BE,Btech చేసి ఖాళీగా ఉన్నారా?.. ఈ పోస్టులకు వెంటనే అప్లై చేసుకోండి.. ఏడాదికి 25 లక్షల జీతం

రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్స్ ను రిలీజ్ చేస్తున్నాయి. రైల్వే, నేవీ, ఆర్మీ, బ్యాంకుల నుంచి జాబ్ నోటిఫికేషన్లు వస్తున్నాయి. ఈ క్రమంలో నిరుద్యోగులకు భారీ శుభవార్త. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నట్లైతే ఈ పోస్టులను అస్సలు వదలకండి. కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే ఏకంగా ఏడాదికి 25 లక్షల జీతం అందుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ ఆద్వార్యంలో నడిచే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.


ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 54 ఇన్ఫర్ మేషన్ టెక్నాలజీ ఎక్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించనున్నారు. ఈ ఉద్యోగాలకు బీఈ/ బీటెక్‌ లేదా బీసీఏ/ బీఎస్సీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో అప్లైయ్ చేసుకోవచ్చు. మే 24 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. దరఖాస్తు చేసుకోదలిచిన వారు పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:
మొత్తం పోస్టులు:
54
ఎగ్జిక్యూటివ్ (అసోసియేట్ కన్సల్టెంట్) పోస్టులు:
28
ఎగ్జిక్యూటివ్ (కన్సల్టెంట్) పోస్టులు:
21
ఎగ్జిక్యూటివ్ (సీనియర్ కన్సల్టెంట్)పోస్టులు :
05
అర్హత :
బీఈ/ బీటెక్‌ లేదా బీసీఏ/ బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ ఎలక్ట్రానిక్స్) లేదా ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఏడాదికి ఎగ్జిక్యూటివ్ (అసోసియేట్ కన్సల్టెంట్) పోస్టుకు రూ.10,00,000.. ఎగ్జిక్యూటివ్ (కన్సల్టెంట్) పోస్టుకు రూ.15,00,000.. ఎగ్జిక్యూటివ్ (సీనియర్ కన్సల్టెంట్) పోస్టుకు రూ.25,00,000 వరకు ఉంటుంది.
దరఖాస్తు విధానం :
ఆన్‌ లైన్‌
దరఖాస్తు ఫీజు :
ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.150 చెల్లించాలి. ఇతరులకు రూ.750గా నిర్ణయించారు.
ఎంపిక ప్రక్రియ :
అసెస్‌మెంట్, ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ప్రారంభ తేదీ:
04-05-2024
దరఖాస్తులకు చివరి తేదీ :
24-05-2024