Sarath Chandra Reddy: నెల్లూరు లోక్సభ అభ్యర్థిత్వంపై కొద్దిరోజులుగా కొనసాగుతూ వస్తోన్న సస్పెన్స్కు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెరదించినట్టే కనిపిస్తోంది.
ఎంపీ అభ్యర్థి పేరును ఖాయం చేసినట్లు తెలుస్తోంది. కొద్దిరోజులుగా జిల్లా రాజకీయాల్లో ప్రచారంలో ఉన్నట్టుగానే- ప్రముఖ పారిశ్రామికవేత్త, అరబిందో శరత్ చంద్రా రెడ్డి అభ్యర్థిత్వానికి పార్టీ అగ్రనాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనని సమాచారం.
ప్రస్తుతం నెల్లూరు లోక్సభ స్థానంపై వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతోన్న విషయం తెలిసిందే. ఆదాల ప్రభాకర్ రెడ్డి ఈ స్థానానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. 2019 నాటి ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఆయన విజయం సాధించారు. ఆయనను నెల్లూరు రూరల్ అసెంబ్లీ బరిలోకి దించింది.
ఆదాల ప్రభాకర్ రెడ్డికి ప్రత్యామ్నాయంగా రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరును తెర మీదికి తీసుకొచ్చింది. నెల్లూరు ఎంపీగా పోటీ చేయడానికి ఆయన కొన్ని కండిషన్లు పెట్టారు. నెల్లూరు సిటీ అసెంబ్లీ టికెట్ను తన భార్య ప్రశాంతిరెడ్డికి ఇవ్వాలనేది ఆయన పెట్టిన షరతుల్లో ఒకటి.
Related News
Roja: వైఎస్సార్ కాంగ్రెస్ నగిరి ఎమ్మెల్యే అభ్యర్ధి రోజా షాకింగ్ కామెంట్స్ చేసారు. తనకు నగిరిలో తెలుగు దేశం పార్టీ వాళ్లతో ఎలాంటి సమస్యలు లేవని..
కానీ వైఎస్సార్ కాంగ్రెస్లో నామినే...
Continue reading
AP Election 2024: ఎన్నికల వేళ ఏపీలోని పలు జిల్లాల్లో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ప్రధాన పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తి.. కొట్లాటలకు దిగుతున్నారు. ఓటేసేందుకు క్యూ లైన్...
Continue reading
Vizag Capital: ఏపీలో మూడు రాజధానులపై మరోసారి క్లారిటీ ఇచ్చారు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఈ రోజు ఎన్నికల మేనిఫెస్టో 2024ను విడుదల చేసిన ఆయన..
మూడు రాజధాను...
Continue reading
YCP Manifesto: వైసీపీ మేనిఫెస్టో పై సొంత పార్టీ శ్రేణుల్లోనే అసంతృప్తి కనిపిస్తోంది. ఉన్న పథకాలకి కొంచెం మెరుగులు దిద్ది స్వల్ప మొత్తంలో కేటాయింపులు పెంచి ప్రకటించడంపై వారు పెదవి వ...
Continue reading
2024 సార్వత్రిక ఎన్నికల సమరానికి సమయం ముంచుకొస్తోంది. నామినేషన్ల పర్వం కూడా మొదలైన నేపథ్యంలో హడావిడి పీక్స్ కి చేరింది. అయితే, ఎన్నికలకు నెలరోజుల సమయం కూడా లేని క్రమంలో ప్రధాన పార్...
Continue reading
అమరావతి: వైకాపాలో ఇన్ఛార్జుల మార్పు ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా మరో రెండు పార్లమెంట్, 3 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన జాబితాను ఆ పార్టీ విడుదల చేసింది. పార్లమెంట్ నియోజకవర్గాల...
Continue reading
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ ఎన్నికలపై దృష్టిసారించారు. మొత్తం మూడు సీట్లలో పోటీ చేసేందుకు వైసీపీ అధినేత జగన్ కసరత్తు చేస్తున్నారు.
మంగళవారం సా...
Continue reading
హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఎంపీ విజయసాయి రెడ్డిపై టీపీసీసీ అధికార ప్రతినిధి కాల్వ సుజాత ఫిర్యాదు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెల్లలో కూలిపోతుందంటూ.....
Continue reading
రాజ్యసభ వేదికగా వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఏపీ విభజన ద్వారా తెలంగాణలో అధికారం కోసం కాంగ్రెస్ ఆశించిందన్నారు. పదేళ్ల తరువాత అమలు చేయలేని హామీలతో అధికారంలోకి...
Continue reading
YSRCP 6th List: అమరావతి: వైనాట్ 175 అంటున్న అధికార పార్టీ వైఎస్సార్ సీపీ (YSRCP) ఇదివరకే 5 జాబితాలు విడుదల చేయగా.. తాజాగా 6వ జాబితా విడుదల చేసింది.
6 అసెంబ్లీ స్థానాలు, 4 పార్లమెం...
Continue reading
ఏపీలో ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ప్రధాన పార్టీలు గెలుపు కోసం కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. వైసీపీ అభ్యర్దుల ఎంపిక కసరత్తు తుది దశకు చేరింది.
టీడీపీ, జనసేన తమ అభ్యర్దుల ...
Continue reading
ఒంగోలు లోక్ సభ ఇన్చార్జ్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియామకంపై బాలినేని శ్రీనివాసరెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. నిన్న చెవిరెడ్డికి పార్టీ బాధ్యతలు ఇచ్చేది లేదని బాలినేనికి చెప్పిన వై...
Continue reading
ఈ షరుతులకు వైఎస్ఆర్సీపీ అగ్రనాయకత్వం అంగీకరించలేదు. ప్రశాంతి రెడ్డిని కాదని మైనారిటీ నాయకుడికి నెల్లూరు సిటీ టికెట్ ఇచ్చింది. దీనితో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మనస్తాపానికి గురయ్యారు. పార్టీకి గుడ్బై చెప్పారు. వేమిరెడ్డి తప్పుకొన్న నేపథ్యంలో లోక్సభ ఎంపీ అభ్యర్థి కోసం వడపోత చేపట్టింది.
చివరికి- అరబిందో డైరెక్టర్ శరత్ చంద్ర రెడ్డి పేరును పరిశీలనలోకి తీసుకుంది. తాజాగా నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ఆయన పేరును ఖరారు చేసినట్లు చెబుతున్నారు. ఆయన స్వస్థలం నెల్లూరే. స్థానికుడు కావడం, వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ అధినేత వీ విజయసాయిరెడ్డికి సమీప బంధువు కావడం కలిసొస్తుందని పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఆర్థికంగా బలవంతుడు.
జిల్లా వ్యాప్తంగా బంధువులు ఉండటం ప్లస్ పాయింట్స్గా భావిస్తున్నాయి. కొన్ని మైనస్ పాయింట్స్ కూడా లేకపోలేదు. సంచలనం రేపిన ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో శరత్ చంద్రారెడ్డి విచారణను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ కేసులో అప్రూవర్గా కూడా మారారాయన.