Sunday, December 14, 2025

15 నిమిషాల్లో హెచ్‌సీవీ టెస్ట్.. కొత్త విధానాన్ని డెవలప్ చేసిన పరిశోధకులు

 రోగమేంటో తెలిస్తే చికిత్స సులభం అవుతుంది. డాక్టర్లు కూడా ఇదే చెబుతుంటారు. అందుకే పేషెంట్లను చెక్ చేసిన తర్వాత అవసరమైన టెస్టులకోసం రిఫర్ చేస్తుంటారు.

రిపోర్ట్ వచ్చాక అవసరమైన ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. అంటే ఇక్కడ రోగ నిర్ధారణ చాలా ముఖ్యం. అయితే ఇది అన్ని అనారోగ్యాలకూ ఒకేలా ఉండదు. కొన్ని నిర్ధారణలు ఆలస్యం అవుతుంటాయి. ఇక వైరస్ శరీరంలో ఉందా, చికిత్స అవసరమా అని తెలుసుకోవాలంటే HCV RNA PCR టెస్ట్ తప్పనిసరి. ఈ ఫలితాలు రావడానికి సాధారణంగా 3 నుంచి 15 రోజులు పడుతుంది. కానీ ఈ ఇక నుంచి అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు. ఎందుకంటే నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ సైంటిస్టులు 15 నిమిషాల్లో పూర్తి చేయగలిగే కొత్త పరీక్ష విధానాన్ని అభివృద్ధి చేశారు.

హెపటైటిసిస్ సి (HCV) టెస్టుల్లో, ట్రీట్మెంట్‌లో ఆలస్యాన్ని నివారించడమే లక్ష్యంగా శాస్త్రవేత్తలు కొత్త పరికరాన్ని, పరీక్ష విధానాన్ని అభివృద్ధి చేశారు. మొదట కోవిడ్-19 కోసం అభివృద్ధి చేసిన DASH® ప్లాట్‌ఫాంను వేగవంతమైన హెచ్‌సీవీ పరీక్షల నిర్ధారణకు అనుగుణంగా అనుకూలించారు. ఇది వివిధ వ్యాధులకు అనుకూలమైన ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ (POC) డయాగ్నస్టిక్స్ సిస్టమ్‌గా రూపొందింది. కాబట్టి దీని ద్వారా రక్తసేకరణ తర్వాత 15 నిమిషాల్లో హెపటైటిస్ సి పరీక్షను పూర్తి చేయవచ్చు. అంటే ఇది రోగ నిర్ధారణ సమయాన్ని 75% తగ్గించడం ద్వారా త్వరగా చికిత్సను ప్రారంభించేందుకు సహాయపడుతుంది. ఇది త్వరలో ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.

ఇప్పటి వరకున్న హెచ్‌సీవీ పరీక్ష విధానం ఆలస్యంతో కూడుకున్నది. ఫలితాలు రావడానికి వారం నుంచి 15 రోజులుపడుతుంది. కానీ కొత్తగా అభివృద్ధి చేసిన DASH® పరికరింతోపాటు దానికి సంబంధించిన టెస్టింగ్ విధానంతో 15 నిమిషాల్లో ఫలితం తెలిసి పోతుంది. అంటే ఒకే రోజులో నిర్ధారణతోపాటు చికిత్స ప్రారంభించవచ్చు. దీంతో ల్యాబ్ లేదా రవాణా అవసరం లేదు.

నిజానికి హెపటైటిస్ సి వైరస్ (HCV) ప్రపంచవ్యాప్తంగా సుమారు 5 కోట్ల మందిని ప్రభావితం చేస్తోంది. ప్రతీ సంవత్సరం సుమారు 2.42 లక్షల మంది మరణాలకు కారణం అవుతుంది. ముఖ్యంగా లివర్ సిరోసిస్, లివర్ క్యాన్సర్లకు దారితీస్తుంది. అయితే 8 నుంచి 12 వారాలు మెడికేషన్స్ యూజ్ చేస్తే ఈ వైరస్ సంపూర్ణంగా దూరం అవుతుంది. కానీ టెస్టింగ్ ప్రాసెస్ వల్ల గుర్తించడమే ఆలస్యమయ్యేది. దీంతో చాలామందిలో చికిత్స ప్రారంభించే సమయానికి హెచ్‌సీవీ అధికమై ఇబ్బందులు తలెత్తేవి. కొన్నిసార్లు మరణాలు సంభవిస్తాయి కూడా. కానీ ఇప్పుడు కేవలం 15 నిమిషాల్లోనే హెసీవీ టెస్ట్ పూర్తి చేసే విధానాన్ని శాస్త్రవేత్తలు రూపొందించారు కాబట్టి ఆ వ్యాధివల్ల సంభవించే మరణాల రేటు 2030 నాటికి పూర్తిగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

ఈ ఆఫర్ మళ్లీ జన్మలో రాదు..28కిమీ మైలేజ్ ఇచ్చే మారుతి కారు పై ఏకంగా రూ.2.40లక్షల తగ్గింపు

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో స్ట్రాంగ్ హైబ్రిడ్ వాహనాలకు ప్రాచుర్యం కల్పించడంలో మారుతి సుజుకి, టయోటా భాగస్వామ్యం కీలకంగా నిలిచింది. ఈ జాయింట్ వెంచర్ ద్వారా వచ్చిన గ్రాండ్ విటారా, అర్బన్ క్రూయిజర్ హైరైడర్ మోడల్స్, మార్కెట్‌లో క్రెటా ఆధిపత్యాన్ని సవాలు చేయడంలో విజయవంతమయ్యాయి.

ఈ రెండు మోడల్స్ అతి తక్కువ సమయంలోనే 3 లక్షలకు పైగా అమ్మకాలు జరిపి, తమ సత్తాను చాటుకున్నాయి.

మొదట్లో గ్రాండ్ విటారా అమ్మకాలు జోరుగా ఉన్నప్పటికీ, ఇటీవల టయోటా హైరైడర్ కొంచెం మెరుగైన అమ్మకాలు సాధిస్తోంది. దీంతో దేశంలోనే అతిపెద్ద తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి, తమ అమ్మకాలను పెంచుకోవడానికి గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రస్తుతం ఉన్న స్టాక్‌లను క్లియర్ చేయడానికి, గ్రాండ్ విటారాపై భారీ ఇయర్-ఎండ్ ఆఫర్‌లను ప్రకటించింది.

ఈ ఆఫర్లలో భాగంగా, గ్రాండ్ విటారా ఎస్‌యూవీని కొనుగోలుదారులు ఏకంగా రూ.2.40 లక్షల వరకు ప్రయోజనాలతో సొంతం చేసుకోవచ్చు. ఇందులో నగదు తగ్గింపులతో పాటు, ఆప్షనల్ ఎక్స్‌టెండెడ్ వారంటీ కవరేజ్ కూడా ఉంటుంది. అయితే మీరు ఎంచుకునే వేరియంట్‌ను బట్టి, ముఖ్యంగా హైబ్రిడ్, మైల్డ్ హైబ్రిడ్ వేరియంట్‌లను బట్టి ఈ తగ్గింపు ఆఫర్‌లో మార్పులు ఉంటాయి.

2022లో విడుదలైన ఈ గ్రాండ్ విటారా, ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు అనేక అడ్వాన్సుడ్ ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో వైర్‌లెస్ కనెక్టివిటీతో కూడిన 9 అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో ప్లస్ ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్, డ్రైవర్‌కు ఉపయోగపడే హెడ్-అప్ డిస్‌ప్లే (HUD), కారు చుట్టూ చూడటానికి 360 డిగ్రీ వ్యూ కెమెరా, వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్ డాక్ వంటి లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి.

గ్రాండ్ విటారా రెండు ప్రధాన ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. 1.5 లీటర్ మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ వేరియంట్ 102 బీహెచ్‌పీ పవర్ ఉత్పత్తి చేస్తుంది. 19.38 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. దీనికి మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ ఉంది.

1.5 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ వేరియంట్ ఇది 113 బీహెచ్‌పీ పవర్‎తో పాటు, ఏకంగా 27.97 కిలోమీటర్ల అద్భుతమైన మైలేజీని అందిస్తుంది. ఈ వేరియంట్ eCVT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే వస్తుంది.

సాంప్రదాయ ఇంజన్ ఆప్షన్లతో పాటు, గ్రాండ్ విటారా సిఎన్‌జి పవర్‌ట్రైన్ (26.6 కి.మీ/కిలో మైలేజ్), ఆల్-వీల్ డ్రైవ్ (AWD) ఆప్షన్లతో కూడా లభిస్తుంది. ప్రస్తుతం ఈ ఎస్‌యూవీ ఎక్స్-షోరూమ్ ధర రూ.10.77 లక్షల నుంచి రూ.20.22 లక్షల వరకు ఉంది.

సిఎన్‌జి వేరియంట్‌ అద్భుతమైన మైలేజీని ఇస్తుందని మారుతి చెబుతోంది. విడుదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 3 లక్షల కంటే ఎక్కువ మంది గ్రాండ్ విటారాను కొనుగోలు చేశారు. ఇటీవల మారుతి సేఫ్టీ మీద కూడా దృష్టి పెట్టింది. దీంతో కస్టమర్లకు గతంలో ఉన్న అపోహలు తొలగిపోతున్నాయి.

భారతీయ కస్టమర్‌లకు తక్కువ ధరలో, అత్యధిక మైలేజ్, అత్యాధునిక ఫీచర్లను అందించాలనే మారుతి సుజుకి వ్యూహానికి ఈ బంపర్ డిస్కౌంట్ ఆఫర్ నిదర్శనం. ఈ ఇయర్-ఎండ్ సేల్‌లో గ్రాండ్ విటారాను సొంతం చేసుకోవడానికి ఇదే సరైన సమయం.

ఏపీలో ఉద్యోగులు పెన్షనర్లకు గుడ్ న్యూస్-హెల్త్ కార్డులపై కీలక అప్డేట్.

పీలో ఉద్యోగులకు, పెన్షనర్లకు కూటమి సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఏడాదిన్నర కాలంగా ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న హెల్త్ కార్డుల సమస్యలపై మరో ముందడుగు వేసింది.

గతంలో ఉద్యోగ సంఘాలతో చర్చల సందర్భంగా సీఎం చంద్రబాబు ఇచ్చిన ఓ హామీని ప్రభుత్వం ఇవాళ నిలబెట్టుకుంది. ఈ మేరకు ఇవాళ ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది.

గతంలో ఉద్యోగ సంఘాలతో చర్చల సందర్భంగా వారు ఉద్యోగుల ఆరోగ్య పథకంతో పాటు హెల్త్ కార్డుల విషయంలో ఎదురవుతున్న సమస్యల్ని సీఎం చంద్రబాబు దృష్టికి తెచ్చారు. దీంతో ఆయన అధికారులతో ఓ కమిటీ ఏర్పాటు చేసి అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఇవాళ ఉద్యోగుల హెల్త్ కార్డులపై ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘాలతో ఇచ్చిన హామీ మేరకు అఫీషియల్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

అక్టోబర్ 18వ తేదీన సీఎం చంద్రబాబుతో ఉద్యోగ సంఘాల భేటీ సందర్భంగా హెల్త్ కార్డుల సమస్యలపై కమిటీ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ ఇవాళ ఏడుగురు సభ్యులతో దీన్ని ప్రకటించారు. సీఎస్ విజయానంద్ ఆధ్వర్యంలో పనిచేసే ఈ కమిటీ ఎనిమిది వారాల్లోగా హెల్త్ కార్డుల సమస్యల్ని పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ సీఈవో వీటిపై తదుపరి చర్యలు తీసుకుంటారని ప్రభుత్వం జీవోలో పేర్కొంది.

ఈ కమిటీలో సీఎస్ తో పాటు సాధారణ పరిపాలన శాఖకు చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేదా ప్రధాన కార్యదర్శి లేదా కార్యదర్శుల్లో ఒకరు, హెచ్ ఆర్ వ్యవహారాలు చూస్తున్న ఆర్ధిక శాఖ కార్యదర్శి, వైద్యారోగ్యశాఖ కార్యదర్శి, ఏపీ ఎన్డీవోల అధ్యక్షుడు విద్యాసాగర్, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ సీఈవో సభ్యులుగా ఉంటారు.

కళ్లకు గంతలు కట్టుకుని పరీక్ష రాసిన విద్యార్థిని.. ఆమె రహస్యం తెలిస్తే అవాక్కే..

ప్రస్తుత కాలంలో పరీక్ష రాయడానికే విద్యార్థులు ఎంతో కష్టపడుతుంటారు. అలాంటిది కళ్లకు గంతలు కట్టుకుని పరీక్ష రాయడం అంటే మాటలు కాదు. అయితే కర్ణాటకలోని బళ్లారికి చెందిన ఒక విద్యార్థిని అసాధారణమైన ప్రతిభను ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

బళ్లారిలోని కురవల్లి తిమ్మప్ప మెమోరియల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్న హిమబిందు అనే విద్యార్థిని సోషల్ సైన్స్ పరీక్షను కళ్లకు గంతలు కట్టుకుని రాసి వార్తల్లో నిలిచింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో అనేక సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కళ్ల గంతలతో అద్భుతం

హిమబిందు ముందుగా కళ్లకు కాటన్ పెట్టుకుని, ఆపై దానిపై నల్లటి గుడ్డను కట్టుకుని పరీక్ష రాసింది. ఈ అద్భుతమైన ఘనత సాధించినందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆమెను ప్రశంసించారు.
ఉపాధ్యాయులు చెప్పిన వివరాల ప్రకారం.. హిమబిందు కళ్లు మూసుకుని కూడా ఫోటోలను త్వరగా గుర్తించగలదు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆంజనేయస్వామి వంటి వారి ఫోటోలను ఆమె వెంటనే గుర్తుపట్టగలదు. టెక్నాలజీలోనూ ఆమె ముందుంది. కళ్లు మూసుకుని తన మొబైల్ ఫోన్‌లో అక్షరాలను ఆమె వెంటనే చెప్పగలదు.

రహస్య మంత్రం, మూడో కన్ను విద్య

11 ఏళ్ల వయస్సు నుంచే ఈ విద్యలో ప్రావీణ్యం సంపాదించిన హిమబిందు తన ఈ పరీక్షలన్నింటినీ కళ్లకు గంతలు కట్టుకుని రాయాలని నిర్ణయించుకుంది. ఈ అసాధారణ సామర్థ్యం గురించి ఆమె ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ”నేను చిన్నప్పటి నుంచి కళ్లకు గంతలు కట్టుకుని రాయడం ప్రాక్టీస్ చేస్తున్నాను. పరీక్ష రాసే ముందు, నేను ఒక రహస్య మంత్రాన్ని పఠిస్తాను, అది ఎవరికీ చెప్పను. మొత్తం 25 కార్యక్రమాల్లో పాల్గొని అవార్డులు అందుకున్నాను. నా గురువు నాకు ఈ జ్ఞానాన్ని ఇచ్చారు. ప్రాణాయామం ద్వారా నేను నా మూడవ కన్ను ద్వారా ప్రతిదీ అర్థం చేసుకోగలను” అని చెప్పింది.

పాఠశాల అనుమతితోనే..

చిన్నప్పటి నుంచే ఈ గాంధారి విద్యను అభ్యసిస్తున్న హిమబిందు సాధనకు ఆమె ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పూర్తిగా మద్దతు ఇచ్చారు. ఆమె ఎనిమిదో తరగతి చదువుతుండటం వల్ల పాఠశాల యాజమాన్య బోర్డు అనుమతితో కళ్లకు గంతలు కట్టుకుని పరీక్ష రాసే అవకాశం లభించింది. అయితే టెన్త్ పబ్లిక్ పరీక్షలను ఇలా రాయడానికి అనుమతి లేదని పాఠశాల వర్గాలు స్పష్టం చేశాయి.

మరోవారంలో ఎన్టీపీసీ రైల్వే రాత పరీక్షలు.. అడ్మిట్ కార్డులు విడుదల ఎప్పుడంటే?

