Friday, September 20, 2024

Poppy Seeds: లేడీస్ గసగసాలు తింటే.. లెక్కలేనన్ని బెనిఫిట్స్ మీ సొంతం!

ప్రతీ వంటింటి పోపు డబ్బాలో గసగసాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇవి కూడా మసాలా దినుసుల్లో ఒకటి. కేవలం వీటిని మసాలాల్లో ఉపయోగిస్తారు అనుకుంటే పొరపాటే. గసగసాలతో ఎన్నో రకాల అనారోగ్య సమస్యల్ని నయం చేసుకోవచ్చు. ఇందులో అనేక పోషకాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో కూడా గసగసాలను అనేక ప్రాబ్లమ్స్‌ని తగ్గించడానికి యూజ్ చేసేవారు. ఇన్ని పోషకాలున్న గసగసాలను మహిళలు తీసుకుంటే.. చాలా లాభాలు ఉన్నాయి. గసగసాలతో తయారు చేసే ఆహారం తీసుకోవడం వల్ల లేడీస్..

ప్రతీ వంటింటి పోపు డబ్బాలో గసగసాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇవి కూడా మసాలా దినుసుల్లో ఒకటి. కేవలం వీటిని మసాలాల్లో ఉపయోగిస్తారు అనుకుంటే పొరపాటే. గసగసాలతో ఎన్నో రకాల అనారోగ్య సమస్యల్ని నయం చేసుకోవచ్చు. ఇందులో అనేక పోషకాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో కూడా గసగసాలను అనేక ప్రాబ్లమ్స్‌ని తగ్గించడానికి యూజ్ చేసేవారు.

ఇన్ని పోషకాలున్న గసగసాలను మహిళలు తీసుకుంటే.. చాలా లాభాలు ఉన్నాయి. గసగసాలతో తయారు చేసే ఆహారం తీసుకోవడం వల్ల లేడీస్ బరువు తగ్గొచ్చు. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. అంతే కాకుండా ఇవి ఆకలిని కంట్రోల్ చేస్తాయి.

గసగసాల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అదే విధంగా హెల్దీ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల చర్మం, జుట్టు సమస్యలు కూడా తగ్గి.. ఆరోగ్యంగా ఉంటాయి.

సాధారణంగా ఆడవారిలో వయసు పెరిగేకొద్దీ ఎముకలు బలహీనమవుతాయి. దీంతో అనేక సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి గసగసాలను తీసుకుంటే.. ఎముకలు బలంగా, దృఢంగా మారతాయి. ఎందుకంటే ఇందులో క్యాల్షియం మెండుగా లభిస్తుంది.

చాలా మంది మహిళలు.. నెలసరి సమయంలో అనేక ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. ఈ సమస్యల నుంచి బయట పడాలంటే.. గసగసాలు తీసుకుంటే బెటర్. ఇందులో ఉండే మెగ్నీషియం.. కండరాలను రిలాక్స్ చేసి.. నొప్పి, ఇతర ఇబ్బందులు తగ్గిస్తాయి.

DD News: దూరదర్శన్ లోగో కలర్ మార్పుపై విమర్శలు.. మాజీ సీఈవో ఏమన్నారంటే..!

దూరదర్శన్ లోగో కలర్ మార్పుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవారం లోగో కలర్ మారుస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన చేసింది. మొన్నటిదాకా ఎరుపు రంగులో ఉన్న డీడీ లోగోను.. తాజాగా కాషాయ రంగులోకి మారుస్తూ డీడీ యాజమాన్యం ఏప్రిల్ 16న నిర్ణయం తీసుకుంది.

అయితే లోగో మార్పుపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, డీడీ న్యూస్ మాజీ సీఈవో జవహర్ సిర్కార్ తప్పుపట్టారు. ఇది అనుచితమైన చర్యగా అభివర్ణించారు. స్వయంప్రతిపత్తి కలిగిన పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్‌ను కాషాయ రంగులోకి కలర్ మార్చడం సరి కాదని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు కాషాయ రంగులోకి డీడీ లోగోను మార్చడం బాధ కలిగిస్తోందని చెప్పారు. ఎన్నికల సమయంలో కలర్ మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది అని నిలదీశారు. ఇది ప్రసార భారతి కాదని.. ఇది ప్రచార భారతి అని జవహర్ సిర్కార్ సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. ఎన్నికల సమయంలో లోగో కలర్ మార్చడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని ఆయన తెలిపారు. ప్రస్తుత సీఈవో తీరును ఆయన తప్పుపట్టారు. సిర్కార్ 2012 నుంచి 2016 వరకు దూరదర్శన్.. ఆల్ ఇండియా రేడియోకు సీఈవోగా పని చేశారు.

డీడీ న్యూస్ కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలో నడుస్తుంది. మొన్నటిదాకా ఎరుపు రంగులో ఉండే డీడీ లోగోను.. ఇప్పుడు కాషాయ రంగులోకి మారుస్తూ డీడీ యాజమాన్యం ఏప్రిల్ 16న నిర్ణయించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటనలో తెలియజేసింది. మునుపెన్నడూ లేని విధంగా వార్తల ప్రయాణానికి సిద్ధంగా ఉండాలని తెలిపింది. సరికొత్త DD వార్తలను మీ ముందుకు తెస్తున్నామని పేర్కొంది. మాకు ధైర్యం ఉంది… వేగంపై కచ్చితత్వం, ఆరోపణలపై వాస్తవాలు, సంచలన నిజాలు ప్రజల ముందుకు తెస్తామని డీడీ న్యూస్ ఓ పోస్ట్‌లో వెల్లడించింది. ఈ మేరకు కొత్త రూపాన్ని సోషల్ వీడియో ద్వారా చూపించింది.

EPFO Pension Rules: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. కొత్త నిబంధనలు వచ్చాయ్.. పూర్తి వివరాలు

ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) ఉద్యోగులకు గొప్ప భరోసా. ముఖ్యంగా ఉద్యోగ విరమణ చేసిన తర్వాత ఆర్థిక భద్రతను అందిస్తుంది. ప్రతి ఉద్యోగికి తన జీతం నుంచి కొంత మొత్తం ప్రతి నెల ఈపీఎఫ్ ఖాతాలో జమవుతుంది. ఆ మొత్తాన్ని ఉద్యోగ విరమణ తర్వాత ఈపీఎఫ్ఓ అందిస్తుంది. ప్రతి నెలా పెన్షన్ కూడా అందిస్తుంది. అయితే ఇటీవల ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు సంబంధించిని కొన్ని నియమాలను మార్చింది. వాటిపై ప్రతి ఈపీఎఫ్ ఖాతాదారుడికి అవగాహన అవసరం. ఈనేపథ్యంలో ఈపీఎఫ్ఓ కొత్తగా తీసుకొచ్చిన విషయాలను మీకు అందిస్తున్నాం. అవేంటో చదివేద్దాం..

పెన్షన్ అర్హత.. పెన్షన్ అర్హతలకు సంబంధించిన మార్పులు కొన్ని ఉన్నాయి. వాటిల్లో కనీస సర్వీస్ టెన్యూర్, వయస్సు, ముందస్తు లేదా వాయిదా వేయబడిన పెన్షన్‌లకు సంబంధించిన ఆప్షన్లు దీనిలో ఉంటాయి.

పెన్షన్ మొత్తం గణన.. జీతం, ఉద్యోగి, యజమాని ఇద్దరి నుంచి వచ్చే విరాళాలు, సర్వీస్ టెన్యూర్ వంటి అంశాలు చివరికి పెన్షన్ మొత్తాన్ని ఎలా ప్రభావితం చేస్తాయనే దానిపై ఈపీఎఫ్ఓ ​​స్పష్టత అందించింది.

ఇతర ప్రయోజనాలు.. బ్రైవర్ బెనిఫిట్స్, ఉపసంహరణ ప్రత్యామ్నాయాలు లేదా నామినేషన్ ప్రక్రియలకు సంబంధించిన నిబంధనలను ఈపీఎఫ్ఓ ​​స్పష్టం చేసేంది.

పెన్షన్ అర్హత ఇలా..
చాలా మంది ఈపీఎఫ్ ​​ఖాతాదారులకు కనీసం 10 సంవత్సరాల పాటు కంట్రిబ్యూట్ చేయడం ద్వారా, ఒక ఉద్యోగి 58 సంవత్సరాల వయస్సులో పెన్షన్‌కు అర్హత పొందుతారని తెలియదు. ఈపీఎఫ్ఓ ​​పెన్షన్ క్లెయిమ్‌లను ఆలస్యం చేసినందుకు ప్రోత్సాహకాన్ని అందిస్తుంది. 60 ఏళ్ల వరకు వాయిదా వేయడాన్ని ఎంచుకోవడం వల్ల మీరు క్లెయిమ్ చేయడాన్ని వాయిదా వేసే ప్రతి సంవత్సరం పెన్షన్ మొత్తం 8% పెరుగుతుంది. ఈ ఎంపిక మీకు ఎక్కువ పెన్షన్ ఫండ్‌ను సమీకరించటానికి వీలు కల్పిస్తుంది. దీని ఫలితంగా పదవీ విరమణలో అధిక నెలవారీ చెల్లింపు జరుగుతుంది.

ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్): ఈపీఎస్ కి 8.33% కేటాయించారు. ఇది ఉద్యోగికి పదవీ విరమణ తర్వాత పెన్షన్ ప్రయోజనాన్ని అందిస్తుంది.

ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్): మిగిలిన 3.67% కూడా ఈపీఎఫ్ కి మళ్లించబడుతుంది, ఇది ఉద్యోగికి పొదుపుగా ఉంటుంది.

ముందస్తు పెన్షన్..
సభ్యులు కనీసం 10 సంవత్సరాలు ఉద్యోగం చేసినట్లయితే, 50 సంవత్సరాల వయస్సు నుంచి ప్రారంభ పెన్షన్‌ను అభ్యర్థించవచ్చు. అయితే, ముందస్తు పెన్షన్‌ను ఎంచుకోవడం వలన పెన్షన్ మొత్తం తగ్గుతుంది. అదనంగా, ఉద్యోగులు తమ ప్రాథమిక జీతంలో 12% కంటే ఎక్కువ మొత్తాన్ని తమ పీఎఫ్ కి స్వచ్ఛందంగా అందించడానికి ఎంచుకోవచ్చు.

ఉద్యోగులు తమ పెన్షన్ ప్రయోజనాలను గ్రహించడానికి, వ్యూహాత్మకంగా ప్లాన్ చేయడానికి ఈపీఎఫ్ఓ వివరణలను అర్థం చేసుకోవడం చాలా అవసరం. కాంట్రిబ్యూషన్ ఫ్రేమ్‌వర్క్, పెన్షన్ అర్హత గురించి తెలుసుకోవడం వల్ల ఉద్యోగులు తమ భవిష్యత్ ప్రయోజనాలను అంచనా వేయడానికి, అదనపు పొదుపులు అవసరమా అని నిర్ణయించడానికి వీలు కల్పిస్తుంది.

పెన్షన్‌ను ఆలస్యం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకోవడం ఉద్యోగులకు అధిక చెల్లింపుల కోసం వాయిదా వేయడం వారి ఆర్థిక లక్ష్యాలతో సరిపోతుందా అని నిర్ణయించడంలో సహాయపడుతుంది. వ్యక్తిగత పొదుపులు, పెట్టుబడులతో పాటుగా ఈపీఎఫ్ఓ ​​ప్రయోజనాలను సమర్థవంతంగా ఉపయోగించుకోవడం సురక్షితమైన పదవీ విరమణకు గొప్పగా దోహదపడుతుంది.

DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పది రోజుల్లో పెరిగిన జీతంతో పాటు బకాయిలు కూడా జమ

కేంద్ర ప్రభుత్వం గత నెలలో డీఏ, డీఆర్‌లలో 4 శాతం పెంపును ప్రకటించినప్పటికీ ఒక వర్గానికి చెందిన ఉద్యోగులు, పెన్షనర్లకు సవరణతో మార్చి నెల వేతనం అందలేదు. అయితే వారు ఇప్పుడు ఏప్రిల్ జీతంలో సవరించిన వేతనంతో పాటు 3 నెలల బకాయిలను పొందే అవకాశం ఉందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్‌ ఇస్తారు. జనవరి, జూలై నుండి అమల్లోకి వచ్చేలా సంవత్సరానికి రెండుసార్లు డీఏ, డీఆర్ పెంచుతారు.

కేంద్ర ప్రభుత్వం గత నెలలో డీఏ, డీఆర్‌లలో 4 శాతం పెంపును ప్రకటించినప్పటికీ ఒక వర్గానికి చెందిన ఉద్యోగులు, పెన్షనర్లకు సవరణతో మార్చి నెల వేతనం అందలేదు. అయితే వారు ఇప్పుడు ఏప్రిల్ జీతంలో సవరించిన వేతనంతో పాటు 3 నెలల బకాయిలను పొందే అవకాశం ఉందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్‌ ఇస్తారు. జనవరి, జూలై నుండి అమల్లోకి వచ్చేలా సంవత్సరానికి రెండుసార్లు డీఏ, డీఆర్ పెంచుతారు. డీఏ పెంపును ప్రకటించిన ప్రభుత్వం గత నెలలో మార్చి నెల జీతాల పంపిణీకి ముందు బకాయిలు చెల్లించబోమని ప్రకటించింది. ఈ నేపథ్యంలో డీఏ, డీఆర్ పెంపునకు సంబంధించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

మార్చి 7న కేంద్ర కేబినెట్ డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)లో 4 శాతం పెంపును ప్రాథమిక వేతనంలో 50 శాతానికి పెంచింది. కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూర్చే 4 శాతం డీఏ పెంపు జనవరి 1, 2024 నుండి అమలులోకి వచ్చింది. ఇది కాకుండా ఉద్యోగులకు హెచ్ఆర్ఏ కూడా పెంచారు. డీఏ పెంపు వల్ల ఖజానాపై రూ.12,868 కోట్ల భారం పడనుంది. అక్టోబర్ 2023లో మునుపటి డీఏ పెంపులో ప్రభుత్వం డియర్‌నెస్ అలవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్‌ను 4 శాతం నుండి 46 శాతానికి పెంచిన విషయం విధితమే.

