Friday, September 20, 2024

Gold Kulfi: బంగారం ధరించడమే కాదు అక్కడ తింటున్నారు – 24 క్యారెట్ల గోల్డ్ కుల్ఫీ ధర ఎంతో తెలుసా?

Gold Kulfi Of Indore: బంగారాన్ని నగలుగా చేయించుకుని ధరించడం ఇప్పటి వరకు చూశాం. కానీ, ఇప్పుడు బంగారంతో చక్కటి కుల్ఫీలు చేయించుకుని తింటున్నారు. బంగారంతో కుల్ఫీలు చేయడం ఏంటి? వాటిని తినడం ఏంటి? అని ఆశ్చర్యపోతున్నారా? కానీ, మీరు విన్నది నూటికి నూరుపాళ్లు నిజం. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఏకంగా 24 క్యారెట్ల గోల్డ్ కుల్ఫీ అమ్ముతున్నారు. కస్టమర్లు ఎగబడి మరీ కొంటున్నారు. అరుదైన కుల్ఫీని తిని ఎంజాయ్ చేస్తున్నారు.

ఫుడ్ వెరైటీస్ కు పెట్టింది పేరు!
ఇండోర్ అనగానే చక్కటి ఫుడ్ వెరైటీస్ కు పెట్టింది పేరు. అక్కడ ఎన్నో రకాలపైనా వంటకాలు లభిస్తాయి. అన్నింటితో పోల్చితే అక్కడి కుల్ఫీ టేస్టీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. గత వేసవి వరకు ఎర్రటి గుడ్డలు చుట్టిన పెద్ద పెద్ద కుండలతో కూడిన కుల్ఫీ బండ్లు వీధుల్లో తిరుగుతూ కనిపించేవి. నేచురల్ గా కుండల కూలింగ్ లో ఉండే కుల్ఫీలను జనాలు ఎంతో ఇష్టంగా తినేవాళ్లు. కానీ, ఈ ఎండకాలంలో కుల్ఫీలు కొత్త హంగులు అద్దుకున్నాయి. ఏకంగా బంగారంతో కూడిన కుల్ఫీలను అమ్ముతున్నారు దుకాణదారులు. వీటిని తినేందుకు కస్టమర్లు ఎగబడుతున్నారు.

24 క్యారెట్ల బంగారు కుల్ఫీ
ఇండోర్ సిటీలోని ఫుడ్ షాపుల్లో గోల్డ్ కుల్ఫీ ప్రత్యేకంగా నిలుస్తుంది. 24 క్యారెట్ల బంగారు వర్క్ తో అలంకరించబడిన కుల్ఫీలు బాగా అమ్ముడుపోతున్నాయి. స్పెషల్ కుల్ఫీకి బంగారు పూతతో కూడిన కవర్ ను చుట్టి అందిస్తున్నారు. ప్రకాష్ కుల్ఫీ & ఫలూదా షాప్ యజమాని బంటీ యాదవ్, షాహీ కుల్ఫీతో సహా ఏకంగా 18 రకాల కుల్ఫీలను కస్టమర్లకు అందిస్తున్నారు. బంటి తాత ఈశ్వరీలాల్ 1965లో ఈ దుకాణాన్ని ప్రారంభించారు. ఆ సమయంలో కేసర్ కుల్ఫీని మాత్రమే అందించేవారు. ఆ దుకాణం తన తండ్రి చేతికి వచ్చాక జీడిపప్పు, సీతాఫలం, మామిడి రుచులను యాడ్ చేశారు. ఇప్పుడు బంటి, తన సోదరుడు శివ కలిసి జీడిపప్పు-గుల్కంద్, పాన్, స్ట్రాబెర్రీ, జామూన్, మలై, చాక్లెట్, ఫిగ్-డ్రై ఫ్రూట్స్ వంటి రుచులను అందిస్తున్నారు.

ఇండోర్ గోల్డ్ కుల్ఫీ ప్రత్యేకత ఏంటంటే?
నిజానికి బంగారు కుల్ఫీ అందించాలనే ఆలోచన.. బంటి సోదరులకు బంగారం మీద ఉన్న ఇష్టమే కారణం అయ్యింది. తమ కస్టమర్లకు ప్రత్యేకమైన కుల్ఫీ అందించాలని భావించారు. అందులో భాగంగానే కుల్ఫీకి బంగారు కవర్ చుట్టి అందిస్తున్నారు. కుల్ఫీ తయారీ కోసం ఫతేహాబాద్ నుంచి పాలను తీసుకొస్తారు. వాటిని సన్నని సెగ మీద వేడి చేస్తారు. సాంప్రదాయకంగా, కుల్ఫీని కుండలో తయారు చేస్తారు. వాటిని కుల్ఫీ పీసెస్ గా చేసి ఫ్రిజ్ లో పెడతారు. కస్టమర్లకు ఇష్టమైన కుల్ఫీని అందిస్తారు. బంగారు కుల్ఫీ కావాలి అనుకునే వారికి కుల్ఫీ చుట్టూ బంగారం పేపర్ చుట్టి అందిస్తున్నారు. ఈ పేపర్ కుల్ఫీని తింటున్నప్పుడు నెమ్మదిగా కరిగి నోట్లోకి వెళ్తుంది. ప్రస్తుతం గోల్డ్ కుల్ఫీ బాగా ఫేమస్ అయ్యింది. బంగారు కుల్ఫీ ధరను రూ. 2,999గా నిర్ణయించారు. బంటీ దుకాణానికి కస్టమర్ల తాకిడి కూడా బాగా పెరిగింది. ప్రస్తుతం ఈ గోల్డ్ కుల్ఫీకి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట బాగా వైరల్ అవున్నాయి.

వీడియో: తాతకు మనవడి అదిరిపోయే రిటర్న్ గిఫ్ట్.. కళ్లు చెమ్మగిల్లుతాయి..

ప్రతి పిల్లాడికి తాత, నానమ్మలతో ఎన్నో అద్భుతమైన క్షణాలు ఉంటాయి. కనేది తల్లిదండ్రులే అయినా అల్లారు ముద్దుగా పెంచేది మాత్రం తాతానానమ్మలే. వారికి మనవడు, మనవరాలు అంటే ఎనలేని ఆప్యాయత ఉంటుంది. వారిని కాలు కింద పెట్టకుండా చూసుకుంటారు. పిల్లల్ని ఎంతో గారం చేస్తారు. ఏ మనవడు ఫస్ట్ సైకిల్ ఎక్కినా, బైక్ ఎక్కినా అది తాతదే అయి ఉంటుంది. మొదట లోకాన్ని చూడటం మొదలు పెట్టేది తాత భుజాల మీద అనే చెప్పాలి. అలాంటి తాతకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే అవకాశం అందరూ మనవళ్లకు రాకపోవచ్చు. కానీ, ఈ మనవడు మాత్రం కాస్త లక్కీ అనే చెప్పాలి. తన తాతకు అదిరిపోయే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తాతకు మనవడు అంటే ఒక హీరో. చిన్నప్పటి నుంచి అలాగే చూసుకుంటారు. బండి మీద ఎక్కించుకుని ఊరు మొత్తం తిప్పి తీసుకొస్తారు. అలాగే ఈ తాత కూడా తన మనవడిని తన టీవీఎస్ 50పై ఎక్కించుకుని చిన్నప్పుడు ఊరంతే తిప్పేవాడు. ఆ మనవడు ఇప్పుడు పైలట్ అయ్యాడు. ఆ పైలట్ మనవడు తన తాతకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. విషయం ఏంటంటే.. తమిళనాడుకు చెందిన ప్రదీప్ కృష్ణన్ పైలట్ గా చేస్తున్నాడు. అతను ఫ్లై చేసే ఇండిగో విమానంలో తన కుటుంబం కూడా ఉంది. తన తల్లి, తాత, నానమ్మలు అదే విమానంలో ప్రయాణిస్తున్నారు.

చిన్నతనంలో తనను టీవీఎస్ 50 మీద ఎక్కించుకుని తిప్పిన తాతకు ఈ పైలట్ మనవడు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నాడు. తన కుటుంబం ఆ విమానంలో ఉన్న విషయాన్ని ప్రయాణికులతో పంచుకున్నాడు. అలాగే తన తాత గురించి ప్రత్యేకించి చెప్పుకొచ్చాడు. తన చిన్నతనంలో ఎక్కువ శాతం తాత బండి మీద వెనకాల కూర్చుని తిరిగిన విషయాన్ని గుర్తుచేసుకున్నాడు. ఇలా తన తాత మొదటిసారి విమానం ఎక్కడం.. అది కూడా తాను ఫ్లై చేసే విమానం ఎక్కడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. తాతను పరిచయం చేస్తూ.. అందరూ హాయ్ చెప్పాలని ప్రయాణికులను కోరాడు. ప్రయాణికులు అంతా చప్పట్లు కొడుతూ తాతకు స్వాగతం పలికారు.

తన కుమారుడు చేసిన ఈ పని చూసి ఆ తల్లి కళ్లు చెమ్మగిల్లాయి. ఈ వీడియో తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. ప్రతి పైలట్ డ్రీమ్ తమ కుటుంబాన్ని తాము నడిపే విమానంలో తిప్పడమే అంటూ చెప్పుకొచ్చాడు. పైలట్ ప్రదీప్ పోస్ట్ చేసిన ఈ వీడియో చూసి నెటిజన్స్ ఎమోషనల్ అవుతున్నారు. ఇలాంటి మనవడు ఉన్నందుకు ఆ తాత ఎంతో లక్కీ అంటూ చెప్తున్నారు. నిజంగా ప్రదీప్ ని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఐస్‌ బాత్‌తో మ్యాజిక్‌..! అందుకే సెలబ్రిటీలకు అంత పిచ్చి..! ఆ కారణాలు తెలిస్తే..

సోషల్ మీడియాలో చాలా ట్రెండ్స్ తరచుగా పుట్టుకొస్తున్నాయి. ఆహారం నుండి ఆరోగ్యం వరకు ప్రతిరోజూ ఒక కొత్త ట్రెండ్ కనిపిస్తుంది. ఈ ట్రెండ్‌లో ఇప్పుడు ఐస్ బాత్ ఒకటి. సోషల్ మీడియాలోప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ మధ్య కాలంలో చాలా మంది సెలబ్రిటీలు ఐస్ బాత్ చేస్తూ కనిపిస్తున్నారు. ఐస్ బాత్ అంటే.. చల్లటి నీటిలో స్నానం చేయడం.. ఈ రోజుల్లో చాలా మంది సెలబ్రిటీలు ఐస్ బాత్ చేస్తున్నారు. గత కొంత కాలంగా సెలబ్రిటీలు, సామాన్యుల మధ్య దీని ట్రెండ్ వేగంగా పెరిగింది. దీనినే క్రయోథెరపీ అని కూడా అంటారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అంతే కాదు చర్మానికి, మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. దాని అద్భుతమైన ప్రయోజనాలను తెలుసుకుందాం.

ఐస్ బాత్ అంటే ఏమిటి?

ఐస్ బాత్ అంటే చల్లటి నీటిలో స్నానం చేయటం. దీనినే చల్లని నీటిలో డిప్ లేదా క్రియోథెరపీ అని కూడా అంటారు. ఇందులో భాగంగా ఆ వ్యక్తిని 11 నుంచి 15 నిమిషాలు నీటిలో ఉంచుతారు. ఈ నీటిని 50 నుంచి 59 డిగ్రీల ఫారెన్ హీట్ మధ్య చల్లబరుస్తారు. దీన్ని సాధారణంగా వ్యాయామం తర్వాత ఆరోగ్య ప్రయోజనాల కోసం అథ్లెట్లు ఎక్కువగా ఉపయోగిస్తారు. కానీ, ప్రస్తుతం చాలా మంది సెలబ్రిటీలు కూడా ఐస్‌ బాత్‌ ట్రీట్‌మెంట్‌ ను అలవాటుగా చేసుకుంటున్నారు.
ఐస్‌ బాత్‌తో కండరాల రికవరీని వేగవంతం చేస్తుంది. గాయాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఎక్కువ వ్యాయామం, శారీరక శ్రమ చేసిన తర్వాత ఐస్ బాత్ చేస్తే శరీర మంట, కండరాల నొప్పి చాలా వరకు తగ్గుతుందని చెబుతారు. అంతేకాదు.. ఐస్‌ బాత్‌తో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. గడ్డకట్టే నీటిలో స్నానం చేయడం ద్వారా దాని చల్లని ఉష్ణోగ్రత ప్రసరణను ప్రేరేపిస్తుంది. ఇది కండరాలకు రక్త ప్రవాహాన్ని, ఆక్సిజన్ పంపిణీని పెంచుతుంది.

ఐస్‌ బాత్‌ మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మంచి మానసిక ప్రశాంతతను అందజేస్తుంది. ఇలా చేయడం వల్ల విశ్రాంతిని ప్రోత్సహిస్తుంది. ఇది నిరాశ, ఆందోళన లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది . రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఐస్ వాటర్ తో స్నానం చేయడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. వ్యాధులు, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. ఆరోగ్యంతో పాటు, ఐస్ బాత్ మన చర్మానికి కూడా చాలా ప్రయోజనకరంగా పనిచేస్తుంది. ఐస్‌ బాత్‌ చల్లని ఉష్ణోగ్రత చర్మ రంధ్రాలను బిగించి, మంటను తగ్గించడం, గ్లోను ప్రోత్సహించడం ద్వారా చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇలా ఆరోగ్యంతో పాటు అందానికి మూలం ఐస్‌ బాత్..అందుకే సెలబ్రిటీల్లో అంతా క్రేజ్‌.

Cumin Water: జీలకర్ర నీరు పరగడుపున తాగడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా? ఈ 4 వ్యాధులు పరార్‌..

జీలకర్ర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది అందరి ఇళ్లలో ప్రతి వంటగదిలో అందుబాటులో ఉంటుంది. జీలకర్ర అనేది ప్రతి వంటల్లో ఉపయోగిస్తుంటారు. దీని వల్ల ఆహారం రుచిగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. జీలకర్ర వాడకం ఆరోగ్య ప్రయోజనాలలో కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రముఖ డైటీషియన్ ఆయుషి యాదవ్ మాట్లాడుతూ రోజూ జీలకర్ర నీటిని తాగితే అద్భుతమైన..
జీలకర్ర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది అందరి ఇళ్లలో ప్రతి వంటగదిలో అందుబాటులో ఉంటుంది. జీలకర్ర అనేది ప్రతి వంటల్లో ఉపయోగిస్తుంటారు. దీని వల్ల ఆహారం రుచిగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. జీలకర్ర వాడకం ఆరోగ్య ప్రయోజనాలలో కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రముఖ డైటీషియన్ ఆయుషి యాదవ్ మాట్లాడుతూ రోజూ జీలకర్ర నీటిని తాగితే అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయని చెప్పారు. జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి, దాని నీటిని తాగడం చాలా ముఖ్యం.

