ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్, ఉచిత కాల్స్ సౌకర్యం ఉంది. కానీ, భారతదేశంలో మొబైల్ ఫోన్ల ప్రయాణం ప్రారంభమైంది కేవలం మూడు దశాబ్దాల క్రితమే. భారతదేశంలో మొబైల్ ఫోన్ల అధికారిక ప్రయాణం జూలై 31, 1995న ప్రారంభమైంది.
ఆ రోజు అప్పటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, దివంగత జ్యోతి బసు, కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి సుఖ్ రామ్తో నోకియా మొబైల్ ఫోన్ ఉపయోగించి మొట్టమొదటి మొబైల్ ఫోన్ కాల్ చేసి చరిత్ర సృష్టించారు. ఈ కాల్ మోడీ టెల్స్ట్రా నెట్వర్క్ ద్వారా కనెక్ట్ అయింది.
కాల్ ఛార్జీలు షాకింగ్:
మొబైల్ ఫోన్లు అప్పుడప్పుడే ప్రజలలో ప్రాచుర్యం పొందుతున్న సమయంలో, కాల్ ఛార్జీలు చాలా ఎక్కువగా ఉండేవి. ఆ కాలంలో, ఒక నిమిషం కాల్ ఖర్చు రూ. 8.4 ఉండేది. ఇక పీక్ అవర్స్లో, ఈ కాల్ ఛార్జీలు రెట్టింపు అయి ఏకంగా రూ. 16.8కు చేరేవి. నేటి కొనుగోలు శక్తిని బట్టి చూస్తే, ఆ విలువ దాదాపు రూ. 170 ఉంటుంది. అంత ఖరీదైన కాల్స్ చేసిన రోజులు ఉండేవి.
జియో విప్లవం:
2016లో ముఖేష్ అంబానీ రిలయన్స్ జియో ద్వారా టెలికాం రంగంలోకి ప్రవేశించిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారాయి. జియో ప్రవేశం టెలికమ్యూనికేషన్ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. భారతదేశంలోని ఏ నెట్వర్క్కైనా మొబైల్ కాల్లను దాదాపు ఉచితం చేసింది. జియో రాక తర్వాత, ప్రపంచంలోనే అత్యల్ప మొబైల్ టారిఫ్ ప్లాన్లు, ఇంటర్నెట్ సర్వీస్ ఛార్జీలు ఉన్న దేశాలలో భారతదేశం ఒకటిగా మారింది.
