జీతాల పెంపు ఇలా
ప్రభుత్వం 4 శాతం డీఏ పెంపును ప్రకటించినందున ఒకరి జీతం నెలకు రూ. 50,000 అనుకుంటే అందులో ఉద్యోగి ప్రాథమిక వేతనంగా రూ. 15,000గా ఉంటుంది. అతను లేదా ఆమె ప్రస్తుతం మూల వేతనంలో 46 శాతం అంటే రూ.6,900 పొందుతున్నారు. అయితే 4 శాతం పెంపు తర్వాత ఉద్యోగి నెలకు రూ. 7,500 పొందుతారు, ఇది అంతకుముందు రూ.6,900తో పోలిస్తే రూ.600 ఎక్కువ. కాబట్టి ఎవరైనా నెలకు రూ. 50,000 జీతంతో రూ. 15,000 బేసిక్ పేగా ఉంటే, అతని లేదా ఆమె జీతం నెలకు రూ.600 పెరుగుతుంది.

Post Office Scheme: సీనియర్ సిటిజన్లకు శుభవార్త.. నెలకు రూ.20,500 పొందవచ్చు!

భారత దేశంలోని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రధాన వ్యవస్థల్లో తపాల శాఖ ఒకటి. దేశంలోనే అతి పెద్ద వ్యవస్థలో ఒకటిగా తపాల శాఖ కొనసాగుతుంది. ఒకప్పుడు పోస్టాఫీసు ద్వారా ఉత్తరాల మార్పిడి మాత్రమే జరిగేది. కాలం మారింది. అలానే ఈ శాఖలో అనేక మార్పులు వచ్చాయి. ప్రజలకు ఎన్నో అద్భుతమైన స్కీమ్స్ తో ఆకట్టుకుంటుంది. పిల్లల నుంచి పండు ముసలి వారి వరకు అందరికి ఏదో ఒక స్కీమ్ ను పోస్టాఫీస్ అందిస్తుంది. తాజాగా పోస్టాఫీస్ అందిస్తున్న ఓ పథకం సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఈ పథకం ద్వారా నెలకు రూ.20,500 పొందవచ్చు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

పోస్టాఫీస్ అనేక రకాల నెలవారీ ఆదాయ స్కీమ్ ను అందిస్తుంది. ఇప్పటికే పిల్లలు, మహిళలకు పలు రకాల సేవింగ్ స్కీమ్స్ ను అందిస్తుంది. అలానే సీనియర్ సిటిజన్లు కూడా వృద్దాప్యంలో ఆర్థిక ఇబ్బంది పడకుండా వారికి పోస్టాఫీస్ స్కీమ్ అందిస్తుంది. అదే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్. వృద్దాప్యంలో సీనియర్ సిటిజన్ల నెలవారీ ఖర్చులను భరించేందుకు తపాలా శాఖ ఈ పథకాన్ని తీసుకొచ్చింది. కొన్ని షరతులను పాటిస్తూ.. ఈ స్కీమ్ ను చక్కగా ఉపయోగించుకోవచ్చు.

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ లో మినిమ్ వెయ్యి రూపాయల నుంచి గరిష్టంగా 30 లక్షల వరకు పెట్టుకొవచ్చు. అయితే మనం ఎంత ఇన్వెస్ట్ మెంట్ చేసినాము అనే దానిపైనే మనకు వచ్చే ఆదాయం ఆధారపడి ఉంటుంది. యాదృచ్ఛికంగా ఈ పథకంలో పెట్టుబడికి సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ఉంది. సెక్షన్ 80సీ కింద రూ.15 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. 60 ఏళ్లు పైబడిన వారిని దృష్టిలో ఉంచుకుని ఈ పథకం రూపొందించబడింది. ఈ స్కీమ్ లో చేరితే.. పదవీ విరమణ తర్వాత సాధారణ ఆదాయాన్ని పొందవచ్చు. అలానే పదవీ విరమణ పొందినవారు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన వారికి ప్రస్తుతం ప్రభుత్వం 8.2 శాతం వరకు వడ్డీ చెల్లిస్తోంది.

ఈ పథకంలో, సీనియర్ సిటిజన్లు కలిసి రూ.15 లక్షలు పెట్టుబడి పెడితే త్రైమాసికానికి రూ.10,250 సంపాదించవచ్చు. 5 సంవత్సరాలలో వడ్డీ ఆదాయం రూ. 2 లక్షలు ఉంటుంది. ఒక వ్యక్తి గరిష్టంగా రూ. 30 లక్షలు పెట్టుబడి పెడితే, అతనికి రూ. 2,46,000 వడ్డీ వస్తుంది. అది నెలకు లెక్కవేసినట్లు అయితే రూ. 20,500 వరకు పొందవచ్చు. మూడు నెలల్లో 61,500 వస్తాయి. సంవత్సరానికి 8.2 శాతం వడ్డీ. వడ్డీ మొత్తం ప్రతి 3 నెలలకు అందుబాటులో ఉంటుంది. ప్రతి సంవత్సరం ఏప్రిల్, జూలై, అక్టోబర్ మరియు జనవరి మొదటి రోజున వడ్డీ వస్తుంది. ఈ స్కీమ్ కి సంబంధించిన పూర్తి వివరాల కోసం మీ సమీపంలో ఉన్న పోస్టాఫీస్ ను సంప్రదించవచ్చు.

China News: అప్పులున్నోళ్లకి చైనా కొత్త శిక్షలు.. కిమ్ మామే బెటర్ అనుకుంట..!!

Bad Debts: ప్రపంచ శక్తిగా ఎదిగిన చైనా సంచలన నిర్ణయాలు తీసుకోవటం వాటిని అమలు చేయటంలో దిట్ట. కరోనా తర్వాత ఏర్పడిన ఆర్థిక అస్థిరతలు చైనా ఆర్థిక వ్యవస్థను అప్పుల కుప్పలుగా మార్చేశాయి. పెద్దపెద్ద కంపెనీలు సైతం ఈ క్రమంలో కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చైనా తాజాగా మరో సంచలనంతో ముందుకొచ్చింది.

చైనాలోని ప్రజలు తమ అప్పులను తీర్చటంలో విఫలమైతే ప్రస్తుతం అష్టకష్టాలు ఎదుర్కోక తప్పదని తెలుస్తోంది. అక్కడి ప్రభుత్వం లోన్ డిఫాల్ట్ అయిన వ్యక్తులకు హైస్పీడ్ రైలు సేవలు, విలాసవంతమైన హోటళ్లలో స్టేతో పాటు ఇతర ఖర్చుల పరిమితులు వంటి తీవ్రమైన పరిమితులను ఎదుర్కోనున్నారు. తాజా చర్యలతో క్విన్ హువాంగ్‌షెంగ్ కథల్లో మాదిరిగా చైనా తన ప్రజల విషయంలో సాంప్రదాయ పద్ధతులను అవలంభిస్తోందని తెలుస్తోంది.

చైనా కఠినమైన చర్యలు వ్యక్తిగత జీవితాలను ప్రభావితం చేయటంతో పాటు ఆర్థిక వ్యయాలకు ఆటంకం కలిగిస్తున్నాయి. చైనా ప్రభుత్వం మిలియన్ల మంది వ్యక్తులకు వివిధ సేవలు, విలాసాల నుంచి నిరోధించి. వారిని బ్లాక్ లిస్ట్‌లో ఉంచింది. ఇది 2019 చివరి నుంచి దాదాపు 50% పెరిగిందని సమాచారం. అమెరికా వంటి దేశాలతో పోల్చితే చైనాలో వ్యక్తిగత దివాలా చట్టాలు మరింత కఠినంగా ఉంటాయి. అప్పుల బాధలో ఉన్న వ్యక్తులు కొత్తగా ప్రారంభించే సామర్థ్యాన్ని పరిమితం చేస్తాయి. ఈ పద్ధతి అన్యాయమని కొందరు చైనీస్ నిపుణులు అక్కడి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. చైనాలో వ్యక్తిగత రుణాల పెరుగుదలకు హౌసింగ్ బూమ్ కారణంగా ఉంది. జప్తు చేయబడిన గృహాలు, క్రెడిట్ కార్డ్‌లపై ఆధారపడటం పెరుగుతోంది. ప్రస్తుతం చైనాలో బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రభుత్వ నియంత్రణ US తరహా ఆర్థిక సంక్షోభానికి బఫర్‌గా పనిచేస్తుంది. చైనా తన ఆర్థిక వ్యవస్థను రియల్ ఎస్టేట్ నుండి వ్యక్తిగత వ్యయానికి మార్చడానికి ప్రయత్నిస్తుండగా.. డిఫాల్టర్లపై శిక్షాత్మక చర్యలు బ్లాక్ మార్కెట్‌ను సృష్టిస్తున్నాయి. సంపద పంపిణీని మరింత సమానం చేసే వ్యక్తిగత దివాలా వ్యవస్థ కోసం పిలుపునిస్తున్నాయి .

Gold Price Today: బంగారం ధర పై పైకే.. ఇక కొనలేమా..!

పెరుగుతోన్న బంగారం ధరతో సామాన్యులు బెంబలెత్తుతున్నారు. ప్రస్తుతం సామాన్యులు బంగారం కొనలేని పరిస్థితి ఏర్పడింది. ధరలు అంతగా పెరిగిపోయాయి. బంగారంపై పెట్టుబడి సురక్షితమని భావించిన పెట్టుబడిదారులు పుత్తడిపై పెట్టుబడి పెడుతున్నారు. మరోవైవు పెళ్లిళ్ల సీజన్ కావడంతో దేశీయంగా బంగారానికి డిమాండ్ పెరిగింది. దీంతో స్వర్ణం ధర పరుగులు పెడుతోంది. శనివారం హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,350 గా ఉంది.

10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 68,160గా ఉంది. ఇక వెండి ధర కిలో 89,900 పైగా కొనసాగుతోంది. బంగారం ధర పెరగడానికి అంతర్జాతీయ కారణాలు ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ భయాలు పెరుగుతున్న నేపథ్యంలో మధ్యప్రాచ్య ప్రాంతంలో పెరుగుతున్న భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తత మధ్య, బంగారం ధరలు వరుసగా ఆరవ వారంలో అధిక స్థాయికి చేరుకున్నాయి. ఆసక్తికరంగా యూఎస్ డాలర్ ధరలు పెరుగుతున్నప్పటికీ, సురక్షితమైన స్థావరం డిమాండ్‌తో బంగారం, వెండి ధరలు పెరిగుతోన్నాయి.

కమోడిటీ మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇరాన్‌లో ఇజ్రాయెల్ చేసిన డ్రోన్ వైమానిక దాడుల గురించి ఆరోపించిన నివేదికల తర్వాత మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న భౌగోళిక-రాజకీయ ప్రమాదం కారణంగా ఈ రోజు బంగారం ధర అప్‌ట్రెండ్‌లో ఉంది. ఇరాన్-ఇరాక్ యుద్ధ భయం, పెరుగుతున్న యూఎస్ డాలర్ రేట్లు కారణంగా పుత్తడి ధర పెరుగుతోంది. అయితే MCX బంగారం ధర ఈరోజు 10 గ్రాముల విస్తృత పరిధి రూ.72,300 నుంచి రూ. 73,300 వరకు ఉందని నిపుణులు పేర్కొన్నారు.

Everest Masala: ‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశించిన ఎస్‌ఎఫ్‌ఏ..!

Everest Masala : ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలా.. భారతదేశం నుండి విదేశాలకు ఎక్కువగా ఎగుమతి చేసుకుంటున్న ప్రముఖ మసాలా మిశ్రమం. దీని తయారీపై ఇప్పుడు విదేశాల్లో సంచలనాత్మక ఆరోపణలు వచ్చాయి. భారతదేశం నుంచి దిగుమతి చేసుకున్న ‘ఎవరెస్ట్‌ చేపల కూర మసాలా’లో పరిమితికి మించి పురుగుమందు అవశేషాలు ఉన్నట్టు సింగపూర్‌ ఫుడ్‌ ఏజెన్సీ (ఎస్‌ఎఫ్‌ఏ) ఆరోపించింది. దీంతో ఫిష్‌ మసాలా ప్యాకెట్లను రీకాల్‌ చేయాలని ఎస్‌ఎఫ్‌ఏ ఆదేశించింది. హాంకాంగ్‌లోని సెంటర్‌ ఫర్‌ ఫుడ్‌ సేఫ్టీ జారీ చేసిన నోటిఫికేషన్‌కు ప్రతిస్పందనగా ఈ చర్య తీసుకున్నట్టు సింగపూర్‌ తెలిపింది.

ఎవరెస్ట్‌ ఫిష్‌ కర్రీ మసాలాలో ఇథిలీన్ ఆక్సైడ్ స్థాయిలు పరిమితికి మించి ఎక్కువగా ఉన్నాయని సూచిస్తూ హాంకాంగ్ ఫుడ్ సేఫ్టీ సెంటర్ నుండి నోటీసు వచ్చింది. ఉత్పత్తులను వెనక్కి తీసుకునే ప్రక్రియ ప్రారంభించాలని ఎస్పీ ముత్తయ్య అండ్‌ సన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు సూచించింది. అయితే ఈ ఆరోపణపై ఎవరెస్ట్‌ కంపెనీ ఇంకా స్పందించలేదని సమాచారం.

SFA ప్రకారం, ఇథిలీన్ ఆక్సైడ్ ఆహారంలో ఉపయోగించడానికి అనుమతి లేదు. సూక్ష్మజీవుల కలుషితాన్ని నిరోధించడానికి సాధారణంగా వ్యవసాయ పనుల్లో దీన్ని ఉపయోగిస్తారని చెప్పింది. తక్కువ స్థాయి ఇథిలీన్ ఆక్సైడ్‌తో కలుషితమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల తక్షణ ప్రమాదం లేనప్పటికీ, దీర్ఘకాలికంగా బహిర్గతం కావడం వల్ల ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. అందువల్ల, పదార్ధం వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించాన్నారు.

ఏపీలో చల్ల.. చల్లగా.! 3 రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు.. ఈదురుగాలులు కూడా.!

