తెలుగింటి భోజనంలో అప్పడం కంపల్సరీ. పప్పు, చారు, రసం, పెరుగన్నంలోకి సైడ్ డిష్గా నంజుకొని తినడానికి ఇది పర్ఫెక్ట్. కేవలం అన్నంలోకి మాత్రమే కాదు ఈవెనింగ్ స్నాక్స్గా కూడా వీటిని తినొచ్చు. అయితే దీనిని ఎప్పుడూ సైడ్ డిష్గానే చూస్తున్నారా? ఓసారి మెయిన్ డిష్గా కర్రీ ప్రిపేర్ చేయండి అద్దిరిపోతుంది. అప్పడాలతో కూర చేయడమేంటి అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమే. అప్పడాలతో సూపర్ టేస్టీగా కూర ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది రాజస్థాన్లో మరింత ఫేమస్. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఈ కర్రీ బెస్ట్ ఆప్షన్. ఈ కూర అన్నంతోపాటు రోటీ, చపాతీ, పరోటా వంటి వాటిల్లోకి కూడా పర్ఫెక్ట్. మరి, లేట్ చేయకుండా కమ్మని మసాలా పాపడ్ కర్రీని ఎలా చేయాలో చూసేయండి.
కావాల్సిన పదార్థాలు:
- అప్పడాలు – 4
- నూనె- 2 టేబుల్స్పూన్లు
- జీలకర్ర – అర టీస్పూన్
- ఆవాలు – అర టీస్పూన్
- ఎండుమిర్చి- 3
- ఉల్లిపాయ – 1
- పచ్చిమిర్చి – 3
- అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్
- వేయించిన జీలకర్ర పొడి – అర టీస్పూన్
- పసుపు – పావు టీస్పూన్
- ధనియాల పొడి – అర టీస్పూన్
- కారం – తగినంత
- ఉప్పు – రుచికి సరిపడా
- గరం మసాలా – అర టీస్పూన్
- ఇంగువ – చిటికెడు
- కరివేపాకు – 2 రెమ్మలు
- టమాటాలు – 2
- పెరుగు – అర కప్పు
- శనగపిండి – 1 టేబుల్స్పూన్
- కొత్తిమీర తరుగు – కొద్దిగా
తయారీ విధానం:
- ముందుగా ఈ కర్రీ కోసం అవసరమైన పదార్థాలను ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం ఓ పెద్ద ఉల్లిపాయను సన్నగా తరగాలి. అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీరను వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి.
- టమాటాలను శుభ్రంగా కడిగి వాటిపై ఉండే తొడిమ తీసేసి మీడియం సైజ్లో ముక్కలుగా చేసుకోవాలి. మిక్సీజార్లోకి టమాటా ముక్కలు వేసి అస్సలు నీళ్లు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
- స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ఫ్రైకి సరిపడా నూనె పోసి వేయించుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత అప్పడం వేసి రెండు వైపులా ఎర్రగా కాల్చుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. మిగిలిన అప్పడాలను కూడా ఇలానే నూనెలో వేయించి తీసి పక్కన పెట్టాలి. కడాయికి కూడా దింపేసి పక్కనుంచాలి.
- అదే స్టవ్ మీద కర్రీ కోసం మరో పాన్ పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి. కాగిన నూనెలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేయి వేయించాలి.
- అనంతరం ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి వేసి లో టూ మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి.
- ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి.
- అల్లం మగ్గిన తర్వాత వేయించిన జీలకర్ర పొడి, పసుపు, ధనియాల పొడి, కారం, ఉప్పు, గరం మసాలా వేసి నూనెలో వేయించాలి.
- మసాలాలు పర్ఫెక్ట్గా వేగిన తర్వాత ఇంగువ, కరివేపాకు వేసి మరో నిమిషం వేయించి గ్రైండ్ చేసిన టమాటా గుజ్జు వేసి కలుపుతూ ఉడికించాలి.
- టమాటా మిశ్రమం మగ్గి నూనె పైకి తేలిన తర్వాత పావు లీటర్ వాటర్ పోసి కలిపి హై-ఫ్లేమ్లో మరిగించాలి.
- ఈలోపు ఓ గిన్నెలోకి పెరుగు, శనగపిండి వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఆ తర్వాత అర కప్పు వాటర్ పోసి మరోసారి కలపాలి.
- స్టవ్ మీద వాటర్ మరుగుతున్నప్పుడు మంటను సిమ్లో పెట్టి పెరుగు మిశ్రమాన్ని కొద్దికొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి.
- టమాటా, పెరుగు మిశ్రమం బాగా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో మరో 5 నిమిషాలు మరిగించాలి.
- వాటర్ బాగా మరుగుతున్నప్పుడు వేయించుకున్న అప్పడాలను చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి.
- అనంతరం నిదానంగా కలిపి మరో 5 నిమిషాలపాటు ఉడికించి కొత్తిమీర తరుగు చల్లి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరి. ఎంతో టేస్టీగా ఉండే రాజస్థాన్ స్పెషల్ పాపడ్ సబ్జీ రెసిపీ రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.
-
చిట్కాలు:
- అప్పడాలను మనం వేయించుకుని తినే విధంగా కాకుండా కాస్త గట్టిగా ఉండేలా రెండు వైపులా లైట్గా కలర్ మారే వరకు వేయించాలి.
- కారం మీ రుచికి తగినట్లుగా వేసుకోవాలి. అయితే పచ్చిమిర్చి, ఎండుమిర్చితో పాటు ఇతర మసాలాలు వాడాం కాబట్టి దాని రుచిని కూడా లెక్కలోకి తీసుకోవాలి.
- వేయించిన అప్పడాలను మరీ ఎక్కువ సేపు గ్రేవీలో ఉడికించాల్సిన పనిలేదు. ఎక్కువ సేపు ఉడికిస్తే మరీ మెత్తగా అవుతాయి.
