జీలకర్ర నీటిని ఖాళీ కడుపుతో తాగితే శరీరంలోని అనేక వ్యాధులు నయమవుతాయి. బలహీనమైన శరీరాన్ని బలోపేతం చేయడంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని రోజూ తాగడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇందులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. జీలకర్రలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది మీ వ్యాధిని నయం చేయడంలో మీకు చాలా సహాయపడుతుంది. మీరు ప్రతిరోజూ ఉదయం తప్పనిసరిగా జీలకర్ర నీటిని తాగాలి. ఇది శరీరంలో వాపులను తగ్గించడానికి కూడా పనిచేస్తుంది. ఇది మాత్రమే కాదు, వివిధ వ్యాధుల నుండి మిమ్మల్ని దూరంగా ఉంచడంలో ఇది చాలా సహాయపడుతుంది. అలాగే శరీరంలోని మురికిని తొలగిస్తుంది. చాలా మందికి శ్వాస సంబంధిత సమస్యలు చాలా ఉన్నాయి. మీరు ఖాళీ కడుపుతో ప్రతిరోజూ జీలకర్ర నీటిని తాగితే, మీరు శ్వాస ఆరోగ్యానికి సంబంధించిన అనేక సమస్యల నుండి బయటపడవచ్చు. శ్వాసకోశంలో ఉపశమనం కలిగించవచ్చు. మీరు దాని నీటిని చాలా వేడిగా తాగాల్సిన అవసరం లేదు. మీరు దానిని గోరువెచ్చగా మాత్రమే తాగాలి.జీలకర్ర నీటిలో యాంటీఆక్సిడెంట్ పదార్థాలు ఉన్నాయి. ఇది మీ శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో మీకు సహాయపడుతుంది. ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన తర్వాత ఈ నీటిని తాగాలి.

Amazon Smart TV Offers: మీ హాల్లోకి పెద్ద టీవీ కొనాలనుకుంటున్నారా? అమెజాన్‌లో భారీ డీల్స్‌.. మిస్‌ కాకండి..

మీ ఇంట్లో హాల్లో పెట్టుకునేందుకు పెద్ద టీవీ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే. మార్కెట్లో టాప్‌ బ్రాండ్లకు సంబంధించిన 50 అంగుళాల టీవీలపై ప్రముఖ ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫారం అమెజాన్లో భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో శామ్సంగ్‌, ఎల్జీ, సోనీ, షావోమీ వంటి ప్రముఖ బ్రాండ్లు కూడా ఉన్నాయి. కేవలం పరిమాణం మాత్రమే కాకుండా.. అధిక రిజల్యూషన్‌తో, మంచి సౌండ్‌ క్లారిటీతో కూడిన టీవీలు సేల్లో ఉన్నాయి.
మీ ఇంట్లో హాల్లో పెట్టుకునేందుకు పెద్ద టీవీ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే. మార్కెట్లో టాప్‌ బ్రాండ్లకు సంబంధించిన 50 అంగుళాల టీవీలపై ప్రముఖ ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫారం అమెజాన్లో భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో శామ్సంగ్‌, ఎల్జీ, సోనీ, షావోమీ వంటి ప్రముఖ బ్రాండ్లు కూడా ఉన్నాయి. కేవలం పరిమాణం మాత్రమే కాకుండా.. అధిక రిజల్యూషన్‌తో, మంచి సౌండ్‌ క్లారిటీతో కూడిన టీవీలు సేల్లో ఉన్నాయి. 4కే రిజల్యూషన్‌, హెచ్‌డీఆర్‌(హై డైనమిక్‌ రేంజ్‌), అత్యాధునిక సాంకేతికతతో కూడాని ఫీచర్లు, ఫంక్షనాలిటీలో కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. వాటిల్లో తక్కువ ధరకు లభ్యమయ్యే 50 అంగుళాల స్క్రీన్‌ కలిగిన టీవీలను మీకు పరిచయం చేస్తున్నాం.

సోనీ బ్రేవియా 50 అంగుళాల స్మార్ట్‌ ఎల్‌ఈడీ గూగుల్‌ టీవీ..
అత్యుత్తమ స్మార్ట్ టీవీల్లో ఇది ఒకటి. దీనిలో 4కే రిజల్యూషన్‌తో కూడిన విజువల్స్‌ వస్తాయి. 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో అసమానమైన స్పష్టతను అదిస్తుంది. 178 డిగ్రీల విస్తృత వీక్షణ కోణంతో, గదిలోని ప్రతి మూలకు ఒకేలా చిత్రం కనిపించేలా చేస్తుంది. మూడు హెచ్‌డీఎంఐ పోర్ట్‌లు, యూఎస్‌బీ పోర్ట్‌ కనెక్టివిటీని అందిస్తుంది. 20 వాట్స్ అవుట్‌పుట్, డాల్బీ ఆడియోతో క్రిస్టల్-క్లియర్ ఆడియోను అందిస్తుంది. గూగుల్‌ టీవీ వాయిస్‌ సెర్చింగ్‌క సపోర్టు చేస్తుంది. నెట్‌ఫిక్స్‌, అమెజాన్‌, ప్రైమ్‌ వీడియో, డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌ వంటి ప్రీ ఇన్‌స్టాల్డ్‌ యాప్స్‌ ఉంటాయి. టెలివిజన్ యాపిల్‌ ఎయిర్‌ ప్లే, యాపిల్‌ హోమ్‌ కిట్‌, అలెక్సా వంటి ఫీచర్స్‌ ఉంటాయి. ఈ టీవీ ధర అమెజాన్‌లో ఆఫర్‌పై రూ. 50,999గా ఉంది.

శామ్సంగ్‌ 50 అంగుళాల 4కే అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ క్యూఎల్‌ఈడీ టీవీ..
దీనిలో మూడు హెచ్‌డీఎంఐ, రెండు యూఎస్‌బీ పోర్టులు ఉంటాయి. టీవీ నుండి మొబైల్ మిర్రరింగ్, ట్యాప్ వ్యూ, యాంబియంట్ మోడ్+తో సహా పలు స్మార్ట్ ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. డాల్బీ అట్మాస్ టెక్నాలజీ, అడాప్టివ్ సౌండ్+తో లీనమయ్యే ధ్వనిని అందిస్తుంది. అలాగే యాక్టివ్ వాయిస్ యాంప్లిఫైయర్ ధ్వనించే వాతావరణంలో కూడా క్రిస్టల్-క్లియర్ డైలాగ్‌నుఅందిస్తుంది. అమెజాన్ ఆఫర్‌లతో దీనిని రూ. 69,990కి కొనుగోలు చేయొచ్చు.
ఎల్‌జీ 50 అంగుళాల 4కే అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్‌ ఎల్‌ఈడీ టీవీ..
ఈ టీవీలోని డిస్‌ప్లే 4కే అల్ట్రా హెచ్‌డీ రిజల్యూషన్‌తో 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. ఇన్‌బిల్ట్‌ వైఫై, మూడు హెచ్‌డీఎంఐ, రెండు యూఎస్‌బీ పోర్టులు ఉంటాయి. వర్చువల్ సరౌండ్ 5.1 అప్-మిక్స్ అనుభవం కోసం 20 వాట్స్ అవుట్‌పుట్, ఆల్ సౌండ్ టెక్నాలజీతో రిచ్, లీనమయ్యే సౌండ్‌ను అందిస్తుంది. ఏఐ థింక్యూ ఆధారంగా పనిచేసే యాపిల్‌ ఎయిర్‌ ప్లే 2 అండ్‌ హోమ్‌ కిట్‌ అమర్చి ఉంటుంది. ఏ5 ఆల్‌ ప్రాసెసర్‌ 4కే జెన్‌6, హెచ్‌డీఆర్‌10, గేమ్‌ ఆప్టిమైజర్‌, ఫిల్మ్‌మేకర్‌ మోడ్‌ వంటివి ఉంటాయి. దీని ధర అమెజాన్లో రూ. 40,990గా ఉంది.

షావోమీ 50 అంగుళాల స్మార్ట్‌ ఆండ్రాయిడ్‌ ఎల్‌ఈడీ టీవీ..
ఈ టీవీలో 4కే అల్ట్రా హెచ్‌డీ రిజల్యూషన్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన డిస్‌ ప్లే ఉంటుంది.. 178 డిగ్రీల° విస్తృత వీక్షణ కోణాన్ని అందిస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై, 3 హెచ్‌డీఎంఐ పోర్ట్‌లు, 2 యూఎస్‌బీ పోర్ట్‌లతో కనెక్టివిటీ ఉంటుంది. 30 వాట్స్ అవుట్‌పుట్ సౌండ్, డాల్బీ ఆడియో, కిడ్స్ మోడ్, యూనివర్సల్ సెర్చ్, ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ + హాట్‌స్టార్ వంటి ప్రసిద్ధ యాప్‌లకు మద్దతు ఉంటుంది. అమెజాన్లో ఈ టీవీ ధర రూ. 34,999గా ఉంది.

వీయూ 50 అంగుళాల స్మార్ట్ ఎల్‌ఈడీ గూగుల్‌ టీవీ..
ఈ టీవీ కూడా 4కే అల్ట్రా హెచ్‌డీ రిజల్యూషన్, 178-డిగ్రీల వైడ్ వ్యూయింగ్ యాంగిల్‌తో వస్తుంది. వైఫై, బ్లూటూత్ 5.1 సామర్థ్యాలతో పాటు 3 హెచ్‌డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్‌బీ పోర్టులు ఉంటాయి. 104 వాట్ డీజే సౌండ్‌తో పాటు అంతర్నిర్మిత సబ్‌వూఫర్, ఇమ్మర్సివ్ ఆడియో కోసం డాల్బీ అట్మాస్ సపోర్ట్‌ ఉంటుంది. గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి కావాల్సిన యాప్స్‌ అందులో వస్తాయి. కిడ్స్ మోడ్, క్రోమ్‌కాస్ట్‌ బిల్ట్-ఇన్ ఫీచర్లు వస్తాయి. యాక్టివ్‌ వాయిస్‌ రిమోట్‌తో హ్యాండ్స్-ఫ్రీ కంట్రోల్‌ ఉంటుంది. అమెజాన్ డీల్స్‌లో ఇప్పుడు ఈ స్మార్ట్‌ టీవీ రూ. 32,999కే కొనుగోలు చేయొచ్చు.

Wooden Comb: జుట్టు దువ్వడానికి ప్లాస్టిక్‌ దువ్వెన మంచిదా? చెక్క దువ్వెన మంచిదా?

జుట్టుకు క్రమం తప్పకుండా నూనె రాసుకుంటూ ఉండటం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే షాంపూ చేసిన తర్వాత కూడా కండీషనర్ ఉపయోగించాలి. కానీ దువ్వెన ఉపయోగించే విషయంలో చాలా మంది తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేస్తుంటారు. జుట్టు సంరక్షణలో షాంపూ-కండీషనర్ ఎంత ముఖ్యమో దువ్వడం కూడా అంతే ముఖ్యం. కానీ దువ్వెన వాడే విషయంలో మనకు అంతగా అవగాహన ఉండదు..
జుట్టుకు క్రమం తప్పకుండా నూనె రాసుకుంటూ ఉండటం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే షాంపూ చేసిన తర్వాత కూడా కండీషనర్ ఉపయోగించాలి. కానీ దువ్వెన ఉపయోగించే విషయంలో చాలా మంది తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేస్తుంటారు. జుట్టు సంరక్షణలో షాంపూ-కండీషనర్ ఎంత ముఖ్యమో దువ్వడం కూడా అంతే ముఖ్యం. కానీ దువ్వెన వాడే విషయంలో మనకు అంతగా అవగాహన ఉండదు.

చాలా మంది జుట్టు దువ్వడానికి ప్లాస్టిక్ దువ్వెనలు ఉపయోగిస్తుంటారు. అలాగే దువ్వెన మురికిగా ఉంటే, దానిని క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. కానీ సమయం లేకపోవడం వల్ల హడావిడిగా అదే దువ్వెనతో దువ్వుతూ ఉంటారు.

ప్లాస్టిక్ దువ్వెనతో జుట్టును దువ్వడం వల్ల ఎక్కువ జుట్టు రాలుతుంది. అంతేకాకుండా ప్లాస్టిక్ దువ్వెనను ఉపయోగించడం వల్ల తలకు సరైన రక్త ప్రసరణ జరగదు. దీనివల్ల జుట్టు సమస్య మరింత పెరుగుతుంది. కాబట్టి జుట్టు సంరక్షణ కోసం చెక్క దువ్వెనను ఎంచుకోవడం మంచిది.

చెక్క దువ్వెనను ఉపయోగించడం వల్ల తలకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీని కారణంగా, ఆక్సిజన్ తగినంత మొత్తంలో జుట్టు మూలాలకు చేరుతుంది. ఇది జుట్టు మూలాలను బలపరుస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. సాధారణంగా స్కాల్ప్ నుంచి సెబమ్ ఉత్పత్తి అవుతుంది. ఆ సెబమ్ మిగిలిన వెంట్రుకలకు చేరకపోతే, అది తలపై పేరుకుపోయి, తలలో జిడ్డుగా మారుతుంది. తల చర్మం జిడ్డుగా మారినప్పుడు చెక్క దువ్వెనను ఉపయోగించడం వల్ల ఈ సెబమ్ స్కాల్ప్‌తో పాటు మిగిలిన జుట్టుకు వ్యాపిస్తుంది.

చుండ్రు, తలపై మృతకణాలు పేరుకుపోవడం అనే సమస్యలు ప్లాస్టిక్ దువ్వెన వల్ల పెరుగుతాయి. కానీ చెక్క దువ్వెనను ఉపయోగించడం వల్ల చుండ్రు సమస్యను సులభంగా నివారించవచ్చు. ప్లాస్టిక్ దువ్వెనతో జుట్టును విడదీయడం కష్టం. కానీ చెక్క దువ్వెనతో జుట్టును దువ్వడం సులువుగా ఉంటుంది. అలాగే చెక్క దువ్వెనలతో జుట్టు చిక్కుతీయడం కూడా చాలా సులభం.

Galaxy m15 5g: సామ్‌సంగ్‌ నుంచి బడ్జెట్‌ 5జీ ఫోన్‌.. రూ. 13 వేలకే..

ప్రస్తుతం 5జీ స్మార్ట్‌ ఫోన్‌ల హవా నడుస్తోంది. దేశంలో 5జీ నెట్‌వర్క్‌ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో కంపెనీలు వరుసగా బడ్జెట్ ధరలో 5జీ ఫోన్‌లను లాంచ్‌ చేస్తూ వస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం సామ్‌సంగ్ సైతం తక్కువ ధరలో 5జీ ఫోన్‌ను తీసుకొస్తోంది. గ్యాలక్సీ ఎమ్‌15 పేరుతో తీసుకొస్తున్న ఈ 5జీ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం సామ్‌సంగ్‌ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎమ్‌15 పేరుతో 5జీ ఫోన్‌ను తీసుకొస్తోంది. ఈ ఫోన్‌ ఏప్రిల్‌ 8వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తుండగా ప్రస్తుతం కంపెనీ ప్రీ బుకింగ్స్‌ను ప్రారంభించింది.

ఇక ఈ స్మార్ట్ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.5 ఇంచెస్‌తో కూడిన సూపర్‌ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. మీడియా టెక్‌ డైమెన్సిటీ 6100 ప్లస్ ప్రాసెసర్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది

కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌ రెయిర్‌ కెమెరాతో కూడిన ట్రిపుల్‌ కెమెరా సెటప్‌ను అందించనున్నారు. 13 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను ఇవ్వనున్నారు. ఈ ఫోన్‌ను 4జీబీ, 6జ జీబీ ర్యామ్‌తో పాటు 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌తో తీసుకురానున్నారు.

ఇక బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 25 వాట్స్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 6000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందిస్తున్నారు. ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 5 ఏళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను ఉచితంగా అందిస్తారు.

ఈ స్మార్ట్ ఫోన్‌ 4జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 13,499కాగా, 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్ ధర రూ. 14,999గా ఉంది. ఈ ఫోన్‌ను సెలెస్టియల్ బ్లూ, స్టోన్‌ గ్రే, బ్లూ టోపేజ్‌ కలర్స్‌లో తీసుకురానున్నారు.