ఏపీ ప్రజలకు కూల్ న్యూస్. వచ్చే 3 రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, అక్కడక్కడ ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. అల్పపీడన ద్రోణి ప్రస్తుతం దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి ఉత్తర తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిమీ ఎత్తులో కొనసాగుతోందని స్పష్టం చేసింది. ఇక రాబోయే మూడు రోజులు వాతావరణ వివరాలు ఇలా ఉండనున్నాయి.

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం:-
ఈరోజు:-
తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురు గాలులు(గంటకు 30-40 కి మీ వేగంతో) వీచే అవకాశం ఉంది. వేడి, తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

రేపు:-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురు గాలులు (గంటకు 40 –50 కి మీ వేగంతో)వీచే అవకాశం ఉంది. వేడి, తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

ఎల్లుండి:-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురు గాలులు(గంటకు 30-40 కి మీ వేగంతో)వీచే అవకాశం ఉంది. వేడి మరియు తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-
ఈరోజు, రేపు:-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు(గంటకు 30-40 కి మీ వేగంతో)వీచే అవకాశం ఉంది. వేడి, తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

ఎల్లుండి:-
వాతావరణం పొడి గా ఉండే అవకాశం ఉంది. వేడి, తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

రాయలసీమ:-
ఈరోజు:-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురు గాలులు(గంటకు 50 -60 కిమీ వేగంతో)వీచే అవకాశం ఉంది. వేడి, తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

రేపు:-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురు గాలులు (గంటకు 30-40 కిమీ వేగంతో) వీచే అవకాశం ఉంది. వేడి, తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

ఎల్లుండి:-
వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. వేడి, తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

Pani Puri : పానీపూరీ తింటున్నారా.. అయితే త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యం.. లేదంటే ప్రాణాల‌కే ప్ర‌మాదం..

Pani Puri : మ‌న‌కు సాయంత్రం పూట రోడ్ల ప‌క్క‌న బండ్ల మీద ల‌భించే వివిధ రకాల చిరుతిళ్ల‌ల్లో పానీపూరీ కూడా ఒక‌టి. పానీపూరీ చాలా రుచిగా ఉంటుంది. పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా అంద‌రూ దీనిని ఇష్టంగా తింటూ ఉంటారు. దీనిని ఇష్ట‌ప‌డని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. అయితే నేటి త‌రుణంలో వ్యాపారులు స్వ‌లాభం కోసం అన్నింటిని క‌ల్తీ చేస్తున్నారు. చాలా సార్లు పానీపూరీ విష‌యంలో కూడా ఇలాంటి విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. పానీపూరీని త‌యారు చేసే వారు న‌కిలీ మ‌సాలాల‌ను వాడుతున్నార‌ని అలాగే పానీపూరీలో వేసే నీరు కూడా మురికి నీరు అని క‌లుషిత‌మైన నీటిని పానీపూరీలో ఉప‌యోగిస్తున్నార‌ని అలాగే పూరీ త‌యారీకి వాడే పిండిని కాళ్ల‌తో తొక్కి త‌యారు చేస్తున్నారని ఇలా అనేక ర‌కాల విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. వీటికి సంబంధించిన వార్త‌ల‌ను ఫోటోలు, వీడియోల రూపంలో ఇప్ప‌టికి మ‌నం సోష‌ల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం.

అలాగే పానీపూరీకి సంబంధించిన మ‌రో విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. పానీపూరీ నీళ్ల‌ల్లో యాసిడ్ క‌లిపి అమ్ముతున్నార‌ని తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. నీటిలో యాసిడ్ క‌లప‌డం వ‌ల్ల పానీపూరీ రుచి పెరుగుతుంద‌ని దీంతో త‌రుచూ ప్ర‌జ‌లు పానీపూరీని తిన‌డానికి త‌మ్మ వ‌ద్ద‌కే వ‌స్తారు అనే దురుద్దేశంతో వ్యాపారులు ఇలా చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు. అలాగే మ‌నం తినే పానీపూరీ నీటిలో యాసిడ్ క‌లిపారా లేదా అనే విష‌యాన్ని కూడా చాలా సుల‌భంగా గుర్తించ‌వ‌చ్చ‌ని వారు చెబుతున్నారు. పానీపూరీలో నీటి రంగు చాలా తేలిక‌గా మారితే వారు నీటిలో యాసిడ్ క‌ల‌పార‌ని అర్థం. అలాగే స్టీల్ ప్లేట్ లో గ‌నుక పానీపూరీని ఇస్తే ప్లేట్ పై తెల్ల‌టి గుర్తులు ఏర్ప‌డతాయి. దీనిని బ‌ట్టి కూడా నీటిలో యాసిడ్ క‌ల‌పార‌ని మ‌నం అర్థం చేసుకోవ‌చ్చు. అంతేకాకుండా యాసిడ్ క‌లిపిన పానీపూరీని తిన‌ప్పుడు మ‌న దంతాల‌పై ఒక‌లాంటి పొర ఏర్ప‌డుతుంది. అలాగే గొంతులో చికాకు, మంట‌, క‌డుపులో నొప్పి వంటి స‌మ‌స్య‌లు కూడా త‌లెత్తుతాయి.

క‌నుక ఇటువంటి ల‌క్ష‌ణాల‌ను ఎవ‌రైనా గుర్తిస్తే వెంట‌నే పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో పాటు ప్ర‌జ‌ల‌ను కూడా అప్ర‌మ‌త్తం చేయ‌డం మంచిది. వీటితో పాటు రుచిగా ఉంది క‌దా అని ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ ఇటువంటి చిరుతిళ్ల‌ను తీసుకోవ‌డం మంచిది కాద‌ని ఇలాంటి నాణ్య‌త‌లేని చిరుతిళ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇలాంటి చిరుతిళ్ల‌ను పిల్ల‌ల‌కు ఇవ్వ‌డం వ‌ల్ల వారి భ‌విష్య‌త్తును మ‌నం నాశ‌నం చేసిన వాళ్లం అవుతామ‌ని క‌నుక వీలైనంత వ‌ర‌కు ఇంట్లోనే వీటిని త‌యారు చేసి తీసుకోవ‌డం మంచిద‌ని వారు చెబుతున్నారు.

Drinking Water : తాగే నీటిలో ఈ ఒక్క‌టి క‌లిపి తాగండి చాలు.. మీరు ఎక్క‌డున్నా ఆరోగ్యం మాత్రం సేఫ్‌గా ఉంటుంది..!

Drinking Water : ప్ర‌కృతిలో ఇత‌ర జీవ‌రాశులు, జంతువులు వాటికి శ‌రీరంలో న‌ల‌త‌గా ఉన్న‌ప్పుడు నీటిని తాగి విశ్రాంతిని తీసుకుంటాయి. ఇత‌ర ఆహారాల జోలికి అవి వెళ్ల‌వు. ఇలా నీటిని తాగి విశ్రాంతి తీసుకోవ‌డం శ‌రీరంలో త‌లెత్తిన ఇబ్బంది వెంట‌నే తగ్గుతుంది. శ‌రీరంలో ఎక్క‌డైతే స‌మ‌స్య త‌లెత్తిందో ఆ స‌మ‌స్య‌ను త‌గ్గించ‌డానికి శ‌రీర‌మంతా ఆ భాగం కేంద్రంగా ప‌ని చేస్తుంది. దీంతో స‌మ‌స్య వెంట‌నే త‌గ్గుతుంది. అలాగే నీటిని తాగ‌డం వ‌ల్ల ఆ భాగాన్ని రిపేర్ చేసే స‌మ‌యంలో వెలువ‌డిన ర‌సాయ‌నాలు, వ్య‌ర్థాలు నీటి ద్వారా బ‌య‌ట‌కు పోతాయి. శ‌రీరంలో ఏర్ప‌డిన ఈ వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపించ‌డంలో కాలేయం ముఖ్య పాత్ర పోషిస్తుంది. నీటిని తాగ‌క‌పోతే శ‌రీరంలో ఏర్ప‌డిని వ్య‌ర్థాల‌ను కాలేయం బ‌య‌ట‌కు పంపించ‌లేదు. కాలేయంలో డిటాక్సిఫికేష‌న్ ప్ర‌క్రియ ఆగిపోతుంది. కనుక జంతువులు శ‌రీరంలో అనారోగ్యం త‌లెత్తిన‌ప్పుడు కేవ‌లం నీటిని మాత్ర‌మే తాగి త‌గిన విశ్రాంతి తీసుకుంటాయి.

దీంతో ఎటువంటి మందులు వాడే అవ‌స‌రం లేకుండా వాటంత‌ట అవే తిరిగి కోలుకుంటాయి. ఇలా ప్ర‌కృతి అంతా చేస్తున్న‌ప్ప‌టికి మ‌నం మాత్రం చిన్న‌ అనారోగ్య స‌మ‌స్య క‌ల‌గ‌గానే మందులు మింగి దానిని న‌యం అయ్యేలా చేస్తున్నాము. కానీ ఇది మంచి పద్ద‌తి కాదు. క‌నుక మ‌నం కూడా చిన్న చిన్న స‌మ‌స్య‌లు అన‌గా జ‌లుబు, ద‌గ్గు, గొంతు ఇన్పెక్షన్, జ్వ‌రం, టానిల్స్, నోరు చేదుగా ఉండ‌డం, ఆక‌లి లేక‌పోవ‌డం వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న‌ప్పుడు శ‌రీరం చెప్పిన‌ట్టుగా మ‌నం విన‌డం మంచిది. శ‌రీరానికి ఆహారం తీసుకోకుండా విశ్రాంతి ఇవ్వ‌డం వ‌ల్ల శ‌రీరంలో రిపేర్ మ‌రియు క్లీనింగ్ చ‌క్క‌గా జ‌రుగుతుంది. దీంతో శ‌రీరంలో న‌ల‌త‌కు కార‌ణ‌మై వైర‌స్, బ్యాక్టీరియాల‌పై తెల్ల ర‌క్త‌క‌ణాలు దాడి చేసి స‌మస్య‌ను త్వ‌ర‌గా త‌గ్గిస్తాయి. మ‌నం కూడా శ‌రీరంలో న‌ల‌త‌గా ఉన్న‌ప్పుడు రోజంతా నీటిని తాగుతూ విశ్రాంతి తీసుకుంటూ ఉండ‌వ‌చ్చు. ఒక‌వేళ బ‌య‌ట తిరిగే వారు అయితే మ‌ధ్య మ‌ధ్య‌లో నీటిలో తేనె, నిమ్మ‌ర‌సం క‌లిపి కూడా తీసుకోవ‌చ్చు. దీంతో నీరసం రాకుండా ఉంటుంది. ఒక‌వేళ జ‌లుబు, ద‌గ్గు వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌పడే వారు అయితే కాచి చ‌ల్లార్చిన నీటిని తాగ‌డం మంచిది.

అయితే కొంద‌రు నీటికి బ‌దులుగా జావ‌లు, పండ్ల ర‌సాలు, మ‌జ్జిగ వంటి వాటినితాగుతూ ఉంటారు. కానీ వీటిని కూడా తీసుకోకుండా కేవ‌లం మంచి నీటిని తాగి ఉండ‌డ‌మే మంచిద‌ని నిపుణులు చెబుతున్నారు. అలాగే స‌మ‌స్య త‌లెత్తిన త‌రువాత లంక‌నం చేయ‌డం కంటే స‌మ‌స్య త‌లెత్తే ముందే మ‌న‌లో కొన్ని ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. ఈ ల‌క్ష‌ణాలు క‌నిపించిన వెంట‌నే నీటిని తాగి లంక‌నం చేయ‌డం వ‌ల్ల స‌మ‌స్య తీవ్రంగా మార‌కుండా ఉంటుంది. ఇలా నీటిని తాగే స‌మ‌యంలో బాగా నీర‌సంగా ఉంది అనుకున్న వారు ఒక గ్లాస్ నీటిలో 4 నుండి 5 స్పూన్ల తేనె, నిమ్మ‌రసం క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల త‌క్ష‌ణ శ‌క్తి ల‌భిస్తుంది. క‌నుక ఇలా చిన్న చిన్న అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న‌ప్పుడు మందులు మింగ‌డానికి బ‌దులుగా కేవ‌లం నీటిని తాగి విశ్రాంతి తీసుకోవ‌డం వ‌ల్ల మందులు వాడే అవ‌స‌రం లేకుండా స‌మ‌స్య నుండి స‌హ‌జ సిద్దంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

Beerapottu Pachi Karam : కమ్మ‌ని బీర‌పొట్టు ప‌చ్చికారం.. ఒక్క‌సారి అయినా స‌రే ట్రై చేయండి..!

Beerapottu Pachi Karam : మ‌నం బీర‌కాయ‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. బీరకాయ‌ల‌తో చేసే వంటకాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. బీర‌కాయ‌ల‌తోనే కాకుండా బీర‌పొట్టుతో కూడా మ‌నం ప‌చ్చడిని త‌యారు చేస్తూ ఉంటాము. బీర‌పొట్టుతో ప‌చ్చ‌డినే కాకుండా మ‌నం కారంపొడిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. బీర‌పొట్టుతో చేసే ఈ కారం పొడి కూడా చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఈ కారంపొడిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం.చాలా మందిబీర‌కాయ పొట్టును ప‌డేస్తూ ఉంటారు. కానీ బీర‌కాయ పొట్టులో ఎన్ఓ పోష‌కాలు, ఆరోగ్య‌ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. క‌నుక దీనిని కూడా ఆహారంగా తీసుకోవ‌చ్చు. మ‌న‌కు ఎంతో మేలు చేసే బీర‌కాయ పొట్టుతో కారంపొడిని ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

బీర‌పొట్టు ప‌చ్చికారం పొడి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బీర‌కాయ‌లు – అర‌కిలో, ప‌ల్లీలు – ఒక‌టిన్న‌ర టేబుల్ స్పూన్, నువ్వులు – ఒక టేబుల్ స్పూన్, ధ‌నియాలు – ఒక టీ స్పూన్, ప‌చ్చిమిర్చి – 5 లేదా 6, నూనె – ఒక‌టిన్న‌ర టేబుల్ స్పూన్, మిన‌ప‌ప్పు – అర టేబుల్ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, దంచిన వెల్లుల్లి రెమ్మ‌లు – 5, ఇంగువ – పావు టీ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, కారం – కొద్దిగా.

