OTT Updates : ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న ఆరు తెలుగు సినిమాలివే!

ఓటీటీ ప్రియులకు గుడ్ న్యూస్. ఈ వారం ఏకంగా ఆరు తెలుగు సినిమాలు, సిరీస్‌లు ఓటీటీలో సందడి చేయనున్నాయి. కరోనా తర్వాత ఓటీటీ హవా కొనసాగుతుంది.


ప్రతి ఒక్కరూ థియేటర్స్ కంటే ఓటీటీలో మూవీస్ చూడటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలో డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ కూడా భారీ ధరకు సినిమాలను కొనుగోలు చేసి సినిమా థియేటర్లో విడుదలైన 15 నుంచి 30 రోజుల్లోనే రిలీజ్ చేస్తున్నాయి. అయితే రీసెంట్‌గా విడుదలైన పలు సినిమాలు ఈ వారం ఓటీటీలో రిలీజ్ కానున్నయి. ఇంతకీ అవి ఏవీ అనుకుంటున్నారా?

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.. కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా, నేహా శెట్టి హీరోయిన్‌గా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో విడుదలై పాటివ్ టాక్ సొంత చేసుకుంది. కాగా ఈ సినిమా జూన్ 14న నెట్ ఫ్లిక్స్‌లో విడుదలకు సిద్ధమైంది. తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. కాగా, ఈ సినిమా థియేటర్లలో విడుదలైన 15 రోజులకే ఓటీటీలోకి వస్తుంది.

డియర్ నాన్న.. చైతన్య రావు హీరోగా నటించిన డియర్ నాన్న మూవీ ఆహా ఓటాటీలో జూన్ 14 నుంచి సందడి చేయనుంది. ఈ సినిమాకు కుంభంసపాటి దర్శకత్వం వహించారు.

పరువు .. నివేతా పేతురాజ్ ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ పరువు.జ దీనిని చిరంజీవి చిన్న కూతురు సుస్మిత కొణిదెల ప్రొడ్యూస్ చేసింది. కాగా, ఈ సినిమా శుక్రవారం ( జూన్ 14 ) నుంచి జీ5, ఓటాటీలో స్ట్రీమింగ్ కానుంది.

యక్షిణి.. బాహుబలిప్రొడ్యూసర్స్ నిర్మించిన యక్షిణి వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో జూన్ 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది. వీటితో పాటు, పారిజాతపర్వం, రష్ సినిమాలు కూడా ఈ వారం ఓటాటీలో సందడి చేయనున్నాయి. చైతన్యరావు, సునీల్, శ్రద్ధా దాస్ ప్రధాన పాత్రలో నటించిన పారిజాత పర్వం జూన్ 12న నేరుగా ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే, దర్శకుడు అల్లరి రవిబాబు కథను అందిస్తూ ప్రొడ్యూస్ చేసి తెలుగు మూవీ రష్ థియేటర్లను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా ఈటీవీ విన్ ఓటీటీలో జూన్ 13న రిలీజైంది. ఈ వారం ఇది కూడా ఓటీటీలో సందడి చేనుంది.