Telangana: తుక్కుగూడ సభ వేదికగా మాస్టర్ స్కెచ్.. కాంగ్రెస్‌లోకి 12 మంది BRS ఎమ్మెల్యేలు..?

ఆపరేషన్ తుక్కుగూడ.. పదిలక్షల మందితో భారీ జన జాతర. రేవంత్‌రెడ్డి కటౌట్ సైజులు నేషనల్ రేంజ్‌కి చేరుకునే వేదిక.. తెలంగాణ కాంగ్రెస్‌ ఖలేజా చూపెట్టడానికి మరో సువర్ణావకాశం.. ఇలా అనేకానేక స్పెషాలిటీస్‌తో ప్రచారం చేసుకుంటోంది హస్తం క్యాడర్. కానీ.. తుక్కుగూడకు సంబంధించి వీటన్నిటికీ మించి సూపర్‌స్పెషాలిటీ ఒకటుంది. రేవంత్‌ రెడ్డి ప్రిస్టీజియస్‌గా భావిస్తున్న ఆ ప్రత్యేకత ఏంటి? బీఆర్‌ఎస్ పార్టీకి షాకిచ్చే ఆ ఎలిమెంట్ ఏమై ఉంటుంది..?
2023… సెప్టెంబర్ 17.. వేదిక తుక్కుగూడ మైదానం.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సమరం కోసం పూరించిన శంఖారావం.. పోటెత్తిన జనం.. చెప్పిమరీ అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ పార్టీ. అందుకే.. తమకు కలిసొచ్చిన తుక్కుగూడ సెంటిమెంట్‌ను లోక్‌సభ ఎన్నికల్లో కూడా రిపీట్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఈనెల ఆరున శనివారం సాయంత్రం జరిగే తుక్కుగూడ జనజాతర సభతో హిస్టరీ రిపీట్‌ చేయాలన్నది రేవంత్ టీమ్ లక్ష్యం. పదిలక్షలమంది జనాన్ని సమీకరించాలన్నది టార్గెట్. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లాంటి జాతీయ నేతలు హాజరయ్యే సభ కనుక దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ.

70 ఎకరాల్లో సభ, 550 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు… వారం రోజులుగా రూపుదిద్దుకుంటున్న సభా వేదిక.. ఆదిలాబాద్ మొద‌లు ఆలంపూర్ వ‌ర‌కు, జహీరాబాద్ నుంచి భ‌ద్రాచ‌లం వ‌ర‌కు జరుగుతున్న జన సమీకరణ… ఇవన్నీ కలిసి తుక్కుగూడ సభ తెలంగాణ రాజకీయాల్లో మోస్ట్‌వాంటెడ్‌గా మార్చేశాయ్. వీటన్నికంటే ముఖ్యంగా పాంచ్‌న్యాయ్-పచీస్ గ్యారంటీస్ పేరుతో లాంచనంగా విడుదలైన కాంగ్రెస్ మేనిఫెస్టో తుక్కుగూడ సభావేదిక మీదే జనానికి పరిచయం కాబోతోంది. అందుకే దేశం చూపు తుక్కుగూడ వైపు అంటూ ప్రచారం చేసుకుంటోంది కాంగ్రెస్ పార్టీ.

కనీసం 13 ఎంపీ స్థానాలు గెలవాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ.. ఆ మేరకు పార్టీ లీడర్‌షిప్‌ను బలోపేతం చేసుకుంటోంది. గేట్లెత్తేశామని ఓపెన్‌గా చెప్పిమరీ ఆపరేషన్ ఆకర్ష్ షురూ చేస్తోంది. అందుకే… తుక్కుగూడ సభను చేరికల సభగా కూడా అంతర్గతంగా ప్రకటించుకుంటోంది. కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలుంటాయని ఇప్పటికే సంకేతాలు కూడా వచ్చేశాయ్.

హైకమాండ్ సమక్షంలో పార్టీలో చేర్చుకునేందుకు కొన్నాళ్లుగా ప్రతిపక్ష నేతలకు గాలం వేస్తోంది కాంగ్రెస్ పార్టీ. టచ్‌లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతూ వస్తోంది టీమ్ ఆఫ్ రేవంత్ రెడ్డి. ఏ పార్టీ నుంచి ఎవరెవరు ఎంతెంతమంది కాంగ్రెస్‌లో చేరతారనే చర్చ కూడా జోరుగా జరుగుతోంది. ఒక్క గులాబీ పార్టీ నుంచే ఏకంగా 12 మంది కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరుతారని ప్రచారం జరుగుతున్న ఎమ్మెల్యేలు వీరే…

కాలె యాదయ్య – చేవెళ్ల
తెల్లం వెంకట్‌రావు- భద్రాచలం
గంగుల కమలాకర్- కరీంనగర్
అరికెపూడి గాంధీ- శేరిలింగంపల్లి
కోవా లక్ష్మి – అసిఫాబాద్
సుధీర్ రెడ్డి – ఎల్‌బీనగర్
ప్రకాష్ గౌడ్- రాజేందర్ నగర్
కె. మాణిక్‌ రావ్- జహీరాబాద్
ముఠా గోపాల్ -ముషీరాబాద్
కాలేరు వెంకటేష్- అంబర్ పేట్
మాగుంటి గోపినాథ్ -జూబ్లీహిల్స్
బండారి లక్ష్మారెడ్డి – ఉప్పల్
కాంగ్రెస్‌తో సంప్రదింపులు జరుపుతున్న ఈ 12 మందిలో కరడుగట్టిన బీఆర్‌ఎస్‌ నేతలు కూడా ఉన్నారు. వీరిలో ఎంతమంది కాంగ్రెస్‌లో చేరతారు.. ఎంతమంది వెనక్కు తగ్గుతారు అనేది ఆసక్తికరం. కానీ. బీఆర్‌ఎస్‌కు భారీ షాక్ ఇవ్వడానికి కాంగ్రెస్‌ పార్టీ సీరియస్‌గా వర్కవుట్ చేస్తోంది. అటు.. చేరికల విషయంలో కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గతంగా తర్జన భర్జన మాత్రం ఆగలేదు.

బీఆర్‌ఎస్ పార్టీ మళ్లీ లేవకుండా దెబ్బకొట్టాలని చూస్తున్న రేవంత్‌రెడ్డి మాత్రం.. ఆపరేషన్ ఆకర్ష్‌ని గట్టిగానే ప్రయోగిస్తున్నారు. ఒకవైపు జనసమీకరణ.. మరోవైపు చేరికల సునామీ.. ఇలా రెండు విధాలుగా తుక్కుగూడ సభను విజయవంతం చేసి.. జాతీయస్థాయిలో ఢిల్లీ పెద్దల సమక్షంలో తన స్టామినాను మరోసారి చాటుకోవాలన్నది రేవంత్‌రెడ్డి సంకల్పంగా తెలుస్తోంది.

Delhi: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. సీబీఐ విచారణకు ఆదేశించిన ఢిల్లీ కోర్టు..

ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయి తిహార్ జైలులో ఉన్న కవితను విచారించేందు సీబీఐ సిద్ధమైంది. ఈ క్రమంలో కవితను విచారించేందుకు కోర్టును అనుమతి కోరింది సీబీఐ. కోర్టు నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో జైల్లోనే కవిత విచారణ జరగనుంది. లిక్కర్ స్కాం కేసులో మార్చి 15న ఎమ్మెల్సీ కవితను ఈడీ అదుపులోకి తీసుకుంది. మరో వైపు ఇదే కేసులో విచారించేందుకు సీబీఐ ఎమ్మెల్సీ కవితకు పలుమార్లు నోటీసులు పంపించగా.. కవిత మాత్రం సీబీఐ నోటీసులు పట్టించుకోకుండా విచారణకు హాజరు కాలేదు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత పేరును నిందితురాలిగా ఛార్జిషీట్‎లో సీబీఐ చేర్చింది. ఈ మేరకు నిందితురాలిగా పేర్కొంటూ 41A కింద సమన్లు పంపింది. ఇటీవల లిక్కర్ స్కాం కేసులో ఫిబ్రవరి 26న ఢిల్లీలోని తమ కార్యాలయానికి విచారణకు రావాలని సీబీఐ కవితకు నోటీసులు పంపింది. అయినప్పటికీ కవిత విచారణకు హాజరుకాకపోవడంతో జైల్లోనే కవితను విచారించేందుకు కోర్టు అనుమతి కోరింది సీబీఐ.

గడిచిన 20 రోజులుగా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవిత తన 16 ఏళ్ల కుమారుడి పరీక్షల కారణంగా తనకు మధ్యంతర బెయిల్‌ను అనుమతి ఇవ్వాలని గురువారం కోర్టును కోరారు. ఇదే క్రమంలో ఈడీ, సీబీఐ కేసులతో ప్రమేయం ఉన్నందున బెయిల్ మంజూరు చేయొద్దని ఈడీ తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. దీనిపై సుదీర్ఘ వాదనలు విన్న ఢిల్లీ అవెన్యూ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరుపై తీర్పును రిజర్వ్ చేసింది. ఏప్రిల్ 8కు వాయిదా వేసింది. సోమవారం ఉదయం 10.30కి కవితను కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. దీంతో ఆమె కేసుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా కవితను విచారించేందుకు సీబీఐ ఏజెన్సీకి అనుమతి ఇవ్వగా మధ్యంతర బెయిల్‎పై ఎలాంటి తీర్పు వెలువడుతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Realme C65: రూ.12 వేలలోపే కొత్త బడ్జెట్ ఫోన్ లాంచ్ చేసిన రియల్‌మీ – కేవలం 30 సెకన్ల ఛార్జింగ్‌తో!

Realme C65 Launched: రియల్‌మీ సీ65 స్మార్ట్ ఫోన్ వియత్నాంలో లాంచ్ అయింది. ఇందులో రెండు కలర్ ఆప్షన్లు, మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్‌లో 6.67 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఉంది. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్లలో ఉన్నాయి. ఈ ఫోన్ మనదేశంలో కూడా త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

రియల్‌మీ సీ65 ధర (Realme C65 Price)
ఈ స్మార్ట్ ఫోన్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇందులో ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర 36,90,000 వియత్నాం డాంగ్‌లుగా (మనదేశ కరెన్సీలో సుమారు రూ.12,000) నిర్ణయించారు. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 42,90,000 వియత్నాం డాంగ్‌లుగానూ (మనదేశ కరెన్సీలో సుమారు రూ.14,000), 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 47,90,000 వియత్నాం డాంగ్‌లుగా (మనదేశ కరెన్సీలో సుమారు రూ.16,000) ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్‌కు సంబంధించిన సేల్ వియత్నాంలో జరుగుతోంది. మనదేశంలో ఈ ఫోన్ ధర రూ.10 వేలలోపే ఉండే అవకాశం ఉంది.
రియల్‌మీ సీ65 స్పెసిఫికేషన్లు (Realme C65 Specifications)
ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మీ యూఐ 5.0 ఆపరేటింగ్ సిస్టంపై పని చేయనుంది. ఇందులో 6.67 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ టు బాడీ రేషియో 88.7 శాతంగా ఉంది. 12ఎన్ఎం మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌పై రియల్‌మీ సీ65 రన్ కానుంది. 8 జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ అందించారు. దీన్ని వర్చువల్‌లో మరో 8 జీబీ పెంచుకోవచ్చు.

ఇక కెమెరాల విషయానికి వస్తే… ఫోన్ వెనకవైపు రెండు సెన్సార్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతో పాటు మరో సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందింాచరు. ఈ ఫోన్‌లో 256 జీబీ వరకు స్టోరేజ్ ఉంది. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 2 టీబీ వరకు పెంచుకోవచ్చు.

బ్లూటూత్ వీ5.3, జీపీఎస్, ఏ-జీపీఎస్, గ్లోనాస్, బైదు, గెలీలియో, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, వైఫై, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఉన్నాయి. ఐపీ54 వాటర్ రెసిస్టెంట్ బిల్ట్‌ను ఈ ఫోన్‌లో అందించారు. యాక్సెలరోమీటర్, గైరోస్కోప్, లైట్ సెన్సార్, మ్యాగ్నెటిక్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్‌లను ఈ ఫోన్‌లో అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ పక్క భాగంలో ఉంది. డైనమిక్ బటన్, ఎయిర్ జెస్చర్ సపోర్ట్ కూడా ఈ ఫోన్‌లో చూడవచ్చు.

రియల్‌మీ సీ65లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. కేవలం 30 సెకన్ల పాటు ఫోన్‌ను ఛార్జింగ్ చేస్తే 43 నిమిషాల కాలింగ్ టైమ్‌ను ఇది అందించనుంది. దీని మందం 0.76 సెంటీమీటర్లు కాగా బరువు 185 గ్రాములుగా ఉంది.

Success Story: రూ.500తో ముంబైలో అడుగుపెట్టి రూ.5,000 కోట్ల సంపాదన..

Dr.A. Velumani: అందరి దారి వేరు ఆయన ఒక్కడి దారు వేరు. పేదరికంలో పుట్టి పెరగటమే తన విజయానికి నిజమైన బలమని చెబుతారు డాక్టర్ వేలుమణి. తమిళనాడులో పుట్టి పెరిగిన ఆయన ఉద్యోగం కోసం ముంబై వెళ్లి వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన తీరు ఖర్చితంగా నేటి యువతకు పెద్ద పాఠం.

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది దేశంలో అతిపెద్ద థైరాయిడ్ టెస్టింగ్ సెంటర్లను ఏర్పాటు చేసిన థైరోకేర్ సంస్థ ఫౌండర్ డాక్టర్ ఆరోగ్యసామి వేలుమణి ప్రయాణం గురించే. కోయంబత్తూరులో ఫ్రెషర్ కావటంతో 50 ఉద్యోగాలకు రిజెక్ట్ అయ్యాక ఒక జాబ్ వచ్చింది. కంపెనీ మూతపడటంతో రూ.500తో ముంబైలో ప్రభుత్వ ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వచ్చి సెలక్ట్ అయ్యారు. అక్కడే పీహెచ్డీ వరకు చదువు పూర్తి చేశారు.

ఉద్యోగం మానేయాలని తీసుకున్న సడెన్ నిర్ణయం నుంచి పుట్టిందే వ్యాపార ఆలోచన. అప్పట్లో రూ.2 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న ఆయన థైరాయిడ్ టెస్టింగ్ గురించి తన చదువులో నేర్చుకున్న కీలక విషయాలతో తక్కువ ధరకే టెస్టింగ్ సేవలను అందించటం ప్రారంభించారు. తొలుత ఫాంచైజింగ్ మోడల్ లో నాణ్యమైన సేవలను సరసమైన ధరలకు అందించి దేశమంతటా వ్యాపారాన్ని విస్తరించారు. అయితే తన కంపెనీలో కేవలం ఫెషర్లకు మాత్రమే ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించుకుని దానినే కొనసాగించారు.

కరోనా సమయంలో దేశంలో టెస్టింగ్ కోసం తొలుత కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం పొందిన తొలి ప్రైవేట్ ల్యాబొరేటరిగీ థైరోకేర్ నిలిచింది. అలా ఒక్క రూపాయి కూడా అప్పు లేకుండా 40 శాతం లాభాలతో కంపెనీని ఏకండా 25 ఏళ్లకు పైగా నిరంతంగా వృద్ధి చెందేలా చేశారు వేలుమణి. భార్య సాయంతోనే తానింతటి వాడనయ్యానని ఎప్పుడూ గుర్తుచేసుకుంటారు. తన ప్రయాణంలో తనను ముందుకు నడిపిన చాలా మందికి కృతజ్ఞతలు చెబుతుంటారు. అలా కేవలం రూ.500తో ముంబైలో ప్రారంభమైన ప్రయాణం కంపెనీని భార్య మరణం తర్వాత 2016లో రూ.5000 కోట్లకు విక్రయించి ముగించారు. ప్రస్తుతం దేశంలోని అనేక మంది యువ వ్యాపారవేత్తలకు గైడెన్స్ ఇస్తూ ముందుకు సాగుతున్నారు. వ్యాపారంలో వేగం కంటే విజయం సాధించటం ముఖ్యమని ఆయనను చూస్తేనే తెలుస్తుంది.