బీర‌పొట్టు ప‌చ్చికారం పొడి త‌యారీ విధానం..

ముందుగా బీరకాయ‌ల‌ను శుభ్రంగా క‌డిగి వాటి పొట్టును తీసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో ప‌ల్లీలు వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇవి చ‌ల్లారిన త‌రువాత పొట్టు తీసి ప‌క్కకు ఉంచాలి. త‌రువాత అదే క‌ళాయిలో నువ్వులు, ధ‌నియాలు వేసి వేయించి జార్ లోకి తీసుకోవాలి. ముందుగా వీటిని మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకున్న త‌రువాత ప‌ల్లీలు వేసి మ‌రీ మెత్త‌గా కాకుండా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత అదే జార్ లో ముందుగా ప‌చ్చిమిర్చి వేసి మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత బీర‌కాయ పొట్టు వేసి మిక్సీ ప‌ట్టుకోవాలి. ఇది మ‌రీ మెత్త‌గా కాకుండా బ‌ర‌క‌గా ఉండేలా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక మిన‌ప‌ప్పు వేసి వేయించాలి. త‌రువాత ఆవాలు, జీల‌క‌ర్ర‌, కరివేపాకు, వెల్లుల్లి రెమ్మ‌లు వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత ఇంగువ‌, ప‌సుపు వేసి వేయించాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న బీర పొట్టు వేసి వేయించాలి. దీనిని క‌లుపుతూ పూర్తిగా వేయించిన త‌రువాత ఉప్పు, కారం వేసి క‌ల‌పాలి. దీనిని ఒక నిమిషం పాటు వేయించిన త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న పొడి వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బీర‌పొట్టు ప‌చ్చికారం పొడి త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, రోటి వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా బీరపొట్టుతో తయారు చేసిన ఈ పొడిని తీసుకోవ‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు.

Nandamuri Balakrishna : తారకరత్న పిల్లలతో బాలయ్య, మోక్షజ్ఞ.. ఫోటో వైరల్..

Nandamuri Balakrishna : నందమూరి తారకరత్న చనిపోయిన తరువాత ఆయన కుటుంబ భాద్యతని బాలకృష్ణ తీసుకున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే వారి బాగోగులు చూసుకుంటూ, వారిని అప్పుడప్పుడు కలుస్తూ.. వారికీ తాను ఉన్నానన్న ధైర్యాన్ని ఇస్తూ వస్తున్నారు. తాజాగా కూడా బాలయ్య, తారకరత్న కుటుంబాన్ని కలుసుకున్నారు. బాలయ్యతో పాటు ఆయన తనయుడు మోక్షజ్ఞ కూడా తారకరత్న కుటుంబంతో కనిపించారు.

తారకరత్న పిల్లలతో బాలయ్య, మోక్షజ్ఞ ఉన్న ఫోటోని తారకరత్న భార్య అలేఖ్య తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. “నేను ఏ వైపు ఉన్నానని నన్ను ఎప్పుడూ అడుగుతూ వస్తున్నారు. దానికి సమాధానం ఏంటంటే.. మానవత్వం, ప్రేమ, ముఖ్యంగా నా కుటుంబం వైపు ఉన్నాను. మావయ్య (బాలయ్య) మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఓబు, పిల్లలు మరియు నేను మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాము” అంటూ పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసుకొచ్చారు.
ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇక షేర్ చేసిన ఫొటోలో మోక్షజ్ఞ, బాలయ్య, తారకరత్న కుటుంబమంతా కలిసి కనిపించడంతో నందమూరి అభిమానులు ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఈ ఫోటోని నెట్టింట షేర్ చేస్తూ తమ సంతోషాన్ని తెలియజేస్తున్నారు. మరికొంతమంది బాలయ్యని ప్రశంసలతో అభినందిస్తున్నారు. కొంతమంది మాటవరసకు చెప్పి వదిలేస్తారు. కానీ బాలయ్య.. తారకరత్న కుటుంబం విషయంలో చేస్తున్నది ప్రశంసనీయం అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

IPL 2024 : కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్‌లకు బిగ్ షాకిచ్చిన బీసీసీఐ

IPL 2024 LSG vs CSK : ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా శుక్రవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్ మధ్య ఎకానా స్టేడియంలో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో లక్నో సొంతగడ్డపై ఎనిమిది వికెట్ల తేడాతో చెన్నై జట్టును ఓడించింది. లక్నో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (57) పరుగులు చేశాడు. చివర్లో ధోనీ సిక్సులు, ఫోర్లతో లక్నో బౌలర్లపై విరుచుకుపడ్డారు. దీంతో తొమ్మిది బంతుల్లో 28 పరుగులు చేశాడు. 177 పరుగుల లక్ష్యంతో లక్నో జట్టు బ్యాటింగ్ ప్రారంభించగా.. డికాక్ (54), కేఎల్ రాహుల్ (82) రాణించడంతో 19 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్నో జట్టు 180 పరుగులు చేసి విజయం సాధించింది.

ఈ మ్యాచ్ లో ఇరు జట్ల కెప్టెన్లు కేఎల్ రాహుల్, రితురాజ్ గైక్వాడ్ లకు బీసీసీఐ షాకిచ్చింది. స్లో ఓవర్ రేటు కారణంగా ఇద్దరికి జరిమానా విధించింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం రాహుల్, గైక్వాడ్ లు చేసిన మొదటి తప్పుకారణంగా.. ఇద్దరికీ రూ. 12లక్షలు జరిమానాను బీసీసీఐ విధించింది. ఇప్పటికే ఈ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్, కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ లకు కూడా జరిమానా విధించిన విషయం తెలిసిందే.

Syed Abdul Rahim Real Story: ఒక రొనాల్డో.. ఒక మెస్సీ .. ఇద్దరినీ తలదన్నే తెలుగోడి కథ

The 1950s and 60s are often referred to as the golden era in Indian football. Not only did the Indians win the gold in football at the 1951 and 1962 Asian Games, they also finished fourth at the 1956 Melbourne Olympics – their best-ever finish at the Games.

Tulsidas Balaram, Chuni Goswami, P.K. Banerjee, Jarnail Singh, Pradyut Barman, Prasanta Sinha, Peter Thangaraj… the list of legends was long. But the man in charge of these ‘Galacticos’ was a certain Syed Abdul Rahim, then considered to be one of Asia’s finest coaches.

The slightly-built but astute tactician is set to be immortalised on the silver screen with Maidaan by director Amit Sharma of Badhaai Ho fame. Starring Ajay Devgn and Priyamani among others, and co-produced by Boney Kapoor, Akash Chawla and Arunava Joy Sengupta, the biopic will be released in Hindi, Tamil, Malayalam and Telugu. Actor Keerthy Suresh will be making her debut in the Hindi film industry with this film, the music of which has been composed by the legendary, A.R. Rahman. The film’s release has been postponed several times because of multiple reasons since 2021, and is finally expected to hit the theatres in July.

Rahim was considered the best football coach India ever had not just for the trophies or medals India won under him, but his revolutionary vision and tactics. The film deals with the earlier-mentioned golden era of Indian football and how he moulded the star-studded team into a world-class unit. It also charts the rise of Rahim from a teacher-turned-physical education instructor to the face and soul of Indian football.

Born in 1909 in Hyderabad, Rahim took to football in school and never looked back. According to ‘Box to Box – 75 years of the Indian Football Team’, he got a BA degree from Osmania University, and taught history and geography in Darul Uloom High School. He also obtained a degree in physical education while he was switching schools in the state.

But his first love remained football. He played as an inside forward and was a prolific goalscorer and a good dribbler, the book says. Even as an administrator, he had an impeccable record. He was the secretary of the Hyderabad Football Association (renamed Andhra Pradesh Football Association in 1959) for 20 years, and spread the game throughout the state. He introduced several tournaments like the Nizam Gold Cup and encouraged the one-touch playing style. As a coach, it was Rahim who shaped the Hyderabad City Police team into a formidable side, which won the Rovers Cup five years in a row in the 50s and the Durand Cup four times.

His success with the Hyderabad team earned him the job of the Indian team coach. Rahim managed the Indian team from 1950 to 1963, with the 1962 Asiad triumph in Jakarta being one of the finest moments of a great coaching career. He is said to have used the 4-2-4 system with the Indian team before Brazil popularised it at the 1958 World Cup.

Rahim, who was a chain smoker, succumbed to cancer at just 53. He had three sons and as many daughters. His eldest son, S.S. Hakim, represented India at the 1960 Rome Olympics.

Watch the video

ధమాకా ఆఫర్: 25 వేలకే 50 ఇంచ్ Smart Tv అందుకోండి.!

ధమాకా ఆఫర్: చౌక ధరలో పెద్ద స్మార్ట్ టీవీ కొనాలనుకునే వారికి ఈరోజు గొప్ప ఆఫర్ అందుబాటులో ఉంది. ప్రముఖ జర్మన్ బ్రాండ్ బ్లూపంక్ట్ సరికొత్తగా తీసుకొచ్చిన 50 ఇంచ్ స్క్రీన్ స్మార్ట్ టీవీ ఈరోజు భారీ డిస్కౌంట్ తో చవక ధరకే లభిస్తోంది.

ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తున్న ఈ స్మార్ట్ టీవీ డీల్ పైన ఒక లుక్కేద్దామా.

Smart Tv Offer

జర్మన్ బ్రాండ్ బ్లూపంక్ట్ స్మార్ట్ టీవీ పైన ఈరోజు Flipkart ఈ అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. అందుకే ఈ స్మార్ట్ టీవీ ఈరోజు చవక ధరకే లభిస్తుంది. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీ పైన గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా ఫ్లిప్ కార్ట్ అందించింది.

ఇక ఈ ఆఫర్ విషయానికి వస్తే, Blaupunkt CyberSound G2 Series నుండి లాంఛ్ చేసిన 50 ఇంచ్ UHD (4K) గూగుల్ స్మార్ట్ టీవీ 2023 సిరీస్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి 38% డిస్కౌంట్ తో సేల్ అవుతోంది. ఈ డిస్కౌంట్ తరువాత ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 25,999 రూపాయల ధరకే లభిస్తోంది. ఈ టీవీ ని HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI తో కొనేవారికి రూ. 1,500 అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

అలాగే, HSBC Bank Credit Card EMI ఆప్షన్ తో కొనే వారికి రూ. 1,750 రూపాయల అధనపు డిస్కౌంట్ లభిస్తుంది. అంటే, ఈ బ్లూపంక్ట్ స్మార్ట్ టీవీని మరింత చవక ధరకే అందుకునే అవకాశం వుంది.

Blaupunkt CyberSound G2: ప్రత్యేకతలు

బ్లూపంక్ట్ యొక్క ఈ బిగ్ స్మార్ట్ టీవీ మీడియాటెక్ క్వాడ్ కోర్ ప్రోసెసర్ మరియు HDR 10+ సపోర్ట్ తో గొప్ప విజువల్స్ ను అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ సన్నని అంచులు కలిగి స్టైలిష్ లుక్ తో కనిపిస్తుంది. ఈ టీవీ లో 2GB RAM మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ ఉన్నాయి.

ఈ స్మార్ట్ టీవీ 3 HDMI, 2 USB, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి వుంది. ఈ టీవీ 60W హెవీ సౌండ్ అందించ గల స్పీకర్లను మరియు Dolby Atmos సౌండ్ సపోర్ట్ లను కలిగి వుంది.

ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..

మీ ఆధార్ కార్డు అప్ డేట్ చేసుకుంటున్నారా?..ఆధార్ కార్డులో పేరు, చిరునామా, ఫొటో లేదా ఏదైనా ఇతర సమాచారాన్ని అప్ డేట్ చేయడానికి కొంత చెల్లించాల్సి ఉంటుంది.

డెమోగ్రాఫిక్ అప్డేట్ , బయోమెట్రిక్ అప్డేట్ ప్రకారం ఫీజు ఉంటుంది.

ఆధార్ ఆప్డేట్ ఛార్జీలు

వేలిముద్రల మార్పు లేదా కంటి స్కాన్కోసం రూ. 100 ఛార్జీలు వసూలు చేస్తారు. పేరు, పుట్టిన తేదీ, చిరునామా మార్చుకుంటే రూ. 50 చెల్లించాల్సి ఉంటుంది. మీరు రెండింటినీ మార్చాలనుకుంటే రెండు రకాల ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్కు వెళ్లి రూ. 30 చెల్లించడం ద్వారా వారి ఈ-ఆధార్ కార్డు ప్రింటెడ్ వెర్షన్ను పొందవచ్చు. మొదటిసారి ఆధార్కోసం నమోదు చేసుకుంటే ఎటువంటి ఛార్జీలు వర్తంచవు. అంతేకాకుండా ఐదు నుంచి పది హేను సంవత్సరా మధ్య వయసున్న పిల్లలకు బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేయడం ఉచితం.

అయితే ఆధార్ కార్డును ఆన్లైన్లో అప్డేట్ చేసుకుంటే పూర్తిగా ఉచితం. అప్డేట్ చేయాల్సిన సమాచారాన్ని ధృవీకరించేందుకు అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించాలి. ఇంతకుముందు ఉచిత ఆధార్ కార్డు పునరుద్దరణకు మార్చి 14 వరకు గడువు ఉంది. కానీ ఇప్పుడు ఉచిత ఆన్లైన్ డాక్యుమెంట్ అప్లోడ్ సదుపాయాన్ని UIDAI జూన్ 14, 2024 వరకు పొడిగింది.

కనీసం పదేళ్లకు ఒకసారి ఆధార్ సమాచారాన్ని అప్డేట్ చేయాలని UIDAI సూచిస్తుంది.

TS inter results update : ఇంటర్ విద్యార్థులకు కీలక అప్ డేట్.. ఫలితాలు వచ్చేది అప్పుడే!

తెలంగాణలో ఇంటర్మీడియట్‌ పరీక్ష ఫలితాలను (TS Inter Results 2024)  బుధవారం (ఏప్రిల్‌ 24) విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ ఫలితాలు ఒకేసారి ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి శృతి ఓజా విడుదల చేస్తారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియట్‌ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ప్రథమ, ద్వితీయ ఇంటర్‌ పరీక్షలకు 9,80,978 మంది విద్యార్థులు హాజరయ్యారు. మార్చి 10 నుంచి ఏప్రిల్‌ 10 మూల్యాంకనం జరిగింది. ఈ ఫలితాలను https://pratibha.eenadu.net/ వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి..

