సైలెంట్ కిల్లర్ గా హైపర్‌టెన్షన్ .. యువతలో పెరుగుతున్న ప్రమాదం

మనుషుల ఆరోగ్యాన్ని మౌనంగా నాశనం చేస్తూ.. ప్రాణాలకి ప్రమాదంగా మారిన అధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్) మళ్లీ హాట్ టాపిక్ అయింది. ఇది “సైలెంట్ కిల్లర్” అని ఎందుకు అంటారు అంటే, దీని ప్రారంభ దశలో ఏమాత్రం లక్షణాలు కనిపించకపోవడం, కానీ దీర్ఘకాలంగా నిర్లక్ష్యం చేస్తే గుండెపోటు, స్ట్రోక్, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడే అవకాశం పెరగడం.


భారతదేశంలో పెరుగుతున్న హైపర్‌టెన్షన్ బాధితులు

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS) నివేదిక ప్రకారం –

25-54 సంవత్సరాల వయస్సు గలవారిలో 35% మందికి పైగా హైపర్‌టెన్షన్ ఉంది
దేశవ్యాప్తంగా 20 కోట్లకుపైగా ప్రజలు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు
అమెరికాలో జనాభాలో సగానికి పైగా హైపర్‌టెన్షన్‌తో పోరాడుతున్నారు

రక్తపోటు ఎంతైతే ప్రమాదం?

120/80 mmHg – సాధారణ స్థాయి

130/80 mmHg పైగా – రక్తపోటు పెరిగినట్టే

140/90 mmHg లేదా అంతకంటే ఎక్కువ – వైద్య సలహా తప్పనిసరి

దీన్ని నిర్లక్ష్యం చేస్తే గుండె, కిడ్నీలు, మెదడు పాడవుతాయి!

హైపర్‌టెన్షన్ ప్రధాన కారణాలు – నిపుణుల హెచ్చరిక

అధిక ఉప్పు & వేయించిన ఆహారం
అధిక చక్కెర – జంక్ ఫుడ్
శారీరక శ్రమ లేకపోవడం
నిరంతర ఒత్తిడి
నిద్రలేమి
అధిక బరువు
ధూమపానం & మద్యపానం

ఈ అంశాలు రక్త నాళాలపై ఒత్తిడిని పెంచి, రక్తపోటు నియంత్రణని దెబ్బతీస్తాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.