TTD: తిరుమల దర్శనానికి వచ్చే భక్తులకు టిటిడి గుడ్ న్యూస్..!!

వేసవి సెలవులకు తిరుమలకు వచ్చే భక్తులకు టిటిడి గుడ్ న్యూస్ చెప్పింది. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలకు వచ్చే యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మూడు నెలల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు ఈవో ధర్మారెడ్డి ప్రకటించారు. సాధారణ భక్తులకు ఎక్కువ దర్శన వేళలు కల్పించడానికి సిఫార్సు లేఖలపై విఐపి దర్శనాన్ని రద్దు చేసినట్లు వివరించారు. క్యూలైన్లు కంపార్ట్మెంట్లో వేచి ఉండే భక్తులకు అన్న ప్రసాదం, మజ్జిగ, వైద్య సదుపాయాలు నిరంతరం అందిస్తామని ప్రకటించారు. ఇప్పటికే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో విఐపి లు నేరుగా వచ్చే వారికి మాత్రమే టిటిడి బ్రేక్ దర్శనం కల్పిస్తుంది. సిఫార్సు లేఖలను పూర్తిగా నిలిపివేశారు. దీంతో సాధారణ భక్తులకు వేగంగా దర్శన అందుబాటులోకి వచ్చింది. ఇదే సమయంలో వేసవి రద్దీ వేల ఎక్కువ సంఖ్యలో వచ్చే భక్తులకు సేవలు అందించేందుకు 2500 మంది శ్రీవారి సేవకులను నియమించారు. మాడవీధులు, నారాయణగిరి గార్డెన్స్ వెంబడి కూల్ పెయింటింగ్స్, డ్రింకింగ్ వాటర్ పాయింట్లు నెలకొల్పారు.

వేసవి వేడి రోజులలో శేషాచల అటవీ ప్రాంతాల్లో ఫ్లాష్ అగ్ని ప్రమాదాలను నివారించడానికి టీటీడీ అటవీశాఖ, ప్రభుత్వ అగ్నిమాపక శాఖ ద్వారా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ధర్మారెడ్డి వెల్లడించారు. ఈనెల 9న ఉగాదినాడు తిరుమలలో ఆస్థానం నిర్వహించనున్నారు. ఇప్పటికే అవసరమైన ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. సెలవులు ప్రారంభం కానుండటంతో ఈ నెలాఖరు నుంచి రెండు నెలలపాటు తిరుమలకు వచ్చే భక్తుల రద్దీ సంఖ్య ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు ఈవో ధర్మారెడ్డి వివరించారు.

Viral Pic: ఆ ఒక్కడే రోడ్డు మధ్యలోనే నిలబడ్డాడు.. రోడ్డేయకుండా ఆపాడు

Viral Pic: మనుషులు పెరుగుతున్నారు.. అవసరాలు పెరుగుతున్నాయి. ఇలాంటప్పుడు కొత్త రోడ్లు వేయడం, నూతన వంతెనలు నిర్మించడం, అధునాతన ఫ్లై ఓవర్లు ఏర్పాటు చేయడం అనివార్యమవుతోంది. ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రాంతాలలో రోడ్లను విస్తరించాలి అనుకున్నప్పుడు అటు ఇటు పక్కల ఉన్న భవనాలను తొలగించాల్సి వస్తోంది.. కోర్టు కేసులు, మన్నుమశానం వంటివి అడ్డు తగలకుంటే.. ప్రభుత్వాలు ఇలాంటి పనులను సులభంగానే చేయగలుగుతున్నాయి. ఇలా రోడ్లను విస్తరించకుంటే ప్రమాదాలు జరుగుతున్నాయి. ఫలితంగా అపారంగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తున్నాయి. మనదేశంలో రోడ్డు విస్తరణ, లేక ఇంకా ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటే ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కోర్టు కేసుల నుంచి మొదలు పెడితే స్థానికుల అభ్యంతరాల వరకు అన్నీ ఇబ్బందులే. అందువల్లే మనదేశంలో నేటికీ చాలా ప్రాంతాల్లో రోడ్లు విస్తరణకు నోచుకోలేదు.. ఇప్పుడంటే కొత్త కొత్త హైవేలు నిర్మాణమవుతున్నాయి. వంతెనలు ఏర్పాటవుతున్నాయి. కానీ ఒకప్పుడు ఇలా ఉండేది కాదు.

మన దేశం సంగతి పక్కన పెడితే.. నిర్మాణరంగంలో మన పొరుగున ఉన్న చైనా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. అనితర సాధ్యమైన స్థాయిలో భవనాలను నిర్మిస్తోంది. సముద్ర జలాల మీదుగా వంతెనలు ఏర్పాటు చేస్తోంది. ప్రతిష్టాత్మకమైన త్రీ గోర్జెస్ వంటి హైడల్ ప్రాజెక్టును నిర్మించింది. ఇలా చెప్పుకుంటూ పోతే చైనా నిర్మాణ కౌశలం ఎంతో విస్తారమైనది.. కమ్యూనిస్టుల పాలనలో ఉన్న ఆ దేశంలో కూడా రోడ్ల విస్తరణ లేదా నూతన వంతెన నిర్మాణంలో మన దేశం లాగానే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలా ఏర్పడిన ఓ ఇబ్బంది వంతెన నిర్మాణ ఆకృతిని పూర్తిగా మార్చేసింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఫోటో ప్రకారం.. చైనాలో ఓ ప్రాంతంలో అతిపెద్ద వంతెన నిర్మించారు. ఆ వంతెన చూసేందుకు చాలా బాగుంది. అటు ఇటు నాలుగు లైన్ల వరుసతో నిర్మించిన రోడ్డుతో అధునాతనంగా కనిపిస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నా ఒక దగ్గర ఆ వంతెన ఆకృతి మలుపులు తిరిగింది. అక్కడ పర్వతాల వంటివి అడ్డుగా లేవు. సముద్రమో, నదులు ఆటంకం గా లేవు. అక్కడ ఆటకం కలిగించింది ఓ కుటుంబం. ఎందుకంటే ఆ వంతెన నిర్మించిన మార్గంలో ఒక కుటుంబం నివాసం ఉంటోంది. వంతెన నిర్మాణ క్రమంలో తమ ఇంటిని తొలగించేందుకు ఆ కుటుంబం ఒప్పుకోలేదు. అధికారులు బతిమిలాడినా ఆ కుటుంబం మెట్టు దిగలేదు. చివరికి చేసేది ఏమీ లేక అధికారులు ఆ ఇంటి దగ్గరికి వచ్చేసరికి వంతెన ఆకృతిని పూర్తిగా మార్చేశారు. వంతెన నిర్మించినప్పటికీ ఆ కుటుంబం ఆ ఇంట్లోనే నివాసం ఉంటోంది. సోషల్ మీడియాలో ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇండియాలోనే కాదు ఎక్కడైనా సరే ఇలాంటి నిరసనకారులు ఉంటారు. కమ్యూనిస్టు ప్రభుత్వమయినప్పటికీ అలాంటి నిరసనకారుల ముందు చైనా తలవంచింది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

AP Inter Results 2024: ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ – ఫలితాలు త్వరలోనే వచ్చేస్తున్నాయ్!

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాలు మరికొద్ది రోజుల్లో వెలువడనున్నాయి. ఈ మేరకు ఇంటర్మీడియ్ బోర్డు సమాయత్తమవుతోంది. ఇంటర్‌ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలు ఒకేసారి వెలువడనున్నాయి.
AP Inter Results: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాలు మరికొద్ది రోజుల్లో వెలువడనున్నాయి. ఈ మేరకు ఇంటర్మీడియ్ బోర్డు సమాయత్తమవుతోంది. ఇంటర్‌ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలు ఒకేసారి వెలువడనున్నాయి. ఇంటర్ ఫలితాలను ఏప్రిల్‌ రెండోవారం లేదా మూడో వారంలో వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఏప్రిల్ 12న ఇంటర్ ఫలితాలు వెలువడనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇంటర్మీడియట్‌ జవాబుపత్రాల మూల్యాంకనం ముగియగా.. మరోసారి జవాబుపత్రాల పరిశీలన, మార్కుల నమోదు ప్రక్రియ పూర్తికాగానే ఫలితాలు విడుదల చేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రవ్యాప్తంగా 1,559 సెంటర్లలో మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ ప‌బ్లిక్‌ పరీక్షలు జ‌రిగిన విష‌యం తెల్సిందే. ఈ ఏడాది ఇంట‌ర్ విద్యార్థులు మొత్తం 10,52,221 మంది ఉన్నారు. ఇందులో మొదటి సంవత్సరం 4,73,058 మంది, రెండో సంవత్సరం 5,79,163 మంది ఉన్నారు. ఒకేషనల్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు దాదాపు లక్ష వరకు ఉన్నారు. ఇంటర్ పరీక్షలు ముగియడంతో.. మూల్యాంకన ప్రక్రియ కూడా మొదలుపెట్టారు. ఏప్రిల్‌ 4న మూల్యాంకన ప్రక్రియ పూర్తయింది. సుమారుగా 23వేల మంది అధ్యాపకులు పాల్గొన్నారు. ఒక్కో అధ్యాపకుడూ రోజుకు 30 జవాబు పత్రాలను మూల్యాంకనం చేశారు. మూల్యాంకనం చేసిన జవాబు పత్రాలను రీవెరిఫికేషన్ చేసిన తర్వాత మార్కులు అప్‌లోడ్ చేయనున్నారు. ఇవన్నీ అయిపోగానే ఫలితాలను వెల్లడించనున్నారు.

గతేడాది మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇంటర్ ఫస్టియర్‌తోపాటు సెకండియర్ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 26న విడుదల చేశారు. అంటే 22 రోజుల్లోనే ఫలితాలను వెల్లడించారు. ఈసారి కూడా అంతే సమయంలో ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. ఏప్రిల్ 12 లేదా ఆ తర్వాత ఒకట్రెండు రోజుల్లో ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.

ఏపీ ఇంటర్ ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి
Step 1: ఏపీ ఇంటర్ విద్యార్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్  https://bie.ap.gov.in/  సందర్శించండి
Step 2: హోం పేజీలో ఏపీ ఇంటర్ రిజల్ట్స్ 2024 లింక్ (Andhra Pradesh Inter Results 2024 link) మీద క్లిక్ చేయండి
Step 3: హాల్ టికెట్ నెంబర్ (రిజిస్ట్రేషన్ నెంబర్), పుట్టిన తేదీ లాంటి వివరాలు నమోదు చేయాలి
Step 4: విద్యార్థుల ఫలితాలు మీ స్క్రీన్ మీద కనిపిస్తాయి
Step 5: విద్యార్థులు రిజల్ట్స్‌ స్కోర్ కార్డును పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకోండి
Step 6: ఇంజినీరింగ్, మెడిసిన్, డిగ్రీల ప్రవేశాల సమయంలో మీ ఇంటర్ స్కోర్ కార్డు అవసరాల కోసం రిజల్ట్ ు ప్రింటౌట్ తీసుకోవడం బెటర్.

ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్లు..

https://examresults.ap.nic.in

www.bie.ap.gov.in

Motorola లేటెస్ట్ Curved 5G Phone పైన బిగ్ డీల్ అందుకోండి.!

కొత్త స్మార్ట్ ఫోన్ కొనడానికి చూస్తున్న వారికి ఈరోజు గొప్ప డీల్ అందుబాటులో వుంది. Flipkart ఈరోజు Motorola లేటెస్ట్ Curved 5G Phone పైన బిగ్ డీల్ ఆఫర్ చేస్తోంది. అందుకే, ఈ కొత్త కర్వ్డ్ డిస్ప్లే 5జి స్మార్ట్ ఫోన్ చాలా చవక ధరకే లభిస్తోంది. అందుకే, ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ కర్వ్డ్ డిస్ప్లే స్మార్ట్ ఫోన్ ఆఫర్ ను మీకోసం అందిస్తున్నాను.

Motorola Edge 40 Neo
మోటోరోలా ఎడ్జ్ 40 నియో ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది. రూ. 23,999 రూపాయల ప్రారంభ ధరతో ఇండియన్ మార్కెట్లో విడుదలైన ఈ ఫోన్, ఈరోజు వెయ్యి రూపాయలు డిస్కౌంట్ తో రూ. 22,999 రూపాయలకే లభిస్తోంది. అంతేకాదు, ఈరోజు ఈ ఫోన్ పైన 2,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ను కూడా పొందవచ్చు.
ఈ స్మార్ట్ ఫోన్ ను SBI, Axis మరియు ICICI బ్యాంక్స్ యొక్క క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్స్ తో కొనే వారికి రూ. 2,000 రూపాయల అధనపు డిస్కౌంట్ లభిస్తుంది. అంటే, ఈ ఆఫర్ లతో ఈ ఫోన్ ను కేవలం రూ. 20,999 రూపాయల ధరకే అందుకోవచ్చు.
Motorola Edge 40 Neo
మోటోరోలా ఎడ్జ్ 40 నియో స్మార్ట్ ఫోన్ ను ఆల్రౌండ్ ఫీచర్స్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ వేగాన్ లెథర్ డిజైన్ తో వస్తుంది. ఇందులో 6.55 ఇంచ్ 10-bit Full HD+ రిజల్యూషన్ డిస్ప్లేని 144Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ డిస్ప్లే లో ఇన్ డిస్ప్లే ఫింగర్ కూడా వుంది.

ఈ మోటోరోలా ఫోన్ Dimensity 7030 ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు 8GB RAM + 128GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ లో వెనుక 50MP + 13MP డ్యూయల్ రియర్ మరియు ముందు 32MP సెల్ఫీ కెమేరా ఉన్నాయి. ఈ ఫోన్ లో 5000 mAh బిగ్ బ్యాటరీ మరియు 68W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ లను కలిగి వుంది.

Jio జబర్దస్త్ ప్లాన్: రూ. 234 కొత్త ప్లాన్ తో 56 రోజుల అన్లిమిటెడ్ లాభాలు అందుకోండి.!

JIo జబర్దస్త్ ప్లాన్: ఇప్పటికే తన పోర్టుఫోలియోలో చాలా ప్రీపెయిడ్ ప్లానులను అందించిన రిలయన్స్ జియో మరొక కొత్త ప్లాన్ ను తీసుకొచ్చింది. రిలయన్స్ జియో ఈ కొత్త ప్లాన్ ను తక్కువ ధరలో ఎక్కువ లాభాలను అందించేలా తీసుకు వచ్చింది. అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ డేటా మరియు ఎస్ఎంఎస్ లాభాలను కూడా ఈ ప్లాన్ అందిస్తుంది. రిలయన్స్ జియో హరి కొత్తగా తీసుకొచ్చిన ఈ ప్లాన్ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందామా.