Eenadu Results links

Jr.INTER General Vocational
Sr.INTER General Vocational

 

 

Sakshi website Results Link

Mana Badi REsults LINK

 

 

 

 

 

తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదల తేదీపై స్పష్టత వచ్చింది. ఈ బుధవారం (ఏప్రిల్ 24న) విడుదల చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలను ఉదయం 11 గంటలకు అధికారులు వెల్లడించనున్నారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 తేదీల మధ్య ఇంటర్మీడియట్‌ పరీక్షలను ప్రభుత్వం నిర్వహించింది. రెండు సంవత్సరాలకు కలిపి 9,80,978 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మార్చి 10 నుంచి ఈనెల 10 తేదీల మధ్య మూల్యాంకనాన్ని పూర్తి చేశారు.

గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం 15 రోజుల ముందుగానే ఫలితాలు ప్రకటించబోతున్నారు. 2023లో మే 9న రిజల్ట్స్ వచ్చాయి. ఈసారి మార్కుల నమోదులో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా అధికారులు పకడ్బంధీ చర్యలు తీసుకున్నారు. జవాబు పత్రాలను మూడు సార్లు పరిశీలించారు. కోడింగ్‌, డీకోడింగ్‌ ప్రక్రియలను జాగ్రత్తగా పూర్తిచేశారు.

ఈ నెల 30న లేదా మే 1న పది ఫలితాలు..
10వ తరగతి ఫలితాల విడుదలపై కూడా విద్యాశాఖ కసరత్తులు చేస్తోంది. ఈ నెల 30 లేదా మే 1న ఫలితాలు వెల్లడించాలని విద్యాశాఖ యోచిస్తోంది. ఇంటర్‌, పదో తరగతి పరీక్ష ఫలితాల విడుదలకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల కోడ్‌ అమలులో ఉండడంతో మంత్రులు కాకుండా విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేయనున్నారు. కాగా పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకు జరిగాయి. 5,08,385 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మూల్యాంకనం శనివారం పూర్తయింది. డీకోడింగ్‌ అనంతరం ఫలితాలు వెల్లడించానున్నారు.

 

ఇంటర్ విద్యార్థులకు పరీక్షల కాలం ముగిసింది. మంచి మార్కులు సాధించేందుకు కష్టపడి చదివి పరీక్షలు రాసిన స్టూడెంట్స్ ఇప్పుడు కాస్త రిలాక్స్ అవుతున్నారు. ఇంటర్ తర్వాత ఏ కోర్సులు చేయాలి.. లైఫ్ లో త్వరగా సెటిల్ అవ్వాలంటే ఏ కోర్స్ బెస్ట్ అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. ఇక ఇప్పుడు మిగిలింది రిజల్ట్స్ మాత్రమే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఇంటర్ విద్యార్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్ స్టూడెంట్స్ కు ఇంటర్ బోర్డ్ కీలక అప్ డేట్ ఇచ్చింది. ఫలితాలు అప్పుడే ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

పరీక్షలు రాసేటపుడు కంటే ఫలితాలు విడుదలయయ్యే రోజే స్కూడెంట్స్ కొంత టెన్షన్ కు గురవుతుంటారు. ఆశించిన మార్కులు వస్తాయో లేదో అని అటు తల్లిదండ్రులు, విద్యాసంస్థల యాజమాన్యాలు ఆందోళన చెందుతుంటాయి. ఇక లక్షలాదిమంది ఇంటర్ విద్యార్థుల భవితవ్యం త్వరలోనే తేలనుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ వార్షిక పరీక్ష ఫలితాలు వారంరోజుల్లోపే వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే మూల్యాంకనం పూర్తికాగా.. ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. ఏప్రిల్ 23 లేదా 24న ఫలితాలను వెల్లడించనున్నారు. గతంలో జరిగిన తప్పులు మళ్లీ రిపీట్ కాకుండా మార్కుల నమోదుతో పాటు ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఒకేసారి ఇంటర్‌ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలను ప్రకటించనున్నారు అధికారులు. అయితే ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈసీ అనుమతి తీసుకుని ఫలితాలను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. దాదాపు 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో.. 4,78,527 మంది మొద‌టి సంవత్సరం విద్యార్థులు కాగా.. 4,43,993 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నారు.

సూపర్ హిట్ థ్రిల్లర్ మంజుమ్మల్ బాయ్స్.. OTT రిలీజ్ డేట్ ఫిక్స్!

ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్ రంగాన్ని ఓటీటీ ఏలేస్తుంది. థియేటర్లో రిలీజ్ అయిన కొత్త సినిమా నెల లోపే ఓటీటీలో ప్రత్యక్షం అవుతున్నాయి. భారతీయ చిత్రాలే కాదు.. ఇతర భాషా చిత్రాలు, వెబ్ సీరీస్ కూడా రిలీజ్ అవుతున్నాయి. క్రైమ్ థ్రిల్లర్, హర్రర్, కామెడీ ఇలా అన్ని జోనర్ లో రిలీజ్ అవుతున్న మూవీస్, వెబ్ సీరీస్ భాషతో సంబంధం లేకుండా ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మధ్య కొంతమంది నిర్మాతలు డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. మాలీవుడ్ లో ఇటీవల రిలీజ్ అయిన మంజుమ్మెల్ బాయ్స్ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తుంది. స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడు అన్న విషయం గురించి తెలుసుకుందాం.

ఇటీవల చిన్న సినిమాలు సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. కంటెంట్ నచ్చితే ఎలాంటి సినిమాలైనా ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. సుమారు రూ.5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ మూవీ దాదాపు రూ.200 కోట్లకు పైగా వసూళ్లు చేసి రికార్డ్ క్రియేట్ సృష్టించింది. చిదంబరం దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ తెలుగు లో ఏప్రిల్ 6న థియేటర్లలోకి వచ్చింది. అంచనాలకు మించి తెలుగు లో కూడా బాక్సాఫీస్ కలెక్షన్లు రాబట్టింది. ప్రస్తుతం థియేట్రికల్ రన్ ఇంకా కొనసాగుతుండటంతో ఓటీటీ రిలీజ్ ఆలస్యం అవుతూ వస్తుంది. ఇప్పటి వరకు ఓటీటీ రిలీజ్ ఈదిగో.. అదిగో అంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ పై ఓ క్లారిటీ వచ్చింది.

ఇటీవల మలీవుడ్ లో రిలీజ్ అవుతున్న చిన్న సినిమాలు బాక్సాఫీస్ షేక్ చేస్తున్నాయి. ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్ లాంటి సినిమాలు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ కావడంతో కలెక్షన్లు కూడా భారీగా రాబట్టాయి. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిస్నీ+ హాట్‍స్టార్ మంజుమ్మెల్ బాయ్స్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు సొంతం చేసుకుంది. వచ్చే నెల మే 3న మలయాళం, తెలుగు తో పాటు మరిన్ని డబ్బింగ్ భాషల్లో స్ట్రిమింగ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. మాలీవుడ్ లో రూ.200 కోట్లు వసూళ్లు చేసిన చిత్రంగా సెన్సేషన్ సృష్టించింది మంజుమ్మల్ బాయ్స్ మూవీ. పరవ ఫిలిమ్స్ బ్యానర్ పై బాబు షాహిర్, సౌబిన్ షాహిర్, షాన్ ఆంటోని ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీలో సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ బాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్ పొదువాల్, లాల్ జూనియర్ తదితరులు కీలక పాత్ర పోషించారు. మరి థియేటర్లో చూడని వాళ్లు మే 3 న ఓటీటీలో వీక్షించండి.

Health Benefits : జీవితాంతం వరకు నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పి ఎప్పటికీ రావు.!!

Health Benefits ; ఈ భూమి మీద దొరికే ఎన్నో ఔషధ మొక్కలలో వామాకు ఒకటి. సాధారణంగా వామాకు మొక్క ప్రతి ఇంట్లో సహజంగానే పెరుగుతూ ఉంటుంది. సంబరవల్లి, దొడ్డ పాత్రి తెలుగులో వామకు అని పిలుస్తూ ఉంటారు.
ఈ మొక్కలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నది. ఆయుర్వేద వైద్యంలో ఒక ముఖ్యమైన మౌలికగా దీన్ని ఉపయోగిస్తారు. అప్పుడప్పుడు వాడితే ఆరోగ్యానికి చాలా మంచిదని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. ఈ వామాకు వల్ల ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వామాకు ఆకులను తీసుకుని తేనెలో కలిపి పిల్లలకు పట్టిస్తే అరుగుదల మెరుగుపడుతుంది. శక్తి కూడా బాగా పెరుగుతుంది.

చిన్నపిల్లలకు జలుబు, దగ్గు ఇన్ఫెక్షన్స్ వంటివి వచ్చినప్పుడు వామాకు నీరు మంచి మెడిసిన్ గా ఉపయోగపడుతుంది. ఈ వామాకులో యాంటీ ఆక్సిడెంట్ గుణం ఉన్నది. కాబట్టి గాయాలను తొందరగా తగ్గిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. మలేరియా వంటి తీవ్రమైన ఫీవర్ వచ్చినప్పుడు ఈ కర్పూరలని ఇవ్వడం మంచి పద్ధతి. శరీరంపై కాయలు అయితే తాజాగా దొరికే వామాకులను తీసుకుని శుభ్రంగా కడిగి దంచి ఆ పేస్ట్టు ని అక్కడ పై పూతక పుస్తే వెంటనే తగ్గుముఖం పడుతుంది. బాగా తలనొప్పితో బాధపడేవారు ఈ వామాకుల రసాన్ని తలపై రాసుకోవాలి ఇలా చేయడం వల్ల తలనొప్పి సమస్య నుంచి శాశ్వతంగా బయటపడతారు. మోకాలు నొప్పి నడుము నొప్పి రాకుండా ఉండడం కోసం వామాకు కషాయం చాలా బాగా ఉపయోగపడుతుంది.
ఇప్పుడు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మీరు ఐదు నుంచి పదిని వామాకులను తీసుకుని శుభ్రంగా కడిగి నీటిలో వేసి బాగా మరగబెట్టి తర్వాత ఈ నీటిని వడకట్టుకుని అందులో కొద్దిగా తేనె వేసుకుని తీసుకోవాలి. ఈ విధంగా ఈ కషాయాన్ని తాగినట్లయితే మీరు చనిపోయేంతవరకు నడుము నొప్పి మోకాల నొప్పి ఎప్పటికీ రావు. మీ ఒంట్లో వేడి కారణంగా వస్తే సమస్యల నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది అన్ని సమస్యలు కూడా శాశ్వతంగా నయమైపోతాయి. డైరెక్ట్ గా తీసుకోవడం వల్ల దగ్గు తగ్గుతుంది. దగ్గు తగ్గించడానికి వామాకు సమర్థవంతంగా పనిచేస్తుందని ఇటీవల పరిశోధనలో తేలింది.

Hair Tips : బట్టతలపై వెంట్రుకలు మొలిపించే అద్భుతం.తుంగ గడ్డలు గురించి ఈ విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Hair Tips : బట్టతలపై వెంట్రుకలు మొలిపించే అద్భుతం.తుంగ గడ్డలు గురించి ఈ విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..

ఆయుర్వేదంలో ప్రతి మొక్కలోను ఏదో ఒక ఔషధ గుణం ఉంటుంది. ఆయుర్వేద శాస్త్రంలో కొన్ని కోట్లాది మొక్కల ఔషధ గుణాలు వాటి ఏ ఏ జబ్బులను తగ్గిస్తాయో వివరంగా తెలిపారు.
ప్రతి మొక్క లోను అందులోని పదార్థాలు వాటి లక్షణాలు అవి ఏ ఏ జబ్బులను తగ్గిస్తాయో ఆయుర్వేదంలో వివరంగా ఉంది అలాంటి ఒక అద్భుతమైన మొక్క గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మన పొలం గట్ల మీద ఊరి చివరన ఖాళీ ప్రదేశాల్లోనూ బంజరు స్థలాల్లోనూ కలుపు మొక్కగా పెరిగే తుంగ గడ్డి గురించి ప్రస్తుతం మనం చర్చించుకుందాం. తుంగ గడ్డి అనేది ఓ కలుపు మొక్క గా మనం భావిస్తూ ఉంటాం. ఈ తుంగ గడ్డి భూమి లోపల తుంగ గడ్డలు ఉంటాయి. వీటినే కొన్ని ప్రాంతాల్లో తుంగభటికలు తుంగమస్తలు అని పిలుస్తారు వీటిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి ఈ తుంగ గడ్డలతో ఏ ఏ వ్యాధులు నివారించవచ్చు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ప్రస్తుతం తుంగ గడ్డలు గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.

తుంగ గడ్డలు జాండీస్ కు రామబాణం అనే చెప్పాలి తుంగ గడ్డలతో చేసిన కషాయం తాగితే కామెర్ల వ్యాధి
తగ్గిపోతుంది ముఖ్యంగా కాలేయంలో ఇన్ఫెక్షన్లు ఇతర సమస్యలకు ఈ తుంగ గడ్డ అద్భుతంగా పనిచేస్తుంది ముఖ్యంగా తుంగ గడ్డలను వేడి నీటిలో మరగబెట్టిన తర్వాత ఆ నీటిని తాగితే కాలేయంలో ఇన్ఫెక్షన్ తగ్గి కామెర్లు తగ్గుముఖం పడతాయి.

అలాగే తుంగ గడ్డలను పేస్టుగా చేసి అందులో తేనె కలిపి నాకితే పేగు పూత వ్యాధి తగ్గిపోతుంది. ముఖ్యంగా అల్సర్ సంబంధిత వ్యాధులకు తుంగ గడ్డలు బాగా పనిచేస్తాయి. అదేవిధంగా మధుమేహం తగ్గించడంలో కూడా తుంగ గడ్డలు అద్భుతంగా పనిచేస్తుంటాయి.

తుంగ గడ్డలతో బట్టతలపై వెంట్రుకలు రావడం ఖాయం.

