Anant Radhika Wedding: ఈ రోజు వివాహ బంధంతో ఒక్కటి కానున్న అనంత్-రాధిక.. ముంబైకి చేరుకుంటున్న అతిధులు.. లిస్టు ఇదిగో

www.mannamweb.com


సియాలోనే అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల వివాహం ఈ రోజు ఘనంగా జరగనుంది.

ఈరోజు రాత్రి 9.30 గంటలకు ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో ఇద్దరూ పెళ్ళితో ఒక్కటి కానున్నారు. ఇప్పటికే వీరి పెళ్లికి సన్నాహాలు దాదాపు పూర్తయ్యాయి. అంతేకాదు ఈ వివాహ వేడుకలో పాల్గొనడం కోసం బాలీవుడ్-హాలీవుడ్ తారలు, ప్రపంచంలోని చాలా మంది వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు ముంబైకి చేరుకుంటున్నారు. మరి అనంత్-రాధికలను ఆశీర్వదించనున్న అతిథి జాబితాలో ఎవరెవరు ఉన్నారో తెలుసా..!

భారతీయ అపర కుబేరుడు ముఖేష్ అంబానీ తన కుమారుడి వివాహానికి ప్రధాని నరేంద్ర మోడీని, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కూడా ఆహ్వానించారు. అయితే ఈ ఇరు నేతలిద్దరూ ఈ పెళ్లి వేడుక్కి హాజరుకానున్నారా లేదా అన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదు. కాగా బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్, ప్రముఖ సెలబ్రిటీ కిమ్ కర్దాషియాన్ ముంబై చేరుకున్నారు.

అనంత్ అంబానీ వివాహ అతిథి జాబితా

శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ సీఈఓ హాన్ జోంగ్-హీ కూడా అనంత్ అంబానీ రాధిక మర్చంట్ వివాహానికి హాజరు కావడానికి ముంబై చేరుకున్నారు. ఈ పెళ్లికి అతిథి జాబితాలో బ్రిటిష్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఉద్ధవ్ థాకరే, ఆదిత్య థాకరే, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. స్టాలిన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలు కూడా ఉన్నారు.

బాలీవుడ్ స్టార్స్ గురించి చెప్పాలంటే, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్, కత్రినా కైఫ్, విక్కీ కౌశల్, షాహిద్ కపూర్, అలియా భట్, రణబీర్ కపూర్ కూడా అనంత్ రాధికల వివాహానికి హాజరుకానున్నట్లు తెలుస్తోంది. క్రీడా ప్రపంచం నుంచి డేవిడ్ బెక్‌హామ్, కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీలు కూడా ఈ వివాహానికి హాజరై పెళ్లి వేడుకలో సందడి చేయనున్నారు.

పెళ్లి వేడుకకి సంబంధించిన షెడ్యుల్

అనంత్ అంబానీ, రాధికల పెళ్లికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ కూడా రిలీజైంది. అనంత్ స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఊరేగింపు మధ్యాహ్నం 3 గంటలకు జియో వరల్డ్ సెంటర్‌కు చేరుకుంటారు. దీని తరువాత సంప్రదాయం ప్రకారం వివాహ క్రతువు నిర్వహిస్తారు. కాగా అనంత్, రాధిక లు సప్తపదితో ఒక్కయ్యే ముహర్తం రాత్రి 9:30 గంటలకు నిర్ణయించబడింది.