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్‌ (RRB) ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ అండర్‌ గ్రాడ్యుయేట్ ఆన్‌లైన్ రాత పరీక్షలను మరో వారంలో నిర్వహించనుంది.

ఈ క్రమంలో ఈ పరీక్షలకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్‌ స్లిప్‌లను తాజాగా విడుదల చేసింది. ఇప్పటికే సీబీటీ 1 పరీక్ష పూర్తి కాగా ఇందులో అర్హత సాధించిన వారికి సీబీటీ 2 పరీక్షను ఆన్‌లైన్‌ విధానంలో డిసెంబర్‌ 20వ తేదీన నిర్వహించనుంది. సీబీటీ 2 పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులను డౌన్‌లోడ్‌ చేసుకోవచచు. ఇక పరీక్షల అడ్మిట్‌ కార్డులను పరీక్షకు సరిగ్గా నాలుగు రోజుల ముందు ఆర్‌ఆర్‌బీ విడుదల చేయనుంది. కాగా డిసెంబర్ 20న మొత్తం 51,978 మంది అభ్యర్థులు దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో పరీక్షకు హాజరుకానున్నారు. ఇతర వివరాలు ఈ కింది అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్‌ (IBPS) ఈ ఏడాది నవంబర్‌ 9వ తేదీన నిర్వహించిన స్పెషలిస్ట్ ఆఫీసర్స్‌ (SO), ప్రొబేషనరీ ఆఫీసర్‌ (PO) మెయిన్స్‌ 2025 పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. ఈ మేరకు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లోhttps://www.ibps.in/ పొందుపరిచింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్‌, రోల్ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి ఫలితాలను పొందవచ్చు. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 1007 ఉద్యోగాలను భర్తీ చేయనుంది.

ఆ చిన్న దేశంలో 10వేలు సంపాదిస్తే.. భారత్‌లో లక్షాధికారులు అవడం పక్కా..

ప్రపంచ పటంలో చిన్న చుక్కలా కనిపించే కొన్ని దేశాల కరెన్సీలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అత్యంత శక్తివంతమైనవిగా నిలుస్తున్నాయి. వాటిలో ఒకటి జోర్డాన్ దినార్.

కేవలం 1.12 కోట్ల జనాభా ఉన్న ఈ దేశ కరెన్సీ విలువ భారత రూపాయి కంటే చాలా ఎక్కువగా ఉంది. ప్రస్తుత గణాంకాల ప్రకారం.. 1 జోర్డాన్ దినార్ విలువ దాదాపు రూ.126.8 భారత రూపాయిలు. అంటే ఒక భారతీయ రూపాయికి కేవలం 0.00788 జోర్డాన్ దినార్లు మాత్రమే లభిస్తాయి. జోర్డాన్‌లో ఎవరైనా 800 దినార్లు సంపాదిస్తే.. మన దేశంలో దాని విలువ రూ.1,14,000 కంటే ఎక్కువగా ఉంటుంది.

అంతర్జాతీయంగా నాలుగో స్థానం

జోర్డాన్ దినార్ విలువ పరంగా అంతర్జాతీయ ర్యాంకింగ్‌లో నాల్గవ స్థానంలో ఉంది. ప్రపంచంలోనే అత్యధిక విలువ కలిగిన కరెన్సీల జాబితాలో కువైట్ దినార్, బహ్రెయిన్ దినార్, ఒమానీ రియాల్ మాత్రమే జోర్డాన్ కంటే ముందు ఉన్నాయి. JODను ప్రపంచంలోనే అత్యంత స్థిరమైన, నమ్మదగిన కరెన్సీలలో ఒకటిగా పరిగణిస్తారు.

చమురు లేకున్నా ఎందుకంత బలం?

చమురు నిల్వలు సమృద్ధిగా లేనప్పటికీ, జోర్డాన్ కరెన్సీ ఇంత బలంగా ఉండటానికి కారణం దాని పటిష్టమైన ఆర్థిక విధానాలు, ద్రవ్య నిర్ణయాలు – ఆర్థిక క్రమశిక్షణ.

US డాలర్‌తో అనుసంధానం

జోర్డాన్ కరెన్సీని US డాలర్‌తో అనుసంధానించడం జరిగింది. దీని కారణంగా దాని విలువ స్థిరంగా ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఆకస్మిక హెచ్చుతగ్గులు దీనిని ప్రభావితం చేయవు. ఈ స్థిరత్వం ప్రపంచ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచి వారి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. జోర్డాన్ సెంట్రల్ బ్యాంక్ నియంత్రిత ద్రవ్య విధానాన్ని అమలు చేస్తుంది. ఇది మార్కెట్లో పరిమిత డబ్బు సరఫరాను నిర్ధారిస్తుంది. సరఫరా తక్కువగా ఉండటం వల్ల ఈ కరెన్సీ విలువ పడిపోకుండా స్థిరంగా ఉంటుంది.

భారత రూపాయి ఎందుకు బలహీనంగా ఉంది?

జోర్డాన్ దినార్‌తో పోలిస్తే భారత రూపాయి బలహీనంగా ఉండటానికి ప్రధాన కారణం.. భారత కరెన్సీ స్వేచ్ఛగా తేలియాడే కరెన్సీ కావడం. అంటే దీని విలువ ప్రపంచ మార్కెట్ శక్తులపై ఆధారపడి ఉంటుంది. ప్రపంచ వాణిజ్యం, ముడి చమురు ధరలు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ, దేశీయ రాజకీయ స్థిరత్వం వంటి అనేక అంశాలు భారత కరెన్సీపై పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. దీనివల్ల రూపాయి వేగంగా హెచ్చుతగ్గులకు గురవుతుంది. తద్వారా దాని విలువ కొంతమేర బలహీనపడుతుంది.

తెలంగాణలో ముగిసిన తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్.. 2 గంటల తర్వాత కౌంటింగ్

తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. గురువారం (డిసెంబర్ 11) ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సరిగ్గా మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిసింది.

పోలింగ్ సమయం ముగిసినా చాలా చోట్ల ఓటర్లు క్యూ లైన్లలో బారులు తీరారు. దీంతో పోలింగ్ కేంద్రాల గేట్లు మూసి మధ్యాహ్నం 1 గంటల లోపు క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు ఎన్నికల సంఘం అధికారులు.

రాష్ట్రవ్యాప్తంగా యువత, పెద్దలు, వృద్ధులు ఉత్సాహంగా ఓటేశారు. ఫలితంగా ఫస్ట్ ఫేజ్ పంచాయతీ ఎన్నికల్లో భారీగా ఓటింగ్ శాతం నమోదైనట్లు తెలుస్తోంది. భోజన విరామం తర్వాత మధ్యాహ్నం 2 గంటల తర్వాత కౌంటింగ్​చేపట్టి విజేతలను ప్రకటించనున్నారు. ఆ వెంటనే గెలుపొందిన సర్పంచ్, వార్డు మెంబర్లు ప్రత్యేకంగా సమావేశమై ఉప సర్పంచ్‌లను ఎన్నుకోనున్నారు. తొలి విడతలో 3,834 సర్పంచ్, 27,628 వార్డ్ మెంబర్ స్థానాలకు పోలింగ్ జరిగింది.

కొన్ని చోట్ల చెల్లాచెదురు ఘటనలు మినహా మిగిలిన అన్నీ చోట్ల పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీగా పోలీసులను మోహరించారు. మరోవైపు.. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు పోలింగ్ సరళిని నిశితంగా పరిశీలించారు. వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని అబ్జర్వ్ చేశారు. అత్యధికంగా వరంగల్, అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో పోలింగ్ పర్సంటేజ్ నమోదైనట్లు సమాచారం.

పగటిపూట నిద్రపోతే ఏమవుతుంది.. చిన్న కునుకుతో ఇన్ని జరుగుతాయా..?

రోగ్యంగా చురుకుగా ఉండాలంటే రోజుకు ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరి అని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు. అయితే నేటి వేగవంతమైన జీవనశైలి, రాత్రి వేళల్లో పని ఒత్తిడి, టెక్నాలజీ వినియోగం వంటి కారణాల వల్ల చాలా మందికి ఆ ఎనిమిది గంటల నిరంతర నిద్ర లభించడం కష్టంగా మారింది.

ఈ పరిస్థితిలో నిద్ర లేమిని భర్తీ చేసుకోవడానికి చాలా మంది బైఫాసిక్ లేదా పాలీఫాసిక్ విధానాన్ని అవలంబిస్తున్నారు. అంటే, రాత్రిపూట నిద్ర తక్కువైతే, పగటిపూట నిద్రపోవడం ద్వారా దాన్ని భర్తీ చేసుకుంటున్నారు.

రోజుకు ఎనిమిది గంటల పాటు నిద్రపోవాలని వైద్యులు చెబుతుంటారు. కానీ ఉద్యోగ ఒత్తిడి, టెక్నాలజీ వాడకం వంటి కారణాల వల్ల చాలా మందికి ఇది సాధ్యం కావడం లేదు. ఇలాంటి వారికి నిద్ర నిపుణులు ఇప్పుడు ఒక కొత్త పద్ధతిని సూచిస్తున్నారు: అదే *బైఫాసిక్ నిద్ర. సాధారణంగా రాత్రి ఒకేసారి ఎక్కువసేపు నిద్రపోవడాన్ని అనుసరిస్తాం. కానీ ఈ కొత్త పద్ధతిలో రాత్రి కొద్దిసేపు, పగటిపూట కొంతసేపు నిద్రపోవడం ద్వారా మొత్తం నిద్ర లేమిని భర్తీ చేసుకోవచ్చు.

సైన్స్ ఏం చెబుతోంది?

నేచర్ సైంటిఫిక్ రిపోర్ అనే జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. నిద్రను ఇలా రెండు భాగాలుగా విభజించడం వల్ల మెదడుపై మంచి ప్రభావం ఉంటుంది. పగటిపూట చిన్న కునుకు తీయడం వల్ల దీర్ఘకాలిక జ్ఞాపకశక్తి పెరుగుతుందని పరిశోధనలో తేలింది. ఈ నిద్ర వల్ల శరీరంలో నిద్ర లేమి కారణంగా ఏర్పడే ఒత్తిడి కూడా తగ్గుతుంది. రాత్రి నిద్ర సరిపోని వారు పగటి నిద్ర ద్వారా ఎనిమిది గంటల నిరంతర నిద్ర పొందినంత చురుకుదనం పొందవచ్చని నిపుణులు అంటున్నారు.

సాంప్రదాయ నిరంతర నిద్ర అనేది సహజ సిర్కాడియన్ లయలకు అనుగుణంగా ఉంటుంది. ఇది గాఢ నిద్ర, వేగవంతమైన కంటి కదలిక దశలతో సహా అన్ని నిద్ర చక్రాల ద్వారా శరీరం సజావుగా సాగడానికి వీలు కల్పిస్తుంది. ఈ స్థిరమైన నిద్ర హార్మోన్ విడుదల, హృదయనాళ నిర్వహణ, జ్ఞాపకశక్తి ఏకీకరణకు మద్దతు ఇస్తుంది, రోజంతా ఊహించదగిన శక్తి స్థాయిలను ఇస్తుంది.

ఎవరికి ఇది మంచిది?

ఈ పద్ధతి ముఖ్యంగా షిఫ్టుల్లో పనిచేసే వారికి ఇంటి బాధ్యతలు ఉండి రాత్రి ఎక్కువసేపు నిద్రపోలేని వారికి లేదా స్థిరమైన నిద్ర సమయం లేని వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది మీ రోజువారీ పనులకు ఆటంకం కలగకుండా, కోల్పోయిన విశ్రాంతిని అందిస్తుంది. కాబట్టి నిద్రను ఒకేసారి కాకుండా రోజులో రెండుసార్లు విభజిస్తే మీ మెదడు పనితీరు మెరుగుపడుతుందని, మీరు మరింత శక్తివంతంగా ఉంటారని నిపుణులు సూచిస్తున్నారు.

కోపం ఎక్కువ రావడానికి కారణాలివే.. ఒత్తిడి-ఆందోళన వల్ల వస్తే ఇలా తగ్గించుకోండి

మీకు కోపం ఎక్కువగా వస్తోందా? అయితే మీరు ఒత్తిడి, ఆందోళనతో ఇబ్బంది పడుతున్నట్లు అర్థమని చెప్తున్నారు డాక్టర్ అర్చికా.

డిడి ధ్యానంలో పీహెచ్డీ చేసిన ఆమె.. కోపం అనేది ఆందోళనకు మరొక రూపమని.. ఒత్తిడి వల్ల పెరిగే ఈ ఎమోషన్స్​ని కంట్రోల్ చేసుకోవడానికి ధ్యానం చేయాలని చెప్తున్నారు. మనసులో ఎన్నో ఆలోచనలు ఉంటాయి. ఉద్యోగపరంగా, కెరీర్ పరంగా, ఫ్యామిలీ పరంగా నెరవేరని అంశాలు ఎన్నో ఉంటాయి. ఆ సమయంలో “ఏం చేయాలి, ఏమి చేయలేకపోతున్నామనే” నిరుత్సాహంలో ఒత్తిడి పెరిగి.. అది కోపంగా బయటకు వస్తుందని తెలిపారు. అందుకే చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా ఇరిటేట్ అవుతూ ఉంటారని తెలిపారు.

ఈ తరహా ఎమోషన్స్​ని కంట్రోల్ చేసుకోవడానికి.. ఒత్తిడి, ఆందోళనను దూరం చేసుకోవడానికి ధ్యానం చేయాలని చెప్తున్నారు. కోపాన్ని అణిచివేయనవసరం లేనప్పుడు దానిని మళ్లించడానికి, ఇతరులపై దానిని చూపించకుండా ఉండేందుకు సరైన మార్గాన్ని అవలంభించాలని అర్చికా చెప్తున్నారు. కోపాన్ని, ఒత్తిడిని తగ్గించేందుకు శాస్త్రీయంగా హెల్ప్ చేసే పద్ధతులను ఆమె వివరించారు. అవి ఏంటో.. వాటిని ఎలా చేయాలో.. వాటివల్ల కలిగే లాభాలు ఏంటో చూసేద్దాం.

బ్రీతింగ్ టెక్నిక్..

కోపం వచ్చినప్పుడు శరీరాన్ని కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి, నాడీ వ్యవస్థను రిలాక్స్ చేయడానికి అత్యంత సింపుల్ మార్గం శ్వాస. యోగ తత్వశాస్త్రంలో.. ఈ అభ్యాసం కోపాన్ని కంట్రోల్ చేస్తుంది. ఒత్తిడిని తగ్గించి మనసును రిలాక్స్ చేస్తుంది. దీనిని ఎలా చేయాలంటే.. కోపం వస్తున్నప్పుడు మీ గుండెపై ఒక చేతిని పెట్టుకోవాలి. నాలుగు సెకన్లు గాలి పీల్చుకోవాలి. ఆరు సెకన్లు బయటకు వదలాలి. ఇది యాక్షన్, రియాక్షన్ మధ్య వంతెనగా చేస్తుంది. కోపాన్ని తగ్గిస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది.

థాట్ లెడ్జర్

కోపంగా ఉన్నప్పుడు.. మనసు ఓ స్టోరిని అల్లుతుంది. అయితే మీరు దానికి వ్యతిరేక దిశలో ఆలోచిస్తున్నామని మనసుకు చెప్పాల్సి ఉంటుంది. నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. అందుకే కోపం వస్తుంది అనుకుంటూ చెప్పుకోవాలి. లేదా మీరు ఆలోచనను డైవర్ట్ చేసే వాటిపైకి తీసుకెళ్లాలి. కోపం వ్యక్తం చేయడానికి బదులుగా.. మీ మైండ్​లో దానికి సంబంధించిన గుడ్, బ్యాడ్ నోట్స్ రాసుకోండి. ఇది కోపాన్ని తగ్గించడానికి, అలాగే ఇతరులపై దానిని వ్యక్తం చేయడానికి గ్యాప్ ఇస్తుంది. ఆ సమయంలో మీ కోపం కచ్చితంగా తగ్గుతుందని శాస్త్రం చెప్తుంది.

