ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతోన్న మహా కుంభమేళాలో మోనాలిసా అనే అమ్మాయి తన కుటుంబంతో కలిసి పూసల దండలు, రుద్రాక్షలు అమ్ముకునేందుకు వచ్చింది.
అయితే కొందరు యూట్యూబర్లు ఆమె ఫొటోలు, వీడియోలు తీసి నెట్టింట వైరల్ చేసేశారు. ఇంకే ముంది కొన్ని గంటల్లోనే మోనాలిసా సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిపోయింది. ఎక్కడ చూసినా ఆమె ఫొటోలు, వార్తలే కనిపించాయి. ఇదే క్రమంలో మోనాలిసాకు తన తర్వాతి లో ఛాన్స్ ఇస్తానని బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా ప్రకటించాడు. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకున్నాడు సనోజ్. ఇచ్చిన మాట ప్రకారం ఆయన మధ్యప్రదేశ్లోని ఇండోర్లోని ఖర్గోన్ జిల్లా మహేశ్వర్లోని మోనాలిసా ఇంటికి వెళ్లారు. అక్కడ ఆమె తండ్రికి పరిశ్రమ గురించి వివరించారు. అలాగే సందేహాలను క్లియర్ చేశారు. దీంతో ఎట్టకేలకు మోనాలిసా తండ్రి జై సింగ్ భోంస్లే కూడా తన కుమార్తె ల్లో నటించేందుకు అనుమతించారు. ఈ విషయాన్ని డైరెక్టర్ సనోజ్ మిశ్రా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నరు.
కాగా సనోజ్ మిశ్రా తెరకెక్కించనున్న ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ లో మోనాలిసా నటించనుంది. ఇందులో ఆమె రిటైర్డ్ ఆర్మీ అధికారి కూతురిగా కనిపించనుందని సమాచారం. దాదాపు 20 కోట్లు బడ్జెట్తో ఈ ను రూపొందించనున్నట్లు సమాచారం. ఈ ద్వారానే బాలీవుడ్ స్టార్ హీరో రాజ్ కుమార్ రావు సోదరుడు అమిత్ రావు తెరంగ్రేటం చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ షూటింగ్ ప్రారంభం కానుండగా, మోనాలిసా ఏప్రిల్ నుంచి షూటింగ్ కు హాజరు కానుందట. అక్టోబర్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల తీసుకువచ్చేందుకు చిత్ర బృందం సన్నాహాకాలు చేస్తోందట.