మాజీ ఏఏజీ పొన్నవోలుపై పోలీసులకు ఫిర్యాదు

ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న మాజీ అదనపు అడ్వొకేట్‌ జనరల్‌(ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డిపై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని తెదేపా పరిశోధన, సమాచార కమిటీ సభ్యుడు తోపూరి గంగాధర్‌ మంగళగిరి పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు.


అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న మాజీ అదనపు అడ్వొకేట్‌ జనరల్‌(ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డిపై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని తెదేపా పరిశోధన, సమాచార కమిటీ సభ్యుడు తోపూరి గంగాధర్‌ మంగళగిరి పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు.

వైకాపా అధినేత జగన్‌ను చంపేస్తే ఏంటని చంద్రబాబు అన్నట్లు పొన్నవోలు తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.

‘అమరావతి భూములు తెదేపా నాయకుల పరం కాకుండా మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో కలిసి ఆపానని పొన్నవోలు అంటున్నారు. తనకు రూ.150 కోట్లు ఎరగా చూపారని ఆరోపిస్తున్నారు. ఆరోపణలకు ఆధారాలు పొన్నవోలు బయటపెట్టాలి’ అని పేర్కొన్నారు.