కోపంలో ఉన్నప్పుడు ఆలోచనలు ఆ టాపిక్ మీద నుంచి డైవర్ట్ చేసుకోగలిగితే కచ్చితంగా మార్పులు చూడవచ్చని చెప్తున్నారు. అంతేకాకుండా ఏదైనా కోపం తెప్పించే విషయం గురించి రియాక్ట్ అవుతున్నారా? రెస్పాండ్ అవుతున్నారో చెక్ చేసుకుంటూ ఉండాలి. కోపాన్ని ట్రిగర్ చేసే అంశాలు తెలుసుకోండి. ఇవన్నీ మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి హెల్ప్ అవుతాయని చెప్తున్నారు.

ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. ముఖ్యమైన విషయాలు ఇవే

సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు పాల్గొన్నారు. రూ.9,500 కోట్ల విలువైన 506 ప్రాజెక్టులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేశారు.

అలాగే, ఆలస్యంగా వచ్చిన మంత్రులపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫైల్ క్లియరెన్స్‌ వేగం పెంచాలని, గోదావరి పుష్కరాల దృష్ట్యా టెంపుల్ టూరిజం, ఆలయాల భద్రతపై చర్యలు తీసుకోవాలని సూచించారు. రుషికొండ ప్యాలెస్ వినియోగంపై సబ్‌ కమిటీ నివేదికను పరిశీలించి త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.

అంగన్‌వాడీలకు గుడ్‌న్యూస్.. జీతాల పెంపుపై క్లారిటీ.. కానీ, వారికి మంత్రి కీలక సూచనలు..

 ఏపీలోని అంగన్‌వాడీ కార్యకర్తలకు గుడ్‌న్యూస్. జీతాల పెంపు అంశంపై మంత్రి స్పష్టత ఇచ్చారు. విజయవాడలో మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి (Gummidi Sandhya Rani) అంగన్వాడీ కార్యకర్తలకు (Anganwadi Workers) మొబైల్స్ పంపిణీ (mobiles Distribution) చేశారు.

5జీ మొబైల్స్ అందజేశారు.

రాష్ట్రంలో 55,706 అంగన్‌వాడీ కేంద్రాలకుగాను మొత్తం 58,204 మంది సిబ్బందికి రూ.75కోట్ల విలువైన మొబైల్స్‌ను మంత్రి గుమ్మడి సంధ్యారాణి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంగన్ వాడీ కేంద్రాలు తల్లిదండ్రుల నమ్మకానికి, వారి ఆశలకు గుర్తుగా నిలుస్తున్నాయని తెలిపారు. మహిళా శిశు సంక్షేమ శాఖ అందిస్తున్న సేవలు 98శాతం సంతృప్తికరంగా, ఏప్లస్ ప్లస్ స్థాయిలో ఉండడం చాలా సంతోషకరమని మంత్రి ప్రశంసించారు. ఈ గొప్ప సేవలను కొనసాగిస్తూ అంగన్వాడీ సిబ్బంది గర్భిణులు, పాలిచ్చే తల్లులు, చిన్న పిల్లలకు ఇంకా బాగా సేవలు అందించాలని మంత్రి కోరారు.

అంగన్వాడీలకు ఏది కావాలన్నా చేస్తామని మంత్రి సంధ్యారాణి చెప్పారు. ఈ సందర్భంగా ఆమె కీలక సూచనలు చేశారు. ఎవరో చెప్పారని ధర్నాలతో సమయం వృథా చేసుకోవద్దని అన్నారు. అలాగే వేతనాల పెంపు అంశం ముఖ్యమంత్రి పరిశీలనలో ఉందని, గ్రామీణ ప్రాంతాల్లోని అంగన్వాడీ ఉద్యోగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేయాలనే ప్రతిపాదనను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లామని మంత్రి పేర్కొన్నారు.

అంగన్వాడీల కోసం ఉపయోగించే యాప్‌ల సంఖ్యను తగ్గించాలని కేంద్రాన్ని కోరామని మంత్రి సంధ్యారాణి పేర్కొన్నారు. ఈ మొబైల్స్ ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు వేగంగా సేవలు అందించేందుకు దోహదపడతాయని చెప్పారు. త్వరలోనే అంగన్వాడీ ఉద్యోగులందరికీ ఒకేరకమైన దుస్తులు అందజేస్తామని అన్నారు.

తరచూ మెట్రోలో ప్రయాణిస్తున్నారా.? ఇకపై ప్రతీ రోజూ చివరి ట్రైన్ అప్పుడే.. తాజా షెడ్యూల్ ఇదే

తంలో ఉన్న మెట్రో టైమింగ్స్ పూర్తిగా మార్చేశారు. వారంలో అన్ని రోజులు ఉదయం 6 గంటలకు నుంచి రాత్రి 11 గంటలకు మెట్రో సర్వీసులు నడుస్తాయి. అంటే శని, ఆదివారాల్లో కూడా సేమ్ టైమింగ్‌లోనే సర్వీసులు నడుస్తున్నాయి.

ఈ మార్పులు నవంబర్ 3 నుంచి అమల్లోకి వచ్చాయి. మరి పాత టైమింగ్స్ ఎలా ఉండేవని అనుకుంటున్నారా.?

సోమవారం నుంచి శుక్రవారం వరకు: మొదటి మెట్రో ఉదయం 6 గంటలకు, చివరి రైలు దాదాపు 11:45 వరకు నడుస్తూ ఉండేది.

శనివారం: ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు సర్వీసులు ఉండేవి.

ఆదివారం: మొదటి మెట్రో ఉదయం 7 గంటలకు, చివరి రైలు రాత్రి 11 గంటలకు ఉండేది.

ఈ కాంబినేషన్ వల్ల వర్కింగ్ డేస్‌లో లేట్ అవర్స్ ప్రయాణానికి సౌలభ్యం ఉన్నా, ఆదివారం మొదటి రైలు ఆలస్యంగా ఉండటం, టైమింగ్స్ రోజు వారీగా మారడం వల్ల కన్‌ఫ్యూజన్ ఉండేది. దీంతో హైదరాబాద్‌లో తమ గమ్యస్థానాలకు చేరుకోవటానికి ఆటోలు, క్యాబ్‌లు, బస్సులు లాంటి ప్రత్యామ్నాయాల వైపు ప్రజలు మొగ్గు చూపారు. ఈ నేపధ్యంలో మెట్రో అధికారులు వారం రోజులు మెట్రో సర్వీసులు ఒకే టైమింగ్స్‌లో నడపాలని నిర్ణయించారు.

ఇకపై వారంలో అన్ని రోజులు మెట్రో సర్వీసులు ఒకే టైమింగ్‌లో నడుస్తాయి. అన్ని రోజులు(సోమవారం నుంచి ఆదివారం) మెట్రో సర్వీస్ అవర్స్ ఉదయం 6:00 నుంచి రాత్రి 11:00 వరకు ఉండేలా ఫిక్స్ చేశారు. మొదటి రైలు అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి ఉదయం 6:00కి బయల్దేరితే.. చివరి రైలు అన్ని టెర్మినల్స్ నుంచి రాత్రి 11:00కి డిపార్ట్ అవుతుంది. దీంతో వీకెండ్‌లో నడిచే రాత్రి 11:45 గంటలకు చివరి రైలు ఇక కట్ అయినట్టే. ఇకపై ఎప్పటిలానే చివరి మెట్రో రైలు రాత్రి 11 గంటలకు క్లోజ్ కానుంది. ప్రయాణికుల సౌలభ్యం, డిమాండ్‌ను బట్టి సర్వీసులను స్టాండర్డ్ టైమ్‌స్లాట్‌లో కుదించే స్ట్రాటజీగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రోజూ ఒకే టైమింగ్ ఉండటం వల్ల ఆఫీస్ వర్కర్లు, స్టూడెంట్స్, ఇతర ప్రయాణికులు తమ రొటీన్‌ను ప్లాన్ చేయడం సులభం అవుతుందని.. ప్రత్యేకించి ఆదివారం ఉదయం 7 నుంచి 6 గంటలకు మార్చడం వల్ల ఎర్లీ మార్నింగ్ ట్రావెలర్లకు కంఫర్ట్ పెరుగుతుందని మెట్రో సంస్థ భావిస్తోంది. ఫ్రీక్వెన్సీ పరంగా పీక్ అవర్స్(ఉదయం 8-11, సాయంత్రం 5-8)లో ఎక్కువ ట్రైన్లు, మిగతా సమయాల్లో 5-12 నిమిషాల గ్యాప్‌తో సర్వీసులు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

బిగ్ న్యూస్.. భారత్ ఫస్ట్ హైడ్రోజన్ ట్రైన్ వస్తోంది.. ఈ రైలు స్పెషాలిటీ ఏంటో తెలిస్తే షాకవుతారు.. మీకు తెలియని 5 విషయాలివే

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ పవర్ ట్రైన్ వచ్చేస్తోంది. భారత రైల్వే హైడ్రోజన్-శక్తితో నడిచే రైలును ఆవిష్కరించింది.

ఈ హైడ్రోజన్ రైలు అత్యంత పొడవైనది. అలాగే అత్యంత శక్తివంతమైనది కూడా. పర్యావరణహిత రవాణా దిశగా అడుగులో భాగంగా పరిశోధన, రూపకల్పన, ప్రమాణాల సంస్థ (RDSO) నిర్దేశించిన స్పెసిఫికేషన్లతో హైడ్రోజన్ పవర్ ట్రైన్ రూపొందించారు. భారత రైల్వేలు పైలట్ ప్రాతిపదికన హైడ్రోజన్ రైలు తయారీని పూర్తి చేశాయి.

ప్రపంచవ్యాప్తంగా అత్యంత పొడవైన ఈ ‘మేడ్ ఇన్ ఇండియా’ హైడ్రోజన్ ట్రైన్ ఏకంగా 2,400kW శక్తివంతమైన ఉత్పత్తితో 10-కోచ్ డిజైన్‌ను కలిగి ఉంది. జీరో ఉద్గారాలతో పూర్తిగా పర్యావరణహితంగా ఉంటుంది. ఈ
ఆవిష్కరణతో పర్యావరణ అనుకూల ప్రయాణానికి గేమ్ ఛేంజర్ అని చెప్పొచ్చు.

దేశంలో హైడ్రోజన్ రైలు సెట్ నిర్మాణం ఇప్పటికే పూర్తయిందని కేంద్ర రైల్వే మంత్రి అశ్వని వైష్టవ్ పేర్కొన్నారు. ఈ హైడ్రోజన్ రైలు నిర్మాణాన్ని పూర్తిగా దేశీయంగా రూపొందించి అభివృద్ధి చేశామని రైల్వే మంత్రి
పేర్కొన్నారు. రైలు నిర్వహణకు అవసరమైన హైడ్రోజన్‌ను సరఫరా చేసేందుకు హర్యానాలోని జింద్‌లో విద్యుద్విశ్లేషణ ఆధారిత గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

ఈ రైలులో హైడ్రోజన్ ఇంధన కణాలు ఆక్సిజన్ తో రసాయన చర్య ద్వారా హైడ్రోజన్ వాయువును విద్యుత్తుగా మారుస్తాయి. ఈ విద్యుత్తుతో రైలు నడుస్తుంది. ఇందులో ఉప ఉత్పత్తులుగా వెలువడేవి నీరు, ఆవిరి మాత్రమే. అవసరమైన రసాయన ప్రక్రియల కోసం రైలుకు గంటకు సుమారు 40వేల లీటర్ల నీరు అవసరం అవుతుంది. ఈ రైలు నుంచి పర్యావరణానికి హానికరమైన ఎటువంటి ఉద్గారాలు వెలువడవు.

ప్రత్యేకతలివే :
రైల్వే మంత్రి ప్రకారం.. దేశంలోని ఫస్ట్ హైడ్రోజన్ రైలు సెట్ ప్రపంచంలోనే అతి పొడవైన (10 కోచ్‌లు), అత్యంత పవర్‌ఫుల్ (2400 kW) బ్రాడ్ గేజ్ హైడ్రోజన్ రైలు సెట్. ఈ రైలు సెట్‌లో 2 డ్రైవింగ్ పవర్ కార్లు (DPCs)
ఉంటాయి. ఒక్కో పవర్ కార్‌కు 1200kW సామర్థ్యం కలిగి ఉంటాయి. మొత్తంగా 2400 kW పవర్ జనరేట్ చేస్తుంది.

10 ప్యాసింజర్ కోచ్‌లు :
ఈ హైడ్రోజన్ రైలు సెట్‌లో మొత్తం 10 ప్యాసింజర్ కోచ్‌లు ఉన్నాయి. పూర్తిగా పర్యావరణ అనుకూల టెక్నాలజీని ఉపయోగించారు. ఈ హైడ్రోజన్ పవర్‌తో నడిచే రైలు సెట్ పూర్తిగా జీరో కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను
ఉత్పత్తి చేస్తుంది. అంటే.. ఏకైక ఉద్గారం నీటి ఆవిరితోనే నడుస్తుంది అనమాట. రాబోయే జనరేషన్ రైల్వే ఫ్యూయిల్ టెక్నాలజీ, క్లీన్, గ్రీన్ అంతా ఉద్గారరహితంగా ఉంటుంది. ఇంధన ఆధారిత టెక్నాలజీ అభివృద్ధికి
ప్రత్యామ్నాయంగా భారతీయ రైల్వేలకు ఈ హైడ్రోజన్ పవర్‌తో నడిచే రైళ్లను తీసుకురావాలని భావిస్తున్నాయి.

ప్రాజెక్టు మొదటి దశ నుంచి హైడ్రోజన్ ట్రాక్షన్ టెక్నాలజీ, మోడల్ తయారీ అభివృద్ధి వరకు భారతీయ రైల్వేల మొదటి ప్రయత్నమని రైల్వే మంత్రి పేర్కొన్నారు. ఎందుకంటే.. ఇప్పటికీ పైలట్ ప్రాజెక్ట్ కాబట్టి ఖర్చును
ఇప్పటికే ఉన్న సాంప్రదాయ ట్రాక్షన్ వ్యవస్థలతో పోల్చడం సరైనది కాదన్నారు.

12A Railway Colony In OTT: సడన్ సర్‌ప్రైజ్.. ఏ ఓటీటీలో చూడొచ్చంటే?

తెలుగు హీరోల్లో అల్లరి నరేశ్ ఒకడు. అప్పట్లో కామెడీ సినిమాలు చేసి బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ గత కొన్నాళ్ల నుంచి మాత్రం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు.

అన్ని రకాల జానర్స్ ప్రయత్నిస్తున్నాడు కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా సక్సెస్ కావట్లేదు. దీంతో రీసెంట్‌గా హారర్ క్రైమ్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఇప్పుడా చిత్రం ఎలాంటి ప్రకటన లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది.

‘పొలిమేర’ రెండు సినిమాలతో మెప్పించిన దర్శకుడు అనిల్ విశ్వనాథ్.. షో రన్నర్‌గా వ్యవహరించిన సినిమా ’12ఏ రైల్వే కాలనీ’. అల్లరి నరేశ్, కామాక్షి భాస్కర్ హీరోహీరోయిన్లుగా నటించారు. గత నెల 21న థియేటర్లలోకి వచ్చింది. తొలి ఆట నుంచే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ఘోరమైన ఫ్లాప్‌గా నిలిచింది. దీంతో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

’12ఏ రైల్వే కాలనీ’ విషయానికొస్తే.. కార్తీక్‌ (అల్లరి నరేశ్‌) అనాథ. వరంగల్‌లోని రైల్వే కాలనీలో ఫ్రెండ్స్‌తో కలిసి బతుకుతుంటాడు. లోకల్‌ రాజకీయ నాయకుడు టిల్లు(జీవన్‌)కి నమ్మిన బంటు. గతంలో రెండుసార్లు ఎన్నికల్లో ఓడిపోయిన టిల్లు.. ఈసారి ఎలాగైనా ఎమ్మెల్మే కావాలని అనుకుంటూ ఉంటాడు. ప్రచార కార్యక్రమాలకు సంబంధించిన ఓ బాధ్యతని కార్తీక్‌కి అప్పజెబుతాడు. దానిలో భాగంగా యువతను ఆకర్షించేందుకు కార్తీక్‌ ఓ ఆటల పోటీ నిర్వహిస్తాడు. ఆ పోటీల్లోనే ఆరాధన (కామాక్షి భాస్కర్ల)ను చూసి మనసు పారేసుకుంటాడు.