తుంగ గడ్డలు బట్టతలపై వెంట్రుకలు తిరిగి మొలిపించడంలో అద్భుతంగా పనిచేస్తుంటాయి. ముఖ్యంగా తుంగ గడ్డలను ఎండబెట్టి దాన్ని కొబ్బరి నూనెలో మరిగించి తలకు పట్టిస్తే వెంట్రుకలు రాలిపోవడం తగ్గిపోతుంది, అంతేకాదు బట్టతలపై కూడా వెంట్రుకలు మొలిచేందుకు పునరుద్జీవంగా పనిచేస్తుంది. తుంగ గడ్డల ఎండబెట్టి వాటిని చూర్ణంగా చేసి ఆ పొడిలో, చందనం కలిపి ముఖంపై రాసుకుంటే మొటిమలు మచ్చలు పోయి ముఖం కాంతివంతంగా మారుతుంది అంతేకాదు నల్లటి నలుపు సైతం తొలగిపోయి మొహం చంద్రబింబంలా మెరిసిపోవడం ఖాయమని ఆయుర్వేద శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

తుంగ గడ్డలు ఒక రకంగా చెప్పాలంటే సర్వరోగ నివారిణి అని చెప్పాలి వీటి పైన ఇప్పటికీ ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. మీ ప్రాంతంలో కూడా తుంగ గడ్డలు లభించినట్లయితే ఆయుర్వేద నిపుణుడి సలహాలతో వాడటం ద్వారా అనేక వ్యాధులనుంచి బయటపడే అవకాశం ఉంటుంది.
(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

Mobile Theft: ఫోన్‌ చోరీకి గురైందా..? ముఖ్యమైన ఈ మూడు పనులు వెంటనే చేయండి

ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ స్నాచింగ్ అనేది సర్వసాధారణంగా మారింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటే వెనుక నుంచి ఎవరైనా వచ్చి ఎప్పుడు ఫోన్‌ లాక్కుంటారో చెప్పాల్సిన పనిలేదు.

ఇలాంటి సంఘటన మీకు తెలిసిన వారికైనా లేదా మీకు ఎప్పుడైనా జరిగితే మీరు ఏమి చేస్తారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఫోన్ దొంగిలించబడిన వెంటనే, మొదటగా పోలీసు స్టేషన్‌కి వెళ్లి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం అందరికీ తెలుసు. ఇందులో కొత్తదనం ఏముంది? అయితే పోలీసు స్టేషన్‌కు వెళ్లే ముందు మీరు కొన్ని ముఖ్యమైన పనిని పూర్తి చేయాలి. మీ ఫోన్‌ను దొంగిలించిన వెంటనే మీరు చేయవలసిన ముఖ్యమైన పని ఏమిటో తెలుసుకుందాం.

టెలికాం ఆపరేటర్‌కు కాల్ చేయండి

మీ మొబైల్ నంబర్ ఉన్న ఏదైనా టెలికాం కంపెనీ కస్టమర్ కేర్‌కు మీరు వెంటనే కాల్ చేయాలి. మీ ఫోన్ దొంగిలించబడినట్లయితే, అదే కంపెనీ నంబర్ ఉన్న మరొకరి నుండి ఫోన్ కోసం అడగండి. ఉదాహరణకు, మీ ఫోన్‌లో రిలయన్స్ జియో నంబర్ ఉంటే మీ ఫోన్‌ దొంగతనానికి గురైన తర్వాత జియో సిమ్‌ కలిగిన ఇతరుల ఫోన్‌ను తీసుకుని కస్టమర్ కేర్‌కు కాల్ చేసి, ఆపై మీ 10 అంకెల మొబైల్ నంబర్‌ను వారికి చెప్పి, మీ మొబైల్ నంబర్‌ను బ్లాక్ చేయాలనుకుంటున్నారని చెప్పండి.

కస్టమర్ కేర్ వ్యక్తి మిమ్మల్ని కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు అడుగుతాడు. మీరు ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన వెంటనే, మీ నంబర్ బ్లాక్ చేస్తారు. నంబర్‌ను బ్లాక్ చేయడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, దొంగ మీ సిమ్‌ను దుర్వినియోగం చేయలేరు.

పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేయండి

అన్నింటిలో మొదటిది మొబైల్ నంబర్‌ను బ్లాక్ చేయడం మంచిది. ఈ పనిని పూర్తి చేసిన తర్వాత సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మీకు జరిగిన సంఘటన గురించి తెలియజేయండి. మీ ఫిర్యాదును విన్న తర్వాత పోలీసు అధికారి మీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తారు. మీరు ఎఫ్‌ఐఆర్ కాపీని కూడా మీ వద్ద ఉంచుకోవాలి. ఈ నివేదికలో మీ మొబైల్ ఫోన్ మోడల్ నంబర్, IMEI నంబర్, మీ ఫోన్ ఏ రంగులో ఉందో వంటి ముఖ్యమైన సమాచారం రాసి ఉటుంది.

IMEI నంబర్ బ్లాక్ చేయండి

ఫోన్ దొంగిలించబడిన తర్వాత మొబైల్ నంబర్ బ్లాక్ చేయించండి. కానీ IMEI నంబర్ గురించి ఏమిటి? ప్రతి స్మార్ట్‌ఫోన్‌కు ప్రత్యేకమైన IMEI నంబర్ ఉంటుందని మీరు తెలుసుకోవాలి. IMEI నంబర్‌ను బ్లాక్ చేయడం వల్ల ప్రయోజనం కూడా ఉంది. ఆ ప్రయోజనం ఏమిటంటే మీరు నంబర్‌ను బ్లాక్ చేసినప్పుడు, ఆ తర్వాత ఫోన్ కేవలం బాక్స్‌గా మిగిలిపోతుంది. ఎందుకంటే IMEI నంబర్ బ్లాక్ అయిన వెంటనే మీ ఫోన్‌లో ఇతర కంపెనీల సిమ్ పనిచేయదు.

ఇప్పుడు ప్రశ్న తలెత్తుతుంది IMEI నంబర్‌ను ఎలా బ్లాక్ చేయాలి? అని. దీని కోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. భారత ప్రభుత్వం సాధారణ ప్రజల సౌకర్యార్థం ఒక వెబ్‌సైట్‌ను సిద్ధం చేసింది. దీని ద్వారా మీరు ఈ పనిని చాలా సులభంగా చేయవచ్చు.

IMEI నంబర్‌ను బ్లాక్ చేయడానికి, మీరు https://www.ceir.gov.in/Home/index.jsp కి వెళ్లాలి. ఈ వెబ్‌సైట్‌ను సందర్శించిన తర్వాత, సైట్ హోమ్‌పేజీకి ఎడమ వైపున బ్లాక్ స్టోలెన్/లాస్ట్ మొబైల్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది. IMEI నంబర్‌ను బ్లాక్ చేయడం కోసం ceir.gov.in ఎంపికపై క్లిక్ చేయడం ద్వారా, కొత్త పేజీ ఓపెన్‌ అవుతుంది. దీనిలో మీరు దొంగిలించబడిన ఫోన్‌ను బ్లాక్ చేయడానికి అభ్యర్థనను సమర్పిస్తున్నారని తెలుపండి. ఈ పేజీలో మీ నుండి కొన్ని ముఖ్యమైన సమాచారం అడుగుతుంది. ముందుగా ఫోన్ ఇన్ఫర్మేషన్ అడుగుతారు. ఆపై మీ ఫోన్ ఎక్కడ చోరీకి గురైంది? ఏ రాష్ట్రంలో దొంగిలించారు మొదలైన దొంగతనం గురించి సమాచారాన్ని ఇవ్వాలి.

దీని తర్వాత, మీరు పేజీలో అడిగిన మొత్తం సమాచారాన్ని పూరించిన తర్వాత, మీరు డిక్లరేషన్‌పై టిక్ చేసి, ఆపై కింద చూపిన సబ్‌మిట్ బటన్‌ను నొక్కాలి. ఇలా చేయడం వల్ల మీ ఫోన్ బ్లాక్ చేయబడుతుంది.

Nestle Cerelac Side Effects: పిల్లలకు సెర్లాక్‌ తినిపిస్తున్నారా.. ప్రమాదంలో పడినట్లే..!

Nestle Cerelac Side Effects: చిన్న పిల్లలకు తల్లిపాల కంటే బలవర్ధకమైన ఆహారం మరొకటి లేదు. అందుకే డెలివరీ అయిన మహిళలు పిల్లలకు కనీసం ఆరు నెలలైనా తల్లిపాలు తాగించాలి. అప్పుడే వారు రోగనిరోధక శక్తిని పెంచుకొని సీజనల్‌ వ్యాధులను తట్టుకుంటారు. అయితే చాలామంది మహిళలకు పాలు సరిపడ రావు. దీంతో వారు ప్రత్యామ్యాయంగా నెస్లే సెర్లాక్‌ని తినిపిస్తారు. మరికొందరు పాలను మరిపించి ఫుడ్‌పైదృష్టిపెట్టడానికి సెర్లాక్‌ను అలవాటు చేస్తారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ సెర్లాక్‌ వల్ల పిల్లలకు చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది. దాని గురించి ఈ రోజు తెలుసుకుందాం.
సెర్లాక్ ప్రొడక్ట్ ను నెస్లే కంపెనీ తయారు చేస్తుంది. వివిధ ఫ్లేవర్స్ తో 15 రకాలుగా మార్కెట్ లో అందుబాటులో ఉంది. తాజాగా చేసిన పబ్లిక్ ఐ పరిశోధనలో షాకింగ్ న్యూస్ బయటికి వచ్చింది. భారత్ లో తయారుచేసే సెరెలాక్‌లో 3 గ్రాముల షుగర్ ఉంటుందని పరిశోధనలో తేలింది. అంతే కాదు ఇందులో చక్కెర, తేనే కలుపుతున్నట్లు తెలిసింది. నిబంధనల ప్రకారం చిన్నారుల కోసం తయారు చేసే ఫుడ్ ఐటమ్స్ లో చక్కెర స్థాయిలు ఉండకూడదు. ఊబకాయం, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా వంటి పేద దేశాల్లో నెస్లే ఈ నిబంధనను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నట్టు తేలింది.
చాలా సందర్భాల్లో నెస్లే సెర్లాక్‌ కంపెనీ షుగర్ లెవల్స్ గురించి ప్యాకేజింగ్‌పై ముద్రించట్లేదని పబ్లిక్ ఐ పేర్కొంది. దీనివల్ల పిల్లలకు చక్కెర వ్యసనంగా మారే అవకాశం ఉంది. తీపికి అలవా టు పడ్డ చిన్నారులు అలాంటి ఆహారాల వైపే మొగ్గు చూపుతారు. ఫలితంగా చిన్నతనంలో తగిన పోషకాలు అందక పెద్దాయ్యాక అనారోగ్యాల బారిన పడుతారు. అందుకే చిన్నపిల్లలకు సెర్లాక్‌ తినిపించే ముందు ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి.

Toyota: 21 కిమీల మైలేజీ.. హైబ్రిడ్ ఇంజిన్‌తో వచ్చిన టయోటా ఇన్నోవా హైక్రాస్.. ధరెంతంటే?

Toyota Innova Highcross: టయోటా కిర్లోస్కర్ మోటార్ ఈరోజు (ఏప్రిల్ 15) తన ప్రముఖ హైబ్రిడ్ కారు టయోటా ఇన్నోవా హైక్రాస్ కొత్త టాప్ వేరియంట్ GX(O)ని విడుదల చేసింది.

మల్టీ పర్పస్ వెహికల్ (MPV) ఈ వేరియంట్ పెట్రోల్ ఇంజన్ ఎంపికతో మాత్రమే వస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 20.99 లక్షలుగా ఉంది.

ఇన్నోవా హైక్రాస్ ఈ కొత్త వేరియంట్ GX పైన ఉంది. ఇది GX వేరియంట్ కంటే రూ. 1 లక్ష ఎక్కువ ఖరీదైనది. ఎక్కువ ఫీచర్ లోడ్ చేసింది. ఇది 7 సీటర్, 8 సీటర్ కాన్ఫిగరేషన్‌లలో ప్రవేశపెట్టింది. ఈ కారు బలమైన హైబ్రిడ్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 21.1kmpl మైలేజీని ఇస్తుంది.

టయోటా ఇన్నోవా హైక్రాస్ ధర రూ. 19.77 లక్షల నుంచి రూ. 30.98 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ). భారతీయ మార్కెట్లో, ఇది మారుతి ఇన్విక్టో, కియా కారెన్స్, టయోటా ఇన్నోవా క్రిస్టాతో పోటీపడుతుంది. దీన్ని ప్రీమియం ఆప్షన్‌గా కూడా ఎంచుకోవచ్చు.

Innova High Cross GX(O) సాధారణ వేరియంట్ కంటే ఎక్కువ ఫీచర్లను కలిగి ఉంది. సాధారణ GX వేరియంట్‌తో పోలిస్తే Innova High Cross కొత్త GX(O) వేరియంట్ అనేక అదనపు సౌకర్యాలను కలిగి ఉంది. ఇందులో పెద్ద 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ Apple CarPlay, ఆటోమేటిక్ AC, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, 360 డిగ్రీ వ్యూ కెమెరా, వెనుక సన్‌షేడ్, ముందు LED ఫాగ్ ల్యాంప్స్, వెనుక డీఫాగర్ ఉన్నాయి.

అయితే, పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వెనుక సన్‌షేడ్ 7-సీటర్ వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. టయోటా ఇన్నోవా హైక్రాస్ GX(O) వేరియంట్‌లో ఫాబ్రిక్ సీట్ అప్హోల్స్టరీతో కూడిన చెస్ట్‌నట్ థీమ్ సాఫ్ట్-టచ్ డ్యాష్‌బోర్డ్ ఉంది. GX వేరియంట్‌తో పోలిస్తే మరింత ప్రీమియం క్యాబిన్ అనుభవాన్ని కలిగి ఉంది.

ఇది కాకుండా, కారులో పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, 9-స్పీకర్ JBL ఆడియో సిస్టమ్, రెండవ వరుసలో పవర్డ్ ఒట్టోమన్ సీట్లు, మూడ్ లైటింగ్, పవర్డ్ టెయిల్‌గేట్ వంటి అనేక గొప్ప ఇంటీరియర్ ఫీచర్లు ఉన్నాయి.

