RBI: ఆరు సంవత్సరాలు గవర్నర్గా పనిచేసిన శక్తికాంత దాస్ స్థానంలో కొత్త గవర్నర్గా నియమితులయ్యారు.
భారతదేశంలో కరెన్సీని జారీ చేసే ఏకైక అధికారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)కే ఉంది. RBI చట్టంలోని సెక్షన్ 22 ప్రకారం, బ్యాంక్ నోట్లు ముద్రించే హక్కు కేవలం రిజర్వ్ బ్యాంకుకు మాత్రమే ఉంటుంది. సెక్షన్ 25 ప్రకారం, బ్యాంక్ నోట్ల డిజైన్, ఆకారం మరియు మెటీరియల్ను RBI సెంట్రల్ బోర్డ్ సిఫార్సుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలి.
RBI శుక్రవారం ప్రకటించినదేంటంటే, మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్ క్రింద కొత్తగా రూ.10 మరియు రూ.500 నోట్లను త్వరలో విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ నోట్లపై కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం ఉంటుంది. ఈ కొత్త నోట్ల డిజైన్ ప్రస్తుతం ప్రచలతంలో ఉన్న మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్ నోట్లను పోలి ఉంటుందని RBI ప్రకటనలో పేర్కొంది. కొత్త నోట్లు విడుదలైనప్పటికీ, ఇంతకు ముందు జారీ చేసిన రూ.10 మరియు రూ.500 నోట్లు కూడా చట్టబద్ధంగా చెలామణిలో కొనసాగుతాయి.
కొత్త నోట్లలో ముఖ్యమైన మార్పు:
గత నెలలో, RBI కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో రూ.10 మరియు రూ.200 నోట్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. మల్హోత్రా డిసెంబర్ 2024లో RBI గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు. ఈ కొత్త నోట్లలో ప్రధాన మార్పు ఏమిటంటే, వాటిపై గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం ఉండటమే.
కరెన్సీ జారీ చేసే అధికారం:
RBIకే దేశంలో కరెన్సీ జారీ చేసే హక్కు ఉంది. ఈ అధికారం RBI చట్టం సెక్షన్ 22 ప్రకారం నిర్ణయించబడింది. సెక్షన్ 25 ప్రకారం, బ్యాంక్ నోట్ల డిజైన్ మరియు రూపకల్పనను RBI సెంట్రల్ బోర్డ్ సిఫార్సుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తుంది.
నోట్ల ముద్రణ ప్రక్రియ:
RBI ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం మరియు ఇతర స్టేక్హోల్డర్లతో సంప్రదించి, వివిధ డినామినేషన్లలో అవసరమైన నోట్ల సంఖ్యను నిర్ణయిస్తుంది. తర్వాత వివిధ కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్లకు ఆర్డర్లు ఇస్తుంది. RBI యొక్క “క్లీన్ నోట్ పాలసీ” ప్రకారం, ప్రజలకు ఎల్లప్పుడూ మంచి నాణ్యత గల నోట్లు అందుబాటులో ఉండేలా చూస్తుంది. ఈ నీతి ప్రకారం, చెలామణిలో ఉన్న పాత మరియు చిరిగిన నోట్లను ఉపసంహరించి, కొత్త నోట్లతో భర్తీ చేస్తుంది.