ఓరోజు కార్తీక్‌కి టిల్లు ఓ పార్సిల్ ఇచ్చి దాన్ని జాగ్రత్తగా దాచిపెట్టమని చెప్తాడు. దీంతో దాన్ని దాచేందుకు దొంగతనంగా ఆరాధన ఇంటికి వెళ్లగా.. అక్కడ తనకు ఊహించని పరిణామం ఎదురవుతుంది. అప్పటిదాక కింద గదిలో తనతో మాట్లాడిన తన ప్రేయసి.. తల్లితో సహా పైగదిలో హత్యకు గురవడం కార్తీక్‌ని షాక్‌కు గురి చేస్తుంది. తర్వాత ఏం జరిగింది? అసలు ఆరాధన ఎవరు? ఈ హత్యలకు కారణమేంటి అనేది మిగతా స్టోరీ.

ట్రంప్ కార్డ్: ఒక్క క్లిక్ తో అమెరికా పౌరసత్వం- భారత్ కు గోల్డెన్ ఆఫర్

మెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’ వీసాను ఆవిష్కరించారు. విదేశీయులు అమెరికాలో శాశ్వత నివాసం పొందడానికి ఉద్దేశించినది.

అమెరికా ట్రెజరీకి మిలియన్ డాలర్లను విరాళంగా ఇవ్వడం ద్వారా ఈ వీసాను పొందవచ్చు. దీనికి సంబంధించిన దరఖాస్తులను స్వీకరించే వెబ్‌సైట్ ను కూడా ఆయన ప్రారంభించారు. ఇది కూడా గ్రీన్ కార్డ్ లాంటిదేనని, దానికంటే గొప్ప ప్రయోజనాలు ఇందులో ఉన్నాయని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.

వ్యక్తిగత, కార్పొరేట్ గోల్డ్ కార్డ్ వీసాల దరఖాస్తులు ప్రస్తుతం ప్రభుత్వ పోర్టల్‌లో అందుబాటులో ఉన్నాయి. వ్యక్తులు/కంపెనీలు దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ కార్డ్ ఆవిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్పొరేట్ కంపెనీలకు ఇది ఉపయోగపడుతుందని, అధిక నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణులను తమ వద్దే నిలుపుకోవాలనుకునే వారికి ఓ చక్కని అవకాశమని అన్నారు. ఉన్నత విద్యా సంస్థల నుండి పట్టభద్రులు, ప్రతిభావంతులను స్పాన్సర్ చేయడానికి, వారిని అమెరికాలో ఉంచుకోవడానికి ఆయా కంపెనీలకు వీలు కలుగుతుందని వివరించారు.

వార్టన్ స్కూల్ ఆఫ్ ఫైనాన్స్, స్టెర్న్ బిజినెస్ స్కూల్, హార్వర్డ్, మస్సాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వంటి విద్యా సంస్థలకు చెందిన ఉన్నత విద్యాసంస్థలకు చెందిన గ్రాడ్యుయేట్లను స్పాన్సర్ చేయవచ్చని తెలిపారు. గోల్డ్ కార్డ్ వంటి సౌకర్యాలను అందుబాటులోకి తీసుకుని రావాలని ఆపిల్ వంటి సంస్థలు కూడా ఒత్తిడి తెచ్చాయని అన్నారు. ఆ సంస్థ అధినేత టిమ్ కుక్ దీని గురించి తనతో అనేకసార్లు మాట్లాడారని ట్రంప్ పేర్కొన్నారు.

గోల్డ్ కార్డ్ దరఖాస్తుదారులు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ కు 15,000 డాలర్ల ప్రాసెసింగ్ ఫీజును చెల్లించాలి. ఇది- నాన్ రీఫండబుల్. ఆ వెంటనే ఆయా దరఖాస్తులన్నీ కూడా ప్రాసెస్ అవుతాయి. దీని తర్వాత దరఖాస్తుదారులు అమెరికా ప్రభుత్వానికి ఒక మిలియన్ డాలర్లను చెల్లించాల్సి ఉంటుంది. ట్రంప్ కార్పొరేట్ గోల్డ్ కార్డ్ ద్వారా కార్పొరేట్ కంపెనీలు ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులను స్పాన్సర్ చేయవచ్చు. ప్రతి ఉద్యోగికి రెండు మిలియన్ డాలర్లను చెల్లించాలి. ఒకసారి చెల్లిస్తే సరిపోతుంది.

ఇదే మొత్తంతో ఆయా కంపెనీలు మరో కొత్త ఉద్యోగికీ బదిలీ చేసుకోవచ్చు. అలాంటప్పుడు మళ్లీ రెండు మిలియన్ డాలర్లను చెల్లించనక్కర్లేదు. బదిలీ చేయించుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు ఒక శాతం మేనేజ్మెంట్ ఫీ, అయిదు శాతం ట్రాన్స్ ఫర్ ఫీ చెల్లించాలి. భారత్, చైనా, ఫ్రాన్స్ వంటి దేశాల నుండి వచ్చిన ట్రైన్డ్ గ్రాడ్యుయేట్లు తమ చదువులను పూర్తి చేసిన అనంతరం దేశం విడిచి వెళ్లకుండా నిరోధించే ఉద్దేశ్యంతో గోల్డ్ కార్డ్‌ను రూపొందించినట్లు ట్రంప్ వివరించారు. ఇది ఇప్పటివరకు అమలు చేసిన బెస్ట్ వెట్టింగ్ గా అభివర్ణించారు.

సమంత – రాజ్ పెళ్లి జరిగిన పదిరోజులకి తెర పైకి మరో సంచలన ట్వీస్ట్

సౌత్‌ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన సమంత డిసెంబర్ 1న ఎలాంటి హడావిడి లేకుండా కుటుంబ సభ్యుల సమక్షంలో రాజ్ నిడమూరును వివాహమాడింది. ఒక్కసారిగా పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అభిమానులు, సినీ వర్గాలు, నెట్టింట వినియోగదారులు పూర్తిగా షాక్ అయ్యారు.
పెళ్లి జరిగిన పదిరోజులు దాటినా… ఆ ఫోటోలు ఇంకా ట్రెండింగ్‌లోనే ఉన్నాయి. అయితే ఈ సర్‌ప్రైజ్ వెడ్డింగ్‌తో పాటు మరోసారి నెట్టింట్లో సమంతపై పాత నెగిటివిటీ మళ్లీ రెచ్చిపోయింది. ప్రత్యేకంగా ఆమె విడాకులు తీసుకున్నప్పటి నుండి సోషల్ మీడియాలో ఆమెపై ఎప్పటికప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు రాజ్‌తో ఆమె పెళ్లి జరగడంతో తిరిగి పాత ఆరోపణలన్నీ మళ్లీ ముందుకు రావడం మొదలైంది.

కొంతమంది నెటిజన్లు సమంత, రాజ్ నిడమోరుతో 2019లోనే ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2′ షూటింగ్ సందర్భంగా దగ్గరయ్యారని, అప్పటి నుంచే వీరి మధ్య రిలేషన్ ఉందని, ఈ కారణంగానే నాగచైతన్య విడాకులు తీసుకున్నాడని చెబుతూ అనేక రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.ఇదే విషయాన్ని ఆధారంగా తీసుకొని మరికొందరు —’చైతన్య తప్పు చేయలేదు’,’శోభిత, చైతు ఇన్నోసెంట్’,’సమంత వల్లే విడాకులు వచ్చాయి’ అంటూ సమంతను లక్ష్యంగా చేసుకుని తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు.

‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ షూటింగ్ 2019లో ప్రారంభం కాగా, సమంత-నాగచైతన్య విడాకులు 2021లో అధికారికంగా ప్రకటించబడ్డాయి. ఈ చిన్న టైమ్‌లైన్‌ను ఆధారంగా చేసుకుని కొందరు “సమంత చీట్ చేసింది” అని నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ వాస్తవంగా చూస్తే— రాజ్ నిడిమోరుకు ఆ సమయంలో భార్య శ్యామలీ ఉంది. సమంత, శ్యామలీ ఇద్దరూ కూడా మంచి స్నేహితులే. సమంతకు శ్యామలీ కామెంట్లు, సపోర్టివ్ మెసేజులు ఎన్నో ఉన్నాయి. ప్రత్యేకంగా, 2022 నవంబర్‌లో మయోసైటిస్‌ గురించి సమంత పోస్ట్ పెట్టినప్పుడు, ఆమె ‘నా గుడ్ ఫ్రెండ్ రాజ్ నన్ను ఇలా ప్రోత్సహించాడు’ అని రాసింది. దానికి రాజ్ తొలి భార్య శ్యామలీ, “రాజ్ దగ్గర ఇలాంటివి చాలా ఉంటాయి సామ్” అంటూ హాయిగా, ఫ్రెండ్లీగా కామెంట్ చేసింది . దీంతో ఆ సమయంలో రాజ్-సమంత మధ్య ఎలాంటి అనుమానాస్పద విషయాలు లేవని స్పష్టమవుతుంది. ఎందుకంటే నిజంగా ఏదైనా తప్పు రిలేషన్ ఉంటే… రాజ్భార్య సపోర్టివ్‌గా సమంత పోస్టులపై ఇలా కామెంట్ చేయడం అసాధ్యం.

ఇప్పటికీ ఈ విడాకుల అసలు కారణం ఏంటి అనేది ఇద్దరు వ్యక్తులకు మాత్రమే పూర్తిగా తెలుసు. బయట ఎవరు చెప్పేది ఊహాగానాలు మాత్రమే. ఇది వారి వ్యక్తిగత జీవితం. వారు ముందుకు వెళ్లిపోయారు. కానీ అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో పాత విషయాలను తవ్వడం, పాత ఆరోపణలను మళ్లీ మళ్లీ తెరపైకి తీసుకురావడం కొనసాగిస్తున్నారు. ఇలా కాకుండా అందరూ “మూవ్ ఆన్” అయితే — నెగిటివిటీ తగ్గుతుంది. వ్యక్తిగత దూషణలు ఆగుతాయి.సోషల్ మీడియా మరింత ఆరోగ్యకరంగా మారుతుంది అనే అభిప్రాయం సాధారణ ప్రజలది. ఇక మొత్తం విషయాన్ని చూస్తే… సమంతపెళ్లి అనూహ్యంగా జరిగినా, ఇప్పుడు బయటకు వస్తున్న ఈ ఆరోపణలకు స్పష్టమైన ఆధారాలు లేవు. అయినప్పటికీ ఆమెపై సోషల్ మీడియా దాడి మాత్రం ఆగేలా కనిపించడం లేదు.

10వ తరగతి చదివిన వారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. 62,460 పోస్టులు.. రైల్వేలో గ్రూప్-డి ఉద్యోగాలు.. ప్రకటన విడుదల

భారతీయ రైల్వే శాఖలో గ్రూప్ డి పోస్టులను భర్తీ చేయడానికి సంబంధించిన ఉద్యోగ ప్రకటన త్వరలో విడుదల కానుంది.

ఈ ప్రకటన ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 62,460 పోస్టులు భర్తీ చేయబడతాయని సమాచారం అందింది.

భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైల్వేలో ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఇది ఒక మంచి అవకాశం.

వయస్సు పరిమితి
ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు 18 నుండి 36 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. అయినప్పటికీ, ఓబీసీ వర్గానికి 3 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ వర్గాలకు 5 సంవత్సరాలు గరిష్ట వయస్సు పరిమితిలో సడలింపు (తగ్గింపు) ఇవ్వబడుతుంది.

జీతం
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ప్రారంభ ప్రాథమిక జీతం (Basic Salary) ₹18,000 లభిస్తుంది.

విద్యార్హత
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి కనీస విద్యార్హతగా, కొన్ని పోస్టులకు 10వ తరగతి ఉత్తీర్ణత లేదా ఇతర పోస్టులకు సంబంధిత విభాగాలలో ఐటీఐ (ITI) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం
దరఖాస్తుదారులు మొదట కంప్యూటర్ ఆధారిత పరీక్ష (Computer Based Test – CBT) మరియు ఆ తర్వాత శారీరక సామర్థ్య పరీక్ష (Physical Efficiency Test – PET) ఆధారంగా ఎంపిక చేయబడతారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష 100 మార్కులకు 100 ప్రశ్నలతో 90 నిమిషాల పాటు జరుగుతుంది.

దరఖాస్తు విధానం
దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు, సంబంధిత మండలం (Zone) యొక్క వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు రుసుము ₹500 (ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి మరియు మహిళలకు ₹250).

టీడీపీ మాజీ ఎమ్మెల్యే పిడతల రామ భూపాల్ రెడ్డి మృతి

గిద్దలూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే పిడతల రామ భూపాల్ రెడ్డి (89) మృతి చెందారు. కొద్ది రోజులుగా వయసు రీత్యా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇవాళ కన్నుమూశారు.

హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రామ భూపాల్ రెడ్డి మరణించారు. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు. కాగా, 1994లో టీడీపీ నుంచి పోటీ చేసి రామ భూపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైన సంగతి తెలిసిందే.

ఓటేయడానికి వెళ్తున్నారా.. ఓటర్ కార్డు లేకపోతే ఈ 12 కార్డుల్లో ఏదైనా తీసుకెళ్లొచ్చు.. అన్నీ ఐడీ ఫ్రూఫ్ కిందే లెక్క

తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. ఈ పంచాయతీ ఎన్నికలు మొత్తం 3 విడతల్లో జరగనున్నాయి. డిసెంబర్ 11, 14, 17 తేదీలలో నిర్వహించనున్నారు.

మందుగా తొలి విడత 11వ తేదీ నుంచి మొదలు కానుంది. ఆ తర్వాత రెండో, మూడో విడత జరగనున్నాయి.

ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా జరిగేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. రాష్ట్రంలో 11వ విడత జరగబోయే గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. ఓటర్లందరకూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మీరు కూడా పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్తున్నారా? అయితే ఇది మీకోసమే.. సాధారణంగా ఓటు వేయాలంటే ప్రతిఒక్కరికి ఓటర్ కార్డు ఉండాల్సిందే. లేదంటే ఓటర్ స్లిప్ ఉన్నా పర్వాలేదు. పంచాయతీ పరిధిలో ఓటర్లకు ఇప్పటికే ఓటర్ స్లిప్స్ కూడా అందే ఉంటాయి.

ఒకవేళ మీకు ఓటర్ స్లిప్ అందకపోతే ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలి? ఓటర్ స్లిప్ లేకుండా ఓటు వేయలేమా? అసలు ఓటు వేసేందుకు వెళ్లే సమయంలో ఎలాంటి డాక్యుమెంట్లు తీసుకెళ్లాలి? ఓటర్ కార్డు లేని పక్షంలో తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్లు ఏంటి? అనేది ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం..

ఓటర్ ఐడీ లేకుంటే ఏం చేయాలి? :
ఓటింగ్ సమయంలో మీ దగ్గర ఓటర్ ఐడీ లేకుండా కంగారుపడాల్సిన పనిలేదు. అలాగే ఓటర్ స్లిప్ లేకున్నా డోంట్ వర్రీ.. మీరు ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. మీకు ఆ ప్రాంతంలో ఓటు ఉంటే చాలు.. కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లను తీసుకెళ్లడం ద్వారా సులభంగా ఓటు వేయొచ్చు. ఎన్నికల పోలింగ్ అధికారులు ప్రధానంగా చెక్ చేసే అంశం.. మీ ఐడెంటిటీ మాత్రమే.. మీకు ఇక్కడ ఓటు ఉందా? లేదా అనేది చూస్తారు. మీరు అందించే ఐడెంటిటీ కార్డు ఆధారంగా వెరిఫై చేస్తారు.