జియో కొత్తగా విడుదల చేసిన రూ. 234 ప్రీపెయిడ్ ప్లాన్ గురించే మనం మాట్లాడుతోంది. ఈ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ ను JioBharat Phone యూజర్ల కోసం ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ జియో భారత్ ఫోన్ యూజర్లకు 56 రోజుల అన్లిమిటెడ్ ప్రయోజనాలను అందిస్తుంది. అయితే, స్మార్ట్ ఫోన్ యూజర్లు ఈ ప్లాన్ ను రీచార్జ్ చేసే అవకాశం ఉండదు. ఇది కేవలం జియో భారత్ ఫోన్ యూజర్లకు మాత్రమే చెల్లుతుంది.
JioBharat Phone Rs. 234 Plan
రిలయన్స్ జియో తన జియో భారత్ ఫోన్ యూజర్ల కోసం ఈ కొత్త రూ. 234 ప్రీపెయిడ్ ప్లాన్ ను అందించింది. ఈ ప్లాన్ 56 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యాన్ని అందిస్తుంది.

అంతేకాదు, ఈ ప్లాన్ తో రోజుకు 0.5 GB చొప్పున 56 రోజుల పాటు డైలీ డేటాని అందిస్తుంది. అలాగే, ఈ డేటా లిమిట్ ముగిసిన తరువాత 64 Kbps స్పీడ్ వద్ద 56 రోజులు అన్లిమిటెడ్ డేటాని పొందవచ్చు.

ఇక ఈ ప్లాన్ అందించే మరిన్ని ప్రయోజనాల విషయానికి వస్తే, ఈ ప్లాన్ తో 28 రోజులకు 300 SMS చొప్పున 56 రోజులకు 600 SMS లను అందిస్తుంది. అంతేకాదు, JioSaavn మరియు JioCinema యాప్స్ కి ఉచిత యాక్సెస్ ను కూడా తీసుకు వస్తుంది.

RDO ఆఫీసునే జప్తు చేపించిన ఓ రైతు కథ! సామాన్యుడి సత్తా చూపాడు!

సాధారణంగా బ్యాంకుల వద్ద రుణాలు తీసుకుని తిరిగి చెల్లించకపోతే.. ఆస్తులను జప్తు చేస్తారు. ఏమాత్రం కనికరం చూపకుండా.. ప్రాపర్టీని స్వాధీనం చేసుకంటారు. మరీ ముఖ్యంగా అన్నదాతలు అప్పు చెల్లించకపోతే వారు తాకట్టు పెట్టిన భూములను వేలం వేస్తారు అధికారులు. కానీ తొలిసారి ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. రైతుకు నష్టపరిహారం చెల్లించడంలో అలసత్వం వహించినందుకు ప్రభుత్వ కార్యాలయాన్ని జప్తు చేయాల్సిందిగా భూసేకరణ, పునరావాస, పునర్నిర్మాణ మండలి సంచలన తీర్పు వెల్లడించింది. ఆ వివరాలు..

ఈ సంఘటన వరంగల్ లో చోటు చేసుకుంది. పారిశ్రామిక అవసరాల కోసం రైతుల నుంచి భూమిని సేకరించి, నష్టపరిహారం చెల్లించకపోవడంతో ఈ తీర్పు వెల్లడించింది. ఆర్డీవో ఆస్తులను జప్తు చేయాలని ఆదేశాలు జారీచేసింది. అయితే ఈ తీర్పు వెనక ఓ రైతు అలుపెరగని పోరాటం ఉంది. ఏం జరిగింది అంటే.. వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు కోసం భూమి ఇచ్చిన ఓ రైతుకు అధికారులు నష్టపరిహారం చెల్లించలేదు. దాంతో వరంగల్‌ ఆర్డీవో ఆస్తుల జప్తునకు భూసేకరణ, పునరావాస, పునర్నిర్మాణ మండలి ఆదేశాలు ఇచ్చింది. గురువారం ఉదయం మండలి అధికారులు, సిబ్బంది ఆర్డీవో ఆఫీసులోని ఏసీలు, కూలర్‌లు, కంప్యూటర్లు, ప్రింటర్లు, ఆర్డీవో వాహనాన్ని సీజ్‌ చేస్తూ.. స్టిక్కర్లు అతికించారు. ఈ సంఘటన సంచలనంగా మారింది.

Rdo office seized

వివరాల్లోకి వెళ్తే వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం శాయంపేటలో ఏర్పాటు చేసిన టెక్స్‌టైల్‌ పార్కు కోసం 2014-16 సంవత్సరాల మధ్య భూసేకరణ జరిగింది. ఇందుకోసం శాయంపేటకు చెందిన సముద్రాల యాకస్వామి, ఆయన కుమార్తెకు చెందిన వివిధ సర్వే నంబర్లలోని 20 ఎకరాల భూమిని సేకరిస్తున్నట్టు రెవెన్యూ అధికారులు తొలుత నోటీసులు ఇచ్చారు. ఇందుకు పరిహారంగా ఎకరానికి రూ.10 లక్షల చొప్పున ఇస్తామని తెలిపారు. కొన్ని రోజుల తర్వాత భూసేకరణ అవసరం లేదన్నారు. మళ్లీ నాలుగేళ్ల తర్వాత భూమిని సేకరిస్తున్నట్లు నోటీసులు జారీచేశారు.

గతంలో నిర్ణయించిన రూ.పది లక్షల పరిహారమే చెల్లిస్తామని పేర్కొన్నారు. దీనిపై యాకస్వామి అభ్యంతరం వ్యక్తం చేశాడు. పరిహారం పెంచాల్సిందిగా హైదరాబాద్‌లోని భూసేకరణ, పునరావాస, పునర్నిర్మాణ మండలిని ఆశ్రయించాడు. సర్వే నంబర్లలోని లోటుపాట్ల కారణంగా మొత్తం 20 ఎకరాలకు కాకుండా.. 12 ఎకరాలకు నష్టపరిహారం పెంచి ఇవ్వాలని పిటిషన్ వేశారు. సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత 6 నెలల క్రితం యాకస్వామికి అనుకూలంగా తీర్పు వచ్చింది.

Rdo office seized

ఎకరాకు రూ.20 లక్షల చొప్పున 12 ఎకరాలకు రూ.2.40 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. కానీ, ఈ తీర్పును అధికారులు పట్టించుకోకపోవడంతో యాకస్వామి మళ్లీ పిటిషన్‌ వేశారు. దాంతో ఆర్డీవో కార్యాలయ ఆస్తులు జప్తుచేసి యాకస్వామికి నష్టపరిహారం చెల్లించాలని తాజాగా తీర్పునిచ్చింది. దీంతో అధికారులు గురువారం కార్యాలయానికి వచ్చి వస్తువులను సీజ్‌ చేశారు. ఈ విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళతామని జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్‌ తెలిపారు.

SBI: ఈ స్కీమ్‌లో ఒకేసారి పెట్టుబడి పెట్టండి.. ప్రతి నెలా అదనపు ఆదాయం పొందండి

మీకు ప్రతి నెల కొంత అదనపు ఆదాయం రావాలని కోరుకుంటున్నారా? అయితే మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో అందుకోసం బెస్ట్ స్కీం ఉంది. అదే SBI యాన్యుటీ డిపాజిట్ స్కీమ్(SBI Annuity Deposit Scheme). దీనిలో ఒకేసారి కొంత మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసి.. ఆ తర్వాత ప్రతి నెలా అసలు మొత్తంతో పాటు నెలవారీ వడ్డీని కూడా పొందవచ్చు.

మీకు ప్రతి నెల కొంత అదనపు ఆదాయం రావాలని కోరుకుంటున్నారా? అయితే మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో అందుకోసం బెస్ట్ స్కీం ఉంది. అదే SBI యాన్యుటీ డిపాజిట్ స్కీమ్(SBI Annuity Deposit Scheme). దీనిలో కొంత మొత్తాన్ని ఒకేసారి డిపాజిట్ చేసి.. ఆ తర్వాత ప్రతి నెలా అసలు మొత్తంతో పాటు నెలవారీ వడ్డీని కూడా పొందవచ్చు. ఈ వడ్డీని ప్రతి మూడు నెలలకు ఒకసారి ఖాతాలో మిగిలి ఉన్న మొత్తంపై లెక్కింపు చేస్తారు. SBI యాన్యుటీ డిపాజిట్లపై లభించే వడ్డీ రేట్లు కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్ల మాదిరిగానే ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో SBI యాన్యుటీ స్కీమ్ వడ్డీ రేటు , అర్హతల వివరాల గురించి ఇప్పుడు చుద్దాం.
SBI వార్షిక డిపాజిట్ పథకంలో ఒకసారి డబ్బును డిపాజిట్ చేయడం ద్వారా దీనిని EMI రూపంలో ఆదాయం పొందవచ్చు. అయితే ఇందులో మీరు డిపాజిట్ చేయాల్సిన వ్యవధి 3, 5, 7 లేదా 10 సంవత్సరాలను ఎంచుకోవచ్చు. మీరు పెట్టుబడి పెట్టిన మొత్తంపై వడ్డీ లభిస్తుంది. SBI ఈ డబ్బును సమాన వాయిదాలలో చెల్లిస్తారు. ఈ EMIలలో ప్రాథమిక డబ్బు, వడ్డీలో కొంత భాగం ఉంటాయి. ఈ పథకంలో వడ్డీ త్రైమాసికంలో వసూలు చేయబడుతుంది. ఇందులో ప్రతి నెలా రిటర్నులలో తగ్గింపు ఉంటుంది.

ఈ పథకంలో పెట్టుబడిని భారతదేశంలోని SBI ఏ శాఖలోనైనా చేయవచ్చు. ఈ పథకంలో కనీస పెట్టుబడి(investment) మొత్తం రూ. 1,000 నుంచి మొదలవుతుంది. ఈ పథకం కోసం గరిష్ట డిపాజిట్ మొత్తంపై పరిమితి లేదు. మీకు ఏదైనా జరిగితే SBI యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ నుంచి రిటర్న్‌లను స్వీకరించడానికి నామినీలను ఎంపిక చేసుకోవచ్చు. కస్టమర్లు మొదట డబ్బును డిపాజిట్ చేయాలి, ఆ తర్వాత వారు ప్రతి నెలా వారీగా చెల్లింపులను 1వ తేదీన అందుకుంటారు. నెలకు వద్దనుకుంటే 36, 60, 84 లేదా 120 నెలల మధ్య డిపాజిట్ వ్యవధిని కూడా ఎంచుకోవచ్చు.

భూకంపం నుంచి భారీ టవర్‌ను ఈ స్టీల్‌బాల్‌ ఎలా రక్షించింది?

భారీ భూకంపం తైవాన్‌ను (Taiwan earthquake) కుదిపేసింది. తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. 1,011 మంది గాయపడ్డారు. ప్రకంపనల తీవ్రతకు ఆ ద్వీపం వ్యాప్తంగా దాదాపు 770 భవనాలు దెబ్బతిన్నాయి. భారీ వంతెనలు కొన్ని సెకన్లపాటు అటూ, ఇటూ ఊగాయి. రోడ్లపై వాహనాలు కుదుపులకు లోనైన పలు వీడియోలు బయటకొచ్చాయి. భూకంప కేంద్రానికి 80 మైళ్ల దూరంలో ఉన్న తైపీలోనూ భవనాలు ప్రమాదకర స్థాయిలో కుదుపులకు గురయ్యాయి. కానీ, ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఆకాశహర్మ్యం అయిన తైపీ-101 (Taipei-101)కి మాత్రం ఏమీ కాలేదు. ఆధునిక ఇంజినీరింగ్‌ సాధించిన అద్భుత విజయంగా అభివర్ణిస్తున్న ఈ భారీ నిర్మాణంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక వ్యవస్థే అందుకు కారణం. దాని విశేషాలేంటో చూద్దాం.

660 టన్నుల గోళం..
భూకంపం సంభవించినప్పుఏడు 1,667 అడుగుల తైపీ-101 (Taipei-101) కొద్దిగా ఊగినట్లు వీడియో ఫుటేజీల్లో కనిపిస్తోంది. కానీ, భారీ కుదుపులకు మాత్రం లోనుకాలేదు. 101 అంతస్తుల ఈ ఆకాశహర్మ్యంలో పై భాగంలో ఏర్పాటుచేసిన గోళం లాంటి వస్తువే అందుకు కారణం. దీన్నే ఇంజినీరింగ్‌ పరిభాషలో ‘ట్యూన్డ్‌ మాస్‌ డ్యాంపెనర్‌’గా వ్యవహరిస్తారు. 87 నుంచి 92 అంతస్తుల మధ్య ఈ భారీ గోళాన్ని 92 మందమైన కేబుల్స్‌తో బిగించారు. దీని బరువు 660 టన్నులు. మొత్తం 41 భారీ ఉక్కు షీట్లతో నిర్మించారు. దీని వ్యాసం 18 అడుగులు. ఇది ఏ దిశలోనైనా దాదాపు 5 అడుగుల వరకు కదులుతుంది. ఫలితంగా, భారీ ప్రకంపనల వల్ల వచ్చే కుదుపులను ప్రతిఘటించే లేదా తగ్గించే లోలకంలా (pendulum) పని చేస్తుంది.

ఎలా పనిచేస్తుందంటే..
‘‘భవనం ఊగినప్పుడు ట్యూన్డ్‌ మాస్‌ డ్యాంపెనర్లు వ్యతిరేక దిశలో కదులుతాయి. తైపీ-101లో ఈ గోళం వేలాడుతూ ఉంటుంది. అకస్మాత్తుగా టవర్‌లో కుదుపులు వచ్చినప్పుడు అది వ్యతిరేక దిశలో ఊగుతుంది. తద్వారా గతిశక్తిని గ్రహిస్తుంది. గోళానికి, టవర్‌కు మధ్య ఉన్న హైడ్రాలిక్‌ సిలిండర్లు ఆ శక్తిని ఉష్ణంగా మార్చి చెదరగొడతాయి’’ అని ‘సూపర్‌టాల్‌: హౌ ద వరల్డ్స్‌ టాలెస్ట్‌ బిల్డింగ్స్‌ ఆర్‌ రీషేపింగ్‌ అవర్‌ సిటీస్‌ అండ్‌ లైవ్స్‌’ పుస్తక రచయిత స్టీఫెన్‌ వివరించారు.

భారీ గాలుల నుంచి కూడా..
ప్రపంచవ్యాప్తంగా ఆకాశహర్మ్యాల్లో ఇలాంటి ట్యూన్డ్‌ మాస్‌ డ్యాంపెనర్లను వాడుతున్నట్లు స్టీఫెన్‌ తెలిపారు. భూకంపాల సమయంలో వచ్చే ప్రమాదకర కుదుపుల వల్ల కలిగే ‘హార్మోనిక్‌ వైబ్రేషన్స్‌’ కారణంగా భవనాలు కుప్పకూలుతాయని తెలిపారు. భవనాలు వాటి సొంత రెసొనెన్స్‌ (Resonance) వద్ద కంపిస్తే కుదుపులు క్రమంగా పెరగడమే అందుకు కారణమని భౌతికశాస్త్ర సూత్రాల ఆధారంగా వివరించారు. వాటి నుంచి రక్షించేందుకే ఈ డ్యాంపెనర్లను ఏర్పాటుచేస్తారని తెలిపారు. భారీ గాలులు వీచే సమయంలో భవనంలో ఉండేవారికి కలిగే అసౌకర్యం నుంచి కూడా ఇది రక్షణ కల్పిస్తుందని చెప్పారు.

