కోస్తా జిల్లాల జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలు బంద్

మొంథా తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికంగా ఉంది. దీంతో ఏపీ సర్కారు ముందు జాగ్రత్తలు చేపట్టింది. ఇందులోభాగంగా, మంగళవారం రాత్రి 7 గంటల నుంచి కోస్తా జిల్లాల్లోని జాతీయ రహదారులపై అన్ని రకాల వాహన రాకపోకలను నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వ అధికారులు ప్రకటించారు.