ఓటర్ లిస్టులో మీ పేరు ఉంటే మీరు మీ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఐడెంటిటీ వెరిఫై కోసం ఎన్నికల సంఘం ఓటర్లకు కొన్ని సడలింపులను ఇచ్చింది. ఓటర్ ఐడీ కార్డ్‌ మీ వద్ద లేకుంటే డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ మాదిరిగా 12 వరకు ఐడెంటిటీ కార్డులను తీసుకెళ్లవచ్చు. ఈ కార్డుల్లో ఏ ఒక్క గుర్తింపు కార్డు చూపించినా మీరు ఓటు వేసేందుకు అనుమతిస్తారు. ఇంతకీ ఏయే డాక్యుమెంట్స్ పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లాలో ఇప్పుడు చూద్దాం..

13 గుర్తింపు కార్డులివే :

ఈసీఐ ఓటరు ఐడీ కార్డుతో పాటు ఈ కింది డాక్యుమెంట్లు కూడా అనుమతిస్తారు. ఆధార్ కార్డు, పాన్ కార్డ్, ప్రత్యేక దివ్యాంగ (UDID) కార్డు, సర్వీస్ గుర్తింపు కార్డు, బ్యాంక్/పోస్ట్ ఆఫీస్ జారీ చేసిన ఫొటోతో కూడిన పాస్‌బుక్, ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డ్ (కార్మిక మంత్రిత్వ శాఖ), డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, జాతీయ జనాభా రిజిస్టర్ (NPR) కింద భారత రిజిస్ట్రార్ జనరల్ జారీ చేసిన స్మార్ట్ కార్డ్, పెన్షన్ పత్రం, MP/MLA/MLCకి జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డు, MGNREGA జాబ్ కార్డ్ వంటివి కూడా తీసుకెళ్లొచ్చు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లే సమయంలో ఓటర్ కార్డు లేని ఈ 13 గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకటి దగ్గర ఉంచుకోవచ్చు.

1) ఓటర్ గుర్తింపు కార్డు
2) ఆధార్ కార్డు
3) M.N.R.E.G.A జాబ్ కార్డు
4) ఫోటోతో బ్యాంక్, పోస్టాఫీస్ పాస్‌బుక్,
5) డ్రైవింగ్ లైసెన్స్
6) హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు
7) పాన్ కార్డ్
8) స్మార్ట్ కార్డు (కార్మిక మంత్రిత్వ శాఖ పథకం)
9) పాస్‌పోర్ట్
10) పెన్షన్ డాక్యుమెంట్ (ఫోటో తప్పనిసరి)
11) యూనిక్ డిసేబిలిటీ గుర్తింపు కార్డు
12) అధికారిక గుర్తింపు కార్డు (ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు)
13) ఉద్యోగ గుర్తింపు కార్డు (కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం)

ఈ 13 ఐడెంటిటీ కార్డులలో ఏదైనా ఒకటి పోలింగ్ బూత్ వద్ద చూపించి ఓటు వేయొచ్చు.

బిగ్ షాకింగ్ న్యూస్.. కొత్త ఏడాదిలో భారీగా పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ధరలు.. ఎయిర్‌టెల్, జియో, Vi యూజర్లలో ఆందోళన

మొబైల్ యూజర్లకు బిగ్ షాకింగ్ న్యూస్.. అతి త్వరలో మొబైల్ రీఛార్జ్ ధరలు భారీగా పెరగబోతున్నాయి.. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

భారతీయ టెలికం మార్కెట్లో మొబైల్ టారిఫ్ ధరలు భారీగా పెంచేందుకు టెలికం కంపెనీలు రెడీ అవుతున్నాయంటూ ఊహాగానాలు వస్తున్నాయి.

నివేదికల ప్రకారం.. డిసెంబర్ చివరి నాటికి లేదా కొత్త ఏడాది 2026 ప్రారంభం నాటికి ప్రముఖ టెలికం దిగ్గజాలైన రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా (Vi) తమ రీఛార్జ్ ప్లాన్‌లను 10 శాతం నుంచి 12శాతం పెంచే యోచనలో ఉన్నట్టు సమాచారం. అదే జరిగితే మొబైల్ రీఛార్జ్ ప్లాన్లు మరింత ఖరీదైనవిగా మారనున్నాయి.

ప్రస్తుతానికి అధికారిక ప్రకటన లేనప్పటికీ, పేమెంట్ యాప్‌లలో అలర్ట్స్ రావడం వినియోగదారుల్లో ఆందోళనలను పెంచాయి. డిసెంబర్ 2025 నుంచి భారత్‌లో మొబైల్ రీఛార్జ్‌లు పెరుగుదలకు సంబంధించి 3 టెలికం కంపెనీలలో ఏ ఒక్కటి ఇంకా ఇప్పటివరకూ అధికారిక ప్రకటన చేయలేదు.

రీఛార్జ్ ధరలపై అలర్ట్స్.. యూజర్లలో ఆందోళన :

ఇప్పటికే, డిసెంబర్ 1 నుంచి రీఛార్జ్‌లు మరింత ఖరీదైనవిగా మారుతాయని పేమెంట్ యాప్స్ వినియోగదారులకు నోటిఫికేషన్‌లను వచ్చాయని అంటున్నారు. చాలా మంది సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడే పాత ప్లాన్ల ధరలకు రీఛార్జ్ చేయమని అలర్ట్స్ వస్తున్నాయి. నిజంగానే రీఛార్జ్ రేట్లు పెరుగుతాయా అని షాక్ అవుతున్నారు.

ఫైనాన్స్ పేమెంట్ యాప్‌లు, రీఛార్జ్ రేట్లు త్వరలో పెరుగుతాయంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ద్రవ్యోల్బణాన్ని నివారించేందుకు సాధ్యమైనంత తొందరగా రీఛార్జ్ ధరలను పెంచేయాలని టెలికం కంపెనీలు చూస్తున్నాయనే వార్తల నేపథ్యంలో వినియోగదారులు సైతం ఆందోళన చెందుతున్నారు. అధికారిక ప్రకటన లేకుండా ఈ హెచ్చరికలు ఎందుకు వస్తున్నాయనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.

రూ. 199 ప్లాన్ రూ. 222కు పెరగొచ్చు :
నివేదికల ప్రకారం.. టెలికాం రీఛార్జ్ ప్లాన్లలో భారీగా పెరుగుదల ఉండవచ్చు. రూ. 199 నెలవారీ ప్లాన్ దాదాపు రూ. 222కు పెరిగే అవకాశం ఉంది. అయితే, రూ. 899 లాంగ్ టైమ్ ప్లాన్ దాదాపు రూ. 1006గా ఉంటుందని అంచనా. జియో, ఎయిర్‌టెల్ ఇప్పటికే కొన్ని చౌకైన (రోజుకు 1GB) ప్లాన్‌లను తొలగించాయి. దాంతో ఈ రెండు టెలికం కంపెనీల టారిఫ్ ధరలు కూడా సూచించాయి. పెరుగుతున్న ఖర్చులను కవర్ చేయడం, 5G విస్తరణ కోసం నిధులను సేకరించాల్సి ఉండటంతో వోడాఫోన్ ఐడియా (Vi) కూడా భారీగా టారిఫ్ ధరలు పెంచే అవకాశం ఉంది.

ఎయిర్‌టెల్ రెండు పాపులర్ ప్రీపెయిడ్ ప్లాన్‌లను రూ. 121, రూ.181 ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే నిలిపివేయడం కస్టమర్లను నిరాశకు గురిచేసింది. తక్కువ ధరలో 30 రోజుల వ్యాలిడిటీతో అద్భుతమైన బెనిఫిట్స్ అందించే ఈ ప్లాన్‌లను ఒక్కసారిగా ఎత్తేసింది. దాంతో ఎయిర్‌టెల్ యూజర్లకు తక్కువ రీఛార్జ్ ఆప్షన్లు ఉన్నాయి. ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయం ప్రకారం.. అతి త్వరలో టారిఫ్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందంటున్నారు.

అమెరికా వెళ్లేవారికి బిగ్ అలర్ట్.. ఇకపై ఇవి తప్పనిసరి

మెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన దగ్గర్నుంచి విదేశీయులు అమెరికాలోకి అడుగుపెట్టకుండా అనేక చర్యలు తీసుకున్నారు.

గత కొన్ని నెలలుగా అనేక సంస్కరణలను చేపట్టారు. ఈ క్రమంలో విదేశీ టూరిస్టుల విషయంలో ట్రంప్ సర్కార్ మరోసారి కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కొంతమంది టూరిస్టులకు.. 5 ఏళ్లకు సంబంధించిన తమ సోషల్ మీడియా హిస్టరీని అందించాల్సిన అంశాన్ని తప్పనిసరి చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం అందుతోంది.

అలాగే విదేశాల నుంచి వచ్చే పర్యటకులు ఫేస్ స్క్రీనింగ్ ప్రాసెస్ లో భాగంగా సెల్ఫీలను అప్లోడ్ చేయాలన్న రూల్ ను కూడా తీసుకురానున్నట్లు తెలుస్తోంది. అమెరికాలోకి విదేశీయుల రాకను తగ్గించే విధంగా ట్రంప్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు స్పష్టం అవుతోంది. ఇప్పటికే ఈ విధానాన్ని ట్రయల్ విధానంలో అమలు చేసేందుకు అగ్రరాజ్యం సిద్దమైంది.

బ్రిటన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జపాన్ నుంచి అమెరికాలోకి వచ్చే విదేశీయులు తప్పనిసరిగా ఐదేళ్ల సోషల్ మీడియా అకౌంట్ హిస్టరీని సంబంధిత అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ సంస్థ పోస్టు చేసింది. ఈ ప్రొపోజల్ కు 60 రోజుల నోటీసు ఇచ్చింది. ఈ మేరకు ప్రజల నుంచి అభ్యంతరాలను ఆహ్వానించింది.

యూఎస్ వీసా ఫ్రీ దేశాల నుంచి టూరిస్టులు.. ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఫర్ ట్రావెల్ అండ్ ఆథరైజేషన్(ESTA) కు అప్లై చేసుకోవచ్చు. దీనిలో భాగంగా 90 రోజుల పాటు అమెరికాలో పర్యటించవచ్చు. అయితే తాజాగా సోషల్ మీడియా హిస్టరీని తప్పనిసరి చేసేందుకు ట్రంప్ సర్కార్ సిద్ధమైన నేపథ్యంలో ఆయా దేశాల పర్యటకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా హిస్టరీతోపాటుగా టూరిస్టులు.. సెల్ఫీలను కూడా అప్లోడ్ చేయాలన్న కొత్త నిబంధన తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదిలాఉంటే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్ లపై అక్కడి సుప్రీంకోర్టులో ప్రస్తుతం విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ట్రంప్ కీలక కామెంట్స్ చేశారు. సుంకాలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటే అది అమెరికాకే పెద్ద ముప్పని తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే మళ్లీ ముట్టరు..

వంటగదిలో అత్యంత సాధారణంగా కనిపించే కూరగాయలలో బంగాళాదుంప ఒకటి. అయితే కొన్నిసార్లు బంగాళాదుంపలు మొలకెత్తుతాయి. దుకాణాల నుంచే మొలకలతో కూడిన దుంపలను ఇంటికి తీసుకురావడం కూడా జరుగుతుంది.

ఇలాంటి మొలకెత్తిన బంగాళాదుంపలు తినడం సురక్షితమేనా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. నిపుణుల ప్రకారం.. మొలకెత్తిన బంగాళాదుంపలు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. దీనివల్ల తీవ్రమైన ప్రాణాపాయ సమస్యలు రాకపోయినా, కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.

గ్లైకోఆల్కలాయిడ్స్ అనే విషాలు

బంగాళాదుంపలు మొలకెత్తినప్పుడు వాటిలో గ్లైకోఆల్కలాయిడ్స్ అనే స్వల్పంగా విషపూరితమైన రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. ఈ విషాలను తీసుకోవడం వల్ల అసిడిటీ వంటి జీర్ణ సమస్యలు పెరుగుతాయి. ఇప్పటికే అసిడిటీతో బాధపడుతున్న వారికి ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. ఈ విష పదార్థాలు ఆమ్లత్వాన్ని మాత్రమే కాకుండా కడుపు నొప్పి, వికారం, ఇతర జీర్ణ సంబంధిత సమస్యలను కూడా కలిగిస్తాయి.

మొలకలు చిన్నగా ఉంటే ఏం చేయాలి?

వైద్యుల సలహా ప్రకారం.. మొలకలు చాలా చిన్నగా ఉంటే వాటిని పూర్తిగా తొలగించి, బంగాళాదుంపలను తినవచ్చు. దీనివల్ల సాధారణంగా ఎటువంటి సమస్యలు ఉండవు. అయితే.. మొలకలు చాలా పెద్దగా ఉంటే వాటిని తినకపోవడమే మంచిది. పెద్ద మొలకల ద్వారా ఎక్కువ గ్లైకోఆల్కలాయిడ్స్ శరీరంలోకి చేరే అవకాశం ఉంటుంది.

గర్భిణీ స్త్రీలకు తీవ్ర ప్రమాదం!

ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు పెద్ద మొలకలు ఉన్న బంగాళాదుంపలను తినడం అత్యంత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి దుంపలు తినడం వల్ల గర్భంలోని శిశువులో పుట్టుకతో వచ్చే లోపాలు సంభవించే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అందుకే గర్భిణీ స్త్రీలు మొలకెత్తిన బంగాళాదుంపలను పూర్తిగా నివారించడం శ్రేయస్కరం.

తినవలసి వస్తే.. చేయవలసిన పని

సాధ్యమైనంత వరకు పచ్చి బంగాళాదుంపలు మొలకెత్తిన వెంటనే వాటిని తినకుండా ఉండటమే మంచిది. ఒకవేళ వాటిని తప్పనిసరిగా తినవలసి వస్తే..మొలకలను పూర్తిగా కత్తిరించి పారేయాలి. దుంపల తొక్కను పూర్తిగా తొలగించాలి.
ఈ విధంగా చేయడం ద్వారా బంగాళాదుంపలో ఉండే విషపూరిత గ్లైకోఆల్కలాయిడ్స్ మొత్తాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.

చాలామందికి తెలియని రహస్యాలు; ఎయిర్ ఫ్రెష్‌నర్‌లు వద్దు! కారు లోపల దుర్వాసన పోగొట్టి, తాజాగా ఉంచే అద్భుతమైన మార్గాలు ఇవే

ప్రయాణం చేసేటప్పుడు, కారు లోపలి నుండి వచ్చే సువాసన మన మానసిక స్థితిని చాలావరకు ప్రభావితం చేస్తుంది.

అయితే, ఈ రోజు మార్కెట్‌లో అందుబాటులో ఉన్న చాలా ఎయిర్ ఫ్రెష్‌నర్‌లు కృత్రిమమైన (ఆర్టిఫిషియల్) మరియు తాత్కాలికమైన సువాసననే అందిస్తాయి.

అంతేకాకుండా, వాటిలో ఉండే రసాయనాలు (కెమికల్స్) తరచుగా తలనొప్పి వంటి ఆరోగ్య సమస్యలకు కూడా కారణం కావచ్చు. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం, రోజూ ప్రయాణం చేసే వ్యక్తులను మరియు ప్రయాణికులను ఆకర్షించాల్సిన వృత్తిపరమైన టాక్సీ డ్రైవర్లు సంవత్సరాలుగా రహస్యంగా ఉపయోగించే ఒక పద్ధతి ఉంది.

అదే నేడు ప్రపంచవ్యాప్తంగా వాహన యజమానులలో ప్రాచుర్యం పొందుతున్న ‘టాక్సీ మెథడ్’. ఈ పద్ధతి కృత్రిమ వాసనపై ఆధారపడకుండా, దుర్వాసనకు మూలకారణాన్ని పూర్తిగా తొలగిస్తుంది అనేది దీని గొప్ప ప్రత్యేకత.