నిర్మాణంలోనూ ప్రత్యేకత..
ఈ డ్యాంపెనర్‌తో పాటు భారీ ప్రకంపనలను సైతం తట్టుకునేలా తైపీ-101 నిర్మాణంలో ప్రత్యేక ఏర్పాట్లుచేసినట్లు స్టీఫెన్‌ తెలిపారు. లోతైన పునాదిపై 380 కాంక్రీటు, ఉక్కు పిల్లర్లతో ఈ టవర్‌ను నిర్మించినట్లు వెల్లడించారు. అలాగే బిల్డింగ్‌ మూల నిర్మాణాన్ని భారీ బీములు, ఉక్కు పిల్లర్లతో అనుసంధానించినట్లు చెప్పారు. ఇవన్నీ ఈ ఆకాశహర్మ్యానికి పటిష్ఠతను చేకూర్చినట్లు చెప్పారు. డిజిటల్‌ డిజైనింగ్‌ దశలోనే అన్ని రకాల ప్రమాదాలను తట్టుకునేలా దీన్ని పరీక్షించినట్లు చెప్పారు.

పరువు గంగపాలు

అమరావతి ఎన్‌ఐడీకి రక్షిత నీరివ్వలేని దుస్థితి
అనారోగ్యంతో పలువురు ఆస్పత్రిపాలు
జాతీయ మీడియా దృష్టికి తీసుకెళ్లిన విద్యార్థులు
ఆగమేఘాలపై ప్రిన్సిపల్‌ సెక్రటరీని పంపిన వైనం
రాష్ట్రం పరువు పోయేలా వైకాపా ప్రభుత్వం వ్యవహరించింది. ఎన్‌ఐడీ విద్యనభ్యసించడానికి దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి రాజధాని అమరావతికి వచ్చిన విద్యార్థులకు కనీసం గుక్కెడు రక్షిత నీళ్లు ఇవ్వలేని దుస్థితిలో ఉంది. దీనిపై విద్యార్థుల నుంచి విస్మయం వ్యక్తమవుతోంది. విద్యా సంస్థకు చేరుకోవడానికి సరైన రహదారులు లేవు. అనారోగ్యం పాలైతే ఆస్పత్రిలో చేరి చికిత్స పొందడానికి స్థానికంగా వైద్య సదుపాయాలు లేక అడవిలో మగ్గిపోతున్నామని విద్యార్థులు మొరపెట్టుకుంటున్నా వారిది అరణ్య రోదనగానే మిగిలిపోయింది. ఇటు ప్రభుత్వం, అటు స్థానిక ఎన్‌ఐడీ అధికారులు పట్టించుకోకపోవడంతో ఎన్నాళ్లు సమస్యలతో సతమతమవుతామని ఏకంగా జాతీయ మీడియా దృష్టికి తీసుకెళ్లారు.దీంతో ఇక్కడ నెలకొన్న సమస్యలు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి.

అమరావతిలో ఉన్న ప్రతిష్ఠాత్మకమైన ఎన్‌ఐడీ (నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌)లో సమస్యలు విద్యార్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి పట్టడం లేదు. తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో ఇక్కడకు పంపితే తాము ఉండే వసతిగృహాల్లోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి హల్‌చల్‌ చేస్తున్నా పట్టించుకునే భద్రతా వ్యవస్థ లేదని విద్యార్థులు ఆందోళన చెందుతున్న విషయం మీడియాలో వచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాలపై స్పందించింది. రాష్ట్ర టెక్స్‌టైల్స్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సునీత, గుంటూరు జేసీ రాజకుమారితో పాటు ఇతర అధికారుల బృందం అమరావతి ఎన్‌ఐడీకి చేరుకుంది. స్థానిక ఎన్‌ఐడీ అధికారులతో పాటు విద్యార్థులతోనూ మాట్లాడి సమస్యలు తెలుసుకుంది. ఇక్కడ రక్షిత నీళ్లు సరఫరా కావడం లేదని, దిక్కుతోచని పరిస్థితుల్లో అవే తాగున్నామని, ఆ నీటితోనే స్నానాలు చేయడంతో చర్మ సంబంధిత సమస్యలు తలెత్తి అనారోగ్యం పాలవుతున్నామని వాపోయారు.

ఆహార కల్తీ జరిగి అస్వస్థతకు గురైతే అప్పట్లో వెంటనే వెళ్లి చికిత్స పొందుదామంటే తమకు ఇక్కడ ఆ సౌకర్యం కూడా ఏర్పాటు చేయలేదని, కనీసం అంబులెన్సు లేదని వారి దృష్టికి తీసుకెళ్లారు. తాము ఉండే పరిసరాల్లో కనీసం చెత్త శుభ్రం చేసే కార్మికులే కనిపించడం లేదని వాపోయారు. షాపింగ్‌ చేసుకోవాల్సి వస్తే కనీసం డబ్బులు డ్రా చేసుకోవటానికి కనీసం ఏటీఎం సౌకర్యం కల్పించలేదని ఆవేదన చెందారు. సమస్యలు తెలుసుకుని ఉన్నతాధికారులే నివ్వెరపోయారు. నాలుగేళ్ల కోర్సులో ప్రస్తుతం 190 మంది విద్యార్థులు ఉన్నారు.

ఎయిమ్స్‌లాగే దీన్నీ విస్మరించారు..
విభజన హామీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2014లో రాష్ట్రానికి ప్రతిష్ఠాత్మకమైన ఎన్‌ఐడీని కేటాయించింది. అప్పటి తెదేపా ప్రభుత్వం దాని నిర్మాణానికి రాజధానిలోని శాఖమూరు వద్ద 50 ఎకరాల భూమి కేటాయించింది. నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేసి సాధ్యమైనంత త్వరగా అమరావతి నుంచే రెగ్యులర్‌గా తరగతులు నిర్వహించేలా ఎన్‌ఐడీ అధికారులతో సమన్వయం చేసుకుని పనుల వేగవంతానికి చర్యలు చేపట్టారు. దీంతో తెదేపా ప్రభుత్వ హయాంలోనే చాలా వరకు భవన నిర్మాణ పనులు జరిగాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం ఎయిమ్స్‌కు నీళ్లు అందించడాన్ని ఎలాగైతే విస్మరించిందో ఎన్‌ఐడీ శాశ్వత భవనాలు పూర్తి చేయడాన్ని పట్టించుకోలేదు. ఒకవైపు భవన నిర్మాణ పనులు జరుగుతుండగానే ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో తాత్కాలిక భవనాల్లో కొనసాగుతున్న ఎన్‌ఐడీని సుమారు నెల కిందట అమరావతిలో అసంపూర్తిగా ఉన్న భవనాల్లోకి మార్చారు. అప్పటివరకు ఏఎన్‌యూలో ఉండగా ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదు. ఇక్కడి నుంచి రాజధానికి వెళ్లగానే సమస్యలు తలెత్తడంతో తొలుత విద్యార్థులు స్థానిక ఎన్‌ఐడీ అధికారుల దృష్టికి తీసుకెల్లారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని గవర్నింగ్‌ బాడీకి ఫిర్యాదు చేశారు. ఇక్కడ వసతి సౌకర్యాలు దారుణంగా ఉన్నాయని దిల్లీలోని ఎన్‌ఐడీ ఉన్నతాధికారులకు మెయిల్స్‌ రూపంలో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. చుట్టూ దట్టమైన ముళ్ల పొదలతో చిట్టడవిని తలపిస్తోందని, తమకు చాలా భయంగా ఉంటోందని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. వసతిగృహాల్లో సరఫరా చేసే ఆహారం నాణ్యతగా ఉండడం లేదని, అపరిశుభ్ర వాతావరణంలో వండి వార్చుతున్నారని ఏకరవు పెడుతున్నారు. ఈ మధ్య సుమారు 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని తెలిసింది.

మీడియాను అనుమతించక..
ఇక్కడి లోపాలను క్షేత్రస్థాయిలో తెలుసుకోవడానికి వచ్చిన మీడియాను అనుమతించలేదు. ‘విద్యార్థులకు ఎదురవుతున్న సమస్యలను వారితో మాట్లాడి తెలుసుకున్నాం. గుంటూరు జిల్లా యంత్రాంగం పరంగా వెంటనే పారిశుద్ధ్య సమస్య పరిష్కరించడానికి సీఆర్‌డీఏ అధికారులకు ఆదేశాలిస్తాం. జిల్లా లీడ్‌ బ్యాంకు మేనేజరుతో చెప్పి ఏటీఎం సౌకర్యం కల్పిస్తాం. వైద్య సదుపాయాల కోసం తుళ్లూరు సామాజిక ఆసుపత్రితో అనుసంధానం చేసి ఇకమీదట అసౌకర్యాలు లేకుండా చర్యలు తీసుకుంటామని’ జిల్లా అధికారి ఒకరు తెలిపారు. మిగిలినవి రాష్ట్ర స్థాయిలో పరిష్కరించాల్సి ఉందని సదరు అధికారి పేర్కొన్నారు.

Family Star Movie Review – ఫ్యామిలీ స్టార్ రివ్యూ: విజయ్ దేవరకొండ సినిమా హిట్టా? ఫట్టా?

ఫ్యామిలీ, మాస్‌ యాక్షన్‌ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం విజయ్‌ దేవరకొండ కు ఖచ్చితమైన హిట్ ఇవ్వాల్సిన టైమ్ లో వచ్చింది. అయితే ఎంతవరకూ అతని అవసరాన్ని తీర్చి నమ్మకాన్ని నిలబెట్టింది?
‘ఐరనే వంచాలా ఏంటి?’ అంటూ విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ గా మన ముందుకు వచ్చారు. దిల్ రాజు బ్యానర్ అంటే ఫ్యామిలీ సినిమాలకు కేరాఫ్ ఎడ్రస్ కాబట్టి ఆ ట్రెడిషన్ ని కొనసాగిస్తున్న రీతిలో ఈ ఫిల్మ్ ని రూపొందించారు. అయితే క్రైమ్ థ్రిల్లర్స్ ఓటిటిలకు షిప్ట్ అయ్యినట్లుగా ఫ్యామిలీ కథలు టీవీ సీరియల్స్ వెళ్లిపోయాయి. అలాంటప్పుడు అంతకు మించి ఉంటేనే తెరపై ఫ్యామిలీ స్టోరీలను ఆదరిస్తారు. ఓ రకంగా రిస్కే అయ్యినా విజయ్ దేవరకొండ దాన్ని ధైర్యంగా స్వీకరించి చేసారు. విజయ్ చాలా హోప్స్ పెట్టుకున్న ఈ చిత్రం ఆయన్ని ఫ్లాఫ్ ల నుంచి బయిటపడేసిందా? ఫ్యామిలీ స్టార్ గా మనందరినీ మెప్పించాడా..అసలు కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్:

మిడిల్ క్లాస్ కుర్రాడు ‘గోవర్ధన్'(Govardhan)కి ఫ్యామిలీ అంటే ప్రాణం. ఆర్కిటెక్ట్ అయిన అతను ఓ కన్స్ట్రక్షన్ కంపెనీలో పని చేస్తూ కుటుంబ బాధ్యతలు అన్నీ తన భుజాల మీదే మోస్తూ ఉంటాడు. ఇంట్లో తనే ఆర్దిక ఆధారం. ఓ ప్రక్కన తాగుడుకు బానిసైన ఒక అన్న(రవి ప్రకాష్) మరో ప్రక్క ఎప్పుడూ ఏదో బిజినెస్ పెట్టుబడి అంటూ తిరిగే మరో అన్న (రాజా చెంబోలు) కు ఆదాయాలు లేకపోవటంతో వాళ్ల ఫ్యామిలీలను తనే సాకాల్సిన పరిస్దితి. ఇలా తను,తన కుటుంబం, ఉద్యోగం అంటూ వెళ్తున్న గోవర్ధన్ జీవితంలోకి ఇందు (మృణాల్ ఠాకూర్) అనే డబ్బున్న అమ్మాయి వస్తుంది. ఆమె అతను ఇంట్లోకి అద్దెకు దిగుతుంది. సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్ డీ చేసే ఆమె వచ్చాక జీవితం మారిపోతుంది. మెదట్లో ఆమెను పట్టించుకోకపోయినా మెల్లిగా ఆమెతో ప్రేమలో పడతాడు. అయితే ప్రేమ ప్రపోజల్ పెట్టే టైమ్ కు ఆమె మన హీరో గోవర్దన్ ఓ ట్విస్ట్ లాంటి షాక్ ఇస్తుంది. ఆ షాక్ ఏంటి..అప్పుడు గోవర్ధన్ ఏం చేశాడు? వాళ్ల ప్రేమ కథ చివరకు ఎలాంటి మలుపు తీసుకుంది? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎనాలసిస్ ..

సినిమా హిట్ అవ్వాలంటే కథే బాగుండాలా ఏంటి? అనుకుని చేసినట్లున్న ఈ సినిమా కథాంశం తన కుటుంబాన్ని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తి ఫ్యామిలీ స్టార్ అని చెప్పడమే . అయితే దాన్ని ఎంత స్మూత్ గా, ఎంత అందంగా చెప్పారనేదానిపై సినిమా సక్సెస్ ఆధారపడి ఉంటుంది. పరుశురామ్ దర్శకుడుగా అద్బుతం తీయకపోవచ్చు కానీ డిజప్పాయింట్ చేయరనిపిస్తారు. అయితే #FamilyStar సినిమాకు ఎంచుకున్న కథ ఆయనకు కలిసి రాలేదు. గీతాగోవిందం టెంప్లేట్ ని రిపీట్ చేద్దామని ప్రయత్నించారు. అయితే అంత ఈజీ టాస్క్ కాదు. హీరోను, నిర్మాతను ఈ ఫార్మెట్ తో ఒప్పించవచ్చు కానీ ప్రేక్షకుడుని ఒప్పించి మెప్పించటం చాలా కష్టం. అయినా ఒకసారి జరిగిన మ్యాజిక్ మరోసారి జరుగుతుందని ఆశించటం అత్యాశే. తనమీద తనకే కాన్ఫిడెన్స్ తగ్గించే అనిపించేలా అమెరికాలో వచ్చే సీన్స్ ఉంటాయి.

న్యూయార్క్ టైమ్ స్కేర్ దగ్గర విజయ్ దేవరకొండను ప్రాసిట్యూట్ అనుకుని అక్కడ అమెరికన్ అమ్మాయిలు ఎటాక్ చేయటం అయితే నవ్వుకోవటానికి పెట్టారో లేక హీరోయిజం ఎలివేషన్ కు పెట్టారో కానీ దణ్ణంరా దొర అనాలనిపిస్తుంది. యుస్ లో బాగా వర్కవుట్ అవ్వాలని,అక్కడ మనవాళ్లకు కనెక్ట్ కావాలని దాదాపు సెకండాఫ్ మొత్తం అమెరికాలో నడిపారు. ఎందుకనో మినిమం బేసిక్ లాజిక్స్ …మిడిల్ క్లాస్ మైండ్ సెట్ అనే ఒకే ఒక కారణం చూపెడుతూ వదిలేసారు. మరీ ముఖ్యంగా హీరో ఇంట్లో అన్న తాగుడికి బానిస అవటానికి కారణం చాలా చిన్నగా ,పెద్ద లాజిక్ గా అనిపించదు. అలాగే హీరోయిన్ క్యారక్టర్ కూడా బిలివబులిటీ రాదు.

కథలో కొంచెం చిరంజీవి (Chiranjeevi) ‘గ్యాంగ్ లీడర్’ (Gangleader) పోలికలు ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే డిఫరెంట్ గా రాసుకుంటే బాగుండేది. కానీ స్క్రీన్ ప్లే చాలా బద్దకంగా కునుకు తీస్తూ నడుస్తున్నట్లు ఉంటుంది. కథను నడపటానికి ఎంచుకున్న బ్రదర్, హీరోయిన్ రెండు కాంప్లిక్ట్స్ లు బలంగా లేవు. ఫస్ట్ హాఫ్ సెటప్ సాగినట్లున్నా, కొన్ని ఫన్నీ డైలాగులుతో నడిచిపోయింది. సెకండాఫ్ లో అదరకొట్టేస్తారు..అసలు విషయం అక్కడుందనుకుంటాము. కానీ ఇంట్రవెల్ అయ్యిన కాసేపటకే అంత సీన్ లేదని డైరక్టర్ మనని వెక్కరిస్తారు.