Innova Hycross GX లిమిటెడ్ ఎడిషన్: డిజైన్..

Innova Hycross మొత్తం SUV-సెంట్రిక్ డిజైన్‌ను కలిగి ఉంది. ఇది పెద్ద కొత్త ఫ్రంట్ గ్రిల్‌ను పొందుతుంది. ఇది సొగసైన LED హెడ్‌ల్యాంప్‌లతో ఉంటుంది. ముందు భాగంలో, గ్రిల్ మధ్యలో కొత్త క్రోమ్ గార్నిష్‌ని కలిగి ఉంటుంది. ముందు, వెనుక బంపర్‌లలో కొత్త ఫాక్స్ సిల్వర్ స్కిడ్ ప్లేట్లు అందించింది.

ఇందులో 18 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. హైక్రాస్ వెనుక భాగంలో ర్యాప్‌రౌండ్ LED టెయిల్-ల్యాంప్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇన్నోవా హైక్రాస్ కొలతలు గురించి మాట్లాడితే, ఇది ఇన్నోవా క్రిస్టా కంటే పెద్ద పరిమాణంలో ఉంది. Innova Hycross 20 mm పొడవు, 20 mm వెడల్పు, 100 mm వీల్‌బేస్ కలిగి ఉంది.

ప్లాటినం వైట్ ఎక్స్టీరియర్ పెయింట్ షేడ్ కోసం మీరు రూ. 9,500 అదనంగా చెల్లించాలి. అయితే, కారు దిగువ స్థాయి GX ట్రిమ్‌పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి, ఇది బంపర్ గార్నిష్, అధిక ట్రిమ్‌లలో ఉండే పెద్ద మెటాలిక్ అల్లాయ్ వీల్స్‌ను కోల్పోతుంది.

Innova Highcross GX(O): ఇంజన్, మైలేజ్..

టయోటా ఇన్నోవా హైక్రాస్ ఈ వేరియంట్ 2.0-లీటర్ సహజంగా ఆశించిన పెట్రోల్ ఇంజన్‌తో అందుబాటులో ఉంది. ఇది 172hp పవర్, 205Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ట్యూన్ చేసింది. ఇందులో ఇంధన-సమర్థవంతమైన హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ ఎంపిక లేదు.

ఇది కాకుండా, కారు అధిక వేరియంట్లలో 2.0-లీటర్ బలమైన హైబ్రిడ్ ఇంజన్ అందించింది. ఇది 21.1 kmpl ఇంధన సామర్థ్యాన్ని, ఫుల్ ట్యాంక్‌పై 1097km పరిధిని ఇస్తుంది. ఇది 9.5 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వేగాన్ని అందుకోగలదు. CVTతో కూడిన కొత్త TNGA 2.0-లీటర్ నాలుగు-సిలిండర్ గ్యాసోలిన్ ఇంజన్ 174 PS శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇ-డ్రైవ్‌తో 2.0-లీటర్ నాలుగు-సిలిండర్ పెట్రోల్-హైబ్రిడ్ ఇంజన్ గరిష్ట శక్తి 186 ps.

ఇన్నోవా హైక్రాస్ GX(O): భద్రతా ఫీచర్లు..

Innova Hycross టయోటా సేఫ్టీ సెన్స్ సూట్‌తో వస్తుంది. ఇందులో డైనమిక్ రాడార్ క్రూయిజ్ కంట్రోల్, ఆటో హై బీమ్, లేన్ చేంజ్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ మానిటర్, 6 SRS ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, గైడ్ మెనీ బ్యాక్‌లు ఉన్నాయి. వీక్షణ మానిటర్, EBDతో కూడిన ABS, వెనుక డిస్క్ బ్రేక్ వంటి గొప్ప ఫీచర్లు ఉన్నాయి.

Digital Voter ID: ఎన్నికలవేళ.. డిజిటల్ ఓటర్ ఐడీ కార్డ్ పొందండిలా..

Digital Voter ID: దేశ వ్యాప్తంగా ఎన్నికల వాతావరణం నెలకొంది. శుక్రవారం 21 రాష్ట్రాలలో 102 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఏడు దశల్లో ఈ ఎన్నికలు నిర్వహిస్తారు.

జూన్ 4న ఫలితాలు వెల్లడిస్తారు. ఇక ఇటీవల కాలంలో ఫోన్ వాడకం పెరిగిపోయింది. అందులోనే అన్ని రకాల గుర్తింపు కార్డులను భద్రపరచుకోవడం ఎక్కువైంది. ప్రస్తుతం ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో డిజిటల్ ఓటర్ ఐడీ కార్డ్ మన ఫోన్లోనే నిక్షిప్తమై ఉంటే బాగుంటుంది కదా.. మారిన సాంకేతిక పరిజ్ఞానం వల్ల.. నెట్ సెంటర్లకు వెళ్లకుండానే.. మొబైల్ లోనే డిజిటల్ ఓటర్ ఐడీ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

చాలా మంది వద్ద ఆధార్, పాన్, జాబ్ (ఉద్యోగం గనుక చేస్తుంటే) ఐడీ కార్డులు కచ్చితంగా ఉంటాయి. అయితే కొంతమంది దగ్గర ఓటర్ ఐడీ కార్డు ఉంటుంది. మరి కొంతమంది వద్ద ఉండదు. అలాంటివారు డిజిటల్ ఓటర్ ఐడీ కార్డ్ ఎలా పొందాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. అలాంటివారు సులువుగా తమ మొబైల్ ఫోన్లోనే ఐడీ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానిని వారు తమ ఫోన్ లోనే భద్రపరచుకోవచ్చు. లేకుంటే ఆధార్ కార్డు లాగా లామినేషన్ చేసుకుని దగ్గర ఉంచుకోవచ్చు. ఇంతకీ అది ఎలాగంటే..

ఈ విధానంలో ముందుగా కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్ సైట్ (https://voters eci.gov.in/login) లోకి వెళ్ళాలి. అందులో ఈ అధికారిక మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేస్తే పాస్ వర్డ్ సెట్ చేసుకోమని చెప్పింది. అది ఇవ్వగానే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. అనంతరం మీరు మీ మొబైల్ నెంబర్, పాస్ వర్డ్ ఎంటర్ చేస్తే..ఒక కప్చా నంబర్ వస్తుంది. దాన్ని టైప్ చేస్తే లాగిన్ అవ్వచ్చు.

అలా లాగ్ ఇన్ అయిన తర్వాత రిక్వెస్ట్ ఓటీపీ పై క్లిక్ చేయాలి. అప్పుడు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అండ్ లాగిన్ పై క్లిక్ చేయాలి. అప్పుడు మీకు ఒరిజినల్ సైట్ కనిపిస్తుంది. అందులో కుడివైపు కింద మూలన ఉన్న e-epic డౌన్లోడ్ పై క్లిక్ చేయాలి. అప్పుడు మీకు ఒక స్క్రీన్ కనిపిస్తుంది. అందులో మీరు ఇంటర్ ఎపిక్ నెంబర్ దగ్గర మీ ఓటర్ ఐడీ కార్డు సంబంధించిన ఎపిక్ నెంబర్ టైప్ చేయాలి. ఆ తర్వాత సెలెక్ట్ స్టేట్లో మీ రాష్ట్రాన్ని ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత సెర్చ్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అప్పుడు మీకు మీ ఓటర్ ఐడి కి సంబంధించిన వివరాలు చూపిస్తుంది. ఆ ఓటర్ ఐడి మీకు సరైనది అనిపిస్తే అప్పుడు మీరు కింద ఉన్న రీసెండ్ ఓటిపి పై క్లిక్ చేయాలి. అప్పుడు మీ మొబైల్ నెంబర్ కు వచ్చే ఓటిపిని ఎంటర్ చేసి, వెరిఫై బాక్స్ పై క్లిక్ చేయాలి. మీరు ఎంటర్ చేసిన ఓటిపి సరైనదే అయితే కరెక్ట్ అని చూపిస్తుంది. ఆ తర్వాత మీరు మీ డిజిటల్ ఓటర్ ఐడి కార్డు కోసం డౌన్లోడ్ ఎపిక్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అది మీ మొబైల్ లో పిడిఎఫ్ ఫార్మాట్లో సేవ్ అవుతుంది. దాన్ని మీరు ప్రింట్ తీసుకోవచ్చు. లామినేషన్ చేస్తే ఆధార్ కార్డు లాగా భద్రపరచుకోవచ్చు. మొబైల్ తో సేవ్ చేసుకుంటే ఎప్పుడైనా అధికారులు అడిగినప్పుడు దాన్ని చూపించవచ్చు.

5G Network Issue ఈ సింపుల్ టిప్స్‌తో.. మీ స్మార్ట్‌ఫోన్‌లో 5G నెట్వర్క్ సమస్యను సాల్వ్ చేసుకోండి…

5G Network Issue ఇంతవరకు మనలో చాలా మంది 2G, 3G, 4G ఇంటర్నెట్ స్పీడ్ చూశాం. ఇటీవలి కాలంలో 5Gలో అడుగుపెట్టాం. ఇది 4G కంటే చాలా వేగంగా పని చేస్తుంది. 5G నెట్వర్క్ హై స్పీడ్ వల్ల ఎలాంటి వీడియోలైనా.. ఎంత క్వాలిటీ ఫోటోలైనా.. ఎంత లెంతీ, క్వాలిటీ వీడియోలైనా క్షణాల్లో డౌన్ లోడ్ అయిపోతున్నాయి. అదే విధంగా అప్ లోడింగుకు ఎక్కువ టైం పట్టట్లేదు. అంతేకాదు ఎలాంటి సైట్లు అయినా, యాప్స్ వెంటనే ఓపెన్ అవుతున్నాయి. 5G నెట్వర్క్ కారణంగా గేమింగ్‌కు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అయితే 5G స్మార్ట్ ఫోన్ కొన్న వారంతా దీన్ని ఉపయోగించలేరు. ఎందుకంటే చాలా మంది 4G నెట్వర్క్ దగ్గరే ఆగిపోయారు. ఈ సందర్భంగా 5G నెట్వర్క్ హైస్పీడ్ పొందాలంటే ఏం చేయాలనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం…
5Gలోని రకాలు..
5G స్మార్ట్‌ఫోన్ కొన్న ప్రతి ఒక్కరికీ హై స్పీడ్ వస్తుందనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే 5G సేవలు ఇంకా అందుబాటులోకి రాని ప్రాంతాలు అనేకం ఉన్నాయి. అలాగే Airtel 5G NSA(Non Stand)లోనే నెట్వర్క్ ఉపయోగిస్తోంది. జియో 5G SA(సొంతంగా) తన టెక్నాలజీ వాడుతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 5G స్మార్ట్‌ఫోన్లలో NSA టెక్నాలజీ ఎక్కువగా వినియోగించబడుతుంది. అందుకే మీరు జియో SA టెక్నాలజీ వాడేటప్పుడు అనేక సమస్యలను ఎదుర్కోవచ్చు.
మీ సిమ్ సపోర్ట్ చేస్తుందా?
మీరు వాడే స్మార్ట్‌ఫోన్లలో 5G సపోర్ట్‌ని కలిగి ఉన్న చాలా పాత పరికరాలు ఉన్నాయి. చాలా సందర్భాలలో 5G స్మార్ట్ ఫోన్లు ప్రాథమిక సిమ్ కార్డులో లేదా మొదటి స్లాట్‌లో మాత్రమే 5G సపోర్ట్ కలిగి ఉంటుంది. కాబట్టి మీరు ఇంటర్నెట్ ఇష్యూ ఫేస్ చేస్తుంటే మీ సిమ్ కార్డు మొదటి స్లాట్‌లో ఉందో లేదో చెక్ చేసుకోండి.

ఫోన్ నెంబర్ 5G యాక్టివ్ ఉందా?
ప్రస్తుతానికి 5G కోసం ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్ లేదు. జియో, ఎయిర్ టెల్ కంపెనీలు యూజర్లకు ఫ్రీగా అన్‌లిమిటెడ్ 5G సేవలు అందించడం ప్రారంభించాయి. అయితే దీని కోసం మీరు నిర్దిష్ట ప్లాన్లలో రీఛార్జ్ చేసుకోవాలి. ఈ రెండు కంపెనీల యాప్‌లోకి వెళ్లి 5G సర్వీస్‌ని యాక్టివేట్ చేసుకోవాలి. కాబట్టి Airtel Thanks లేదా MyJio యాప్‌లో వెళ్లడం ద్వారా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

సిమ్‌ని అప్‌గ్రేడ్ చేయాలా?
ప్రస్తుతం 4G సిమ్ వాడుతున్నవారు.. 5G హైస్పీడ్ కావాలనుకుంటున్నారు. అయితే మీ సిమ్ కార్డు 3G అయితే అది 5Gకి మార్చలేం. అయితే 3G సిమ్ నుంచి 4Gలోకి మార్చొచ్చు. కానీ 5Gకి మార్చలేరు. అందుకే మీరు కొత్త 4G కొత్త సిమ్ కార్డు తీసుకోవాలి.

సెట్టింగులో ఈ మార్పులు చేసుకోండి..
మీరు వాడే స్మార్ట్‌ఫోన్లలో 4G/5G టైప్ సెలెక్ట్ చేసుకున్నారని కన్ఫార్మ్ చేసుకోండి. దీని ఆధారంగా మీ స్మార్ట్ ఫోన్ నెట్వర్క్ ఆటోమేటిక్‌గా 4G లేదా 5Gలో రన్ అవుతుంది. ఒకవేళ మీరు 5G నెట్వర్క్ సిగ్నల్ వీక్‌గా ఉండే ప్రాంతంలో నివసిస్తుంటే, 4G ఆటోమేటిక్‌గా ఆన్ అవుతుంది. మీరు 5Gని మాత్రమే పొందాలనుకుంటే, మీ ఫోన్ సెట్టింగులో 5G నెట్వర్క్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి.

Red bananas : ప్రతి రోజూ ఖాళీ కడుపుతో ఎర్ర అరటిపండు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా..!

