అంగన్వాడీ టీచర్ సుజాత మృతిపై వీడనున్న మిస్టరీ..

తాడ్వాయిమండలంలోని కాటాపూర్ 3వ అంగన్వాడి సెంటర్ టీచర్ రడం సుజాత హత్య పెద్ద సంచలనంగా మారింది.


అనేక అనుమానాలు వ్యక్తం కావడంతో ములుగు జిల్లా ఎస్పీ శబరిస్ ఆదేశాల మేరకు పస్రా సీఐ శంకర్, తాడ్వాయి స్థానిక ఎస్సై శ్రీకాంత్ రెడ్డి లు వచ్చి విచారణ చేపట్టారు. సమగ్ర దర్యాప్తు చేశారు. పలు అంశాలు వెలువడ్డాయి. హత్యకు సంబంధాలు ఉన్న సరిహద్దు ఏటూర్ నాగారం మండలానికి చెందిన ఇద్దరినీ, ఇంకొకరిని ముగ్గురిని పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నట్టు తెలిసింది.

అంగన్వాడి టీచర్ సుజాత మృతిపై మిస్టరీ వీడనుంది. నేడు రేపు మీడియా ఎదుట వివరాలు వెల్లడించేందుకు పోలీసు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేసుకున్నారు.పోలీసులు ముమ్మరంగా విచారణ..హత్య జరిగిన అతి తక్కువ సమయంలోనే 12 గంటల లోపు పూర్తి సమాచారం సేకరించినట్లు తెలిసింది. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పసర సిఐ శంకర్ తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్ రెడ్డి నిర్విరామ కృషి చేశారు. హత్య జరిగిన బుధవారం సాయంత్రం కాటాపూర్ మూడో సెంటర్ కేంద్రాన్ని, ఆ బజారులోన సమస్యలను అక్కడి పరిస్థితులను పరిశీలించి, విచారణ చేపట్టారు. అన్నారం పెట్రోల్ బంక్ సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా, ఫోన్ కాల్ హిస్టరీ ఆధారంగా ఎటునాగారం మండలం రొయ్యూరు గ్రామానికి చెందిన ఇద్దరిని, మరొకరిని స్టేషన్ కు తీసుకొచ్చి విచారిస్తున్నారు. చనిపోయిన రోజు, ముందు రోజు, మృతి చెందిన తర్వాత ఏం జరిగింది అన్నదానిపై అడిగి తెలుసుకున్నారు. ఏది ఏమైనా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పసర సీఐ శంకర్, తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్ రెడ్డి తన పోలీస్ బలగాలతో నిరంతర నిర్విరామ కృషితో అతి త్వరలో కేసు మిస్టరీ వీడనుంది.