శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు ఒక శుభవార్త. ఇకపై భక్తులు తమ ఇంటి నుంచే ఆన్లైన్లో ప్రసాదాలను బుక్ చేసుకునే సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది.
ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు ఇటీవల ప్రారంభించిన ‘కౌంటర్ బిల్లింగ్ మాడ్యూల్’ ద్వారా ఈ సేవలను భక్తులకు అందించనున్నారు.
ఈ సదుపాయం మొదట శబరిమల దేవాలయంలో అందుబాటులోకి వస్తుంది. ఆ తర్వాత, ట్రావెన్కోర్ సంస్థానం పరిధిలోని 1252 దేవాలయాల ప్రసాదాలను కూడా భక్తులు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. రద్దీ కారణంగా నేరుగా ఆలయానికి రాలేని భక్తులకు ఈ సేవలు ఎంతో ఉపయోగపడతాయని దేవస్వం బోర్డు తెలిపింది.
బోర్డు అధ్యక్షుడు తెలిపిన వివరాల ప్రకారం, ఈ కౌంటర్ బిల్లింగ్ మాడ్యూల్ ఒక నెలలోపు పూర్తిస్థాయిలో పని చేయడం ప్రారంభిస్తుంది.































