మ్యూచువల్ ఫండ్ సిప్ స్ట్రాటజీ గురించి తెలుసా? రోజుకు రూ. 100 ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ఇలా చేతికి రూ. 5 కోట్లు

www.mannamweb.com


మీకు ప్రతి నెలా జీతం వస్తుందా.. మొత్తం ఖర్చు చేస్తున్నారా.. ఏమైనా పొదుపు చేస్తున్నారా.. ఇప్పుడు బానే ఉన్నా.. పొదుపు చేయకుంటే దీర్ఘకాలంలో ముఖ్యంగా వయసు మళ్లిన సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. అందుకే డబ్బుల్ని ఆదా చేసి.. దీనిని పెట్టుబడులకు మళ్లించాలి. అయితే ఎందులో పెట్టుబడి పెట్టాలనే దానిపై మంచి ప్లాన్ ఉండాలి. పెట్టుబడుల కోసం చాలా ఆప్షన్స్ ఉంటాయి. అయితే దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ ఎందులో ఎక్కువ వస్తాయి.. రిస్క్ తీస్కొని ఎందులో ఇన్వెస్ట్ చేయాలి.. రిస్క్ లేకుండా మంచి రిటర్న్స్ ఎక్కడ వస్తాయనే దానిపై ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవాలి. ఒక పక్కా ప్రణాళిక ప్రకారం ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలి.
>> అయితే కాస్త రిస్క్ ఉన్నప్పటికీ లాంగ్ రన్‌లో మంచి రిటర్న్స్ కోసం చాలా మంది మ్యూచువల్ ఫండ్లలో సిప్ విధానంలో పెట్టుబడులు పెడుతుంటారు. ఇక్కడ రోజువారీగా రూ. 100 చొప్పున పెట్టుబడి పెట్టినా.. పదవీ విరమణ కల్లా 5 కోట్ల వరకు సంపాదించొచ్చు. ఇందుకోసం.. ఎంత రిటర్న్స్ ఆశించాలి. నెలకు ఎంత పెట్టుబడి పెట్టాలి. ఎన్నేళ్లలో ఎంతొస్తాయో చూద్దాం.

>> మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో కాంపౌండింగ్ ఎఫెక్ట్ పని చేస్తుంది. అంటే ఇన్వెస్ట్‌మెంట్‌పై చక్రవడ్డీ రూపంలో రిటర్న్స్ వస్తాయి. అంటే.. ఇక్కడ కొంత మొత్తం పెట్టుబడి పెడితే.. ఏడాది చివర్లో దానిపై వడ్డీ రూపంలో కొంత ఆదాయం వచ్చిందనుకుందాం. అయితే.. ఇక్కడ వడ్డీ రూపంలో వచ్చిన ఆదాయం.. అసలులో కలుస్తుంది. అప్పుడు మరుసటి సంవత్సరం ఇలా అసలుపై వడ్డీ, మళ్లీ వడ్డీపై వడ్డీ ఇలా కాలం గడుస్తున్న కొద్దీ రిటర్న్స్ పెరుగుతూనే ఉంటాయి. అందుకే.. ఇక్కడ ఎంత తక్కువ వయసులో పెట్టుబడి పెడితే.. అంత ఎక్కువ రిటర్న్స్ అందుకోవచ్చు. అప్పుడు దీర్ఘకాలం పాటు పెట్టుబడులు కొనసాగించవచ్చు.

>> ఉదాహరణ చూస్తే.. ఉద్యోగంలో చేరిన 25 ఏళ్ల వ్యక్తి.. సిప్‌లో రోజుకు 100 చొప్పున మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి ప్రారంభించాడనుకుందాం. అప్పుడు నెలకు రూ. 3 వేలు అవుతుంది. ఇక 60 ఏళ్ల వరకు రిటైర్మెంట్ వరకు ఏటా 10 శాతం పెట్టుబడి పెంచుకుంటూ పోవాలి. ఇలా మరో 35 ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తే.. రిటైర్మెంట్ కల్లా పెద్ద మొత్తంలో సంపద సృష్టించుకోవచ్చు.

>> మ్యూచువల్ ఫండ్స్‌లో చాలా స్కీమ్స్ సగటున 15 శాతం రిటర్న్స్ కంటే ఎక్కువే ఇస్తాయి. మనం ట్రెండ్‌ను బట్టి 12 శాతం వార్షిక రిటర్న్స్ వస్తుందని అనుకొని లెక్కలు చూద్దాం. రోజుకు రూ. 100 చొప్పున నెలకు రూ. 3 వేలు పెట్టుబడి పెట్టాలి. మొత్తం 35 ఏళ్లు కట్టాలి. సగటు రిటర్న్స్ 12 శాతంగా అంచనా వేస్తే.. పెట్టుబడి మొత్తం = రూ. 3000x 12 నెలలు x 35 సంవత్సరాలు = రూ. 97.56 లక్షలవుతుంది. ఇక దీనిపై వచ్చే రాబడి రూ. 4.35 కోట్ల వరకు ఉంటుంది. పెట్టుబడితో కలిపి మొత్తం చేతికి రూ. 5.33 కోట్లు వస్తాయి. ఇది పెట్టుబడిని, రిటర్న్స్‌ను బట్టి మారుతుంటుంది.