఇది పెన్షనర్ల సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన ఆన్లైన్ ఫిర్యాదు పరిష్కార వ్యవస్థ.