స్టూడెంట్స్​కు గుడ్ న్యూస్.. వరుసగా 7 రోజులు సెలవులు! ఎందుకంటే..?

తెలుగు రాష్ట్రల్లోని స్కూల్, కాలేజీలు చదువుతున్న విద్యార్థులకు వరుస సెలవులతో పండగ వాతవరణం నెలకొంది. ఎప్పుడెప్పుడు సెలవు దొరుకుంతదా హాయిగా విశ్రాంతి తీసుకుందాం అనుకునే విద్యార్థులకు ఈ ఏడాది మొత్తం పండగాల కారణంగా వరుస హాలిడేస్ రాబోతున్నాయి. ఇప్పటికే హోలీ పండుగ కారణంగా వరుసగా రెండు రోజులు సెలవులు దొరకడంతో పిల్లలు ఆనందగా హోలీ పండుగను నిర్వహించుకున్నారు. ఇక సెలవులు ముగియడంతో నేటి నుంచి మళ్లీ స్కూల్, కాలేజీలు అంటూ పరుగులు పెట్టాలి. దీంతో మళ్లీ ఏ పండుగ వస్తుందా.. ఎప్పుడు సెలువులు ఇస్తారా అని క్యాలెండర్ వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి హాలిడేస్ కోసం ఎదురుచూసే విద్యార్థులకు మరో అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది. మళ్లీ స్కూల్ పాఠశాలలు వరుసగా 7 రోజులు పాటు సెలవులు ఇవ్వనున్నారు. ఎందుకంటే..


ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రల్లో విద్యార్థులకు ఒంటి పూట బడులు కొనసాగుతున్నాయి. అలాగే మరో వైపు విపరీతమైన ఎండలు ఉండడంతో ఈఏడాది త్వరాగా వేసవి సెలవులు ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. కనుక ఆ పరీక్షలు ముగియగానే మిగిలిన తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి అనంతరం భారీగా వేసవి సెలవులు ఇవ్వవచ్చు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ ఏప్రిల్ నెలలో విద్యార్థులకు వరుసగా 7 రోజులు సెలవులు రానున్నాయి. అయితే ఈ హాలిడేస్ అనేవి ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 17 వరకు వరుసగా పాఠశాలలకు, కాలేజీలకు ఇవ్వనున్నారు. కారణమేమిటంటే.. ఈ ఏప్రిల్ నెలలో ఉగాది, రంజాన్ , శ్రీరామనవమి సందర్భంగా వారం రోజుల్లో వరుసగా 4 రోజలు సెలవులు రానున్నాయి.

అలాగే వీటితో పాటు అదనంగా.. రెండో శనివారం, ఆదివారం కూడా ఉండటంతో.. ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 17 వరకు వరుసగా పాఠశాలలకు సెలవులు రానున్నాయి. అదే విధాంగా కాలేజీలకు కూడా సెలువులు ఇవ్వనున్నారు. ఇక వేసవి సెలవులు ఏప్రిల్ 18 కానీ, ఏప్రిల్ 20 నుంచి కానీ ఇవ్వనున్నట్లు సమాచారం. అలాగే తిరిగి జూన్ 13వ తేదీ వరకు ఈ వేసవి సెలవులు ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఈ క్రమంలోనే ఈ ఏడాది వేసవి సెలవులు దాదాపు 50 రోజలు పాటు ఇచ్చే అవకాశం ఉంది. ఇక తెలంగాణలో కూడా ఇంచుమించు ఇవే సెలవులు ఉండే అవకాశం ఉందని సమాచారం.