సహజ మార్గాలు (Natural Methods)
కారు లోపల ఉన్న అప్రియమైన వాసనను దాచిపెట్టడానికి ప్రయత్నించే బదులు, దానిని పీల్చుకుని, తటస్థీకరించడమే (నిర్వీర్యం చేయడమే) టాక్సీ మెథడ్ యొక్క ప్రాథమిక సూత్రం. దీని కోసం టాక్సీ డ్రైవర్లు సాధారణంగా ఇళ్లలో లభించే కొన్ని సహజ పదార్థాలపై ఆధారపడతారు. ఇందులో బేకింగ్ సోడా అత్యంత ముఖ్యమైనది. ఇది దుర్వాసనను పీల్చుకునే అద్భుతమైన పదార్థం. కారు సీట్లపైనా, కార్పెట్లపైనా బేకింగ్ సోడాను చల్లి, రాత్రంతా ఉంచిన తర్వాత, మరుసటి రోజు వాక్యూమ్ క్లీనర్ ఉపయోగించి శుభ్రం చేయడం ద్వారా బట్టలలో లోతుగా ఇరుక్కుపోయిన దుర్వాసనను పూర్తిగా తొలగించడానికి సహాయపడుతుంది.

అంతేకాకుండా, ఒక చిన్న పాత్రలో బేకింగ్ సోడా తీసుకుని సీటు కింద ఉంచడం వలన దీర్ఘకాలం పాటు కారు లోపలి భాగం తాజాగా (ఫ్రెష్‌గా) ఉండటానికి సహాయపడుతుంది.

బేకింగ్ సోడా మాదిరిగానే ప్రభావవంతమైన మరొక పదార్థం ఉమిక్కరి (Charcoal/ బొగ్గు). ఒక గుడ్డ సంచిలో లేదా గాలి తగిలే కవర్లలో కొంచెం బొగ్గు నింపి కారు సీట్ల కింద లేదా డిక్కీలో (Boot) ఉంచడం వలన, ఎటువంటి వాసనను విడుదల చేయకుండానే, గాలిలోని తేమను మరియు దుర్వాసనను పీల్చుకుంటుంది. దీనిని ప్రతి రెండు లేదా మూడు నెలలకు ఒకసారి మార్చవలసి ఉంటుంది.

ఈ సహజ మార్గాలు, రసాయనాల అసౌకర్యం లేకుండానే, ప్రయాణికులకు శుభ్రమైన వాతావరణాన్ని అందిస్తాయి. కొంతమంది డ్రైవర్లు కొత్త కాఫీ పొడిని ఒక చిన్న పాత్రలో తెరిచి ఉంచడం ద్వారా మంచి సువాసన రావడానికి మరియు దుర్వాసనను పీల్చుకోవడానికి ఉపయోగిస్తారు.

క్యాబిన్ ఎయిర్ ఫిల్టర్ మరియు ఏసీ శుద్ధి
కారు లోపల చెడు వాసన రావడానికి ప్రధాన కారణం ఎయిర్ కండీషనర్ (A/C) సిస్టమ్‌లో పేరుకుపోయిన మురికి మరియు ఫంగస్. బయటి నుండి వచ్చే ధూళి మరియు కాలుష్యాన్ని అడ్డుకునే క్యాబిన్ ఎయిర్ ఫిల్టర్ శుభ్రంగా లేనప్పుడు దుర్వాసన కారు లోపలికి వ్యాపిస్తుంది. అందువల్ల, టాక్సీ మెథడ్‌లో అత్యంత తప్పనిసరి అయిన దశ ఏమిటంటే, ఈ ఫిల్టర్‌ను నిర్ణీత వ్యవధిలో మార్చడం లేదా శుభ్రం చేయడం.

ఫిల్టర్‌ను మార్చేటప్పుడు, ఏసీ వెంట్లలో ఉపయోగించే ప్రత్యేక రకమైన యాంటీ-బ్యాక్టీరియల్ క్లీనర్లను ఉపయోగించి ఏసీ సిస్టమ్‌ను శుభ్రం చేయడం వలన, దుర్వాసనకు కారణమయ్యే ఫంగస్ పెరుగుదలను నిరోధించడానికి సహాయపడుతుంది. ఎయిర్ ఫిల్టర్ ఉన్న భాగాన్ని గుర్తించి, పాత ఫిల్టర్‌ను తీసివేసి కొత్తది పెట్టినప్పుడు, కారు లోపలికి ప్రవేశించే గాలి యొక్క నాణ్యత గణనీయంగా పెరుగుతుంది మరియు అప్రియమైన వాసన పూర్తిగా తొలగించబడుతుంది.

స్థిరమైన పరిశుభ్రత (Regular Cleaning)
ఏ వాసన పీల్చుకునే వస్తువును ఉపయోగించినప్పటికీ, కారు లోపల పరిశుభ్రతను పాటించడంలో విఫలమైతే దుర్వాసన మళ్లీ వస్తుంది. టాక్సీ డ్రైవర్లు ప్రతిరోజూ కారును శుభ్రం చేయడానికి కారణం ఇదే. నిరంతర వాక్యూమ్ క్లీనింగ్ ఈ పద్ధతికి ఆధారం. సీట్ల కింద మరియు మూలల్లో ఉండే ధూళి మరియు ఆహార అవశేషాలను ఖచ్చితంగా తొలగించాలి.

అంతేకాకుండా, కారులో ఒక చిన్న చెత్తబుట్ట (చవట్కుట్ట) ఉంచి, ప్రతిరోజూ అందులోని వ్యర్థాలను తొలగించాలి. వాహనం లోపలి భాగంలో ఉన్న ప్లాస్టిక్, లెదర్ ఉపరితలాలను శుభ్రం చేయడానికి మృదువైన (మృదులమాన) క్లీనింగ్ వైప్‌లను ఉపయోగించడం వాటికి కొత్త మెరుపును ఇవ్వడానికి సహాయపడుతుంది. వర్షాకాలంలో లేదా ఏదైనా ద్రవ పదార్థాలు కారులో పడితే, ఆ భాగాన్ని వెంటనే తుడిచి, పూర్తిగా ఆరిపోయేలా చేయాలి. తేమ అలాగే ఉండిపోవడం అచ్చు (ఫంగస్) పెరగడానికి మరియు దుర్వాసన రావడానికి సులభమైన మార్గం.

కృత్రిమం లేని సువాసన
దుర్వాసన పూర్తిగా తొలగిపోయిన తర్వాత, కారు లోపల తేలికపాటి మరియు సహజమైన సువాసన అందించడానికి టాక్సీ మెథడ్ సూచిస్తుంది. దీని కోసం ఎసెన్షియల్ ఆయిల్స్ (Essential Oils) ఉపయోగించడం సముచితం. లెమన్‌గ్రాస్, లావెండర్, పుదీనా వంటి సువాసనలు ఉన్న ఎసెన్షియల్ ఆయిల్స్‌ను ఒక చిన్న మట్టిపాత్రలో లేదా చిన్న గుడ్డ ముక్కపై వేసి ఏసీ వెంట్ దగ్గర ఉంచవచ్చు.

ఎయిర్ ఫ్రెష్‌నర్‌లలోని రసాయనాల కంటే ఎసెన్షియల్ ఆయిల్స్ ఎక్కువ సురక్షితమైనవి. అవసరమైనప్పుడు మాత్రమే ఈ సువాసనను ఉపయోగించడం మరియు మిగిలిన సమయాల్లో శుభ్రమైన గాలిని నిర్ధారించడం ముఖ్యం. ఈ సరళమైన మరియు సహజమైన పద్ధతులను అలవాటు చేసుకుంటే, మీ కారు లోపల ఎల్లప్పుడూ కొత్తదానిలా మరియు ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంచవచ్చు.

సంక్షోభంలో ఉపాధ్యాయ వృత్తి

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలు క్షీణిస్తున్నాయని నేషనల్‌ అచీవ్‌మెంట్‌, పాఠశాలల పనితీరు గ్రేడింగ్‌ ఇండెక్స్‌ (పీజీఐ), ఎస్‌సీఈఆర్‌టీ సర్వేలు తెలుపుతున్నాయి.

పీజీఐ ప్రకారం రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి 36 ఉండగా, వాటిలో మన రాష్ట్రం 21వ స్థానంలో నిలిచింది. అభ్యసనా ప్రమాణాల్లో 35వ స్థానంలో ఉన్నది. నేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే ప్రకారం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సామర్థ్యం 50 శాతం కంటే తక్కువ ఉన్నది. అదేవిధంగా ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థుల విద్యాసామర్థ్యాలూ కొంచెం అటు ఇటుగా ఉన్నాయని సర్వేల నివేదికలు చెప్తున్నాయి.

విద్యార్థులకు సరైన సామర్థ్యాలు లేకపోవడానికి గల కారణాలు ఏమిటనే అభిప్రాయంతో ఇటీవల పాఠశాల విద్యాశాఖ, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం, యూనిసెఫ్‌ అధ్యయనం చేశాయి. ఉపాధ్యాయులకు బోధనేతర పనులను అప్పగిస్తుండటంతో కీలకమైన బోధన సమయాన్ని కోల్పోతున్నారు. దానివల్ల విద్యార్థులకు నష్టం జరుగుతున్నది. పాఠాలు బోధించాల్సిన సమయంలో ఉపాధ్యాయులకు ఫోన్లు వస్తుంటాయి. మధ్యాహ్న భోజనం, విద్యార్థుల హాజరు.. ఇలా ఏదో ఒక డేటా అడుగుతారు. దానివల్ల ఉపాధ్యాయులు బోధన పట్ల ఏకాగ్రతను కోల్పోతున్నారు. అందుకు ప్రభుత్వమే కారణం. ఉపాధ్యాయులు తరగతి గదికే పరిమితమయ్యే పరిస్థితులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగానిదే. పాఠశాల పనిదినాల్లో తరగతి గదిలో బోధించే పనిలో ఉపాధ్యాయుడు, వారి బోధనను పర్యవేక్షించే విధుల్లో పర్యవేక్షణాధికారి ఉండాలి. కానీ, అలా జరగకపోవడంతో విద్యాపాలన చిన్నాభిన్నమైంది.

‘ఉపాధ్యాయులు ఉద్యోగాలు వదిలి వెళ్లిపోతున్నారు- కొందరు మౌనంగా, మరికొందరు ఉద్యోగంలో ఉన్నప్పటికీ మానసికంగా వైదొలుగుతున్నారు. యువతరం అసలు ఉపాధ్యాయులుగా రావాలనే కోరుకోవడం లేదు’- అని విద్యావేత్త, జాతీయ విద్యాపరిశోధన శిక్షణా సంస్థ (ఎన్‌సీఈఆర్‌టీ) పూర్వ సంచాలకులు ఎన్‌.కృష్ణకుమార్‌ అన్నారు. ఇట్లా ఎందుకు జరుగుతున్నది? సిలబస్‌ పూర్తి చేయాలనే తీవ్ర ఒత్తిడి ఉపాధ్యాయులపై ఉన్నది. తల్లిదండ్రుల అవాస్తవ అంచనాలు ఒత్తిడిని పెంచుతున్నాయి. సబ్జెక్టులు, పనిభారం పెరిగిపోయాయి. గురుశిష్యుల మధ్య బంధం ఒకప్పుడు విద్యకు గుండెకాయ లాంటిది. కానీ, ఇప్పుడు డేటా, గడువుల కింద అది సమాధి అయిపోయింది. బోధన కంటే డేటా సేకరించి పంపడమే కీలకమైపోయింది. విద్యార్థులు ఇప్పుడు ఉపాధ్యాయులను సేవలందించేవారిగా మాత్రమే చూస్తున్నారు. వారిపై గౌరవమూ తగ్గిపోయింది. దేశవ్యాప్తంగా పాఠశాలల్లో ఒక నిశ్శబ్ద విప్లవం జరుగుతున్నది. అది ఉపాధ్యాయుల మనసుల్లో నెలకొన్న అలసట, నిస్సహాయత, నిరాశలతో కూడినది.

ఉపాధ్యాయులు బోధనకు దూరంగా వలసపోవడాన్ని రెండు దశాబ్దాల కిందటే యునెస్కో గుర్తించింది. అందుకే ఉపాధ్యాయులు ఎటు పోతున్నారంటూ తన అధికార పత్రిక ప్రాస్పెక్ట్స్‌లో విద్యపై జరిగే తైమాసిక సమీక్షలో ప్రశ్నించింది. పాఠశాల తరగతి గది పరిస్థితులకు సంబంధించిన అంశాలను, విద్యార్థి ప్రవర్తనను ప్రభావితం చేసే గృహ వాతావరణం వంటివి ఇందుకు కొన్ని కారణాలైనప్పటికీ, మన దేశంలో ఈ దిశగా అధ్యయనమే జరగలేదు. ఆ క్రమంలోనే యునెస్కో, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం, పాఠశాల విద్యాశాఖ మన రాష్ట్రంలో జరిపిన అధ్యయన నివేదికను బయటపెట్టింది.

‘తరగతి గదిలో దేశ భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది’ అన్న విద్యావేత్త కొఠారి ఉపాధ్యాయుల వేతనాలు, పని పరిస్థితులు, పదోన్నతులపై కూడా తన అభిప్రాయాలను సిఫారసుల రూపంలో చెప్పారు. దేశంలోని మిగతా వృత్తుల కన్నా ఉపాధ్యాయ వృత్తికి అధిక వేతనాలుండాలని, మెరుగైన పదోన్నతి విధానాలుండాలని ఆయన సిఫారసు చేశారు. కానీ, ఆరు దశాబ్దాలైనా ఆ దిశగా విద్యావ్యవస్థ రూపుదిద్దుకోలేదు. ఉపాధ్యాయుల వేతన వ్యవస్థ మెరుగుపడలేదు సరికదా.. కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌, అవర్‌ లీ బేస్డ్‌ పద్ధతిలో అతి తక్కువ జీతాలకు ఉపాధ్యాయుల నియామకాలు జరుగుతున్నాయి. ఇన్ని అవలక్షణాలతో ఉన్న ఉపాధ్యాయ వృత్తిని యువకులు ఎందుకు ఆదరించాలి?

ప్రస్తుత డీఈవోలలో బోధనేతర సిబ్బందే ఎక్కువగా ఉన్నారు. పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతను ఉపాధ్యాయులకే అప్పగించాలని, విద్యార్థులతో నేరుగా సంబంధం ఉండే మండల విద్యాధికారి, డిప్యూటీ విద్యాధికారి పోస్టులనూ ఉపాధ్యాయులతో భర్తీ చేయాలని 1992లో సుందరేశన్‌ ఏకసభ్య కమిటీ సిఫారసు చేసింది. ఈ సిఫారసులను గమనంలోకి తీసుకోవాలి. డీఈవో, జాయింట్‌ డైరెక్టర్‌ లాంటి పోస్టుల్లోనూ ఉపాధ్యాయులకు భాగస్వామ్యం లభిస్తే వారు తమకున్న బోధనానుభవం, విద్యాతత్వశాస్త్ర, విద్యామనస్తత్వశాస్త్ర అవగాహనతో పాలనా చర్యలు తీసుకోగలుగుతారు.

విద్యా విధానంలో పరివర్తన తీసుకురావడం అర్హులైన ఉపాధ్యాయులతోనే సాధ్యమవుతుంది. అయితే వారికి సమాజం నుంచి తగిన గౌరవం, సంతృప్తికరమైన వేతనం అందితేనే వారిలో ప్రేరణ సజీవంగా ఉంటుంది. ప్రభుత్వ విద్యాసంస్థలను అన్నిరకాల వసతులతో అభివృద్ధి చేసి, పటిష్ఠ పర్యవేక్షణతో, జవాబుదారీతనంతో కూడిన ఉన్నత ప్రమాణాల విద్యను అందిస్తామని తల్లిదండ్రులకు ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాలి. అప్పుడే అందరికీ విద్యాప్రమాణాలతో కూడిన విద్య అందుతుంది.

శీతాకాలం జాగ్రత్త.. ఉదయాన్నే ఈ తప్పులు చేస్తే ఇన్ఫెక్షన్‌ వస్తుందంట..