ఎర్ర అరటి పండులో విటమిన్ సి, విటమిన్ బి6, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ సమృద్ధిగా, తక్కువ కేలరీలుంటాయి. దీనిని అల్పాహారంగా, డెజర్గా కూడా హెల్తీ ఫుడ్‌గా తీసుకోవచ్చు.

ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇంకా దీనితో ఎన్ని లాభాలంటే..

రోగనిరోధక శక్తి..

రెడ్ అరటిపండులోని మెగ్నీషియం, పొటాషియం వంటి రిచ్ లక్షణాలు రక్తపోటును తగ్గిస్తాయి. ఈ పండులో ఉండే విటమిన్ సి, రోగనిరోధక శక్తిని పెంచే కీలకమైనది. శరీర రోగనిరోధక శర్తిని పెంచడానికి, చర్మాన్ని ఆరోగ్యాంగా ఉంచడానికి కొల్లాజెన్ ఉత్పత్తి చేయడానికి విటమిన్ సి చాలా ముఖ్యమైనది.

కంటి ఆరోగ్యం..

ఎర్రటి అరటి పండులో కెరోటినాయిడ్లు కారణంగా ఈ పండు పై పొర ( తొక్క) ఎర్రగా ఉంటుంది. ఈ అరటి పండును తీసుకోవడం వల్ల ఇది కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులోని బీటా కెరోటిన్ కంటి చూపును పెంచుతుంది.

బరువు తగ్గడానికి కూడా..

బరువు తగ్గించుకోవాలని చూసే వారు ఎర్రటి అరటిపండ్లను ఎంచుకోవచ్చు. అధిక ఫైబర్ లక్షణాల కారణంగా ఎర్రటి అరటిపండ్లు తక్కువ కొవ్వును కలిగి ఉంటాయి. చాలా తక్కువ కేలరీల కారణంగా ఎక్కువ సేపు కడుపునిండుగా ఉండేలా చేస్తుంది. ఇది మధుమేహం, గుండె జబ్బులు, ఊబకాయం సమస్యలను తగ్గిస్తుంది.

వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఎర్రటి అరటిపండ్లు తీసుకోవడంతో మినరల్స్, విటమిన్లు పుష్కలంగా అందుతాయి. అలాగే ఇందులోని కార్బోహైడ్రేట్లు మొత్తం ఆరోగ్యాన్ని పెంచుతాయి.

ACలో 1 టన్, 1.5 టన్ అంటే ఏంటో తెలుసా? ఎలాంటిది సెలెక్ట్ చేసుకోవాలి?

వేసవి కాలం వచ్చిందంటే చాలు.. చాలా మంది ఇళ్లలో ఏసీలు ఆన్ లో ఉంటాయి. కొంతమంది అయితే ఈ ఉక్కపోతని తట్టుకోలేక కొనేస్తుంటారు. అయితే మీరు గమనిస్తే ఏసీల్లో రకాలు ఉంటాయి.

1 టన్ ఏసీ అని.. 1.5 టన్ ఏసీ అని.. 2 టన్ ఏసీ అని ఇలా ఏసీల్లో రకాలు ఉంటాయి. మరి ఏసీల్లో ఉంటే ఈ టన్ అంటే ఏంటో ఎప్పుడైనా తెలుసుకోవాలని అనిపించిందా? టన్ అంటే ఏసీ కూలింగ్ కెపాసిటీని లెక్కించేది. ఇది మీ రూమ్ సైజ్ మీద ఆధారపడి ఉంటుంది. ఒక గంటలో గదిలో ఉన్న వేడిని ఎంతవరకూ తరిమికొడుతుందన్న దాని మీద ఈ టన్ అనే కొలమానం ఆధారపడి ఉంటుంది. వేడిని బ్రిటిష్ థర్మల్ యూనిట్ లో (BTU) కొలుస్తారు.

ఒక టన్ ఏసీ 12 వేల బ్రిటిష్ థర్మల్ యూనిట్ల వేడి గాలిని తొలగిస్తుంది. అదే 2 టన్ ఏసీ యూనిట్ అయితే 24 వేల బీటీయూ వేడిని తొలగిస్తుంది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే.. 24 గంటల్లో 1 టన్ అంటే 2,220 పౌండ్ల ఐస్ ని కరిగించడానికి 1 టన్ ఏసీ యూనిట్ అవసరమవుతుంది. ఈ కూలింగ్ సామర్థ్యాన్ని బ్రిటిష్ థర్మల్ యూనిట్స్ లో లెక్కిస్తారు. మీ ఇంట్లో ఉన్న ఏసీ 1 టన్ ఆ? లేక 2 టన్ ఆ అనేది తెలుసుకోవాలంటే మోడల్ నంబర్ మీద గానీ ఏసీ యూనిట్ లేబుల్ మీద గానీ చూస్తే తెలిసిపోతుంది. మోడల్ నంబర్ మీద టన్ కి సంబంధిత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఉదాహరణకు మీ ఏసీ యూనిట్ ఒక టన్ అయితే కనుక 12,000 BTU అని.. 1.5 టన్ అయితే కనుక 18,000 BTU అని ఉంటుంది. ఎంత ఎక్కువ టన్ ఏసీ యూనిట్ అయితే ఎంత ఎక్కువ కూలింగ్ నిస్తుందని అర్థం.

ఎంత కెపాసిటీ ఏసీని సెలెక్ట్ చేసుకోవాలి? ఎలా సెలెక్ట్ చేసుకోవాలి?

మరి మన ఇంటికి ఏ టన్ ఏసీ యూనిట్ సెట్ అవుతుంది. ఎంత కెపాసిటీ ఉన్నది సెట్ అవుతుంది అనేది తెలుసుకోవడం చాలా సింపుల్. మీ గది ఎన్ని చదరపు అడుగులు ఉందో దాన్ని 25తో గుణించండి. వచ్చిన నంబర్ ఏదైతే ఉందో అది.. మీ గది చల్లబడటానికి ఎన్ని నంబర్ ఆఫ్ బ్రిటిష్ థర్మల్ యూనిట్స్ అవసరమో చెబుతుంది. ఆ వచ్చిన నంబర్ ని 12 వేలతో భాగిస్తే మీ గదికి అవసరమైన టన్ కెపాసిటీ అనేది వస్తుంది. ఒక గదిలో ఐదుగురు వ్యక్తులు ఉంటే కనుక ఆ రూమ్ కి 0.5 టన్ ఏసీ యూనిట్ అనేది కనీస అవసరం. మీ గది పరిమాణం 100 నుంచి 130 చదరపు అడుగులు ఉంటే కనుక 0.8 టన్ నుంచి 1 టన్ ఏసీ సరిపోతుంది. 130 నుంచి 200 చదరపు అడుగులు ఉంటే కనుక 1.5 టన్ ఏసీ సరిపోతుంది. 200 చదరపు అడుగుల కంటే ఎక్కువ ఉంటే కనుక 2 టన్ ఏసీ తీసుకోవాలి. అదే 500 చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థలం ఉన్న రూమ్ అయితే కనుక ఒకటి కంటే ఎక్కువ ఏసీలు తీసుకోవాల్సి ఉంటుంది.

ఇలా లెక్కించండి:

0.8 టన్ ఏసీ – 9000 BTU
1 టన్ ఏసీ – 12000 BTU
25 టన్ ఏసీ – 15,000 BTU
1.5 టన్ ఏసీ – 18,000 BTU
2 టన్ ఏసీ – 24,000 BTU
గది పరిమాణం X 25 BTU = గది BTU
110 చదరపు అడుగులు X 25 = 2650 BTU (ఇది ఒక వ్యక్తి లెక్క)
అదనంగా మనుషులు ఉంటే ఒక్కో వ్యక్తికి 600 నుంచి 700 BTU అనేది అవసరమవుతుంది. ఉదాహరణకు నలుగురు ఉంటే 2400 నుంచి 2800 BTU అవసరమవుతుంది. అంటే మొత్తం మీద 5,450 BTU అనేది అవసరమవుతుంది. అంటే కనీసం 0.8 టన్ ఏసీ తీసుకోవాల్సి ఉంటుంది. గది సైజ్ పెరిగితే BTU పెరుగుతుంది. దాన్ని బట్టి ఏసీ సామర్థ్యం పెరుగుతుంది. కాబట్టి ఏసీ కొనుక్కోవాలనుకునేవారు ఈ లెక్కలు పాటించండి.

Health: ఇవి తింటే కొవ్వును కోసి బయటకు తీసినట్లే.. మంచు కరిగినట్లు కరగాల్సిందే

రక్తనాళ్లలో కొలెస్ట్రాల్ పేరుకోకుండా కాపాడేది ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్. అవిసె గింజుల్లో ఓమెగా 3 ఫ్యాటీ యాసిడ్ ధారాలంగా ఉంటుంది. అవిసె గింజుల్లో ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ అనే గుడ్ కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది.

ఇది మన బాడీకి ఎంతో మేలు చేస్తోంది. దాదాపు 27 పరిశోధనలు ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. 30 రోజులపాటు రోజూ 25 నుంచి 30 గ్రాములు అవిసె గింజల్ని తింటే.. బ్రెయిన్ స్ట్రోక్స్, హార్ట్ స్ట్రోక్స్ వచ్చే అవకావం నెల రోజుల్లోనే 15 శాతం తగ్గిందని పరిశోధనల ద్వారా నిరూపితమైంది. అంతేకాదు గుండె సంబంధిత జబ్బులు వచ్చి స్టంట్స్, బైపాస్ ఆపరేషన్స్ చేయించుకున్నవారు.. లేదా బ్లాక్స్ ఉన్నవారు కూడా ఈ అవిసె గింజల్ని రోజుకు 25 గ్రాములు తీసుకుంటే.. ఫ్యూచర్‌లో వారికి గుండెజబ్బులు తిరగబెట్టే ప్రమాదం ఉండదని ప్రకృతి వైద్యులు మంతెన చెబుతున్నారు.

ఇలా అయితే రుచిగా…

తొలుత అవిసె గింజల్ని దోరగా వేయించి.. పక్కన పెట్టుకోవాలి. ఆపై సీడ్స్ తీసిన చిన్న, చిన్న ఖర్జూరం ముక్కలను తీస్కోని.. దానిలో కొంత హనీ వేసి.. పోయిపై పెట్టి 2 నిమిషాలు వేడి చేయాలి. ఆపై వేపిన అవిసె గింజల్ని అందులో కలిపి.. లడ్డూలుగా చేసుకోవాలి. అలా రోజు ఒక అవిసె లడ్డూ తింటే ఆరోగ్యం మీ చెంతే.

Nokia Boring Phone: నోకియా నుంచి బోరింగ్ ఫోన్.. స్పెషాలిటీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Nokia Boring Phone : స్మార్ట్‌ఫోన్ కంపెనీలు అన్నీ కూడా వేగంగా తమ మార్కెట్‌ను విస్తరిస్తున్నాయి. 4జీ, 5జీ అందిస్తూ లేటెస్ట్ AI టెక్నాలజీతో మొబైల్ లవర్స్‌ను అట్రాక్ట్ చేస్తున్నారు. అయితే ప్రముఖ ఫోన్ల తయారీ కంపెనీ నోకియా ఇందుకు భిన్నంగా కొత్త బోరింగ్ ఫోన్‌ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ స్పెషాలిటీ తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ ఫోన్ తీసుకొచ్చేందుకు హీనెకెన్-బోడెగా అనే సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ఫోన్‌ను ఎక్కువ రోజుల పాటు విక్రయించే ఆలోచనలో కంపెనీ లేదు. కేవలం 5,000 యూనిట్ల ఫోన్లను మాత్రమే తయారు చేయనున్నట్లు హీనెకెన్ వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఈ ఫోన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.

హీనెకెన్, బోడెగా సంస్థల సహకారంతో హెచ్‌ఎమ్‌డీ నోకియా బోరింగ్ ఫోన్‌ను ఆవిష్కరించింది. అలానే హ్యాండ్‌సెట్ ఫ్లీప్ స్క్రీన్‌ కలిగి ఉంటుంది. దీని డిజైన్ కూడా కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ ఫోన్‌లోని అత్యంత ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో ఇంటర్నెట్, సోషల్ మీడియా, ఇతర థర్డ్ పార్టీ యాప్‌లు ఇందులో డౌన్‌లోడ్ చేయలేరు.

HMD నోకియా ది బోరింగ్ ఫోన్‌ను ప్రారంభించేందుకు హీనెకెన్, బోడెగా కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రస్తుతానికి ఫోన్‌ను సేల్‌కు తీసుకురావడం లేేదు. ఇది బహుమతుల ద్వారా అందుబాటులో ఉంటుంది. అయితే దీని విక్రయానికి సంబంధించి కంపెనీ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. 5,000 యూనిట్ల ఫోన్‌ను తయారు చేయనున్నట్లు హీనెకెన్ వెబ్‌సైట్‌ ద్వారా వెల్లడించారు.

బోరింగ్ ఫోన్‌లో ఇంటర్నెట్ యాక్సెస్, సోషల్ మీడియా లేదా ఇతర యాప్‌లు లేని ఫీచర్ ఫోన్.
ఇది పాతతరం ఫోన్‌లు, రెట్రో ఫోన్‌ల మాదిరిగానే పని చేస్తుంది. ఇది కాల్స్ చేయడానికి, మెసెజింగ్‌కి మాత్రమే యూజ్ అవుతుంది. ఫ్లిప్‌ను మూసివేయడం ద్వారా కాల్‌ను డిస్‌కనెక్ట్ చేయవచ్చు. హోలోగ్రాఫిక్ స్టిక్కర్‌లను కలిగి ఉంది.

ఫోన్ డిజైన్ నోకియా 2660 ఫ్లిప్‌తో సరిపోతుంది. డిస్‌ప్లే గురించి చెప్పాలంటే, బోరింగ్ ఫోన్‌లో 2.8-అంగుళాల QVGA ఇన్నర్ డిస్‌ప్లే, 1.77-అంగుళాల కవర్ డిస్‌ప్లే ఉంది. ఇది 0.3 మెగాపిక్సెల్ కెమెరా, 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌ని కలిగి ఉంది. ఫోన్ 2G, 3G, 4G నెట్‌వర్క్‌ల ద్వారా కాలింగ్, మెసేజ్‌లకు సపోర్ట్ చేస్తుంది.

Health

సినిమా