అక్కడ పూర్తిగా ఫ్యామిలీ ఎమోషన్ సీన్స్ మీద డిపెంట్ అయ్యారు కానీ అవి చాలా సార్లు చూసేసినవే కావటంతో డేజావులా ఇంతకు ముందే చూసిసినట్లు అనిపిస్తూంటాయి. కామెడీ కూడా గీతా గోవిదం తరహాలో వర్కవుట్ కాలేదు. అక్కడక్కడా కొన్ని మెరుపులు మెరిసినా ప్లాట్ స్ట్రాంగ్ గా లేకపోవటంతో తేలిపోయాయి. థియేటర్ నుంచి బయిటకు వచ్చాక ఏం చూసాము అంటే గుర్తుకు వచ్చే పరిస్దితి లేదు. ఇది rom-com అంటే అదీ పూర్తిగా చెప్పలేం. టెంప్లేట్ లో వెళ్తున్నట్లు అనిపిస్తుంది కానీ ఎమోషన్ కనెక్షన్స్ ఇవ్వకపోవటంతో మంచి మూవ్ మెంట్స్ కూడా రిజిస్టర్ అయ్యే పరిస్దితి లేదు.

టెక్నికల్ గా …

ఇలాంటి రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కు ఫెరఫెక్ట్ అనిపించే గోపీసుందర్ ని సంగీతానికి ఎంచుకున్నారు. కానీ ఎకస్పెక్ట్ చేసిన స్దాయిలో అయితే మ్యూజిక్ మేజిక్ చెయ్యలేదు. గీతా గోవిందం చిత్రానికి పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్లస్ అయ్యాయి. ఈ సారి ఈ డిపార్టమెంటే దెబ్బ కొట్టింది. ఇక సినమాటోగ్రఫీ ..బాగుంది. కొన్ని విజువల్స్ ఫ్రెష్ గా ఉన్నాయి. మార్తాండ్ కే. వెంకటేష్ ఎడిటింగ్ కూడా కొన్ని ల్యాగ్ ని సరిచేసి పరుగెత్తించలేకపోయింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. పరుశురామ్ మొదటి నుంచి డైలాగ్స్ లో తన స్పెషాలిటీ చూపెడుతున్నారు. ఈ సారి కొన్ని బాగా పేలాయి. నో బడి కెన్ స్టాప్ విత్ దైర్ కుట్రాస్ అండ్ కుతంత్రమ్స్ వంటివి తెలిసినట్లుగా అనిపించేవే అయినా సందర్బాన్ని బట్టి బాగానే వర్కవుట్ అయ్యాయి.

నటీనటుల్లో ..

నటుడుగా విజయ్ దేవరకొండకు ఇది కీలకసమయం. ఇలాంటి కంపర్ట్ జోన్ కథలు సీనియర్ హీరోలకు వదిలేయాలి. అలాగే పెద్దగా ఇంపార్ట్ కలగచేయని ఇలాంటి టెంప్లేట్ కథలకు స్వస్ది చెప్పాలి. లేకపోతే ఎంత బాగా చేసినా సీన్స్, కథ సహకరించక సక్సెస్ దూరంగా నిలబడి దోబూచులాడుతుంది. ఇలాంటి సినిమాలు బాగున్నాయి అని చెప్పలేం. భలే ఉంది వెంటనే చూడాలి అని చెప్పలేని పరిస్దితి క్రియేట్ చేస్తాయి. అయితే అదే సమయంలో ఒక విషయం చెప్పాలి..మిడిల్ క్లాస్ కుర్రాడుగా ఫెరఫెక్ట్ గా యాప్ట్ అయ్యారు. ఇందుగా మృణాలి ఠాకూర్.. చూడ్డానికి బాగుంది. అయితే క్యారక్టరైజేషన్ అంతగొప్పగా లేదు. సీనియర్ యాక్టర్ జగపతిబాబు రొటీన్ పాత్రలో అలా కనిపించి ఇలావెళ్లిపోయారు. వెన్నెల కిషోర్ కమిడియన్ గా కాసేపు నవ్వించారు. బామ్మ పాత్రలో మరాఠీ రోహిణి సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు తర్వాత మరోసారి కనిపించి ఆకట్టుకుంది.

బాగున్నవి

విజయ్ దేవరకొండ ఫెరఫార్మెన్స్
ప్రొడక్షన్ వాల్యూస్
లీడ్ పెయిర్ కెమెస్ట్రీ
మంచి మెసేజ్
కొన్ని డైలాగులు

బాగోలేనివి
ఈ కథకు అవసమైన ఎమోషన్ డెప్త్ లేకపోవటం
ఓవర్ అనిపించిన అమెరికా ఎపిసోడ్
ఎనభైల నాటి కథ,కథనం
సరైన కాంప్లిక్ట్ లేకపోవటం

ఫైనల్ టాక్

రొటీన్ ఫ్యామిలీ కథలలో స్టార్స్ నటించినా అంతంత మాత్రమే ఇంపాక్ట్ ఇస్తుందని మరోసారి రుజువైంది. ఫ్యామిలీలను టార్గెట్ చేసినట్లున్న ఈ సినిమా యూత్ కు ఏ మేరకు ఎక్కుతుందనే దానిపై సక్సెస్ రేటు ఆధారపడి ఉంటుంది.
Rating:2.5
— సూర్య ప్రకాష్ జోశ్యుల

నటీనటులు: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, జగపతిబాబు, రోహిణి, వెన్నెల కిషోర్, తదితరులు
సినిమాటోగ్రఫీ : కేయూ మోహనన్
సంగీతం : గోపీసుందర్
ఆర్ట్ డైరెక్టర్ : ఏ ఎస్ ప్రకాష్
ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్
పీ ఆర్ ఓ : జి.యస్.కే మీడియా
క్రియేటివ్ ప్రొడ్యూసర్ : వాసు వర్మ
నిర్మాతలు : రాజు – శిరీష్
రచన, దర్శకత్వం – పరశురామ్ పెట్ల
విడుదల తేదీ 05, ఏప్రియల్ 2024.

Lines on Hand : మీ చేతిలో రేఖలు M అనే అక్షరంను పోలి ఉన్నాయా? దాని అర్థం తెలుసా?

Lines on hand – Letter M : జాతకాలను నమ్మేవారు ఉన్నారు. నమ్మని వారు ఉన్నారు. ఏది జరిగినా జాతకానికి ముడి వేసే ప్రజలు కూడా ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కో విధమైన జాతకాన్ని విశ్వసిస్తూ ఉంటారు.
అయితే కొందరు జ్యోతిష్యులు చేతిలో రేఖలు చూసి జాతకం చెబుతుంటారు. ఇక మన చేతిలో ఎన్నీ గీతలు ఉంటాయి. ఆ గీతలను బట్టి జాతకం చెబుతారు. మరి మీరు ఎప్పుడైనా జాతకం చెప్పించుకున్నారా? ఓ సారి మీ చేతిని మీరు చూసుకోండి. ఇఫ్పుడు నేను మీ జాతకం చెప్పబోతున్నాను. అదేంటి అనుకుంటున్నారా?

అరచేతిలో చాలా మందికి రేఖలు, గీతలు ఉంటాయి. అందులో కొందరికి మాత్రం ఫోటోలో చూపిస్తున్న విధంగా ఎమ్ అనే అక్షరం గల ఆకారం కనిపిస్తుంటుంది. మరి ఈ రేఖలు దేనికి సంకేతం. దీని అర్థం ఏమిటి? మీకు ఇలా ఎమ్ అక్షరం ఉందా అనే వివరాలు ఓసారి తెలుసుకోండి. లైఫ్ లైన్, హెడ్ లైన్, హార్ట్ లైన్ వల్ల ఈ ఎమ్ సింబల్ ఏర్పడుతుంది. లైఫ్ లైన్ మణికట్టు నుంచి పైకి ఉంటే హెడ్ లైన్ దాటి హార్ట్ లైన్ కు చేరుతుంది. ఇక జీవిత రేఖ, తల రేఖ, హృదయ రేఖలతో వాలుగా ఉంటూ ఎమ్ సింబల్ కనిపిస్తుంది.
ఈ సింబల్ డబ్బు, ప్రేమ అదృష్టాన్ని సూచిస్తుంది అంటారు పండితులు. వీరికి ఉన్నతమైన లక్ష్యాలు ఉంటాయట. కన్న కలలను సాకారం చేసుకోవడానికి ఎక్కువ కృషి చేస్తుంటారు. అనుకోవాలే కానీ కచ్చితంగా అది నెరవేరే వరకు కష్టపడుతూనే ఉంటారట. అంతే విధంగా గుర్తింపును కూడా సాధిస్తారట. అయితే వీరు 40 సంవత్సరాల లోపే పేరు ప్రతిష్టలు పొందేలా చాలా కృషి చేస్తారట.

వీరు ఒక విధంగా సూపర్ అని చెప్పాలి. ఎలాంటి వసతులు లేకున్నా, సపోర్ట్ లేకున్నా వీరు ది బెస్ట్ అనిపించుకుంటారట. నాలుగు, ఐదు తరాలకు సరిపోయే విధంగా కూడా సంపాదిస్తారట. కొందరు ఏకంగా మిలియనీర్స్ గా ఎదుగుతారు. వీరు ఉత్సాహంతో, కరుణ, సృజనాత్మకంగా సమస్యలను పరిష్కరించుకుంటారు. ఒక పని అప్పగిస్తే చాలు అవి ఇట్టే పూర్తి అవుతాయి. మరి మీలో కూడా ఈ ఎమ్ సింబల్ ఉందా? ఉంటే పైన చెప్పినవి మీకు కూడా వర్తిస్తాయి.

AP Summer Holidays : ఏపీలో ఇంటర్ విద్యార్ధులకు సెలవులు

ఆంధ్రప్రదేశ్‌లోని(Andhra Pradesh) ఇంటర్మీడియట్‌ కళాశాలలకు(Inter colleges) ప్రభుత్వం వేసవి సెలవులు(Summer holidays) ప్రకటించింది. మే 31వ తేదీ వరకు వేసవి సెలవులు ఉంటాయని, జూన్‌ 1వ తేదీ నుంచి తిరిగి కళాశాలలు తెరచుకుంటాయని ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారులు తెలిపారు.
సెలవుల్లో కాలేజీలలో ఎలాంటి తరగతులు నిర్వహించరాదని, అలాగే షెడ్యూల్‌ విడుదల కాకపోయినా ప్రవేశాలు నిర్వహిస్తున్న కాలేజీలపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

ఏపీ ప్రభుత్వం (AP Government) స్కూళ్లకు సైతం రెండు రోజుల క్రితమే వేసవి సెలవులు ప్రకటించేసింది. ఏప్రిల్ 24 నుంచి పాఠశాలలకు సెలవులు ప్రారంభం కానున్నాయి. జూన్ 13 వరకూ అంటే 50 రోజుల పాటు పాఠశాలలకు ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. మార్చి 18 నుంచి ఏపీ ప్రభుత్వం ఎండల కారణంగా ఒంటిపూట బడులను ప్రకటించింది. అప్పటి నుంచి ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఒంటిపూట ఒడులు నిర్వహిస్తున్నారు. కాగా.. ఏపీ వ్యాప్తంగా ఏప్రిల్ 23 నాటికి అన్ని తరగతుల విద్యార్థులకు పరీక్షలు పూర్తి చేసి.. 24 నుంచి వేసవి సెలవులు ఇవ్వనున్నారు.

Karnataka: గట్టి పిండమే.. బోరుబాబిలో చిన్నారి.. 20 గంటల తర్వాత క్షేమంగా బయటకు..!

Karnataka: అనుకోకుండా పెద్ద ప్రమాదం జరిగినప్పుడు అందులో నుంచి ఎవరైనా బయట పడితే గట్టి పిండమే అంటా.. కర్ణాటక రాష్ట్రంలో బోరు బావిలో పడిన ఓ చిన్నారి కూడా అదే అనిపించుకుంది.
20 గంటల పాటు బోరుబావిలో ఉన్న చిన్నారిని రెస్క్యూటీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. 20 గంటలు శ్రమించిన ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు చిన్నారిని ప్రాణాలతో బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని విజయపురి జిల్లాలో ఏప్రిల్‌ 4న జరిగింది.

పొలం వద్ద ఆడుకుంటూ..
విజయపుర జిల్లా లచయానా గ్రామానికి చెందిన సతీశ్‌ ముజగొండ తన ఇంటి సమీపంలో ఉన్న నాలుగు ఎకరాల పొలంలో ఇటీవల బోరు వేయించాడు. నీళ్లు పడకపోవడంతో అలాగే వదిలేశాడు. ఈ క్రమంలో సతీశ్‌ రెండేళ్ల కుమారుడు బుధవారం(ఏప్రిల్‌ 3న) ఆడుకుంటూ వెళ్లి అందులో పడిపోయాడు. దాదాపు 16 అడుగుల లోతులో ఇరుక్కుపోయాడు. చిన్నారి ఏడుపు విన్న స్థానికులు వెంటనే బాలుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తర్వాత అధికారులకు విషయం చెప్పారు. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అధికారుల సూచనల మేరకు ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు బుధవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో రెస్క్యూ ఆపరేషన్‌ మొదలు పెట్టాయి. బోరుకు సమాంతరంగా 21 అడుగుల లోతు గొయ్యి తావ్వారు. అనంతరం ఎస్కవేటర్‌ సహాయంతో బాలుడిని బయటకు తీసుకువచ్చారు.

ఆస్పత్రికి తరలింపు..
సుమారు 20 గంటలపాటు బోరుబావిలో ఉన్న చిన్నారిని వెంటనే సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. బయటకు తీయక ముందే.. అంబులెన్స్‌తోపాటు వైద్య సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. బాలుడిని బయటకు తీసుకురాగానే ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు.

మొత్తానికి 20 గంటల రెస్క్యూ ఆపరేషన్‌ తర్వాత బాలుడు బయటకు రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించిన సిబ్బందిని అభినందించారు.

Breaking: ప్రముఖ న్యూస్ రీడర్ కన్నుమూత..!

ఇప్పుడంటే ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగి.. ఎలాంటి సమచారం అయిన మన అరచేతిలో వచ్చి వాలిపోతుంది. సెల్ ఫోన్లోనే.. మనకు కావాల్సిన ఎలాంటి సమాచారం అయినా మనకు దొరికిపోతుంది.
అయితే ఒకప్పుడు మాత్రం వార్తలు గురించి రోజంతా వేచి చూడాలి. రాత్రి ఏడు గంటలకు టీవీల్లో అదీ దూర దర్శన్‌లో ఏడుగంటలకు మాత్రమే ఓ బులిటెన్‌లో జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర,రాజకీయ వార్తలు అన్నీ వచ్చేవి. ఆ వార్తలు చదివే న్యూస్ రీడర్ పేరు శాంతి స్వరూప్. ప్రభుత్వ ప్రచార సాధనమైనటువంటి దూరదర్శన్ లో తొలి తెలుగు యాంకర్‌గా ఆయన ప్రాముఖ్యత సంపాదించారు. అయితే శాంతి స్వరూప్ ఇవాళ కన్నుమూశారు. హైదరాబాద్ మలక్ పేట యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. తెలుగు దూరదర్శన్ పేరు చెప్పగానే అందరికీ శాంతి స్వరూప్ గుర్తుకు వచ్చేవారు.