దయాన్నే తినే మంచి అల్పాహారం రోజంతా ప్రయోజనకరంగా ఉంటుంది. శీతాకాలంలో కూడా, అల్పాహారాన్ని జాగ్రత్తగా పరిగణించాలి. ఎందుకంటే జలుబు గొంతు ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతుంది.

అల్పాహారం రోజంతా శరీర ఉష్ణోగ్రత నియంత్రణను సెట్ చేస్తుందని వైద్యులు చెబుతారు.. కానీ, కొంతమంది ఈ సీజన్‌లో నూనె పదార్తాలతోపాటు.. వారి ఆరోగ్యానికి హాని కలిగించే ఆహారాన్ని తింటారు. ఇలాంటి పరిస్థితుల్లో అలాగే, వైద్యులు వివరించిన విధంగా ఆరోగ్యానికి మంచి చేసే ఆహారాలు ఏమిటో తెలుసుకుందాం..

ఢిల్లీలోని GTB హాస్పిటల్‌లో డైటీషియన్‌గా పనిచేస్తున్న డాక్టర్ అనామిక గౌర్ వివరిస్తూ.. కొంతమంది అల్పాహారంగా చల్లని పాలు తాగుతారు. కానీ ఈ సీజన్‌లో, మీరు ఉదయం చల్లని పాలు లేదా పెరుగు తినకూడదు. ఇవి కఫం ఉత్పత్తి చేస్తాయి. గొంతు నొప్పికి కారణమవుతాయి. మీరు ఉదయం పాలు తాగవలసి వస్తే, మీరు దానికి కొద్దిగా పసుపు జోడించవచ్చు.. ఇది పాలను వేడి స్వభావంగా మారుస్తుంది.

ఖాళీ కడుపుతో ఫ్రూట్ సలాడ్ తినడం..

ఉదయం ఖాళీ కడుపుతో ఫ్రూట్ సలాడ్ తినడం ప్రయోజనకరమని ప్రజలు సాధారణంగా నమ్ముతారు.. అయితే, ఇది అందరికీ నిజం కాదు. కొంతమంది ఈ సీజన్‌లో అరటిపండ్లు, నారింజ వంటి చల్లని పండ్లను తింటారు. ఈ పండ్లను కూడా నివారించండి. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఆపిల్ లేదా బొప్పాయి తినవచ్చు.

అలాగే, ఉదయం బ్రెడ్ తినడం మానుకోండి. చాలా బ్రెడ్లలో శుద్ధి చేసిన పిండి ఉంటుంది. ఇది శరీరంలో నొప్పి – మంటను పెంచుతుంది. ఇది గొంతు నొప్పి, శ్లేష్మం పేరుకుపోవడం వంటి సమస్యలను కలిగిస్తుంది. బ్రెడ్‌కు బదులుగా, మీరు శనగపిండి తో చేసిన పదార్థాలు, చీలా లేదా ఆమ్లెట్ తినవచ్చు.

ఖాళీ కడుపుతో టీ తాగడం..

శీతాకాలంలో టీ తాగడం చాలా ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ, ఉదయం ఖాళీ కడుపుతో ఎప్పుడూ తాగకూడదు. దీనివల్ల శరీరంలో ఆమ్లత్వం – నిర్జలీకరణం పెరుగుతుంది. దీనివల్ల గొంతు సమస్యలు వస్తాయి. టీకి బదులుగా, రెండు గ్లాసుల గోరువెచ్చని నీరు, ఆ తర్వాత హెర్బల్ టీ తాగండి. మీరు నిజంగా టీ తాగాలనుకుంటే, పాలు తాగకుండా, కొద్దిగా అల్లం కలిపి తాగండి.

శీతాకాలంలో ఉదయం పూట ఖచ్చితంగా ఏమి తినాలి?

గంజి

మూంగ్ దాల్ చీలా

మీరు మాంసాహారం లైట్ గా ఇంకా.. రోజుకు ఒక గుడ్డు తినండి.

దక్షిణాసియా వంటకాల్లో బియ్యం – కాయధాన్యాలతో తయారు చేసిన వంటకాలను తీసుకోండి..

ముఖ్యంగా రోజుకు సరిపడినంత నీరు తాగడం, నిద్ర కూడా ముఖ్యం అని గుర్తించాలి..

రాత్రి పూట ఆ గుడివైపు వెళ్లిన వారు ఏమవుతున్నారు?..

రాధా-కృష్ణుల అపూర్వ ప్రేమకు, అనంతమైన భక్తికి సాక్ష్యంగా నిలిచే నిధివనం రహస్యం నేటికీ వీడలేదు. ఇక్కడి చెట్లు గోపికల రూపమని, సూర్యాస్తమయం తర్వాత అవి ప్రాణం పోసుకుంటాయని చెబుతారు.

రాత్రి రాసలీల కోసం సిద్ధం చేసిన రంగమహల్‌లోని మంచం ఉదయానికి ఎలా చెదిరిపోతుంది? ఆ మాయా నృత్యం చూడాలని ప్రయత్నించిన వారికి ఎలాంటి భయంకర అనుభవాలు ఎదురయ్యాయి? తెలుసుకుందాం.

బృందావనంలో నిధివనం (నిధి అంటే నిధి, వనం అంటే అడవి) గురించి కథలు, జానపదాలు అపారంగా ఉన్నాయి. ఈ వనంలోని పొదలు, చెట్లు మీరు ఎక్కడా చూడని విధంగా వంగి, పొట్టిగా ఉంటాయి. స్థానికులు వీటిని గోపికల రూపాలు అంటారు. సూర్యోదయంతో అవి స్తంభిస్తాయి, చంద్రోదయంతో మళ్లీ నృత్యం చేస్తాయి అని నమ్ముతారు. అవి ఎప్పుడూ జంటలుగా ఉంటాయి.

సూర్యాస్తమయం తర్వాత నిశ్శబ్దం

సమయం సాయంత్రం అవుతుంది. పూజారులు చివరి హారతి ఇస్తారు. దీపాలు వణుకుతాయి, గంటలు ఆగిపోతాయి. ఆ తర్వాత ఒక్కరూ ఉండరు. పూజారి, భక్తుడు, బృందావనంలో కనిపించే కోతులు, పక్షులు కూడా మాయమవుతాయి. వేసవిలో రాత్రి 8 గంటలకల్లా, చలికాలంలో మరింత ముందుగా వనం తాళం వేసి, నిర్మానుష్యంగా మారుతుంది. అయితే ఆ వనం ఖాళీగా ఉండదు.

ప్రతి రాత్రి రాసలీల

నమ్మకం ప్రకారం, రాధాకృష్ణులు ప్రతి రాత్రి ఇక్కడికి వచ్చి, గోపికలతో రాసలీల చేస్తారు. ఆలయ వాసులకు ఇది కేవలం కథ కాదు, నిత్య సత్యం. తలుపులు మూసే ముందు, పూజారులు కృష్ణుడు (కన్హయ్య) కోసం ప్రతిదీ సిద్ధం చేస్తారు: తమలపాకులు, పళ్లు తోముకోవడానికి వేప పుల్లలు, వెండి లేదా ఇత్తడి నీటి పాత్రలు, స్వీట్లు, మంచంపై మెత్తటి పరుపులు సర్దుతారు.

ఉదయం కనిపించే వింత సంకేతాలు

ప్రతి ఉదయం ఏదో ఒకటి తప్పకుండా మాయమవుతుంది. మంచం నిద్రపోయినట్లుగా చెదిరిపోతుంది. నీరు అయిపోతుంది. వేప పుల్లలు కొరికినట్లు గుర్తులు కనిపిస్తాయి. ఇవి దైవం యొక్క వేలిముద్రలు. తరతరాలుగా వనం సంరక్షకులు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నారు.

సాక్ష్యం చెప్పడానికి ప్రయత్నించిన వారికి…

ఈ దైవ నృత్యం చూడాలని ప్రయత్నించిన వారు తిరిగి వచ్చినప్పుడు సాధారణ స్థితిలో లేరనే కథనాలు ఉన్నాయి. ఒక పండితుడు లోపల దాక్కున్నాడు, అతడు జీవితాంతం మాట్లాడకుండా పిచ్చిగా కనిపించాడు. కిటికీలోంచి తొంగి చూసిన ఒక ప్రయాణికుడు కంటిచూపు కోల్పోయాడు. మరికొందరు అదృశ్యమయ్యారు. దీనికి నిర్దిష్ట ఆధారం లేదు. కానీ దశాబ్దాలుగా ఈ కథనం తరచుగా వినిపిస్తుంది. భయం, విశ్వాసం కలిసే ఈ గోడల వెనుక ఆ రహస్యం సురక్షితంగా ఉంటుంది.

రంగ మహల్ లోపల

నిధివనం మధ్యలో రంగ మహల్ ఉంది. ఇది రాధా-కృష్ణులు తమ దైవ నృత్యం తర్వాత విశ్రాంతి తీసుకునే స్థలమని భక్తులు నమ్ముతారు. ఇక్కడ ప్రతి సాయంత్రం మంచాన్ని శుభ్రంగా, పద్ధతిగా సిద్ధం చేస్తారు – అలంకరణ వస్తువులు, తమలపాకులు, స్వీట్లు ఉంచుతారు. ఉదయం చూస్తే, పరుపులు చెదిరి, వస్తువులు కదిలి, నీరు అయిపోయినట్లు కనిపిస్తుంది.

స్వామి హరిదాస్ కథ

బృందావనంలో కృష్ణుడి అత్యంత ఇష్టమైన రూపాన్ని ప్రజల మధ్యకు తీసుకురావడానికి కారణం స్వామి హరిదాస్. ఈ సంగీతకారుడు, కవి, సన్యాసి నిధివనంలో ధ్యానం చేస్తున్నప్పుడు రాధాకృష్ణులు ప్రకాశవంతమైన రూపంలో ఆయనకు దర్శనం ఇచ్చారు. శాశ్వత దర్శనం కోసం ఆయన కోరగా, దైవం బాంకే బిహారీగా రూపాంతరం చెందింది. ఈ విగ్రహం ఇప్పుడు ప్రసిద్ధి చెందిన బాంకే బిహారీ ఆలయంలో ఉంది.

భక్తులు చెప్పే మరొక విషయం

బాంకే బిహారీ కళ్లు సగం మూసుకునే ఉంటాయి. కారణం, ఆ విగ్రహం చూపు కూడా మనుషులు భరించలేని విధంగా అత్యంత తీవ్రమైన అనుభూతిని ఇస్తుందట. ఎక్కువసేపు కంటికి కన్ను కలిపి చూస్తే, భక్తులు ఆనందంతో స్పృహ కోల్పోతారనేది ఇక్కడి నమ్మకం.

చెట్లు వంగి ఉంటాయి..

నిధివనంలోని అసాధారణ వృక్షజాలం పరిశోధనా పత్రాలు, ట్రావెలాగ్‌లలో ప్రస్తావనకు వస్తుంది. నేల కూర్పు, తక్కువ సూర్యరశ్మి కారణంగా మొక్కలు వంగి, పొట్టిగా పెరుగుతాయని శాస్త్రం చెబుతుంది. కానీ భక్తులు, అవి నృత్యం మధ్యలో ఉన్న గోపికలు అని నమ్ముతారు. ఇక్కడి కొమ్మను నరికితే జీవితాంతం దురదృష్టం వెంటాడుతుందని భయపడతారు.

సందర్శించడానికి ఉత్తమ సమయం

మీరు తప్పకుండా సూర్యాస్తమయం కంటే ముందే తిరిగి రావాలి. పూజారులు కూడా ఈ సంప్రదాయాన్ని పాటిస్తారు.

వేసవి: ఉదయం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు (మధ్యాహ్నం 1 గంట నుండి 3:30 గంటల వరకు మూసివేస్తారు)

శీతాకాలం: ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు (మధ్యాహ్నం 1 గంట నుండి 3:30 గంటల వరకు మూసివేస్తారు)

మీరు విశ్వాసం వైపు ఉన్నా లేదా సైన్స్ వైపు ఉన్నా, నిధివనం మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది. సాయంత్రం గంటల తర్వాత వచ్చే నిశ్శబ్దం అసాధారణంగా ఉంటుంది. రంగ మహల్‌లోని చెదిరిన మంచం లాజిక్‌కు సవాలు విసురుతుంది. బహుశా రాధా-కృష్ణులు ప్రతి రాత్రి ఇక్కడ కలుస్తారు. బహుశా రాసలీల మన కంటికి కనిపించని ప్రపంచానికి అతీతంగా జరుగుతుంది. కొన్నిసార్లు, ఒక ప్రదేశం సజీవంగా ఉండటానికి ప్రజలు నమ్మడం సరిపోతుంది.

పంచాయతీ ఎన్నికల సందడి.. తెలంగాణలో అతిచిన్న గ్రామం, అతిపెద్ద గ్రామం ఎక్కడో తెలుసా ?

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సమయం వచ్చేసింది. రేపే మొదటి దశ ఎన్నికలు జరగనున్నాయి.14,17 తేదీల్లో రెండు, మూడు దశల ఎన్నికల నిర్వహించనున్నారు. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ అధికారులు ఎన్నికల కోసం ఏర్పాట్లును ముమ్మరం చేశారు.

ఎన్నికలు జరిగే రోజునే ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఎవరు సర్పంచ్గా గెలుస్తారో అనేది రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే తెలంగాణలో అతిపెద్ద గ్రామం, అతిచిన్న గ్రామం ఏంటో మీకు తెలుసా ?. ఇప్పుడు దాని గురించే తెలుసుకుందాం.

అతిపెద్ద గ్రామం

ఇక వివరాల్లోకి వెళ్తే.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం మేజర్ పంచాయతీ అతిపెద్ద గ్రామంగా నిలిచింది . ఈ ప్రాంతం పంచాయతీతో పాటు మండలకేంద్రంగా ఉంది. రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) ప్రకటించిన జాబితా ప్రకారం ఇక్కడ ఏకంగా 40,761 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ డిసెంబర్ 11న ఎన్నికలు జరగనున్నాయి. ఈ పంచాయతీలో ఎస్టీ జనరల్కు రిజర్వేషన్ కేటాయించారు. 20 వార్డుల్లో 5 స్థానాలు ఎస్టీ జనరల్, 5 స్థానాలు ఎస్టీ మహిళ, మరో అయిదు స్థానాలు జనరల్, ఇతర 5 స్థానాలు జనరల్ మహిళకు కేటాయించారు. ఇక సర్పంచ్ స్థానానికి అయిదుగురు, వార్టుల్లో 75 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. 1982లో ఈ పంచాయతీకి తొలిసారిగా ఎన్నికలు జరిగాయి.

2005లో ఈ ప్రాంతాన్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేసినా పలు కారణాల వల్ల రద్దయ్యింది. 2018లో మళ్లీ మున్సిపాలిటీగా మార్చేందుకు యత్నించినా న్యాయపరంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో 2019లో అక్కడ ఎన్నికలు జరగలేదు. చివరికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం భద్రచలం పట్టాణాన్ని మూడు పంచాయతీలుగా విభజిస్తూ నిర్ణయించింది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక భద్రాచలం పట్టాణాన్ని ఒకే పంచాయతీగా కొనసాగించింది. అలాగే 14 ఎంపీటీసీ స్థానాలతో తిరిగి మండల కేంద్రంగా కూడా ఏర్పాటు చేసింది.

అతిచిన్న గ్రామం

ఉమ్మడి ఖమ్మం జిల్లాలనే ఆళ్లపల్లి మండలం అడవిరామారం అనే గ్రామం అతి తక్కువ ఓటర్లు ఉన్న గ్రామ పంచాయతీగా కొనసాగుతోంది. ఇక్కడ కేవలం 85 మంది మాత్రమే ఓటర్లు ఉన్నారు. వీళ్లలో 40 మంది మహిళలు, 45 మంది పురుషులు ఉన్నారు. ఇక్కడ సర్పంచ్ స్థానాన్ని ఎస్టీ జనరల్కు కేటాయించారు. అలాగే ఇక్కడున్న నాలుగు వార్డులను కూడా ఎస్టీలకే రిజర్వ్ చేశారు. ఈ గ్రామానికి డిసెంబర్ 17న మూడో దశలో ఎన్నికలు జరగనున్నాయి. అడవిరామం అనేది పినపాక నియోజకవర్గంలో ఉంది. ఇది మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో ఉంది. ఈ గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం కూడా లేదు.