1977 అక్టోబర్ 23న దూరదర్శన్ కార్యక్రమాలను నాటి రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డి ప్రారంభించగా.. మొట్టమొదటి యాంకర్ గా శాంతిస్వరూప్ పనిచేశారు. ప్రాంప్టర్ లేని సమయంలో తప్పులు లేకుండా జాగ్రత్తగా వార్తలు చదివి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2011లో ఆయన పదవి విరమణ పొందారు. ముఖ్యంగా దూరదర్శన్ టీవీలో తెలుగు ప్రజలకు వార్తలు చెప్పిన మొట్టమొదటి వ్యక్తి శాంతి స్వరూప్ కావడం విశేషం. సీనియర్ సినీ ప్రముఖులతో కూడా ఈయనకు పరిచయం ఉంది. శాంతి స్వరూప్ కి సినిమాలతోపాటు రాజకీయాల్లో కూడా మంచి అనుభవం ఉంది.

Post office: నెలకు రూ. 1000 ఇన్వెస్ట్ చేస్తే.. రూ. 5 లక్షలు సొంతం చేసుకోవచ్చు..

భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ప్రతీ ఒక్కరూ ఎంతో కొంత సేవింగ్ చేస్తూ ఉంటారు. వారి, వారి ఆదాయాలకు అనుగుణంగా డబ్బులను పొదపు చేస్తుంటారు. అందులోనూ రిస్క్‌ తక్కువగా ఉండీ మంచి లాభాలు వచ్చే వాటిపై దృష్టిసారిస్తుంటాం. ఇలాంటి వారి కోసమే ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ పోస్టాఫీస్‌ అదిరిపోయే ప్లాన్స్‌ను అందిస్తోంది. ఇలాంటి వాటిలో రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌ ఒకటి.

ఇందులో పెట్టుబడి పెట్టడం వల్ల తక్కువ రిస్క్‌తో మంచి రిటర్న్స్‌ను పొందొచ్చు. రిస్క్‌ కూడా తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఈ పథకంలో భాగంగా 6.5 శాతం వడ్డీ రేటను పొందుతారు. ఈ పథకంలో మీరు రూ.100 నుంచి డబ్బులు పొదుపు చేసుకోవచ్చు, గరిష్ట పరిమితి అంటూ ఏం లేదు. ఇందు కోసం సింగల్‌ లేదా జాయింట్ అకౌంట్ ఓపెన్‌ చేసుకోవచ్చు. ఈ పథకంలో ప్రతీ నెల డబ్బులు జమ చేయాల్సి ఉంటుంది.

ఇందులో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి కనీసం 5 ఏళ్లు పెట్టుబడి పెడుతూ ఉండాలి. తర్వాత మీ డబ్బులను ఒకేసారి చెల్లిస్తారు. మీరు పెట్టుబడి పెట్టిన మొత్తం ఆధారంగా మీరు రిటర్న్స్‌ పొందుతారు. ఉదాహరణకు మీరు నెలకు రూ. వెయ్యి పెట్టుబడి పెడుతూ పోతూ రూ. 5 లక్షలు ఎలా సొంతం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు నెలకు రూ. 1000 ఇన్వెస్ట్ చేస్తే 5 ఏళ్లకు రూ. 60000 అవుతుంది. మీకు వడ్డీ రూపంలో రూ. 11000 జమ అవుతాయి.

ఒకవేళ పెట్టుబడిని మరో 5 ఏళ్లు పొడగిస్తే.. మీ డిపాజిట్ మొత్తం రూ. 1.2 లక్షలకు చేరుతుంది. దానికి వడ్డీతో కలిపి మొత్తం 1.69 లక్షలు వస్తాయి. ఇలాగే మరో ఐదేళ్లు పెట్టుబడి పెడితే.. అప్పుడు మీరు రూ. 2.4 లక్షలు ఇన్వెస్ట్ చేస్తారు. ఇలా మీరు 20 ఏళ్లు పెట్టుబడి పెడితే మీరు ఏకంగా రూ. 5 లక్షలు సొంతం చేసుకోవచ్చు. 20 ఏళ్లు పెద్ద సమయమే అయినప్పటికీ.. ప్రతీ నెల కేవలం 1000 పెట్టుబడితో ఉద్యోగ విరమణ తర్వాతే ఒకేసారి రూ. 5 లక్షలు రావడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

Telangana: వార్నీ ఎదెక్కడి విడ్డూరం.. ట్రాక్టర్ డ్రైవర్ సీటు బెల్ట్ పెట్టుకోలేదట..! ఫైన్ వేసిన పోలీసులు..

ట్రాఫిక్‌ నియమాలు పాటించకపోతే ఎవరికైనా సరే జరిమానా తప్పదు. ప్రజల భద్రతే లక్ష్యంగా మన పోలీసు యంత్రాంగం వాహన చట్టాలు, రోడ్డు భద్రతా నియమాలను కఠినంగా అమలు చేస్తున్నారు. అందులో భాగంగా బైక్‌ పై వెళ్లేవారు తప్పనిసరిగా హెల్మెట్‌ పెట్టుకోవాలి. ఇద్దరి కంటే ఎక్కువ మంది బైక్‌పై ప్రయాణించరాదు. సిగ్నళ్ల వద్ద జంప్‌ చేయరాదు. ర్యాష్‌ డ్రైవింగ్‌ చేయరాదు. అలాగే, కారులో ప్రయాణించే వారు డ్రైవర్‌ సహా పక్కనున్న వారు కూడా సీటు బెల్ట్‌ తప్పనిసరిగా ధరించాలి. లేదంటే, అధికారులు వేసే ఫైన్‌ కట్టక తప్పదు. అందరికీ తెలిసిన ఈ పాత ముచ్చట్లు ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా..? అయితే సీటు బెల్ట్‌ పెట్టుకోలేదని ట్రాక్టర్ డ్రైవర్ కు ఫైన్ వేశారు ట్రాఫిక్‌ సిబ్బంది. ఈ విచిత్రమైన ఘటన భద్రాద్రి కొత్తగూడెంలో జిల్లాలో చోటు చేసుకుంది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఓ ట్రాక్టర్ డ్రైవరుకు సీటు బెల్ట్ పెట్టుకోలేదని 100 రూపాయలు ఫైన్ వేశారు పాల్వంచ పోలీసులు. పాల్వంచ మండలం జగన్నాథ పురం కు చెందిన నాగిరెడ్డి ట్రాక్టర్ లో ఇసుక తీసుకు వస్తుండగా ఫైన్ వేశారు పోలీసులు. మార్చి 27 న పోలీసులు ఫైన్ వేయగా, విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ట్రాక్టర్‌ డ్రైవర్‌ నాగిరెడ్డి షాక్‌ అయ్యాడు. అతనే కాదు.. విషయం తెలిసిన చుట్టుపక్కల జనాలు కూడా ఆశ్చర్యపోతున్నారు. ట్రాక్టరుకు అసలు సీట్ బెల్ట్ ఎక్కడిదని ట్రాక్టర్ యజమాని వాపోతున్నాడు. ఈ విషయం గురించి తెలుసుకోవాలని షోరూమ్ కి కూడా ఫోన్ చేసామని.. అయితే ట్రాక్టర్ కు సీటు బెల్ట్ అనేదే ఉండదని చెప్పారని ట్రాక్టర్ డ్రైవర్ తెలిపారు.

గతంలోనూ మహబూబాబాద్‌ జిల్లాలో ఇలాంటి విచిత్ర సంఘటనే జరిగింది. ఒక ట్రాక్టర్ డ్రైవర్‌కు ఇలాంటి చలాన్‌ వచ్చింది. మహబూబాబాద్‌ జిల్లా సీతానాగారం గ్రామానికి చెందిన ఓ ట్రాక్టర్ డ్రైవర్‌కు హెల్మెట్ ధరించలేదని చలానా విధించినట్లు మెసేజ్‌ వచ్చింది. అది చూసిన బాధితుడు కంగుతిన్నాడు. వెంటనే ట్రాఫిక్‌ అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

CM Revanth: ప్రైవేటు యాజమాన్యాలకు రేవంత్ సర్కార్ భారీ షాక్.. ఫీజుల నియంత్రణకు కొత్త చట్టం

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలతో పాలనలో దూకుడుగా ముందుకు సాగుతోంది. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తూనే.. గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది. అలానే తమ పాలనలో ప్రజా సంక్షేమ నిర్ణాయలు తీసుకుంటుంది. ఈ క్రమంలో ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తోన్న కార్పొరేట్ విద్యా సంస్థలకు కళ్లెం వేయడాని రెడీ అయ్యింది రేవంత్ సర్కార్. ఫీజుల నియంత్రకు కొత్త చట్టం తీసుకురాబోతుంది. ఆ వివరాలు..

రాష్ట్రంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థలపై కొరడా ఝుళిపించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ రెడీ అయ్యింది. కార్పొరేట్ కాలేజీల్లో పెరుగుతున్న ఫీజులపై తల్లిదండ్రుల నుంచి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తడంతో.. ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించింది కాంగ్రెస్ సర్కార్. దీనిపై ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. ఫీజుల పేరుతో విద్యార్థులను వేధింపులకు గురి చేయడంతో గతంలో.. పదుల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న సంగతి తెలిసిందే.

అయితే.. ఫీజుల అంశంపై గతంలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందినా.. బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదని.. సరైన చర్యలు తీసుకోలేదనే ఆరోపణలున్నాయి. దాంతో తల్లిదండ్రుల ఆశలన్ని ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మీదనే ఉన్నాయి. వారి విన్నపం మేరకు కాంగ్రెస్ సర్కార్ ఫీజుల దోపిడికి పాల్పడుతున్న కార్పొరేట్ విద్యాలయాలపై దృష్టి సారించింది. అనుమతులు లేకుండా కొనసాగుతోన్న కార్పొరేట్ కళాశాలలపై చర్యలు చేపట్టడమే కాకుండా.. ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం కూడా తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచాంర.

అయితే.. ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల కోడ్ నడుస్తుండటంతో ఇప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు. దాంతో ఎన్నికలు ముగిసిన వెంటనే అసెంబ్లీ సమావేశమై ఫీజుల నియంత్రణపై ప్రత్యేక చట్టం తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ సర్కార్ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు విధివిధానాలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అయితే దీనిపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు పూర్తయి చట్టం చేసి.. అది అమల్లోకి వచ్చే సరికి అడ్మీషన్లు పూర్తయిపోయి తరగతులు కూడా ప్రారభమవుతాయంటూ వాపోతున్నారు.

Assembly elections : చంద్రబాబుకు ఈసీ నోటీసులు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. మార్చి 31 ఎమ్మిగనూరులో ఆయన చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం సూచించింది.
ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారనే ఫిర్యాదుతో నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది.

కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మే 13న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో రాజకీయ పార్టీల పోస్టర్లు, బ్యానర్లు, ఫెక్సీలను తొలగించారు. అంతేకాదు ఎన్నికల నిబంధనలు ప్రతిఒక్కరూ పాటించాలని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశించింది. ఎవరు అతిక్రమించినా చర్యలు ఉంటాయని హెచ్చరించింది. అయినా సరే నేతలు ఎన్నికల ఆదేశాలను లెక్కచేయకుండా ఎన్నికల ప్రచారంలో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం స్పందించి వివరణ ఇవ్వాలని ఆయన నాయకులకి నోటీసులు జారీ చేస్తోంది.

డబ్బు చేతిలో నిలవడం లేదా? మీ ఇంట్లో అక్కడ తాబేలు బొమ్మ పెట్టి చూడండి!

మన దేశంలో టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న రోజుల్లో కూడా ఇప్పటికి వాస్తు శాస్త్రాన్ని చాలామంది గట్టిగా నమ్ముతుంటారు. అలాగే వాస్తు ప్రకారం ఇంటి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.
ఈక్రమంలోనే వాస్తు ప్రకారం ఇళ్లు నిర్మించిడం దగ్గర నుంచి, ఇంట్లో ఏ వస్తువులు ఎక్కడ ఉండాలో, ఎక్కడ ఉంచితే లాభం కలుగుతుందోనని పది రకాలుగా ఆలోచిస్తుంటారు. అలాగే ఈ విషయంలో..కొన్ని సార్లు జ్యోతిష్య నిపుణుల సలహాలను, సంప్రాదింపులను కూడా చేస్తుంటారు. ఎందుకంటే..చాలా ఇళ్లలో ఈ వాస్తు దోషాల వలన.. ఎంత సంపాదిస్తున్న డబ్బు నిలవకపోవడం వంటి ఏదో కారణాలతో అనేక నష్టాలు వాటిల్లుతాయి. అలాంటి సమయంలో.. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని రకాల వస్తువుల్ని ఉంచడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయని చాలామంది బలంగా నమ్ముతారు. మరి అలాంటి ఆద్భుతమైన వస్తువుల్లో ఈ క్రిస్టల్ తాబేలు కూడా ఒకటి. అయితే దీనిని ఇంట్లో ఆ చోట పెట్టుకుంటే..ఇంట్లో ఊహించని మ్యాజిక్ జరగడంతో పాటు ఆకస్మిక లాభాలు పొందవచ్చు. ఇంతకి వాస్తు ప్రకారం ఈ క్రిస్టల్ తాబేలును ఎక్కువగా వాస్తు ప్రకారం ఏ దిక్కులో ఉంచితే మంచిదో తెలుసుకుందాం.
మనలో ఇప్పటికి చాలామంది వాస్తు శాస్త్రాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. అలాగే వాస్తు ప్రకారం ఇంటి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతిఒక్కరూ ఇంట్లో కొన్ని రకాల వస్తువుల్ని ఉంచడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయని గట్టిగా నమ్ముతుంటారు. మరి అలాంటి వస్తువుల్లో ఈ క్రిస్టాల్ తాబేలు బొమ్మ కూడా ఒకటి. దీనిని ఇంట్లో పెట్టుకుంటే అనేక లాభాలు పొందవచ్చని అందరూ నమ్ముతుంటారు. అయితే ఈ క్రిస్టల్ తాబేలును ఎక్కువగా వాస్తు ప్రకారం ఏ దిక్కులో ఉంచితే మంచిదో తెలుసుకుందాం.అయితే వాస్తు ప్రకారం ఈ క్రిస్టల్ తాబేలును దక్షిణ దిక్కులో ఇంట్లో పెట్టుకుంటే మంచి పాజిటీవిటీ పెరుగుతుంది. అలాగే, బెడ్‌రూమ్‌లో పెట్టుకుంటే.. మంచి నిద్ర లభిస్తుందట. దీంతో నిద్ర సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా.. క్రిస్టల్ తాబేలును పూజగదిలో పెట్టుకుంటే.. ఇంటికి చాలా మంచిది. అది కూడా పసుపు రంగు క్లాత్‌లో చుట్టి పెడితే మరింత మంచిదని నిపుణులు చెబుతున్నారు.
అంతేకాకుండా.. గుమ్మంకు ఎదురుగా క్రిస్టల్ తాబేలును ఉంచుకుంటే.. నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి రాదు. ఇక ఇంట్లో సంపాదన పెరగాలి అనుకునేవారు.. క్రిస్టల్ తాబేలును లాకర్‌లో పెట్టుకుంటే.. ఇంట్లోకి ధన ప్రవాహం పెరుగుతుంది. సులభంగా డబ్బును ఆకర్షిస్తుంది. అలాగే వారి ఇంట్లో ఎల్లప్పుడు సంపాద అనేది క్రమంగా పెరుగుతు ఉంటుంది. ఇక వారకి ఆర్థిక ఇబ్బందులనేవి దరిదాపుల్లో చేరవు.

Health

సినిమా