ఇక బిగ్‏బాస్ చూడడం దండగ.. విన్నర్ ఎవరో ముందే ఫిక్స్.. అస్సలు ఊహించలేదే..

బిగ్ బాస్ సీజన్ 9.. గ్రాండ్ ఫినాలేకు మరో రెండు వారాల సమయం మాత్రమే ఉంది. ఇప్పుడు హౌస్ లో ఏడుగురు సభ్యులు ఉన్నారు. డీమాన్ పవన్, సంజన, ఇమ్మాన్యుయేల్, కళ్యా్ణ్ పడాల, భరణి శంకర్, సుమన్ శెట్టి, సంజన హౌస్ లో ఉన్నారు.

అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండనుందనే టాక్ వినిపిస్తుంది. మిడ్ వీక్ ఎలిమినేషన్ తోపాటు .. వీకెండ్ ఎలిమినేషన్ జరగనుందని సమాచారం. ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం మిడ్ వీక్ సుమన్ శెట్టి.. వీకెండ్ సంజన బయటకు రానున్నట్లు తెలుస్తోంది. ఇక తనూజ, భరణి, ఇమ్మాన్యుయేల్, డీమాన్ పవన్, కళ్యాణ్ పడాల టాప్ 5 కంటెస్టెంట్స్ ఫిక్స్ అని తెలుస్తోంది. ఇక వీరిలో టైటిల్ రేసులో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు కళ్యాణ్ పడాల, తనూజ.

ప్రస్తుతం బిగ్ బాస్ టైటిల్ కు దగ్గరగా కళ్యాణ్ పడాల, తనూజ అత్యధిక ఓటింగ్ తో దూసుకుపోతున్నారు. కామన్ మెన్ కోటా నుంచి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్.. మొదట్లో నెగిటివిటీని ఎదుర్కొన్నాడు. కానీ నెమ్మదిగా తన ఆట తీరును మార్చుకుంటూ విన్నర్ ఇతడే అనేలా చేశాడు. కానీ కళ్యాణ్ ఆట ఇప్పుడు దారి తప్పినట్లుగా తెలుస్తోంది. కేవలం తనూజ కోసమే గేమ్ ఆడుతున్నట్లుగా ప్రవర్తిస్తున్నాడు. ఇదే విషయాన్ని అటు భరణి సైతం బ్లాస్ట్ అయ్యాడు. అయితే ముందు సీజన్ 9 విన్నర్ తనూజ అని టాక్ చక్కర్లు కొడుతుంది.

జనాల ఓటింగ్ ప్రకారం కళ్యాణ్ టాప్ ప్లేస్ లో ఉండగా… తనూజ రెండో స్థానంలో ఉంది. కానీ ప్రేక్షకుల లెక్కలు కాకుండా బిగ్ బాస్ ఓటింగ్ అంటే మాత్రం తూజ విన్నర్ కావడం ఖాయమని అంటున్నారు. ఈ సీజన్ మొదటి నుంచి తనూజకు ఎక్కువగా సపోర్ట్ ఉందని.. ఆమె తప్పు చేసినా తనకే మద్దతు తెలుపుతున్నారని నెటిజన్స్ వాపోతున్నారు. నిజానికి తనూజ ఫిజికల్ టాస్కులలో అంతగా పోటీపడింది లేదు. ఆమె కంటే డీమాన్ పవన్, కళ్యాణ్, భరణి, రీతూ చౌదరి ఫిజికల్ టాస్కులలో అదరగొట్టేశారు. కానీ విన్నర్ మాత్రం తనూజ అంటూ నెట్టింట జోరుగా నడుస్తుంది. మరోవైపు ఇప్పుడు బిగ్ బాస్ విన్నర్ ఎవరనేది ముందే ఫిక్స్ అయ్యారనే ప్రచారం తెరపైకి వచ్చింది. అందరూ ఊహించినట్లుగా తనూజ, కళ్యాణ్ కాకుండా ఈసారి ఇమ్మాన్యుయేల్ విన్నర్ కాబోతున్నాడని తెలుస్తోంది. బిగ్ బాస్ నిర్వాహకులు అతడినే ఫైనల్ చేశారని అంటున్నారు. దీంతో నెట్టింట అడియన్స్ రియాక్ట్ అవుతున్నారు. విన్నర్ ఎవరో ముందే ఫిక్స్ అయితే.. మరీ షో చూడడం ఎందుకని కామెంట్స్ చేస్తున్నారు. మరీ ఇది ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది.

కొత్త లేబర్ కోడ్స్‌తో టేక్ హోమ్ శాలరీ తగ్గుతుందా? పీఎఫ్ డిడక్షన్ ఎలా ఉంటుంది? క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.

కేంద్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి 29 పాత కార్మిక చట్టాలను కలిపి మొత్తం నాలుగు చట్టాలుగా మార్చింది. ఈ మేరకు నూతన లేబర్ కోడ్స్ అమల్లోకి తెచ్చింది.

వేతనాల కోడ్- 2019, సామాజిక భద్రత కోడ్- 2020, పారిశ్రామిక సంబంధాల కోడ్- 2020, వృత్తి భద్రత,ఆరోగ్య, పని పరిస్థితుల కోడ్- 2020 అనే నాలుగు కొత్త లేబర్ కోడ్‌లను అమల్లోకి తెచ్చింది.

కొత్త లేబర్‌ కోడ్స్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో టేక్ హోమ్ శాలరీ తగ్గుతుందా? అనే విషయంపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేసింది.

” PF డిడక్షన్ చట్టబద్ధమైన వేతన పరిమితిలో ఉంటే కొత్త లేబర్ కోడ్‌లు టేక్ హోమ్ శాలరీని తగ్గించవు. PF డిడక్షన్‌లు రూ.15,000 వేతన పరిమితిపై ఆధారపడి ఉంటాయి , ఈ పరిమితికి మించి చేసిన కాంట్రిబ్యూషన్స్ స్వచ్ఛందంగా ఉంటాయి, తప్పనిసరి కాదు ” అని పోస్టులో పేర్కొంది. దీనితో పాటు కొత్త లేబర్ కోడ్స్ ద్వారా మరికొన్ని ప్రయోజనాలు ఉద్యోగులకు లభించనున్నాయి.

ఒకే సంవత్సరానికి గ్రాట్యుటీ
కొత్త లేబర్ కోడ్స్ ప్రకారం, గ్రాట్యుటీ విషయంలో కూడా కీలక మార్పులు ఉంటాయి.పాత నిబంధనల ప్రకారం ఒక ఉద్యోగి కనీసం 5 సంవత్సరాలు పనిచేసినప్పుడే గ్రాట్యుటీ పొందేందుకు అర్హత పొందుతాడు.అయితే కొత్త లేబర్ కోడ్ ప్రకారం, ఫిక్స్‌డ్ టర్మ్ ఎంప్లాయిస్(FTE) ఒక సంవత్సరం పనిచేసినా సరే గ్రాట్యుటీ పొందే అవకాశం ఉంది. అంతే కాదు సెలవులు, మెడికల్,సోషల్ సెక్యూరిటీ వంటి పర్మనెంట్ వర్కర్స్ పొందే అన్ని రకాల ప్రయోజనాలు వీరు కూడా పొందవచ్చు.

కొత్త లేబర్ కోడ్‌ల ప్రకారం, దేశవ్యాప్తంగా ఉన్న 40 ఏళ్లు పైబడిన ఉద్యోగులకు ఉచితంగా హెల్త్ చెకప్‌లు పొందవచ్చు. కొత్త లేబర్ కోడ్‌ల ప్రకారం, ఉద్యోగుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం వార్షిక ఆరోగ్య పరీక్షలకు సంబంధించిన నియమాలలో పెద్ద మార్పులను చేసింది. గతంలో, ఉద్యోగులకు సంవత్సరానికి ఒకసారి ఉచిత హెల్త్ చెకప్ అనేది చట్టపరంగా తప్పనిసరి కాదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం 40 ఏళ్లు పైబడిన ఉద్యోగులందరికీ సంవత్సరానికి ఒకసారి ఉచిత హెల్త్ చెకప్‌లను తప్పనిసరి చేసింది. దీని ద్వారా ఉద్యోగులకు సంబంధించిన వ్యాధులు లేదా ఏవైనా ఆరోగ్య సంబంధిత సమస్యలను సకాలంలో గుర్తించవచ్చు. ఉద్యోగుల ఆరోగ్యాన్ని కాపాడే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకుంది.

ఇది ఎవరికి వర్తిస్తుంది?
కాంట్రాక్ట్ వర్కర్క్, మైనింగ్ విభాగంలో పనిచేసే ఉద్యోగులకు, ప్రమాదకరమైన పరిశ్రమ కార్మికులు, డాక్ వర్కర్స్ వంటి ఉద్యోగులకు ఈ హెల్త్ చెకప్ సంవత్సరానికి ఒకసారి తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది.

రాత్రి నిద్రలో కాలు నరాలు లాగుతున్నాయా..?? దీనికి గల కారణం

రాత్రి నిద్రలో కాలు నరాలు అకస్మాత్తుగా లాగుతున్నాయా (తొడ లేదా పిక్క కండరాలు పట్టేస్తున్నాయా)? దీనికి పరిష్కారం ఏమిటి?

నిద్రలో కాళ్ళలో కండరాల తిమ్మిరి (Calf muscle cramps) రావడానికి చాలా కారణాలు ఉండవచ్చు…

పగలంతా ఎక్కువగా నడవడం, పరిగెత్తడం లేదా ఎక్కువసేపు నిలబడటం వంటి కారణాల వల్ల కండరాలు అలసిపోతాయి. రాత్రిపూట అవి హఠాత్తుగా లాగేస్తాయి (పట్టేస్తాయి). కాళ్ళను ఎక్కువసేపు ఒకే స్థితిలో ఉంచి నిద్రిస్తే రక్త ప్రసరణ తగ్గుతుంది – ఇది కూడా తిమ్మిరిని కలిగిస్తుంది.

కాళ్లు కొంచెం కూడా కదలకుండా కూర్చుని పనిచేయడం, ప్రయాణం చేయడం కూడా రాత్రిపూట కండరాల తిమ్మిరిని కలిగించవచ్చు. తగినంత నీరు తాగకపోవడం, పొటాషియం పోషక లోపం వంటివి కారణాలుగా చెబుతున్నారు.

అయితే, చాలావరకు ఇటువంటి కండరాల తిమ్మిరి నిద్రిస్తున్నప్పుడే ఎందుకు వస్తుంది అని అడిగితే… (నా అనుభవంలో నాకు తెలిసిన ఒక ఆలోచనను చెబుతున్నాను).

చిన్నతనంలో నిద్రపోయే సమయంలో మన పక్కన పడుకున్న సోదరుడి దగ్గర నుంచి (నిద్రలో) ఎన్ని దెబ్బలు, తన్నులు తిని ఉంటాం లేదా వాడికి ఇచ్చి ఉంటాం… నేను ఇది ఎందుకు చెబుతున్నానంటే… నిద్రపోయేటప్పుడు ఒక వ్యక్తి కదలిక లేకుండా నిశ్శబ్దంగా ఉన్నట్లు కనిపించినా, కొన్నిసార్లు నిద్రలో అతని కదలికలు వేగంగా, బలంగా, ఆందోళనగా ఉంటాయి. ఆంగ్లంలో దీనిని స్లీప్ మూవ్‌మెంట్ ఇంటెన్సిటీ (నిద్రలో అధిక కదలికలు) అంటారు. నిద్రలో ఒక వ్యక్తి యొక్క కదలికలు కొన్నిసార్లు వేగంగా మరియు బలవంతంగా (jerky & forceful) ఉంటాయి.

ఉదాహరణకు, ఒక వ్యక్తి నిద్రలో తనను తాను గోకుతున్నట్లయితే, అది కాస్త గట్టిగా ఉంటుంది, ఉదయం చూసినప్పుడు చిన్న గోరు గీతలు కూడా ఉండవచ్చు. దీనికి కారణం నిద్రలో సహజ స్థాయి కంటే ఎక్కువ కదలిక ఉండటమే.

అదేవిధంగా, రోజంతా పనిచేసి కండరాలు అలసిపోయిన స్థితిలో… రాత్రి ఎక్కువసేపు కాలు మడచి నిద్రించే వ్యక్తి అకస్మాత్తుగా వేగంగా కాళ్ళ వేళ్ళను గరిష్టంగా మడచడం లేదా చాచడం చేస్తాడు, దీనివల్ల అతని కాలు కండరాలు సంకోచించి (చురుక్కుమని)పిక్క కండరాల తిమ్మిరి (calf muscle cramps) ఏర్పడుతుంది. సాధారణంగా ఉన్నదాని కంటే నిద్రలో మన కదలికలు కొన్నిసార్లు వేగంగా, బలంగా ఉండటమే దీనికి కారణం (కావచ్చు… ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే).

ఇదే కండరాల సంకోచం మేల్కొని ఉన్నప్పుడు కూడా జరుగుతుంది. కానీ మనం మేల్కొని ఉన్నప్పుడు శరీర స్థితిని వెంటనే మార్చుకుంటాము. అందువల్ల ఆ సంకోచం తేలికపడిపోతుంది. కానీ నిద్రలో వెంటనే స్థితిని మార్చుకోలేకపోవడం వల్ల, ఆ సంకోచం పూర్తిగా పనిచేసి కండరాల తిమ్మిరి చాలా తీవ్రంగా అనిపిస్తుంది.

  • మొదటి చిత్రం – కాలు కండరం సాధారణ స్థితిలో ప్రశాంతంగా ఉంది.
  • రెండవ చిత్రం – కాలు వంగినప్పుడు (నిద్రలో కాళ్ళను వేగంగా ముందుకు తోసినప్పుడు) కండరం సంకోచిస్తుంది.
  • మూడవ చిత్రం – కండరం సంకోచించిన తర్వాత కూడా వదలకుండా ఉంటుంది. అందుకే నొప్పి వస్తుంది.

అప్పుడప్పుడు వచ్చే ఇటువంటి కండరాల తిమ్మిరి చాలా తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది.

ఈ బాధ కొన్ని సెకన్ల పాటు లేదా కొన్ని నిమిషాల వరకు ఉండవచ్చు. తక్షణ పరిష్కారం:

ఆ సమయంలో కాలు కదలకుండా ఉంచితే, కొన్ని సెకన్లలో అదే తగ్గిపోతుంది. తిమ్మిరి కొనసాగితే… పాదాన్ని నిటారుగా ఉంచి, కాలి వేళ్ళను నెమ్మదిగా మీ వైపు లాగండి (రెండవ చిత్రంలో ఉన్నదానికి వ్యతిరేక దిశలో). ఇది కండరాన్ని సాగదీసి (stretch చేసి) తిమ్మిరిని తొలగిస్తుంది. తిమ్మిరి తగ్గిన తర్వాత కూడా నొప్పి ఉంటే, వేడి నీటితో కాపడం ఇవ్వడం, నొప్పి నివారణ ఆయింట్‌మెంట్లు ఉపయోగించడం ఫలితం ఇస్తుంది.

శాశ్వత పరిష్కారం వంద శాతం లేనప్పటికీ… రోజూ తగినంత నీరు తాగడం, తరచుగా కొబ్బరి నీరు తాగడం, పొటాషియం, మెగ్నీషియం ఉన్న ఆహారాలను (అరటిపండ్లు, నట్స్ వంటివి) తీసుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది.

కండరాల తిమ్మిరి తరచుగా వస్తున్నట్లయితే, వైద్యుడిని సంప్రదించి సలహా తీసుకోవడం ఉత్తమం.

Health

సినిమా